పాఠకులకు విజ్ఞానాన్ని పంచుదాం | Sakshi
Sakshi News home page

పాఠకులకు విజ్ఞానాన్ని పంచుదాం

Published Wed, Jul 5 2023 5:50 AM

గ్రంథాలయ కమిటీ సభ్యులకు పుస్తకాలు అందజేస్తున్న గంగిరెడ్డి  - Sakshi

షాద్‌నగర్‌: గ్రంథాలయాలకు పుస్తకాలు అందజేసి పాఠకులకు విజ్ఞానాన్ని పంచుదామని, ఈ కార్యక్రమంలో ప్రజలందరూ భాగస్వామ్యం కావాలని గ్రంథాలయ అభివృద్ధి కమిటీ చైర్మన్‌ లక్ష్మీనర్సింహారెడ్డి పిలుపునిచ్చారు. బుధవారం పట్టణానికి చెందిన విశ్రాంత ఉపాధ్యాయుడు గంగిరెడ్డి షాద్‌నగర్‌ గ్రేడ్‌– 1 గ్రంథాలయానికి పదివేల విలువ చేసే పుస్తకాలను అందజేశారు. ఈ సందర్భంగా లక్ష్మీనర్సింహారెడ్డి మాట్లాడుతూ.. గ్రంథాలయాలను అభివృద్ధి చేయాల్సి బాధ్యత అందరిపై ఉందన్నారు. కార్యక్రమంలో గ్రంథాలయ కమిటీ ప్రధాన కార్యదర్శి శేఖర్‌, వైస్‌ చైర్మన్‌ మహేశ్వర్‌, డైరక్టర్లు సుధాకర్‌, జంగరాజ్‌, యాదయ్య, గోపాల్‌, అబ్దుల్‌ రావూఫ్‌, అజహర్‌, ప్రభాకర్‌ తదితరులు పాల్గొన్నారు.

గ్రంథాలయ అభివృద్ధి

కమిటీ చైర్మన్‌ లక్ష్మీనర్సింహారెడ్డి

Advertisement
 
Advertisement
 
Advertisement