ప్రతీ హామీ నెరవేరుస్తాం | Sakshi
Sakshi News home page

ప్రతీ హామీ నెరవేరుస్తాం

Published Wed, Nov 15 2023 4:34 AM

ఎల్లకొండలో మాట్లాడుతున్న నేతలు  - Sakshi

నవాబుపేట: కేసీఆర్‌ పాలనలో ఎవరు అభివృద్ధి చెందారో ప్రజలే గమనించాలని చేవెళ్ల కాంగ్రెస్‌ అభ్యర్థి భీం భరత్‌ విమర్శించారు. మంగళవారం ఆయన మండల పరిధిలోని గుబ్బడి పత్తేపూర్‌, ముబారక్పూర్‌, గంగ్యాడ, ఎల్లకొండ గ్రామాల్లో ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా భీం భరత్‌ మాట్లాడుతూ.. మాజీ ఎమ్మెల్యే కె.ఎస్‌ రత్నం పూటకు ఒక పార్టీ మారే వ్యక్తి అన్నారు. ఆయన వల్ల చేవెళ్లకు ఒరిగిందేమి లేదన్నారు. ప్రస్తుత ఎమ్మెల్యే యాదయ్య నియోజకవర్గానికి ఏమి చేశాడో చెప్పాలన్నారు. కాంగ్రెస్‌ అధికారంలోకి రాగానే ఎన్నికల్లో ఇస్తున్న ప్రతీ హామీ నెరవేరుతుందన్నారు. తనకు అవకాశం ఇస్తే ప్రజలకు అందుబాటులో ఉండి సేవ చేస్తాన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్సీ యాదవరెడ్డి, మధుసూదన్‌ రెడ్డి, పార్టీ మండల అధ్యక్షుడు వెంకటయ్య, సర్పంచ్‌లు రాములు, ప్రభాకర్‌ రెడ్డి, మండల నాయకులు వెంకట్‌రెడ్డి, గోపాల్‌రెడ్డి, అనంత్‌రెడ్డి, ఉపేందర్‌రెడ్డి, కొండల్‌యాదవ్‌, ప్రసాద్‌ తదితరులు పాల్గొన్నారు.

Advertisement
Advertisement