చారకొండ: తండ్రి మృతిచెందగా.. ఆ బాధను దిగ మింగుకొని పదో తరగతి పరీక్ష రాసి అంత్యక్రియ ల్లో పాల్గొంది ఓ విద్యార్థిని. వివరాల్లోకి వెళ్తే.. మండలంలోని జూపల్లికి చెందిన కడారి తిరుపతయ్య యాదవ్ (40) చికిత్స పొందుతూ సోమవా రం మధ్యాహ్నం మృతిచెందాడు. కుమార్తె పావని పదోతరగతి పరీక్షలు రాస్తుంది. మంగళవారం మండల కేంద్రంలోని జెడ్పీ ఉన్నత పాఠశాల పరీక్ష కేంద్రంలో భౌతికశాస్త్రం పరీక్ష రాసి అంత్యక్రియల్లో పాల్గొంది.
పది పరీక్ష రాసి అంత్యక్రియలకు
హాజరైన కుమార్తె