పంట కాల్వలోకి దూసుకెళ్లిన బైక్
● అక్కడికక్కడే యువకుడు మృతి
మార్కాపురం టౌన్: పంట కాల్వలోకి బైక్ దూసుకెళ్లడంతో ఓ యువకుడు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. ఈ సంఘటన మార్కాపురం పట్టణ పోలీసుస్టేషన్ పరిధిలోని బోడపాడు రోడ్డులో మంగళవారం రాత్రి చోటుచేసుకుంది. పోలీసుల కథనం మేరకు.. తర్లుపాడు మండలం బుడ్డపల్లి గ్రామానికి చెందిన బత్తుల బాజీబాబు(25) జేసీబీ డ్రైవర్గా పనిచేస్తున్నాడు. మంగళవారం రాత్రి విధులు ముగించుకున్న అనంతరం యథావిధిగా తన ద్విచక్ర వాహనంపై స్వగ్రామానికి బయలుదేరాడు. ఈ క్రమంలో బైక్ అదుపుతప్పి బోడపాడు వద్ద ఉన్న పంట కాల్వలో పడి పోవడంతో తీవ్రంగా గాయపడి అక్కడికక్కడే మృతి చెందాడు. బుధవారం ఉదయం అటుగా వెళ్తున్న వాహనదారులు గుర్తించి పట్టణ ఎస్సై అబ్దుల్ రెహమాన్కు సమాచారం అందించారు. సంఘటనా స్థలాన్ని పోలీసులు పరిశీలించారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment