అహోబిలంలో వైభవంగా శ్రీరామ నవమి వేడుకలు | Sakshi
Sakshi News home page

అహోబిలంలో వైభవంగా శ్రీరామ నవమి వేడుకలు

Published Thu, Apr 18 2024 10:15 AM

ప్రత్యేక అలంకరణలో సీతారామచంద్రులు,  లక్ష్మణ స్వామి    - Sakshi

ఆళ్లగడ్డ: దిగువ అహోబిలంలో శ్రీరామ నవమి వేడుకలు వైభవంగా నిర్వహించారు. ముందుగా ఉత్సవమూర్తులైన శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ ప్రహ్లాదవరదస్వాములను ప్రత్యేక పల్లకీలో కొలువుంచి అహోబిలం మఠంలో వెలసిన సీతారామ సన్నిధికి తోడ్కొని వచ్చారు. సీతారామచంద్రుడు, లక్ష్మణ స్వాములకు, శ్రీదేవి, భూదేవి, సమేత ప్రహ్లాదవరద స్వాములకు అభిషేకం, అర్చన, తిరుమంజనం నిర్వహించిన అనంతరం ఉత్సవమూర్తులను నూతన పట్టుపీతాంబరాలతో అలంకరణ చేసి కొలువుంచారు. అనంతరం భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. రాత్రి ఉత్సవ మూర్తులకు మాడ వీధుల్లో వైభవోపేతంగా గ్రామోత్సవం నిర్వహించి కార్యాక్రమాన్ని ముగించి భక్తులకు తీర్థ ప్రసాదాలు అందజేశారు.

Advertisement
Advertisement