విత్తన మేళాకు రైతులు | Sakshi
Sakshi News home page

విత్తన మేళాకు రైతులు

Published Sat, May 25 2024 6:05 PM

విత్తన మేళాకు రైతులు

మెదక్‌జోన్‌: రాజేంద్రనగర్‌లోని ప్రొఫెసర్‌ జయశంకర్‌ వ్యవసాయ విశ్వవిద్యాలయంలో ఏర్పాటు చేసిన విత్తన మేళాను జిల్లా రైతులు సందర్శించారని జిల్లా వ్యవసాయ అధికారి గోవింద్‌ తెలిపా రు. శుక్రవారం ఆయన మాట్లాడుతూ.. జిల్లాలోని 21 మండలాల నుంచి 30 మంది రైతులు మేళాకు హాజరయ్యారన్నారు. మేలైన వంగడాలు సాగుచేయాలని వ్యవసాయ విశ్వవిద్యాల యం నిర్ణయించిందన్నారు. 16 పంటల్లో 67 రకాలకు సంబంధించి దాదాపు 12 వేల క్వింటాళ్ల విత్తనాలను రైతులకు విక్రయించేందుకు అందుబాటులో ఉంచినట్లు చెప్పారు. వ్యవసాయంలో ఆధునిక సాంకేతికతపై రైతుల సందేహాలు తీర్చడానికి శాస్త్రవేత్తలతో చర్చాగోష్టి ఏర్పాటు చేస్తున్నారని వివరించారు. వ్యవసాయం, అనుబంధ రంగాలకు సంబంధించిన ప్రదర్శన సైతం ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు.

Advertisement
 
Advertisement
 
Advertisement