ఎల్ఎండీకి నీటి విడుదల
బోయినపల్లి: మిడ్మానేరు నుంచి మంగళవారం ఎల్ఎండీకి 5 వేల క్యూసెక్కుల నీరు విడుదల చేశారు. ప్రాజెక్టులోకి 3,150 క్యూసెక్కుల ఇన్ఫ్లో వస్తోంది.
ఆకాశం మేఘావృతమై ఉంటుంది. గాలిలో తేమ అధికంగా ఉంటుంది. వర్షం కురిసే అవకాశం లేదు. చలిగాలులు వీస్తాయి.
సిరిసిల్లలో వైఎస్సార్ అడుగులు
సిరిసిల్ల: దివంగత నేత డాక్టర్ వై.ఎస్.రాజశేఖర్రెడ్డి 2009లో ముఖ్య మంత్రి హోదాలో సిరిసిల్లలో ఎన్నికల ప్రచార సభలో పాల్గొన్నారు. అప్పటి సిరిసిల్ల కాంగ్రెస్ అభ్యర్థి, మున్సిపల్ చైర్పర్సన్గా ఉన్న గుడ్ల మంజుల పక్షాన వైఎస్సార్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. కళాశాల మైదానంలో జరిగిన సభలో అప్పటి కరీంనగర్ ఎంపీ అభ్యర్థి పొన్నం ప్రభాకర్గౌడ్, వేములవాడ అభ్యర్థి ఆది శ్రీనివాస్, జగిత్యాల అభ్యర్థి జీవన్రెడ్డి ఉన్నారు. సిరిసిల్లలో వైఎస్సార్ అడుగుజాడలను ఆయన అభిమానులు గుర్తు చేసుకుంటున్నారు.
జ్ఞాపకం