శ్రీకాకుళం క్రైమ్: జిల్లాలో వివిధ నేర కార్యకలాపాల్లో ఉన్న కరుడుగట్టిన నేరస్థులు, క్రిమినల్ గ్యాంగుల్లో ఉన్న వ్యక్తుల పేర్లు, ముఖచిత్రాలతో కూడిన పోస్టర్లను, ఫ్లెక్సీలను గురువారం శ్రీకాకుళం ఆర్టీసీ కాంప్లెక్సులో పోలీసులు ఏర్పాటు చేశారు.
ఇందులో ఉన్న వ్యక్తులు అనుమానాస్పదంగా తిరిగితే వెంటనే పోలీసులకు తెలియజేయాలని జిల్లా సెంట్రల్ క్రైమ్స్టేషన్ ఇన్స్పెక్టర్ వి.బాబూజీరావు కోరారు. సీసీఎస్ సీఐ 6309990835, అదనపు ఎస్పీ (క్రైమ్) టి.పి.విఠలేశ్వరరావు 6309990893 నంబర్లకు తెలియజేసి నేరనియంత్రణకు సహకరించాలన్నారు.