ఎస్ఆర్ఆర్ కాలేజీ అటానమస్ స్టేటస్ పొడిగింపు
మధురానగర్(విజయవాడసెంట్రల్): మాచవరం ఎస్ఆర్ఆర్ అండ్ సీవీఆర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలకు మరో పదేళ్లు అటానమస్ స్టేటస్ను యూజీసీ పొడిగించింది. 2017లో అటానమస్ స్టేటస్ పొందిన కళాశాల ఇటీవల నిర్వహించిన నాక్లో ఏ గ్రేడ్ సాధించింది. ఎంతో మంది ప్రముఖులు విద్యాబ్యాసం చేసిన ఎంతో మంది మేధావులు పనిచేసిన 86 ఏళ్ల చరిత్ర కలిగిన ఎస్ఆర్ఆర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలకు యూజీసీ నాక్ ఏ గ్రేడ్తో పాటు పదేళ్లు స్వయంప్రతిపత్తి పొడిగించటం పట్ల కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ కె. భాగ్యలక్ష్మి హర్షం వ్యక్తం చేశారు. కళాశాల అధ్యాపకులు, అధ్యాపకేతరులు, విద్యార్థులు, పూర్వ విద్యార్థులు, విద్యార్థుల తల్లిదండ్రుల సమష్టి కృషితోనే ఈ స్థాయికి చేరుకున్నామని ఆమె అన్నారు. ఇదే స్ఫూర్తితో కళాశాల సిబ్బంది సమన్వయంతో పనిచేసి మరింత మెరుగైన విద్యాబోధన చేయాలని సూచించారు.