త్వరలో సీఎం చేతుల మీదుగా ఫిషింగ్‌ హార్బర్‌ ప్రారంభం | Sakshi
Sakshi News home page

త్వరలో సీఎం చేతుల మీదుగా ఫిషింగ్‌ హార్బర్‌ ప్రారంభం

Published Wed, Nov 22 2023 12:06 AM

-

త్వరలో సీఎం చేతుల మీదుగా

ఫిషింగ్‌ హార్బర్‌ ప్రారంభం

జువ్వలదిన్నె ఫిషింగ్‌ హార్బర్‌ నిర్మాణ పనులను ఏడాదిన్నర కాలంలోనే 90 శాతం మేర పూర్తి చేశామని ఎమ్మెల్యే రామిరెడ్డి తెలిపారు. త్వరలో సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి చేతుల మీదుగా ప్రారంభిస్తామని చెప్పారు. ఫిషింగ్‌హార్బర్‌ అందుబాటులోకి వస్తే తీరప్రాంత రూపురేఖలు మారిపోతాయన్నారు. హార్బర్‌లో ఐస్‌ఫ్యాక్టరీలు, కోల్డ్‌స్టోరేజ్‌లు, చేపలు ఆరబెట్టుకునేందుకు, విక్రయాలకు వీలుగా ప్లాట్‌ఫామ్‌ల నిర్మాణం చేపడుతామని, తద్వారా మత్స్యకారుల ఆదాయం రెట్టింపు అవుతుందన్నారు. జువ్వలదిన్నె ఫిషింగ్‌హార్బర్‌తో పాటు రామాయపట్నం పోర్టు ద్వారా మత్స్యకారులకే కాకుండా భూముల ధరలు పెరిగి రైతులు, అనుబంధ పరిశ్రమల ద్వారా ఉపాధి అవకాశాలతో యువతకు మేలు జరుగుతుందని వివరించారు. కావలి ఏఎంసీ చైర్మన్‌ సన్నిబోయిన ప్రసాద్‌, వైఎస్సార్‌సీపీ మండల కన్వీనర్‌ మద్దిబోయిన వీరరఘు, మత్స్యకార నాయకులు కొండూరు శ్రీనివాసులు, బీద రమేష్‌, కావలి రూరల్‌ మండల జేసీఎస్‌ కన్వీనర్‌ శ్రీనివాసులు, స్థానిక సర్పంచ్‌ గోవిందస్వామి, వైఎస్సార్‌సీపీ నాయకులు, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.

Advertisement
Advertisement