Sakshi News home page

భగత్‌సింగ్‌ ఆశయాలను ఆచరించాలి

Published Fri, Mar 29 2024 12:30 AM

మాట్లాడుతున్న గొర్రెపాటి మాధవరావు - Sakshi

నిజామాబాద్‌రూరల్‌(డిచ్‌పల్లి): దేశంలో సామ్రాజ్యవాదుల దోపిడీకి వ్యతిరేకంగా భగత్‌సింగ్‌ ఉద్యమించాడని, ఆయన ఆశయాలను ఆచరణలో ఉంచాలని న్యాయవాది, మానవ హక్కుల వేదిక రాష్ట్ర మాజీ అధ్యక్షులు గొర్రెపాటి మాధవరావు పేర్కొన్నారు. స్వాతంత్య్ర సమరయోధులు భగత్‌ సింగ్‌, రాజ్‌గురు, సుఖ్‌దేవ్‌ల వర్ధంతి సందర్భంగా తెలంగాణ విశ్వవిద్యాలయంలో గురువారం పీడీఎస్‌యూ ఆధ్వర్యంలో ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. యూనివర్సిటీ విద్యార్థులు భగత్‌సింగ్‌ ఆశయాలను ఆచరణలో ఉంచాలని పిలుపునిచ్చారు. అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ సరిత మాట్లాడుతూ.. సమాజ హితం కోసం నేటి యువత ఆలోచించి పని చేయాలన్నారు. పీడీఎస్‌యూ ప్రతినిధులు జన్నారపు రాజేశ్వర్‌, జయంతి, మోహిత్‌, ప్రిన్స్‌, దేవిక, రవీందర్‌, అక్షయ్‌, ఆకాష్‌, బిందు, లహరి, నితిన్‌ పాల్గొన్నారు.

Advertisement

What’s your opinion

Advertisement