రూ.70వేల విలువైన మద్యం స్వాధీనం | Sakshi
Sakshi News home page

రూ.70వేల విలువైన మద్యం స్వాధీనం

Published Thu, Apr 18 2024 2:05 PM

పట్టుబడిన మద్యం, నిందితులు  - Sakshi

ఏటూరునాగారం/మంగపేట: ఎలాంటి అనుమతులు లేకుండా తరలిస్తున్న రూ.70వేల విలువైన అక్రమ మద్యం స్వాధీనం చేసుకున్నట్లు ఏటూరునాగారం ఎక్సైజ్‌ స్టేషన్‌ సీఐ ఎల్‌.రామకృష్ణ తెలిపారు. ఎన్నికల కోడ్‌ అమలులో భాగంగా బుధవారం మంగపేట మండలం మల్లూరు గ్రామపంచాయతీ శివారు ప్రాంతంలో వాహనాలు తనిఖీ చేస్తుండగా ఒక ఆటోలో తరలిస్తున్న 66.96లీటర్ల లిక్కర్‌, 15.60లీటర్ల బీర్లను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. అక్రమంగా మద్యాన్ని తరలిస్తున్న రమణక్కపేటకు చెందిన గుమ్మల రంజిత్‌, కున్నారపు చంటిలను అదుపులోకి తీసుకుని విచారించినట్లు తెలిపారు. ఈ క్రమంలో వారు మణుగూరు నుంచి మద్యం తీసుకొచ్చి మంగపేట మండలంలో విక్రయిస్తున్నట్లు తేలిందన్నారు.

Advertisement
 
Advertisement
 
Advertisement