నీళ్లిస్తేనే ఓట్లేస్తాం! | Sakshi
Sakshi News home page

నీళ్లిస్తేనే ఓట్లేస్తాం!

Published Wed, Nov 15 2023 4:34 AM

- - Sakshi

గౌలిపురా: మా బస్తీ ఓట్లు కావాలంటే.. తాగునీరు, చేతిపంపు తదితర మౌలిక వసతులు కల్పించాలని గౌలిపురా మేకలమండి గాంఽధీనికేతన్‌ యువజన సంఘం కమిటీ పెద్దలు, బస్తీవాసులు డిమాండ్‌ చేస్తున్నారు. యాకుత్‌పురా నియోజకవర్గం తరపున పోటీ చేస్తున్న వివిధ పార్టీలకు చెందిన అభ్యర్థులు అభివృద్ధి పనులు చేస్తామంటేనే రండి అంటున్నారు. తమ బస్తీలో 4,300 ఓట్లు ఉన్నాయని.. అన్ని సౌకర్యాల సదుపాయాలు కల్పిస్తేనే మీ విజయం కోసం పాటుపడతామన్నారు. బస్తీవాసులకు ఎలాంటి డబ్బులు ఇవ్వకుండా చేతిపంపు వేయించి నీటి వసతి సదుపాయం కల్పిస్తే కలకాలం మీరు పేరు గుర్తుంటుందంటూ ఓ బ్యానర్‌ను ఏర్పాటు చేయడం గమనార్హం.

Advertisement
Advertisement