నిర్మల్చైన్గేట్: ప్రభుత్వ స్థలాలు కబ్జాకు గురవుతున్నాయని ఆధారాలతోసహా కలెక్టర్ కు ఫిర్యాదు చేసినా చర్యలు తీసుకోవడం లేదని బీజేఎల్పీ నేత, నిర్మల్ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్రెడ్డి అన్నారు. జిల్లా కేంద్రంలోని మహేశ్వర్రెడ్డి క్యాంపు కార్యాలయంలో గురువారం మాట్లాడారు. గత ప్రభుత్వ హయాంలో నిర్మల్లో మాజీ మంత్రి ఇంద్రకరణ్రెడ్డి చేసిన అవినీతి అక్రమాలను అధికార కాంగ్రెస్ పార్టీ కాపాడుతోందని ఆరోపించారు. సోఫీనగర్లోని ప్రభుత్వ భూమిలో కట్టిన డీమార్ట్ విషయంలో అధికారులకు ఆధారాలతో ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. రెవెన్యూశాఖ మంత్రి ఆదేశాలు ఇచ్చినా జిల్లా అధికారులు చర్యలు తీసుకోవడం లేదని ఆరోపించారు. డీమార్టు నిర్మించిన స్థలం ప్రభుత్వానిదని అధికారులు సర్టిఫై చేసి ఇప్పుడు కమర్షియల్ కాంప్లెక్స్ నిర్మాణానికి సహకరిస్తున్నారన పేర్కొన్నారు. తాత్కాలికంగా డీమార్ట్ను ఓపెన్ చేయించినా స్థలం స్వాధీనం చేసుకునేలా న్యాయపోరాటం చేస్తామని హెచ్చరించారు. సోఫీనగర్తోపాటు గాజులపేట, వెంకటాపూర్, అయ్యప్ప టెంపుల్ ప్రాంతాల్లో ప్రభుత్వ, దేవాదాయ భూముల విషయంలోనూ అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని పేర్కొన్నారు. జిల్లా అధికారులు చర్యలు తీసుకోకపోతే, బీజేపీ నేతలంతా కాషాయ జెండాలు ధరించి గాజులపేటలోని శ్రీకృష్ణ దేవాలయం భూములు కాపాడుకునేందుకు ఆందోళనకు దిగుతామన్నారు.
Breadcrumb
- HOME
ఆధారాలతో ఫిర్యాదు చేసినా చర్యలు లేవు
Published Fri, Mar 29 2024 1:00 AM
Related news
-
అమరం.. స్మరణం
బాధను పంచుకోవాలి విద్యార్థులు అన్ని విషయాలను అధ్యాపకులతో పంచుకోవాలని కార్పొరేట్ ట్రైనర్ తిరుమల్రెడ్డి సూచించారు. వాతావరణం ఆకాశం కొంతమేకు మేఘావృతమవుతుంది. ఉష్ణోగ్రతలు స్వల్పంగా తగ్గుతాయి. వేడి, ఉక్కపోత కొనసాగుతుంది. సాయంత్రం వర్షం పడే అవకాశం ఉంది. 8లోu ఇంద్రవెల్లి: 1981 ఏప్రిల్ 20 జల్..జంగల్...జమీన్ కోసం ఉద్యమించిన అడవిబిడ్డలపై అప్పటి సర్కారు తుపాకీ ఎక్కుపెట్టింది. తూటాల వర్షం కురిపించింది. హక్కుల సాధనలో 15 మంది గిరిజనులు అమరులయ్యారు. వారి రక్తపుటేరులతో తడిసిన పచ్చని వనం ఎరుపెక్కింది. అడవిబిడ్డల అమరత్వం నింగికెగిసిన అగ్ని శిఖలా ఇంద్రవెల్లిలో అమరుల స్తూపమై నిలిచింది. ఈ ఘటనకు 43 ఏళ్లు. అయితే ఇప్పటికీ ఆ స్తూపం వద్ద ఏటా ఆదివాసీలు స్వేచ్ఛగా నివాళులు అర్పించలేని పరిస్థితి. నాడు పూర్తిగా పోలీసు నిఘాలోనే స్తూపం ఉండేది. 2015లో తొలిసారిగా ఆంక్షలతో కూడిన అనుమతి ఇవ్వడంతో ఆదివాసీలు వచ్చి అమరులకు నివాళులర్పిస్తున్నారు. ఈసారి ఉమ్మడి జిల్లా నుంచి ఆదివాసీలతోపాటు జిల్లా ఇన్చార్జి మంత్రి సీతక్క, ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జుపటేల్, ఆదివాసీ ప్రజాప్రతినిధులు, నాయకులు హాజరుకానున్నారు. స్తూపం వద్ద ఏర్పాట్లు పూర్తి చేసినట్లు నిర్వాహకులు తెలిపారు. 33 ఏళ్లుగా నివాళులకు దూరం నాటి కాల్పుల ఘటన సాక్షిగా ఇంద్రవెల్లి సమీపంలో స్తూపం నిర్మించారు. ఆ రోజు నుంచి ఉమ్మడి రాష్ట్రం పాలన ముగిసే వరకు 33 ఏళ్లుగా అమరులకు నివాళులర్పించడానికి అనుమతి ఇవ్వలేదు. ఏటా పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేసే వారు. ఈ క్రమంలో 2004 అప్పటి బోథ్ ఎమ్మెల్యే సోయం బాపూరావ్ గిరిజన నాయకులతోపాటు అప్పటి ఎంపీ మధుసూదన్రెడ్డితో కలిసి ఏప్రిల్ 25న నివాళులర్పించారు. అప్పటి నుంచి ఏటా ఆదివాసీ గిరిజనులు అదేరోజున నివాళులర్పించారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఆదివాసీ సంఘాల కోరిక మేరకు రాష్ట్ర ప్రభుత్వం అనుమతి ఇవ్వకపోయినా ఆంక్షలు సడలించి స్తూపం వద్ద ఏప్రిల్ 20న నివాళులు అర్పించేందుకు రెండు గంటల సమయం ఇచ్చింది. దీంతో ఆదివాసీ సంప్రదాయ రీతిలో పూజలు చేసి నివాళులర్పిస్తున్నారు. ఎట్టకేలకు స్మృతి వనం, ఇళ్ల స్థలాలు నాడు హక్కుల కోసం పోరాడిన ఆదివాసీలపై అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం పోలీసులతో దాడి చేయించడంతో అనేక మంది ప్రాణాలు కోల్పోవడంతోపాటు గాయాలపాలయ్యారు. అయితే బాధిత కుటుంబాలను ఏ ప్రభుత్వాలు పట్టించుకోలేదు. మూడేళ్ల క్రితం అమరుల కుటుంబాలను గుర్తించిన ఎంపీ సోయం బాపూరావు రూ.10 వేల చొప్పున ఆర్థికసాయం అందించారు. ప్రస్తుతం రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడంతో సీఎం రేవంత్రెడ్డి, జిల్లా ఇన్చార్జి మంత్రి సీతక్క స్పందించారు. పోలీస్ శాఖలో ఉన్న రికార్డుల ప్రకారం 15 మంది అమరవీరుల కుటుంబాలకు ఇటీవల మండలంలోని ముత్నూర్ సమీపంలో ఇళ్ల స్థలాలు కేటాయించారు. హక్కు పత్రాలతోపాటు ఇందిరమ్మ ఇళ్లు నిర్మించుకునేందుకు రూ.5 లక్షల చొప్పున నిధులు మంజూరు చేశారు. అమరవీరుల స్తూపాన్ని స్మృతి వనంగా తీర్చదిద్దేందుకు రూ.97 లక్షలు కేటాయించారు. రెండోసారి స్మారక స్తూపం నిర్మాణం. ఆదివాసీల స్మారకార్థం రైతు కూలీ సంఘం ఇంద్రవెల్లిలో 80 అడుగుల స్తూపాన్ని నిర్మించింది. ఆ స్తూపాన్ని 1986 మార్చిలో గుర్తుతెలియని వ్యక్తులు డైనమేట్లతో పేల్చారు. గిరిజనుల ఆందోళనలతో 1987లో ప్రభుత్వం ఐటీడీఏ నిధులతో రెండోసారి స్తూపం నిర్మించింది. పోలీసు బందోబస్తు.. సంస్మరణ దినోత్సవం సందర్భంగా ఇంద్రవెల్లి మండలంలో శుక్రవారం సాయంత్రం నుంచి శనివారం సాయంత్రం వరకు పోలీసు బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు. ఉట్నూర్ డీఎస్పీ నాగేందర్ ఆధ్వర్యంలో ఇద్దరు సీఐలు, ఏడుగురు ఎస్సైలతోపాటు 100మందితో బందోబస్తు నిర్వహిస్తున్నారు. అసలేం జరిగింది. స్వాతంత్య్రం వచ్చి అప్పటికీ మూడున్నర దశాబ్దాలవుతున్నా ఆదివాసీలు ఎదుర్కొంటున్న సమస్యలు పరిష్కారానికి నోచుకోలేదు. ఈ క్రమంలో 1981లో చట్టబద్ధమైన హక్కుల సాధన కోసం పిపుల్స్వార్ ఆధ్వర్యంలో గిరిజన రైతు కూలీ సంఘం పేరిట ఇంద్రవెల్లిలో గిరిజన బహిరంగ సభ ఏర్పాటు చేశారు. పోలీసులు అనుమతి ఇవ్వకపోయినా ఆ రోజు సోమవారం వారసంత కావడంతో ఉదయం నుంచే ఆదివాసీలు భారీగా తరలివచ్చారు. మధ్యాహ్నం 3 గంటల వరకే సభప్రాంగణం గిరి పుత్రులతో కిక్కిరిసిపోయింది. సభా స్థలాన్ని ఖాళీ చేయాలని పోలీసులు హెచ్చరికలు జారీ చేశారు. అయినా వినకుండా మరికొందరు గిరిజనులు ర్యాలీగా అక్కడికి బయలుదేరారు. వారిని అడ్డుకునే క్రమంలో ముందున్న గిరిజన యువతితో ఓ పోలీసు అసభ్యకరంగా ప్రవర్తించాడు. ఆమె వెంటనే పోలీసుపై దాడి చేయగా ఆయన నెలకొరిగాడు. పరిస్థితి చేయిదాటి పోవడంతో పోలీసులు తూటాల వర్షం కుర్పించారు. రక్తం ఏరులై పారింది. ఈ ఘటనలో 15మంది ఆదివాసీలు మాత్రమే చనిపోయినట్లు ప్రభుత్వ రికా ర్డుల్లో ఉంది. కానీ అప్పుడు తూటాల గాయాలతో తమ ఇళ్లకు వెళ్లి పోలీసుల భయంతో బయటకు రాలేక, వైద్యం అందక 60 మంది వరకు చనిపోయినట్లు పౌరహక్కుల సంఘం నిజనిర్ధారణ కమిటీ తమ నివేదికలో స్పష్టం చేసింది. గాయంతో ఏ పని చేయలేను.. నాడు ఇంద్రవెల్లిలో వారసంత ఉండడంతో నా భర్త శంభుతో కలిసి వెళ్లిన. సంత నుంచి మిటింగ్కు వెళ్లినం. అక్కడ పోలీసుల కాల్పుల్లో నా కుడి చేయికి గాయమైంది. నా భర్త శంభు కూడా బుల్లెట్ల గాయంతో ఇంటికొచ్చి కొద్ది రోజుల తరువాత చనిపోయాడు. చేతి గాయం కారణంగా ఇప్పటికీ నేను ఎలాంటి పని చేయలేకపోతున్నా. ఉన్న ఒక్క కొడుకు కూడా అనారోగ్యంతో చనిపోయిండు. కోడలు వద్ద ఉంటున్న. ఆసరా పింఛన్ కూడా రావట్లేదు. కష్టంగా ఉంది. ప్రభుత్వం ఆదుకోవాలి. – మడావి జంగుబాయి, కన్నాపూర్ నా భర్తను కోల్పోయిన.. నాటి ఘటనలో నా భర్త కొద్దు మరణించాడు. ఆ తరువాత కూలి పనులు చేసుకుంటూ నా కొడుకును పెంచి పెద్ద చేసిన. ఇప్పటి వరకు ఉండేందుకు ఇల్లు కూడా లేదు. ఇటీవల ఇంటి స్థలం, ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేశారు. అయితే ఇందిరమ్మ నిధులతో ఇల్లు కట్టించి ఇవ్వాలి. ఐటీడీఏ ద్వారా రుణం అందించి నా కొడుకుకు ఉపాధి చూపాలి. – సేడ్మకి లచ్చుబాయి, తాటిగూడ ఇంద్రవెల్లి ఘటనకు 43 ఏళ్లు ఎట్టకేలకు అమరులను గుర్తించినరాష్ట్ర ప్రభుత్వం నేడు అమరవీరుల సంస్మరణ దినం ఉమ్మడి జిల్లా నుంచి తరలిరానున్న ఆదివాసీలు -
తొలి ఎంపీ.. సి.మాధవరెడ్డి
● హైదరాబాద్ రాష్ట్రంలో మొదటి ఎన్నికలు ● సోషలిస్టు పార్టీ తరఫున ఆదిలాబాద్ నుంచి పోటీ ● 25 వేల పైచిలుకు అధిక్యంతో విజయం కై లాస్నగర్: ఆదిలాబాద్ పార్లమెంట్ నియోజకవర్గం 1952లో ఆవిర్భవించింది. మహారాష్ట్ర, కర్నాటకలోని పలు ప్రాంతాలను కలుపుకుని హైదరాబాద్ రాష్ట్రంగా ఉన్న సమయంలో ఏర్పడిన ఈ నియోజకవర్గం జనరల్ స్థానంగా ఉండేది. అప్పట్లో హైదరాబాద్ రాష్ట్రంలో 21ఎంపీ స్థానాలు ఉండగా అందులో ఆదిలాబాద్ పార్లమెంట్ నియోజకవర్గం ఒకటి. ఈ నియోజకవర్గానికి 1952 మార్చి 27న తొలిసారిగా సాధారణ ఎన్నికలు జరిగాయి. ఇందులో సోషలిస్టు పార్టీ సత్తా చాటింది. ఆ పార్టీ తరఫున సి.మాధవరెడ్డి పోటీ చేయగా, ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ అభ్యర్థిగా జేవీ నర్సింగ్రావు బరిలో నిలిచారు. ఈ నియోజకవర్గ పరిధిలో మొత్తం 3,51,017 మంది ఓటర్లున్నారు. కాగా తొలిసారిగా జరిగిన ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగంపై ప్రజల్లో అంతగా అవగాహన లేకపోవడంతో సగానికిపైగా ఓటర్లు ఓటు హక్కు వినియోగానికి దూరంగా ఉన్నారు. తొలిసారిగా జరిగిన ఎన్నికల్లో 1,56,907 (44.7శాతం)ఓట్లు పోలయ్యాయి. 1,94,110 మంది ఓటర్లు ఎన్నికలకు దూరంగా ఉన్నారు. కాగా ఆ రోజుల్లో ఓటు హక్కు వినియోగించుకున్న ప్రతీ ఓటు చెల్లుబాటు కావడం గమనార్హం. ఆదిలాబాద్ ఎంపీగా.. ఆదిలాబాద్ పార్లమెంట్ నియోజకవర్గానికి జరిగిన తొలి ఎన్నికల్లో చెరుకు మాధవరెడ్డి ఎంపీగా విజయం సాధించి రికార్డు సృష్టించారు. సోషలిస్టు పార్టీ తరఫున పోటీ చేసిన ఆయనకు 90,995 ఓట్లు రాగా, సమీప ప్రత్యర్థి నర్సింగ్రావుకు 65,912 ఓట్లు పోలయ్యాయి. దీంతో మాధవరెడ్డి 25,083 ఓట్ల అధిక్యంతో విజయం సాధించి ఆదిలాబాద్ ఎంపీగా పార్లమెంట్లో అడుగుపెట్టారు. కమ్యూనిస్టుగా రాజకీయ జీవి తాన్ని ప్రారంభించిన మాధవరెడ్డి కాంగ్రెస్, టీడీపీల నుంచి కూడా పదవులు దక్కించుకున్నారు. ఆయన రాజకీయ జీవితం మూడు పార్టీల్లో సాగింది. అనంతరం కాంగ్రెస్లో చేరి 1962లో బోథ్ ఎమ్మెల్యేగా గెలిచి అసెంబ్లీలో అడుగుపెట్టారు. టీడీపీ ఆవిర్బావంతో ఆ పార్టీలో చేరిన ఆయన రెండోసారి 1984లో మరోసారి ఎంపీగా విజయంసాధించారు. చెరుకు మాధవరెడ్డి -
నిర్మల్
విద్యార్థులు ఆదర్శంగా నిలవాలి అల్లంపల్లి జీయర్ గురుకులం విద్యార్థులు ఆదర్శంగా నిలవాలని శ్రీత్రిదండి చినజీయర్స్వామి సూచించారు. శనివారం శ్రీ 20 శ్రీ ఏప్రిల్ శ్రీ 20248లోu 22న ఆదిలాబాద్కు సీఎం రేవంత్రెడ్డి ● కాంగ్రెస్ అభ్యర్థి నామినేషన్కు హాజరు కైలాస్నగర్: రాష్ట్ర ముఖ్యమంత్రి, టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డి ఈ నెల 22న జిల్లా కేంద్రానికి రానున్నట్లు ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్ ప్రకటనలో తెలిపారు. కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి సుగుణ నామినేషన్ దాఖలు కార్యక్రమంలో సీఎం పాల్గొంటారని పేర్కొన్నారు. అనంతరం జిల్లా కేంద్రంలో నిర్వహించే భారీ బహిరంగసభలో ముఖ్యమంత్రి పాల్గొని ప్రసంగిస్తారని తెలిపారు. పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలోని అన్ని ప్రాంతాల ప్రజలు తరలివచ్చి సభను జయప్రదం చేయాలని కోరారు. భైంసాటౌన్: మహాలక్ష్మి పథకంతో ఆర్టీసీకి ఆదరణ విపరీతంగా పెరిగింది. జీరో టికెట్తో మహిళా ప్రయాణికుల సంఖ్య మరింత పెరిగింది. దాదాపు అన్ని డిపోల్లోనూ ఓఆర్ (ఆక్యుపెన్సీ రేషియో)శాతం 87–88 వరకు నమోదవుతోంది. దీంతో సంస్థకు గతంతో పోలిస్తే భారీగా ఆదాయం సమకూరుతోంది. ఈ ఆదాయాన్ని మరింత పెంచుకోవడంపై సంస్థ దృష్టి పెట్టింది. ఇందులో భాగంగా ఈ ఉగాది నుంచి వచ్చే ఉగాది వరకు ప్రతీ డిపో రోజుకు రూ.లక్ష అదనపు ఆదాయం సాధించేలా ‘లక్షే లక్ష్యం’ అనే చాలెంజ్కు శ్రీకారం చుట్టింది. ఇప్పటికే ఆదిలాబాద్ రీజియన్ పరిధిలో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. భైంసా, నిర్మల్ డిపోల్లో డిప్యూటీ ఆర్ఎం ప్రణీత్ లక్షే లక్ష్యం కార్యక్రమం ఉద్దేశంపై ఉద్యోగులకు అవగాహన కల్పించారు. ప్రయాణికులను ఆర్టీసీ వైపు ఆకర్షించాలని, ప్రతీ స్టేజీలో ప్రయాణికులను పిలిచి ఎక్కించుకోవాలని సూచించారు. రీజియన్కు రూ.ఆరు లక్షలు టార్గెట్.. ఆర్టీసీ ఆదిలాబాద్ రీజియన్ పరిధిలో ఆదిలాబాద్, నిర్మల్, భైంసా, ఆసిఫాబాద్, ఉట్నూర్, మంచిర్యాల డిపోలు ఉన్నాయి. రీజియన్ పరిధిలో ప్రస్తుతం సరాసరి 88 శాతం ఓఆర్(ఆక్యుపెన్సీ రేషియో) నమోదవుతోంది. దీనిని 92 శాతానికి పెంచాలని లక్ష్యంగా నిర్ణయించారు. అలాగే ప్రస్తుతం అన్ని డిపోలకు కలిపి రోజుకు రూ.135.78 లక్షలు ఆదాయం వస్తుండగా, దీనిని రూ.141.80 లక్షలకు పెంచే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఈ లెక్కన ప్రతీ డిపోకు రోజుకు రూ.లక్ష చొప్పున అదనపు ఆదాయం సాధించాలని టార్గెట్ విధించారు. ఆదిలాబాద్ రీజియన్ పరిధిలో ఓఆర్, రెవెన్యూపరంగా నిర్మల్ డిపో ముందు నిలుస్తోంది. ప్రస్తుతం 92 శాతం ఓఆర్ వస్తుండగా, రోజుకు రూ.34.92 లక్షల ఆదాయం చేకూరుతోంది. అత్యల్పంగా ఉట్నూర్ డిపో 86 శాతం ఓఆర్ వస్తుండగా, రోజుకు రూ.6.42 లక్షల ఆదాయం వస్తోంది. దీంతో డిపో సామర్థ్యాన్ని బట్టి టార్గెట్ విధించారు. ఆదాయం సరే.. సర్వీసులేవి.. ఇదిలా ఉండగా, మహాలక్ష్మి పథకంతో ప్రైవేట్ వాహనాల్లో ప్రయాణించే వారి సంఖ్య దాదాపు పూర్తిగా తగ్గిపోయింది. దీంతో బస్సులు లేని రూట్లలో మినహా, చాలా రూట్లలో ప్రైవేట్ వాహనాలు కనిపించడం లేదు. ఈ నేపథ్యంలో ఆర్టీసీ ఈ లక్ష్యం చేరుకోవడం పెద్ద కష్టమేమీ కాదని సంబంధిత అధికారులు భావిస్తున్నారు. అయితే, ఆదాయంపై దృష్టి పెట్టిన సంస్థ ప్రయాణికులకు ఇబ్బందులు లేకుండా సుఖవంతమైన ప్రయాణం అందించేలా చర్యలు తీసుకోవాలని ప్రయాణికుల కోరుతున్నారు. ప్రస్తుతం రీజియన్ పరిధిలో రద్దీ వేళల్లో కొన్ని ట్రిప్పులకు ఓఆర్ శాతం 107 వరకు ఉంటోంది. కొన్ని ట్రిప్పుల్లో 60–80 శాతం ఉంటోంది. దీంతో సరాసరి 88 శాతం ఉంటోంది. గతంతో పోలిస్తే ఓఆర్ శాతం మెరుగుపడింది. రద్దీ సమయాల్లో అదనపు సర్వీసులు నడపడం ద్వారా ప్రయాణికులకు ఇబ్బందులు లేకుండా చూడాలని కోరుతున్నారు. న్యూస్రీల్అంబేద్కర్ స్టడీ సర్కిల్ ఏర్పాటు చేయాలి నిర్మల్చైన్గేట్: జిల్లా కేంద్రంలోని 534 సర్వే నంబర్లో అంబేద్కర్ స్టడీ సర్కిల్ ఏర్పాటు చేయాలని అంబేద్కర్ యువజన సంఘం ఆధ్వర్యంలో డీసీసీ అధ్యక్షుడు కూచాడి శ్రీహరిరావుకు శుక్రవారం వినతిపత్రం అందజేశారు. ఆ ప్రభుత్వ భూమిని కొందరు ఆక్రమించేందుకు యత్నించారని దానిని కాపాడామని తెలిపారు. అందరికీ ఉపయోగపడేలా అంబేద్కర్ స్టడీ సర్కిల్ ఏర్పాటు చేయాలని కోరారు. వినతిపత్రం ఇచ్చినవారిలో కాంగ్రెస్ పట్టణ అధ్యక్షుడు నాందేడపు చిన్ను, అంబేద్కర్ యువజన సంఘం జిల్లా అధ్యక్షుడు బత్తుల రంజిత్, మాల మహానాడు రాష్ట్ర ఉపాధ్యక్షుడు కొంతం గణేశ్, కత్తి నవీన్, దామ భూమేశ్, దేవి రవి, అరుణ్, సప్పల రవి, సేపూరి సిద్ధార్థ, మణికంఠ, నిమ్మ గణేశ్, బి.రాజు ఉన్నారు. అదనపు ఆదాయానికి ప్రణాళిక ఓఆర్ పెంపునకు కసరత్తు ఆర్టీసీలో కొత్త చాలెంజ్కు శ్రీకారంఆదిలాబాద్ రీజియన్లో డిపోలవారీగా లక్ష్యం ఇలా... డిపో ప్రస్తుతం లక్ష్యం ఓఆర్ రోజువారీ ఆదాయం ఓఆర్ రోజువారీ ఆదాయం ఆదిలాబాద్ 87 రూ.28.46 91 రూ.29.76 భైంసా 87 రూ.13.79 89 రూ.14.12 నిర్మల్ 92 రూ.34.92 97 రూ.36.62 ఉట్నూర్ 86 రూ.06.42 90 రూ.06.71 ఆసిఫాబాద్ 88 రూ.18.67 92 రూ.19.50 మంచిర్యాల 88 రూ.33.50 92 రూ.35.07 రీజియన్ 88 రూ.135.78 92 రూ.141.80 ప్రయాణికులకు చేరువయ్యేందుకు... ఆర్టీసీ ప్రయాణికులకు మరింత చేరువయ్యేందుకు సంస్థ అనేక కార్యక్రమాలు చేపడుతోంది. ప్రయాణికులకు మెరుగైన సేవలు అందించడంతోపాటు సంస్థ ఆదాయం పెంచుకునే కార్యక్రమాలపై దృష్టి పెట్టింది. ఇందులో భాగంగా ప్రతీ డిపోకు రోజుకు రూ.లక్ష అదనంగా ఆదాయం చేకూరాలనే ఉద్దేశంతో లక్షే లక్ష్యం కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ఈ కార్యక్రమంపై డిపోల వారీగా ఉద్యోగులకు అవగాహన కల్పించాం. – ప్రణీత్, డిప్యూటీ ఆర్ఎం, ఆదిలాబాద్ -
ఆత్రం సుగుణ ఆస్తులు రూ.54.60 లక్షలు
కై లాస్నగర్: ఆదిలాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ కాంగ్రెస్ అభ్యర్థి ఆత్రం సుగుణ లక్షాధికారే. శుక్రవారం ఆమె తరఫున దాఖలు చేసిన నామినేషన్ అఫిడవిట్లో తనకున్న ఆస్తులతో పాటు అప్పుల వివరాలు పేర్కొన్నారు. చరాస్తులు రూ.12లక్షల 10వేలు ఉండగా, తన భర్త భుజంగ్రావు పేరిట రూ.42వేలు ఉన్నట్లుగా తెలిపారు. స్థిరాస్తులు తన పేరిట రూ.42లక్షల 50వేలు ఉన్నాయి. అలాగే తన పేరిట వివిధ బ్యాంకుల్లో రూ.23లక్షల 49వేల 224 అప్పులు ఉండగా, తన భర్త పేరిట రూ.29లక్షల 76వేల 946 అప్పు ఉన్నట్లుగా వెల్లడించిన ఆమె తనకు సొంత వాహనం లేనట్టుగా పేర్కొన్నారు. కాగా తనపై ఉద్యమ కాలం నాటికి సంబంధించి 50 క్రిమినల్ కేసులు పెండింగ్లో ఉన్నట్లు వెల్లడించారు. -
ఎన్నికల వ్యయం పకడ్బందీగా నమోదు చేయాలి
● ఎన్నికల వ్యయ పరిశీలకులు జాదావార్ వివేకానంద నిర్మల్చైన్గేట్: ఎన్నికల ప్రచారానికి పార్టీ ద్వారా, అభ్యర్థి తరఫున ఖర్చుచేసే ప్రతీ పైసా ఎన్నికల వ్యయం కింద నమోదు చేయాలని ఆదిలాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ ఎన్నికల వ్యయ పరిశీలకులు జాదావార్ వివేకానంద అన్నారు. జిల్లా కేంద్రంలోని పెన్గంగ గెస్ట్హౌస్ నుంచి పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలోని ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల అధికారులతో కలెక్టర్ రాజర్షి షా, ఎస్పీ గౌస్ ఆలంతో కలిసి శుక్రవారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అభ్యర్థులు, రాజకీయ పార్టీలు ఎన్నికల ప్రచారంలో చేసే ఖర్చుల వివరాలు పక్కాగా నమోదు చేయాలన్నారు. ఎస్ఎస్టీ, వీఎస్టీ, ఎస్ఎస్టీ అకౌంటింగ్ టీం సభ్యులు సమన్వయంతో సమర్థవంతంగా విధులు నిర్వహించాలన్నారు. అనుమానాస్పద బ్యాంకు ఖాతాలను తనిఖీ చేయాలన్నారు. ఎంసీఎంసీ ద్వారా ఎన్నికల్లో చేసిన ప్రకటనలకు ఈసీ విడుదల చేసిన రేట్ల ప్రకారం ఎన్నికల వ్యయంగా నమోదు చేయాలన్నారు. అలాగే రోజువారిగా దినపత్రికల్లో వచ్చే పెయిడ్ న్యూస్పై దృష్టి సారించాలని, సోషల్ మీడియాపై ప్రత్యేక నిఘా ఉంచాలన్నారు. కార్యక్రమంలో నిర్మల్, కుమురంభీం ఆసిఫాబాద్ జిల్లాల కలెక్టర్లు అశిష్ సంగ్వాన్, వెంకటేష్ దోట్రే, ఇతర అధికారులు తదితరులు పాల్గొన్నారు. అన్ని టీంలు సిద్ధం.. అనంతరం కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ మాట్లాడుతూ జిల్లాలోని మూడు అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో అన్నిరకాల టీమ్లను ఏర్పాటు చేశామని, ఇప్పటి వరకు సీవిజిల్ యాప్లో 5 ఫిర్యాదులు వచ్చాయని, వాటిని పరిష్కరించామని తెలిపారు. రూ.1.19 కోట్ల నగదును స్వాధీనం చేసుకున్నామన్నారు. ఎస్పీ జానకీషర్మిల మాట్లాడుతూ జిల్లాలోని ప్రతీ చెక్ పోస్టుల వద్ద పటిష్టమైన నిఘా వ్యవస్థను ఏర్పాటు చేశామని, 16,089 లీటర్ల మద్యాన్ని పట్టుకున్నామని తెలిపారు. సమావేశంలో అదనపు కలెక్టర్ కిశోర్కుమార్, ఆర్డీవోలు రత్నకళ్యాణి, కోమల్రెడ్డి, ఈడీఎం నదీం, ఎన్నికల సూపరింటెండెంట్ శ్రీనివాస్, అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.
Related News by category
-
ఎన్నికల వ్యయం పకడ్బందీగా నమోదు చేయాలి
● ఎన్నికల వ్యయ పరిశీలకులు జాదావార్ వివేకానంద నిర్మల్చైన్గేట్: ఎన్నికల ప్రచారానికి పార్టీ ద్వారా, అభ్యర్థి తరఫున ఖర్చుచేసే ప్రతీ పైసా ఎన్నికల వ్యయం కింద నమోదు చేయాలని ఆదిలాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ ఎన్నికల వ్యయ పరిశీలకులు జాదావార్ వివేకానంద అన్నారు. జిల్లా కేంద్రంలోని పెన్గంగ గెస్ట్హౌస్ నుంచి పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలోని ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల అధికారులతో కలెక్టర్ రాజర్షి షా, ఎస్పీ గౌస్ ఆలంతో కలిసి శుక్రవారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అభ్యర్థులు, రాజకీయ పార్టీలు ఎన్నికల ప్రచారంలో చేసే ఖర్చుల వివరాలు పక్కాగా నమోదు చేయాలన్నారు. ఎస్ఎస్టీ, వీఎస్టీ, ఎస్ఎస్టీ అకౌంటింగ్ టీం సభ్యులు సమన్వయంతో సమర్థవంతంగా విధులు నిర్వహించాలన్నారు. అనుమానాస్పద బ్యాంకు ఖాతాలను తనిఖీ చేయాలన్నారు. ఎంసీఎంసీ ద్వారా ఎన్నికల్లో చేసిన ప్రకటనలకు ఈసీ విడుదల చేసిన రేట్ల ప్రకారం ఎన్నికల వ్యయంగా నమోదు చేయాలన్నారు. అలాగే రోజువారిగా దినపత్రికల్లో వచ్చే పెయిడ్ న్యూస్పై దృష్టి సారించాలని, సోషల్ మీడియాపై ప్రత్యేక నిఘా ఉంచాలన్నారు. కార్యక్రమంలో నిర్మల్, కుమురంభీం ఆసిఫాబాద్ జిల్లాల కలెక్టర్లు అశిష్ సంగ్వాన్, వెంకటేష్ దోట్రే, ఇతర అధికారులు తదితరులు పాల్గొన్నారు. అన్ని టీంలు సిద్ధం.. అనంతరం కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ మాట్లాడుతూ జిల్లాలోని మూడు అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో అన్నిరకాల టీమ్లను ఏర్పాటు చేశామని, ఇప్పటి వరకు సీవిజిల్ యాప్లో 5 ఫిర్యాదులు వచ్చాయని, వాటిని పరిష్కరించామని తెలిపారు. రూ.1.19 కోట్ల నగదును స్వాధీనం చేసుకున్నామన్నారు. ఎస్పీ జానకీషర్మిల మాట్లాడుతూ జిల్లాలోని ప్రతీ చెక్ పోస్టుల వద్ద పటిష్టమైన నిఘా వ్యవస్థను ఏర్పాటు చేశామని, 16,089 లీటర్ల మద్యాన్ని పట్టుకున్నామని తెలిపారు. సమావేశంలో అదనపు కలెక్టర్ కిశోర్కుమార్, ఆర్డీవోలు రత్నకళ్యాణి, కోమల్రెడ్డి, ఈడీఎం నదీం, ఎన్నికల సూపరింటెండెంట్ శ్రీనివాస్, అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. -
తొలి ఎంపీ.. సి.మాధవరెడ్డి
● హైదరాబాద్ రాష్ట్రంలో మొదటి ఎన్నికలు ● సోషలిస్టు పార్టీ తరఫున ఆదిలాబాద్ నుంచి పోటీ ● 25 వేల పైచిలుకు అధిక్యంతో విజయం కై లాస్నగర్: ఆదిలాబాద్ పార్లమెంట్ నియోజకవర్గం 1952లో ఆవిర్భవించింది. మహారాష్ట్ర, కర్నాటకలోని పలు ప్రాంతాలను కలుపుకుని హైదరాబాద్ రాష్ట్రంగా ఉన్న సమయంలో ఏర్పడిన ఈ నియోజకవర్గం జనరల్ స్థానంగా ఉండేది. అప్పట్లో హైదరాబాద్ రాష్ట్రంలో 21ఎంపీ స్థానాలు ఉండగా అందులో ఆదిలాబాద్ పార్లమెంట్ నియోజకవర్గం ఒకటి. ఈ నియోజకవర్గానికి 1952 మార్చి 27న తొలిసారిగా సాధారణ ఎన్నికలు జరిగాయి. ఇందులో సోషలిస్టు పార్టీ సత్తా చాటింది. ఆ పార్టీ తరఫున సి.మాధవరెడ్డి పోటీ చేయగా, ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ అభ్యర్థిగా జేవీ నర్సింగ్రావు బరిలో నిలిచారు. ఈ నియోజకవర్గ పరిధిలో మొత్తం 3,51,017 మంది ఓటర్లున్నారు. కాగా తొలిసారిగా జరిగిన ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగంపై ప్రజల్లో అంతగా అవగాహన లేకపోవడంతో సగానికిపైగా ఓటర్లు ఓటు హక్కు వినియోగానికి దూరంగా ఉన్నారు. తొలిసారిగా జరిగిన ఎన్నికల్లో 1,56,907 (44.7శాతం)ఓట్లు పోలయ్యాయి. 1,94,110 మంది ఓటర్లు ఎన్నికలకు దూరంగా ఉన్నారు. కాగా ఆ రోజుల్లో ఓటు హక్కు వినియోగించుకున్న ప్రతీ ఓటు చెల్లుబాటు కావడం గమనార్హం. ఆదిలాబాద్ ఎంపీగా.. ఆదిలాబాద్ పార్లమెంట్ నియోజకవర్గానికి జరిగిన తొలి ఎన్నికల్లో చెరుకు మాధవరెడ్డి ఎంపీగా విజయం సాధించి రికార్డు సృష్టించారు. సోషలిస్టు పార్టీ తరఫున పోటీ చేసిన ఆయనకు 90,995 ఓట్లు రాగా, సమీప ప్రత్యర్థి నర్సింగ్రావుకు 65,912 ఓట్లు పోలయ్యాయి. దీంతో మాధవరెడ్డి 25,083 ఓట్ల అధిక్యంతో విజయం సాధించి ఆదిలాబాద్ ఎంపీగా పార్లమెంట్లో అడుగుపెట్టారు. కమ్యూనిస్టుగా రాజకీయ జీవి తాన్ని ప్రారంభించిన మాధవరెడ్డి కాంగ్రెస్, టీడీపీల నుంచి కూడా పదవులు దక్కించుకున్నారు. ఆయన రాజకీయ జీవితం మూడు పార్టీల్లో సాగింది. అనంతరం కాంగ్రెస్లో చేరి 1962లో బోథ్ ఎమ్మెల్యేగా గెలిచి అసెంబ్లీలో అడుగుపెట్టారు. టీడీపీ ఆవిర్బావంతో ఆ పార్టీలో చేరిన ఆయన రెండోసారి 1984లో మరోసారి ఎంపీగా విజయంసాధించారు. చెరుకు మాధవరెడ్డి -
‘మోదీ సారథ్యంలోనే దేశ అభివృద్ధి’
నిర్మల్చైన్గేట్: ప్రధాని నరేంద్రమోదీ సారథ్యంలోనే దేశం అన్నిరంగాల్లో అభివృద్ధి సాధి స్తోందని, ప్రగతిపథంలో దైసుకెళ్తోందని బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి మెడిసెమ్మె రాజు అన్నారు. పట్టణంలో శుక్రవారం ఇంటింటికీ బీజేపీ కార్యక్రమంలో నిర్వహించారు. 24వ వార్డులో ప్రచారం నిర్వహించారు. సబ్కా సాత్ సబ్కా వికాస్ అనే నినాదంతో మోదీ పాలన సాగిస్తున్నారని తెలిపారు. పదేళ్లు దేశానికి అవి నీతి రహిత పాలన అందించారని తెలిపారు. కార్యక్రమంలో బీజేవైఎం జిల్లా అధ్యక్షుడు ఒడిసెల అర్జున్, సీనియర్ నాయకులు ఒడిశెల శ్రీనివాస్, ద్యేవరశెట్టి గణేశ్, అనంతుల అభిలాష్, కిశోర్, శరత్, వంశీ, అన్వేష్, శివకుమార్, అనుదీప్ తదితరులు పాల్గొన్నారు. ఇంటింటి ప్రచారంలో బీజేపీ నాయకులు -
అమరం.. స్మరణం
బాధను పంచుకోవాలి విద్యార్థులు అన్ని విషయాలను అధ్యాపకులతో పంచుకోవాలని కార్పొరేట్ ట్రైనర్ తిరుమల్రెడ్డి సూచించారు. వాతావరణం ఆకాశం కొంతమేకు మేఘావృతమవుతుంది. ఉష్ణోగ్రతలు స్వల్పంగా తగ్గుతాయి. వేడి, ఉక్కపోత కొనసాగుతుంది. సాయంత్రం వర్షం పడే అవకాశం ఉంది. 8లోu ఇంద్రవెల్లి: 1981 ఏప్రిల్ 20 జల్..జంగల్...జమీన్ కోసం ఉద్యమించిన అడవిబిడ్డలపై అప్పటి సర్కారు తుపాకీ ఎక్కుపెట్టింది. తూటాల వర్షం కురిపించింది. హక్కుల సాధనలో 15 మంది గిరిజనులు అమరులయ్యారు. వారి రక్తపుటేరులతో తడిసిన పచ్చని వనం ఎరుపెక్కింది. అడవిబిడ్డల అమరత్వం నింగికెగిసిన అగ్ని శిఖలా ఇంద్రవెల్లిలో అమరుల స్తూపమై నిలిచింది. ఈ ఘటనకు 43 ఏళ్లు. అయితే ఇప్పటికీ ఆ స్తూపం వద్ద ఏటా ఆదివాసీలు స్వేచ్ఛగా నివాళులు అర్పించలేని పరిస్థితి. నాడు పూర్తిగా పోలీసు నిఘాలోనే స్తూపం ఉండేది. 2015లో తొలిసారిగా ఆంక్షలతో కూడిన అనుమతి ఇవ్వడంతో ఆదివాసీలు వచ్చి అమరులకు నివాళులర్పిస్తున్నారు. ఈసారి ఉమ్మడి జిల్లా నుంచి ఆదివాసీలతోపాటు జిల్లా ఇన్చార్జి మంత్రి సీతక్క, ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జుపటేల్, ఆదివాసీ ప్రజాప్రతినిధులు, నాయకులు హాజరుకానున్నారు. స్తూపం వద్ద ఏర్పాట్లు పూర్తి చేసినట్లు నిర్వాహకులు తెలిపారు. 33 ఏళ్లుగా నివాళులకు దూరం నాటి కాల్పుల ఘటన సాక్షిగా ఇంద్రవెల్లి సమీపంలో స్తూపం నిర్మించారు. ఆ రోజు నుంచి ఉమ్మడి రాష్ట్రం పాలన ముగిసే వరకు 33 ఏళ్లుగా అమరులకు నివాళులర్పించడానికి అనుమతి ఇవ్వలేదు. ఏటా పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేసే వారు. ఈ క్రమంలో 2004 అప్పటి బోథ్ ఎమ్మెల్యే సోయం బాపూరావ్ గిరిజన నాయకులతోపాటు అప్పటి ఎంపీ మధుసూదన్రెడ్డితో కలిసి ఏప్రిల్ 25న నివాళులర్పించారు. అప్పటి నుంచి ఏటా ఆదివాసీ గిరిజనులు అదేరోజున నివాళులర్పించారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఆదివాసీ సంఘాల కోరిక మేరకు రాష్ట్ర ప్రభుత్వం అనుమతి ఇవ్వకపోయినా ఆంక్షలు సడలించి స్తూపం వద్ద ఏప్రిల్ 20న నివాళులు అర్పించేందుకు రెండు గంటల సమయం ఇచ్చింది. దీంతో ఆదివాసీ సంప్రదాయ రీతిలో పూజలు చేసి నివాళులర్పిస్తున్నారు. ఎట్టకేలకు స్మృతి వనం, ఇళ్ల స్థలాలు నాడు హక్కుల కోసం పోరాడిన ఆదివాసీలపై అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం పోలీసులతో దాడి చేయించడంతో అనేక మంది ప్రాణాలు కోల్పోవడంతోపాటు గాయాలపాలయ్యారు. అయితే బాధిత కుటుంబాలను ఏ ప్రభుత్వాలు పట్టించుకోలేదు. మూడేళ్ల క్రితం అమరుల కుటుంబాలను గుర్తించిన ఎంపీ సోయం బాపూరావు రూ.10 వేల చొప్పున ఆర్థికసాయం అందించారు. ప్రస్తుతం రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడంతో సీఎం రేవంత్రెడ్డి, జిల్లా ఇన్చార్జి మంత్రి సీతక్క స్పందించారు. పోలీస్ శాఖలో ఉన్న రికార్డుల ప్రకారం 15 మంది అమరవీరుల కుటుంబాలకు ఇటీవల మండలంలోని ముత్నూర్ సమీపంలో ఇళ్ల స్థలాలు కేటాయించారు. హక్కు పత్రాలతోపాటు ఇందిరమ్మ ఇళ్లు నిర్మించుకునేందుకు రూ.5 లక్షల చొప్పున నిధులు మంజూరు చేశారు. అమరవీరుల స్తూపాన్ని స్మృతి వనంగా తీర్చదిద్దేందుకు రూ.97 లక్షలు కేటాయించారు. రెండోసారి స్మారక స్తూపం నిర్మాణం. ఆదివాసీల స్మారకార్థం రైతు కూలీ సంఘం ఇంద్రవెల్లిలో 80 అడుగుల స్తూపాన్ని నిర్మించింది. ఆ స్తూపాన్ని 1986 మార్చిలో గుర్తుతెలియని వ్యక్తులు డైనమేట్లతో పేల్చారు. గిరిజనుల ఆందోళనలతో 1987లో ప్రభుత్వం ఐటీడీఏ నిధులతో రెండోసారి స్తూపం నిర్మించింది. పోలీసు బందోబస్తు.. సంస్మరణ దినోత్సవం సందర్భంగా ఇంద్రవెల్లి మండలంలో శుక్రవారం సాయంత్రం నుంచి శనివారం సాయంత్రం వరకు పోలీసు బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు. ఉట్నూర్ డీఎస్పీ నాగేందర్ ఆధ్వర్యంలో ఇద్దరు సీఐలు, ఏడుగురు ఎస్సైలతోపాటు 100మందితో బందోబస్తు నిర్వహిస్తున్నారు. అసలేం జరిగింది. స్వాతంత్య్రం వచ్చి అప్పటికీ మూడున్నర దశాబ్దాలవుతున్నా ఆదివాసీలు ఎదుర్కొంటున్న సమస్యలు పరిష్కారానికి నోచుకోలేదు. ఈ క్రమంలో 1981లో చట్టబద్ధమైన హక్కుల సాధన కోసం పిపుల్స్వార్ ఆధ్వర్యంలో గిరిజన రైతు కూలీ సంఘం పేరిట ఇంద్రవెల్లిలో గిరిజన బహిరంగ సభ ఏర్పాటు చేశారు. పోలీసులు అనుమతి ఇవ్వకపోయినా ఆ రోజు సోమవారం వారసంత కావడంతో ఉదయం నుంచే ఆదివాసీలు భారీగా తరలివచ్చారు. మధ్యాహ్నం 3 గంటల వరకే సభప్రాంగణం గిరి పుత్రులతో కిక్కిరిసిపోయింది. సభా స్థలాన్ని ఖాళీ చేయాలని పోలీసులు హెచ్చరికలు జారీ చేశారు. అయినా వినకుండా మరికొందరు గిరిజనులు ర్యాలీగా అక్కడికి బయలుదేరారు. వారిని అడ్డుకునే క్రమంలో ముందున్న గిరిజన యువతితో ఓ పోలీసు అసభ్యకరంగా ప్రవర్తించాడు. ఆమె వెంటనే పోలీసుపై దాడి చేయగా ఆయన నెలకొరిగాడు. పరిస్థితి చేయిదాటి పోవడంతో పోలీసులు తూటాల వర్షం కుర్పించారు. రక్తం ఏరులై పారింది. ఈ ఘటనలో 15మంది ఆదివాసీలు మాత్రమే చనిపోయినట్లు ప్రభుత్వ రికా ర్డుల్లో ఉంది. కానీ అప్పుడు తూటాల గాయాలతో తమ ఇళ్లకు వెళ్లి పోలీసుల భయంతో బయటకు రాలేక, వైద్యం అందక 60 మంది వరకు చనిపోయినట్లు పౌరహక్కుల సంఘం నిజనిర్ధారణ కమిటీ తమ నివేదికలో స్పష్టం చేసింది. గాయంతో ఏ పని చేయలేను.. నాడు ఇంద్రవెల్లిలో వారసంత ఉండడంతో నా భర్త శంభుతో కలిసి వెళ్లిన. సంత నుంచి మిటింగ్కు వెళ్లినం. అక్కడ పోలీసుల కాల్పుల్లో నా కుడి చేయికి గాయమైంది. నా భర్త శంభు కూడా బుల్లెట్ల గాయంతో ఇంటికొచ్చి కొద్ది రోజుల తరువాత చనిపోయాడు. చేతి గాయం కారణంగా ఇప్పటికీ నేను ఎలాంటి పని చేయలేకపోతున్నా. ఉన్న ఒక్క కొడుకు కూడా అనారోగ్యంతో చనిపోయిండు. కోడలు వద్ద ఉంటున్న. ఆసరా పింఛన్ కూడా రావట్లేదు. కష్టంగా ఉంది. ప్రభుత్వం ఆదుకోవాలి. – మడావి జంగుబాయి, కన్నాపూర్ నా భర్తను కోల్పోయిన.. నాటి ఘటనలో నా భర్త కొద్దు మరణించాడు. ఆ తరువాత కూలి పనులు చేసుకుంటూ నా కొడుకును పెంచి పెద్ద చేసిన. ఇప్పటి వరకు ఉండేందుకు ఇల్లు కూడా లేదు. ఇటీవల ఇంటి స్థలం, ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేశారు. అయితే ఇందిరమ్మ నిధులతో ఇల్లు కట్టించి ఇవ్వాలి. ఐటీడీఏ ద్వారా రుణం అందించి నా కొడుకుకు ఉపాధి చూపాలి. – సేడ్మకి లచ్చుబాయి, తాటిగూడ ఇంద్రవెల్లి ఘటనకు 43 ఏళ్లు ఎట్టకేలకు అమరులను గుర్తించినరాష్ట్ర ప్రభుత్వం నేడు అమరవీరుల సంస్మరణ దినం ఉమ్మడి జిల్లా నుంచి తరలిరానున్న ఆదివాసీలు -
ఆత్రం సుగుణ ఆస్తులు రూ.54.60 లక్షలు
కై లాస్నగర్: ఆదిలాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ కాంగ్రెస్ అభ్యర్థి ఆత్రం సుగుణ లక్షాధికారే. శుక్రవారం ఆమె తరఫున దాఖలు చేసిన నామినేషన్ అఫిడవిట్లో తనకున్న ఆస్తులతో పాటు అప్పుల వివరాలు పేర్కొన్నారు. చరాస్తులు రూ.12లక్షల 10వేలు ఉండగా, తన భర్త భుజంగ్రావు పేరిట రూ.42వేలు ఉన్నట్లుగా తెలిపారు. స్థిరాస్తులు తన పేరిట రూ.42లక్షల 50వేలు ఉన్నాయి. అలాగే తన పేరిట వివిధ బ్యాంకుల్లో రూ.23లక్షల 49వేల 224 అప్పులు ఉండగా, తన భర్త పేరిట రూ.29లక్షల 76వేల 946 అప్పు ఉన్నట్లుగా వెల్లడించిన ఆమె తనకు సొంత వాహనం లేనట్టుగా పేర్కొన్నారు. కాగా తనపై ఉద్యమ కాలం నాటికి సంబంధించి 50 క్రిమినల్ కేసులు పెండింగ్లో ఉన్నట్లు వెల్లడించారు.
Advertisement
Photos
View allVideo
View allTuesdays and Fridays Movie: వెబ్ ఫ్లిక్స్.. మూడు షరతులు
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
టైటిల్ నిలబెట్టుకోవాలనే లక్ష్యంతో...
వాట్సప్లో మారిన రంగులు.. కారణం అదేనంటూ
బెయిర్ స్టో విధ్వంసకర సెంచరీ.. కేవలం 45 బంతుల్లోనే
లాయర్గా...
పరుగుల పంజా...
పరుగు ఇవ్వకుండానే 7 వికెట్లు
‘మిక్స్డ్’ ఫైనల్లో సురేఖ–అభిషేక్ జోడీ
చెడుపై గెలుపు
చరిత్ర సృష్టించిన పంజాబ్ కింగ్స్.. ప్రపంచంలోనే తొలి జట్టుగా
ఇదెక్కడి విధ్వంసం... కేవలం 28 బంతుల్లోనే! 8 సిక్స్లతో
Bullet List Block
- rabri devi: రబ్రీ దేవి ఇంటికి సీబీఐ బృందం
- sreemukhi: ఖతర్నాక్ అందాలతో కవ్విస్తోన్న అందాల యాంకర్ శ్రీముఖి (ఫొటోలు)
- Actress Sreeleela: శ్రీలీల బ్యూటిఫుల్ ఫొటోలు
- Sree Lakshmi Reddy: కలహాలు లేని కాపురం ఉండబోదు.. అంతమాత్రాన
- TCSS ఆధ్వర్యంలో ఘనంగా వినాయక చవితి వేడుకలు
- PR Sreejesh: ఆవును అమ్మి.. కొడుకు కలను సాకారం చేసి
- PR Sreejesh: ఆవును అమ్మి.. కొడుకు కలను సాకారం చేసి
- RRR Movie : ఆ పాట కంటతడి పెట్టిస్తుందట
- Bellamkonda Sreenivas: మరో సూపర్ హిట్ రీమేక్తో వస్తోన్న బెల్లంకొండ
- Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
What’s your opinion
is snake reptile?
What is your fav car
ముంబై కెప్టెన్గా హార్దిక్ పాండ్యా నియామకం సరైందేనా?
AP : కూటమి మ్యానిఫెస్టోపై ఏమనుకుంటున్నారు?
నమ్మశక్యం కాని వాగ్దానాలిస్తారు
ఏ పార్టీకి నచ్చిన వాగ్దానాలు వారిస్తారు
Advertisement