అభివాదం చేస్తున్న చెన్నయ్య, నాయకులు
ఖమ్మంమామిళ్లగూడెం: దళితుల వర్గీకరణ కోసం కాకుండా రాజ్యాధికారమే లక్ష్యంగా పోరాడాలని మాల మహానాడు జాతీయ అధ్యక్షుడు చెన్నయ్య పిలుపునిచ్చారు. మాల మహానాడు ఉమ్మడి ఖమ్మం జిల్లా కమిటీ ఆధ్వర్యాన బుధవారం ఖమ్మంలో జరిగిన ఆత్మీయ సమ్మేళనంలో ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. దళితుల మధ్య చిచ్చుపెట్టే ప్రయత్నాలను ప్రధాని మోదీ మానుకోవాలని సూచించారు. దళిత జనాభా పెరిగిందని, అందుకు అనుగుణంగా రిజర్వేషన్లు పెంచాలే తప్ప దళితుల మధ్య చిచ్చు పెట్టి రాజకీయ లబ్ధి కోసం యత్నించొద్దని తెలిపారు. కార్యక్రమంలో కన్వీనర్ దామాల సర్వయ్య, జిల్లా అధ్యక్షుడు శ్రీధర్తో పాటు రమేశ్, బాలకృష్ణ, దేవదానం, దామల సత్యం, తొగరు భాస్కర్, నాగార్జున, గోపీచరణ్, ప్రభాకర్, నర్సింహారావు, సురేందర్, సురేశ్, వెంకటేశ్వర్లు, శ్రీనివాస్, మడుసు జాకోబ్, కాంతమ్మ, సుక్కమ్మ, వీరభద్రం, వీరబాబు తదితరులు పాల్గొన్నారు.
మాల మహానాడు జాతీయ అధ్యక్షుడు చెన్నయ్య
Comments
Please login to add a commentAdd a comment