గని కార్మికుల సమస్యలు పరిష్కరించాలి | Sakshi
Sakshi News home page

గని కార్మికుల సమస్యలు పరిష్కరించాలి

Published Fri, Apr 19 2024 1:35 AM

-

భూపాలపల్లి అర్బన్‌: భూపాలపల్లి ఏరియాలోని వివిధ గనుల్లో కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించాలని తెలంగాణ సింగరేణి ఉద్యోగుల సంఘం ఏరియా ఉపాధ్యక్షుడు దాసరి జనార్దన్‌ డిమాండ్‌ చేశారు. ఏరియాలోని యూనియన్‌ కార్యాలయంలో గురువారం ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. 5వ గనిలో మ్యాన్‌రైడింగ్‌ సరిగా పని చేయడం లేదన్నారు. 150 కుర్చీలు ఉండాల్సి ఉండగా.. కేవలం 20 కుర్చీలు మాత్రమే ఉన్నాయని తెలిపారు. క్యాంటీన్‌లో సమయపాలన పాటించడం లేదని చెప్పారు. అధికారుల దృష్టికి తీసుకెళ్లినా పట్టించుకోవడం లేదన్నారు. ఎండ తీవ్రత పెరిగినప్పటికీ చల్లటి తాగునీటికి అందించడం లేదని ఆరోపించారు. ప్రశ్నించిన కార్మికులను సస్పెండ్‌ చేస్తూ చార్జీిషీట్లు జారీ చేస్తున్నారని మండిపడ్డారు. ఈ సమావేశంలో నాయకులు కాసర్ల ప్రసాద్‌రెడ్డి, శ్రీనివాస్‌, కలికొటి లింగయ్య, రాళ్లబండి బాబు, శ్రీధర్‌ పాల్గొన్నారు.

Advertisement
Advertisement