బాల్కొండ: యాసంగీ సీజన్లో ఆయకట్టుకు చివరి తడిగా కాలువల ద్వారా నీటి విడుదల కొనసాగుతుండటంతో శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్ నీటి మట్టం వేగంగా తగ్గుతోంది. మూడు రోజులుగా కాలువల ద్వారా నీటి విడుదల చేస్తున్నారు. రోజుకు 0.4 టీఎంసీల చొప్పున ఇది వరకే 1.2 టీఎంసీల నీరు ఖాళీ అయింది. కాకతీయ కాలువ ద్వారా ఐదు వేల క్యూసెక్కులు, లక్ష్మికాలువ ద్వారా 200 క్యూసె క్కులు, సరస్వతి కాలువ ద్వారా 300 క్యూసె క్కులు, ఆవిరి రూపంలో 271 క్యూసెక్కులు, తాగు నీటి అవసరాలకు 231 క్యూసెక్కుల నీరు పోతుంది. ప్రాజెక్ట్ పూర్తి స్థాయి నీటి మట్టం 1,091 (90 టీఎంసీలు) అడుగులు కాగా ఆదివారం సాయంత్రానికి ప్రాజెక్ట్లో 1,058.30 (11.4టీఎంసీలు) అడుగుల నీరు నిల్వ ఉందని ప్రాజెక్ట్ అధికారులు తెలిపారు.
Breadcrumb
- HOME
తగ్గుతున్న ఎస్సారెస్పీ నీటిమట్టం
Published Mon, Apr 15 2024 1:25 AM
Related news
-
పిడుగుపాటుకు ఆవు మృతి
నవీపేట: పిడుగుపాటు కారణంగా మండలంలోని మోకాన్పల్లిలో ఆవు మృతి చెందింది. మిర్యాల ఒడ్డెన్నకు చెందిన ఆవు సోమవారం సాయంత్రం పిడుగుపాటుకు గురై మృతి చెందిందని, దాని విలువ సుమారు రూ.40వేలు ఉంటుందని గ్రామస్తులు తెలిపారు. మోతెలో విద్యుత్షాక్తో.. వేల్పూర్: మండలంలోని మోతెలో విద్యుత్షాక్తో ఆవు మృతి చెందింది. ఉరడి నవీన్ అనే రైతుకు చెందిన సోమవారం ఆవు విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ పరిసరాల్లో మేతమేస్తుండగా షాక్ తగిలి మృతి చెందిందని మండల పశువైద్యాధికారి సంతోష్రెడ్డి తెలిపారు. మృతి చెందిన ఆవు విలువ సుమారు రూ. 40వేలు ఉంటుందని బాధిత రైతులు తెలిపాడు. రోడు ్డప్రమాదంలో పీఆర్ ఏఈకి గాయాలు ఎల్లారెడ్డిరూరల్(ఎల్లారెడ్డి): నాగిరెడ్డిపేట పీఆర్ ఏఈ పిచ్చయ్యకు రోడ్డు ప్రమాదంలో గాయాలైనట్లు స్థానికులు సోమవారం తెలిపారు. నాగిరెడ్డిపేట కార్యాలయంలో విధులను ముగించుకుని మెదక్కు వెళ్తుండగా ఎదురుగా వచ్చిన బైక్ ఢీకొట్టిందని, ఈ ఘటనలో పిచ్చయ్యకు తీవ్రగాయాలయ్యాయన్నారు. చికిత్స నిమిత్తం బాధితుడిని మెదక్ ఆస్పత్రికి తరలించినట్లు తెలిపారు. ఆటో, స్కూటీ ఢీకొన్న ఘటనలో.. ఎడపల్లి (బోధన్): మండలంలోని అలీసాగర్ లిఫ్ట్ ఆటో, స్కూటీ ఢీకొన్న ఘటనలో ఇద్దరికి తీవ్రగాయాలయ్యాయి. ఇద్దరు మహిళలు నిజామాబాద్ నుంచి బోధన్ వైపు స్కూటీపై వెళ్తుండగా ఆటో ఢీకొట్టింది. ఈ ఘటనలో ఇద్దరు మహిళలకు తీవ్రగాయాలయ్యాయి. బాధితులను చికిత్స నిమిత్తం స్థానికులు నిజామాబాద్కు తరలించారు. -
త్రుటిలో తప్పిన ప్రమాదం
డిచ్పల్లి: ధాన్యం బస్తాల లోడ్తో వెళ్తున్న లారీ మండల కేంద్రంలోని రైల్వే స్టేషన్ ఎదుట సోమవారం సాయంత్రం బోల్తాపడింది. ఓవర్ లోడ్ కారణంగా లారీ ఎడవవైపు ఒరిగి బోల్తాపడింది. రోడ్డు పక్కన నిలబడి ఉన్న వారిపై ధాన్యం బస్తాలు పడకపోవడంతో ప్రమాదం తప్పిందని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. డ్రైవర్ అద్దాన్ని పగులగొట్టుకుని క్యాబిన్లో నుంచి బయటకు వచ్చాడు. సిరికొండ మండలం చీమన్పల్లిలో ఐడీసీఎంఎస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రంలో వడ్ల బస్తాలను లోడ్ చేసుకుని నిజామాబాద్ శివారులోని రైస్మిల్లుకు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. సీఎం పర్యటన నేపథ్యంలో బందోబస్తులో ఉన్న పోలీసులు సమాచారం అందిన వెంటనే ఘటనాస్థలానికి చేరుకొని వాహనాల రాకపోకలు క్రమబద్ధీకరించారు. ఐడీసీఎంఎస్ సిబ్బందితో మాట్లాడి మరో లారీని రప్పించి ధాన్యం బస్తాలను తరలించారు. -
రాయిని ఢీకొన్న బైక్.. ఒకరి మృతి
● ఆరబోసిన ధాన్యం కుప్ప వద్ద ఘటన నవీపేట: రోడ్డుపై ఆరబోసిన ధాన్యం కుప్పపక్కన పెట్టిన రాయిని బైక్ ఢీకొన్న ఘటనలో ఒకరు మృతి చెందారు. నవీపేట–నాగేపూర్ మధ్య బాసర రోడ్డుపై ఈ ఘటన సోమవారం సాయంత్రం చోటుచేసుకుంది. ఎస్సై యాదగిరి తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి.. నాగేపూర్కు చెందిన నేతి సాయిలు(40) తన ఇద్దరు స్నేహితులతో కలిసి బైక్పై నవీపేటకు వెళ్తున్నాడు. మార్గమధ్యంలో రోడ్డుపై ఆరబోసిన ధాన్యం కుప్పకు అడ్డుగా పెట్టిన రాయిని ఢీకొట్టి బైక్ అదుపుతప్పింది. ఈ ఘట నలో సాయిలు అక్కడికక్కడే మృతి చెందగా, ఇద్ద రు స్నేహితులు ఘటనాస్థలం నుంచి పరారయ్యా రు. మృతుడికి భార్య వసంత, ఆరేళ్ల కూతురు ఉన్నారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. గుర్తు తెలియని వాహనం ఢీకొని.. కామారెడ్డి క్రైం: గుర్తుతెలియని వాహనం ఢీకొట్టిన ఘటనలో తాడ్వాయికి చెందిన మర్రి సాయిలు(40) అనే వ్యక్తి మృతి చెందాడు. ఈ ఘటన జిల్లా కేంద్రం పరిధిలోని పొందుర్తి శివారులో సోమవారం తెల్లవారుజామున చోటు చేసుకుంది. ఎస్సై రాజు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి.. సాయిలు పని నిమిత్తం ఆదివారం సాయంత్రం బైక్పై భిక్కనూరుకు వెళ్లాడు. సోమవారం తెల్లవారుజామున తిరిగి వెళ్తుండగా, పొందుర్తి సమీపంలోని లక్ష్మీనగర్తండా వద్ద వెనుక నుంచి వచ్చిన గుర్తు తెలియని వాహనం బైక్ను ఢీకొట్టింది. ఈ ఘటనలో సాయిలు అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడి తండ్రి వీరయ్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. -
అకాల వర్షం.. అతులాకుతలం
● నీటిలో కొట్టుకుపోయిన ధాన్యం ● నేలకొరిగిన భారీచెట్లు పిట్లం(జుక్కల్) : మండల కేంద్రంలో, చిల్లర్గి, సిద్దాపూర్, రాంపూర్, గౌరారం, కుర్తి తదితర గ్రామాల్లో సోమవారం కురిసిన భారీ వర్షంకు వరదనీరు రావడంతో వరిపంట ధాన్యం, జొన్నపంట పూర్తిగా నీటిలో మునిగిపోయింది. ధాన్యం నీళ్లలో కొట్టుకుపోయింది. మండల కేంద్రంలోని వ్యవసాయ మార్కెట్ కమిటీలో అధికారులు సిబ్బందికి, సహకార సంఘం అధికారులకు ధాన్యంపై కప్పడానికి కవర్లు ఇవ్వాలని ఎన్నిసార్లు కోరినప్పటికీ పట్టించుకోలేదని వారు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వీరిపై సంబంధిత అధికారులు చర్యలు తీసుకోవాలని, అదే విధంగా ఎక్కువ కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు త్వరగతిన ధాన్యంను కొనుగోలు చేయాలని రైతులు కోరుతున్నారు. నిజాంసాగర్లో.. నిజాంసాగర్(జుక్కల్) : నిజాంసాగర్, మహమ్మద్ నగర్ మండలాల్లో సోమవారం సాయంత్రం కురిసిన అకాలవర్షంతో పాటు బలమైన గాలులు, ఉరుములు, మెరుపులకు ప్రజలు అతలాకుతలయ్యారు. ఒక్కసారిగా వచ్చిన గాలులకు చెట్ల కొమ్మలు విరిగి పడటంతో పాటు ఇళ్ల పైకప్పు రేకులు లేచిపడ్డాయి. ఆయా గ్రామాల్లో కొనుగోలు కేంద్రాల వద్ద కుప్పలు పోసిన వరిధాన్యం వర్షానికి తడిసి ముద్దయ్యింది. రోడ్లపైన ఆరబెట్టిన ధాటికి ధాన్యం కొట్టుకుపోవడంతో రైతులు ఆందోళన చెందారు. రామారెడ్డిలో.. రామారెడ్డి : ఈదురుగాళ్లు ఉరుములు మెరుపులతో కూడిన భారీ వర్షంతో మండలంలో పలు చోట్ల చెట్లు నేలకొరకగా, ఇనుపరేకులు కింద పడిన ఘటనలు సోమవారం సాయంత్రం రాత్రి చోటుచేసుకున్నాయి. రామారెడ్డి నుంచి కామారెడ్డికి వెళ్లే మార్గంలో భారీ చెట్లు సైతం నేలకొరకగా ప్రమాదం జరిగే అవకాశం ఉండడంతో రామారెడ్డి ఎస్సై విజయ్ కొండ ఆధ్వర్యంలో పోలీసులు శ్రమించి జేసీబీ సాయంతో చెట్లను తొలగించారు. ఏఎస్సై రవీందర్, కానిస్టేబుల్ పవన్, గణేశ్ తదితరులు పాల్గొన్నారు. రూరల్ పరిధిలో.. కామారెడ్డి రూరల్ : మండలంలోని ఆయా గ్రామాల్లో సోమవారం సాయంత్రం ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షం కురిసింది. ఈదురుగాలులతో కూడిన వర్షం కురియడంతో పలు గ్రామాల్లో చెట్లు విరిగిపడ్డాయి. ఇళ్లపై రేకులు కొట్టుకుపోయాయి. మిద్దె ఇళ్లు పాక్షికంగా దెబ్బతిన్నాయి. అరగంట పాటు కురిసిన వర్షానికి విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. దోమకొండలో విద్యుత్ సరఫరా బంద్ దోమకొండ : మండల కేంద్రంలో సోమవారం ఉరుములు మెరుపులతో కూడిన వర్షం రాగా పిడుగు పడింది. రాత్రి 7 గంటల ప్రాంతంలో ఉరుములతో కూడిన వర్షం ప్రారంభమైంది. గ్రామంలోని బీబీపేట్ రోడ్డులో అయ్యవారి రామాచారి ఇంట్లో ఉన్న కొబ్బరి చెట్టుపై పిడుగు పడి చెట్టు మంటలతో పూర్తిగా కాలిపోయింది, పిడుగు పడిన సమయంలో ఇంట్లో ఎవరు లేకపోవడంతో గండం తప్పింది. మంటలు వస్తున్న విషయం తెలుసుకున్న ఆ ప్రాంతవాసులు కరెంటు అధికారులకు ఫోన్తో సమాచారం అందించడంతో గంట సేపు కరెంటును నిలిపివేశారు. గాలులకు కొట్టుకుపోయిన షెడ్లు పెద్దకొడప్గల్(జుక్కల్) : మండలంలో ఆదివారం నుంచి ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తూనే ఉంది. సోమవారం సాయంత్రం భారీ ఈదురుగాలులకు టీకారం తండాలో 30 రేకుల షెడ్లు ఎగిరిపోయాయి. ఈ ఏడాది వర్షాల్లేక పంటలు కొంత ఎండిపోగా, మిగితా పంట ఇలా అకాల వర్షానికి వర్షార్పణమైంది. రోడ్లపై ఆరబోసిన ధాన్యం దాదాపుగా కొట్టుకుపోయింది. లింగంపేటలో.. లింగంపేట(ఎల్లారెడ్డి): మండలంలోని పలు గ్రామాల్లో సోమవారం రాత్రి కురిసిన అకాల వర్షానికి అన్నదాతలు ఆగమయ్యారు. కొనుగోలు కేంద్రాల్లో ఆరబెట్టిన ధాన్యం పూర్తిగా తడిసిపోయింది. తడిసిన ధాన్యాన్ని వర్షం నీటి నుంచి తీయడానికి రైతులు అవస్థలు పడ్డారు. అధికారులు ధాన్యం తూకం వెంట వెంటనే వేయాలని రైతులు కోరుతున్నారు. వాతావరణలో తరుచూ మార్పులతో ఆరిన ధాన్యం తూకంలో జాప్యం కారణంగా తడిసిపోతుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. -
ఎయిర్ఫోర్స్ క్యాప్స్ అందజేత
కామారెడ్డి అర్బన్ : విద్యార్థులు అన్నిరంగాల్లో రాణించడానికి క్రమశిక్షణ అనేది చాలా ముఖ్యమైందని ఎయిర్ఫోర్స్ అధికారులు సందీప్, అనిల్ అన్నారు. కామారెడ్డి ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల, ఆర్కే డిగ్రీ కళాశాలలో సోమవారం ఎయిర్ ఫోర్స్, అగ్నివీర్పై విద్యార్థులకు అవగాహన కల్పించారు. కార్యక్రమంలో ముఖ్యఅతిథులుగా పాల్గొన్న ఎయిర్స్ ఫోర్స్ అధికారులు నాలం సందీప్, అనిల్ గోస్వామిలు ఎయిర్ ఫోర్స్ క్యాప్, బ్రోచర్ను అందజేసి అవగాహన కల్పించారు. ఆర్మీ,నేవీ,ఎయిర్ ఫోర్స్ రంగాల్లో ఉద్యోగాలు పొందేందుకు ప్రాథమికంగా ఎన్సీసీ విద్యార్థులకు అదనపు అర్హతగా కలిసివస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపాల్ కే.విజయ్కుమార్, క్రీడలు, యువజన జిల్లా అధికారి వై.దామోదర్రెడ్డి, ఎన్సీసీ అధికారి లెఫ్టినెంట్ ఎం రామస్వామి, సమన్వయకర్త ఎం చంద్రకాంత్, అధ్యాపకులు అనిల్కుమార్, చంద్రశేఖర్, ఆర్కే సీఈవో జైపాల్రెడ్డి తదితరులు పాల్గొన్నారు. సీఎంకు స్వాగతం పలికిన చైర్పర్సన్ కామారెడ్డి టౌన్ : నిజామాబాద్లో సోమవా రం జరిగిన కార్యక్రమానికి హాజరైన రాష్ట్ర సీఎం రేవంత్రెడ్డిని మున్సిపల్ చైర్పర్సన్ ఇందుప్రియ సభలో సీఎంను శాలువాతో సత్కరించారు. కామారెడ్డి జిల్లా యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు మహమ్మద్ ఇలియాస్ స్వాగతం పలికా రు. ఈ కార్యక్రమంలో జిల్లా కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు. దివ్యాంగులు ఓటు హక్కు వినియోగించుకోవాలి కామారెడ్డి టౌన్ : దివ్యాంగులు ప్రతిఒక్కరూ ఓటు హక్కును వినియోగించుకోవాలని విజ్ఞా న్ వికలాంగుల సేవా సమితి వ్యవస్థాపకుడు చిప్ప దుర్గాప్రసాద్ కోరారు. సోమవారం జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడారు. వచ్చే నెల 13వ తేదీన జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో భాగంగా కేంద్ర ఎన్నికల కమిషన్ దివ్యాంగుల కోసం ఉచిత రవాణా సౌకర్యం కల్పించిందన్నారు. 270 సెల్ఫోన్ల రికవరీ బాన్సువాడ : బాన్సువాడ పోలీస్టేషన్ పరిధిలో బాధితులు పోగొట్టుకున్న సెల్ఫోన్లను రికవరీ చేసినట్లు సీఐ కృష్ణ తెలిపారు. పోలీస్టేషన్ పరిధిలో ఇప్పటివరకు 600 పైగా సెల్ఫోన్లు పోయినట్లు బాధితులు ఫిర్యాదు చేశారని, అందులో ఇప్పటి వరకు 270 సెల్ఫోన్లను రికవరీ చేశామని ఆయన అన్నారు. బాధితులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు యాప్ ద్వారా చోరీకి గురైన ఫోన్లను స్వాధీనం చేసుకున్నామన్నారు. సెల్ఫోన్ల రికవరీకి కృషి చేసిన సీఈఐఆర్ ఆపరేటర్ రాజేష్ను సీఐ అభినందించారు.
Related News by category
-
పిడుగుపాటుకు ఆవు మృతి
నవీపేట: పిడుగుపాటు కారణంగా మండలంలోని మోకాన్పల్లిలో ఆవు మృతి చెందింది. మిర్యాల ఒడ్డెన్నకు చెందిన ఆవు సోమవారం సాయంత్రం పిడుగుపాటుకు గురై మృతి చెందిందని, దాని విలువ సుమారు రూ.40వేలు ఉంటుందని గ్రామస్తులు తెలిపారు. మోతెలో విద్యుత్షాక్తో.. వేల్పూర్: మండలంలోని మోతెలో విద్యుత్షాక్తో ఆవు మృతి చెందింది. ఉరడి నవీన్ అనే రైతుకు చెందిన సోమవారం ఆవు విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ పరిసరాల్లో మేతమేస్తుండగా షాక్ తగిలి మృతి చెందిందని మండల పశువైద్యాధికారి సంతోష్రెడ్డి తెలిపారు. మృతి చెందిన ఆవు విలువ సుమారు రూ. 40వేలు ఉంటుందని బాధిత రైతులు తెలిపాడు. రోడు ్డప్రమాదంలో పీఆర్ ఏఈకి గాయాలు ఎల్లారెడ్డిరూరల్(ఎల్లారెడ్డి): నాగిరెడ్డిపేట పీఆర్ ఏఈ పిచ్చయ్యకు రోడ్డు ప్రమాదంలో గాయాలైనట్లు స్థానికులు సోమవారం తెలిపారు. నాగిరెడ్డిపేట కార్యాలయంలో విధులను ముగించుకుని మెదక్కు వెళ్తుండగా ఎదురుగా వచ్చిన బైక్ ఢీకొట్టిందని, ఈ ఘటనలో పిచ్చయ్యకు తీవ్రగాయాలయ్యాయన్నారు. చికిత్స నిమిత్తం బాధితుడిని మెదక్ ఆస్పత్రికి తరలించినట్లు తెలిపారు. ఆటో, స్కూటీ ఢీకొన్న ఘటనలో.. ఎడపల్లి (బోధన్): మండలంలోని అలీసాగర్ లిఫ్ట్ ఆటో, స్కూటీ ఢీకొన్న ఘటనలో ఇద్దరికి తీవ్రగాయాలయ్యాయి. ఇద్దరు మహిళలు నిజామాబాద్ నుంచి బోధన్ వైపు స్కూటీపై వెళ్తుండగా ఆటో ఢీకొట్టింది. ఈ ఘటనలో ఇద్దరు మహిళలకు తీవ్రగాయాలయ్యాయి. బాధితులను చికిత్స నిమిత్తం స్థానికులు నిజామాబాద్కు తరలించారు. -
ఎయిర్ఫోర్స్ క్యాప్స్ అందజేత
కామారెడ్డి అర్బన్ : విద్యార్థులు అన్నిరంగాల్లో రాణించడానికి క్రమశిక్షణ అనేది చాలా ముఖ్యమైందని ఎయిర్ఫోర్స్ అధికారులు సందీప్, అనిల్ అన్నారు. కామారెడ్డి ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల, ఆర్కే డిగ్రీ కళాశాలలో సోమవారం ఎయిర్ ఫోర్స్, అగ్నివీర్పై విద్యార్థులకు అవగాహన కల్పించారు. కార్యక్రమంలో ముఖ్యఅతిథులుగా పాల్గొన్న ఎయిర్స్ ఫోర్స్ అధికారులు నాలం సందీప్, అనిల్ గోస్వామిలు ఎయిర్ ఫోర్స్ క్యాప్, బ్రోచర్ను అందజేసి అవగాహన కల్పించారు. ఆర్మీ,నేవీ,ఎయిర్ ఫోర్స్ రంగాల్లో ఉద్యోగాలు పొందేందుకు ప్రాథమికంగా ఎన్సీసీ విద్యార్థులకు అదనపు అర్హతగా కలిసివస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపాల్ కే.విజయ్కుమార్, క్రీడలు, యువజన జిల్లా అధికారి వై.దామోదర్రెడ్డి, ఎన్సీసీ అధికారి లెఫ్టినెంట్ ఎం రామస్వామి, సమన్వయకర్త ఎం చంద్రకాంత్, అధ్యాపకులు అనిల్కుమార్, చంద్రశేఖర్, ఆర్కే సీఈవో జైపాల్రెడ్డి తదితరులు పాల్గొన్నారు. సీఎంకు స్వాగతం పలికిన చైర్పర్సన్ కామారెడ్డి టౌన్ : నిజామాబాద్లో సోమవా రం జరిగిన కార్యక్రమానికి హాజరైన రాష్ట్ర సీఎం రేవంత్రెడ్డిని మున్సిపల్ చైర్పర్సన్ ఇందుప్రియ సభలో సీఎంను శాలువాతో సత్కరించారు. కామారెడ్డి జిల్లా యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు మహమ్మద్ ఇలియాస్ స్వాగతం పలికా రు. ఈ కార్యక్రమంలో జిల్లా కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు. దివ్యాంగులు ఓటు హక్కు వినియోగించుకోవాలి కామారెడ్డి టౌన్ : దివ్యాంగులు ప్రతిఒక్కరూ ఓటు హక్కును వినియోగించుకోవాలని విజ్ఞా న్ వికలాంగుల సేవా సమితి వ్యవస్థాపకుడు చిప్ప దుర్గాప్రసాద్ కోరారు. సోమవారం జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడారు. వచ్చే నెల 13వ తేదీన జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో భాగంగా కేంద్ర ఎన్నికల కమిషన్ దివ్యాంగుల కోసం ఉచిత రవాణా సౌకర్యం కల్పించిందన్నారు. 270 సెల్ఫోన్ల రికవరీ బాన్సువాడ : బాన్సువాడ పోలీస్టేషన్ పరిధిలో బాధితులు పోగొట్టుకున్న సెల్ఫోన్లను రికవరీ చేసినట్లు సీఐ కృష్ణ తెలిపారు. పోలీస్టేషన్ పరిధిలో ఇప్పటివరకు 600 పైగా సెల్ఫోన్లు పోయినట్లు బాధితులు ఫిర్యాదు చేశారని, అందులో ఇప్పటి వరకు 270 సెల్ఫోన్లను రికవరీ చేశామని ఆయన అన్నారు. బాధితులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు యాప్ ద్వారా చోరీకి గురైన ఫోన్లను స్వాధీనం చేసుకున్నామన్నారు. సెల్ఫోన్ల రికవరీకి కృషి చేసిన సీఈఐఆర్ ఆపరేటర్ రాజేష్ను సీఐ అభినందించారు. -
గల్ఫ్ సంక్షేమ బోర్డు ఏర్పాటు చేస్తాం
నిజామాబాద్ పార్లమెంట్ పరిధిలో అ త్యధిక సంఖ్యలో రైతులు, గల్ఫ్ కార్మికులు ఉంటారని నిజామాబాద్ కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి జీవన్రెడ్డి పేర్కొ న్నారు. రైతులను బీఆర్ఎస్, బీజేపీలు పట్టించుకోలేదన్నారు. పసుపుబోర్డుపై అర్వింద్ ఉత్తర్వులతో సరిపెట్టారని వ్యాఖ్యానించారు. గల్ఫ్ కార్మికులు మృతి చెందితే రాష్ట్ర ప్రభుత్వం ద్వారా రూ. 5 లక్షల పరిహారం అందిస్తామని తెలిపారు. ఈఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసి గెలిపించాలని కోరారు. పార్లమెంట్లో ప్రజల సమస్యల కోసం పోరాటం చేస్తానని చెప్పారు. పసుపుబోర్డు నిజామాబాద్లో ఏర్పా టు చేస్తారా లేక అహ్మదాబాద్లో ఏర్పాటు చేస్తా రా స్పష్టం చేయాల్సిన బాధ్యత అర్వింద్, బీజేపీపై ఉందన్నారు. గతంలో పసుపు క్వింటాలు అమ్మితే రైతు తులం బంగారం కోనుగోలు చేసేవారని, ఇప్పడు క్వింటాలు పసుపు ధర రూ. 15వేలు ఉందన్నారు. నిజామాబాద్కు స్మార్ట్ సిటీ తీసుకువచ్చి మరింత అభివృద్ధి చేస్తానని హామీ ఇచ్చారు. -
త్రుటిలో తప్పిన ప్రమాదం
డిచ్పల్లి: ధాన్యం బస్తాల లోడ్తో వెళ్తున్న లారీ మండల కేంద్రంలోని రైల్వే స్టేషన్ ఎదుట సోమవారం సాయంత్రం బోల్తాపడింది. ఓవర్ లోడ్ కారణంగా లారీ ఎడవవైపు ఒరిగి బోల్తాపడింది. రోడ్డు పక్కన నిలబడి ఉన్న వారిపై ధాన్యం బస్తాలు పడకపోవడంతో ప్రమాదం తప్పిందని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. డ్రైవర్ అద్దాన్ని పగులగొట్టుకుని క్యాబిన్లో నుంచి బయటకు వచ్చాడు. సిరికొండ మండలం చీమన్పల్లిలో ఐడీసీఎంఎస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రంలో వడ్ల బస్తాలను లోడ్ చేసుకుని నిజామాబాద్ శివారులోని రైస్మిల్లుకు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. సీఎం పర్యటన నేపథ్యంలో బందోబస్తులో ఉన్న పోలీసులు సమాచారం అందిన వెంటనే ఘటనాస్థలానికి చేరుకొని వాహనాల రాకపోకలు క్రమబద్ధీకరించారు. ఐడీసీఎంఎస్ సిబ్బందితో మాట్లాడి మరో లారీని రప్పించి ధాన్యం బస్తాలను తరలించారు. -
అకాల వర్షం.. అతులాకుతలం
● నీటిలో కొట్టుకుపోయిన ధాన్యం ● నేలకొరిగిన భారీచెట్లు పిట్లం(జుక్కల్) : మండల కేంద్రంలో, చిల్లర్గి, సిద్దాపూర్, రాంపూర్, గౌరారం, కుర్తి తదితర గ్రామాల్లో సోమవారం కురిసిన భారీ వర్షంకు వరదనీరు రావడంతో వరిపంట ధాన్యం, జొన్నపంట పూర్తిగా నీటిలో మునిగిపోయింది. ధాన్యం నీళ్లలో కొట్టుకుపోయింది. మండల కేంద్రంలోని వ్యవసాయ మార్కెట్ కమిటీలో అధికారులు సిబ్బందికి, సహకార సంఘం అధికారులకు ధాన్యంపై కప్పడానికి కవర్లు ఇవ్వాలని ఎన్నిసార్లు కోరినప్పటికీ పట్టించుకోలేదని వారు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వీరిపై సంబంధిత అధికారులు చర్యలు తీసుకోవాలని, అదే విధంగా ఎక్కువ కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు త్వరగతిన ధాన్యంను కొనుగోలు చేయాలని రైతులు కోరుతున్నారు. నిజాంసాగర్లో.. నిజాంసాగర్(జుక్కల్) : నిజాంసాగర్, మహమ్మద్ నగర్ మండలాల్లో సోమవారం సాయంత్రం కురిసిన అకాలవర్షంతో పాటు బలమైన గాలులు, ఉరుములు, మెరుపులకు ప్రజలు అతలాకుతలయ్యారు. ఒక్కసారిగా వచ్చిన గాలులకు చెట్ల కొమ్మలు విరిగి పడటంతో పాటు ఇళ్ల పైకప్పు రేకులు లేచిపడ్డాయి. ఆయా గ్రామాల్లో కొనుగోలు కేంద్రాల వద్ద కుప్పలు పోసిన వరిధాన్యం వర్షానికి తడిసి ముద్దయ్యింది. రోడ్లపైన ఆరబెట్టిన ధాటికి ధాన్యం కొట్టుకుపోవడంతో రైతులు ఆందోళన చెందారు. రామారెడ్డిలో.. రామారెడ్డి : ఈదురుగాళ్లు ఉరుములు మెరుపులతో కూడిన భారీ వర్షంతో మండలంలో పలు చోట్ల చెట్లు నేలకొరకగా, ఇనుపరేకులు కింద పడిన ఘటనలు సోమవారం సాయంత్రం రాత్రి చోటుచేసుకున్నాయి. రామారెడ్డి నుంచి కామారెడ్డికి వెళ్లే మార్గంలో భారీ చెట్లు సైతం నేలకొరకగా ప్రమాదం జరిగే అవకాశం ఉండడంతో రామారెడ్డి ఎస్సై విజయ్ కొండ ఆధ్వర్యంలో పోలీసులు శ్రమించి జేసీబీ సాయంతో చెట్లను తొలగించారు. ఏఎస్సై రవీందర్, కానిస్టేబుల్ పవన్, గణేశ్ తదితరులు పాల్గొన్నారు. రూరల్ పరిధిలో.. కామారెడ్డి రూరల్ : మండలంలోని ఆయా గ్రామాల్లో సోమవారం సాయంత్రం ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షం కురిసింది. ఈదురుగాలులతో కూడిన వర్షం కురియడంతో పలు గ్రామాల్లో చెట్లు విరిగిపడ్డాయి. ఇళ్లపై రేకులు కొట్టుకుపోయాయి. మిద్దె ఇళ్లు పాక్షికంగా దెబ్బతిన్నాయి. అరగంట పాటు కురిసిన వర్షానికి విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. దోమకొండలో విద్యుత్ సరఫరా బంద్ దోమకొండ : మండల కేంద్రంలో సోమవారం ఉరుములు మెరుపులతో కూడిన వర్షం రాగా పిడుగు పడింది. రాత్రి 7 గంటల ప్రాంతంలో ఉరుములతో కూడిన వర్షం ప్రారంభమైంది. గ్రామంలోని బీబీపేట్ రోడ్డులో అయ్యవారి రామాచారి ఇంట్లో ఉన్న కొబ్బరి చెట్టుపై పిడుగు పడి చెట్టు మంటలతో పూర్తిగా కాలిపోయింది, పిడుగు పడిన సమయంలో ఇంట్లో ఎవరు లేకపోవడంతో గండం తప్పింది. మంటలు వస్తున్న విషయం తెలుసుకున్న ఆ ప్రాంతవాసులు కరెంటు అధికారులకు ఫోన్తో సమాచారం అందించడంతో గంట సేపు కరెంటును నిలిపివేశారు. గాలులకు కొట్టుకుపోయిన షెడ్లు పెద్దకొడప్గల్(జుక్కల్) : మండలంలో ఆదివారం నుంచి ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తూనే ఉంది. సోమవారం సాయంత్రం భారీ ఈదురుగాలులకు టీకారం తండాలో 30 రేకుల షెడ్లు ఎగిరిపోయాయి. ఈ ఏడాది వర్షాల్లేక పంటలు కొంత ఎండిపోగా, మిగితా పంట ఇలా అకాల వర్షానికి వర్షార్పణమైంది. రోడ్లపై ఆరబోసిన ధాన్యం దాదాపుగా కొట్టుకుపోయింది. లింగంపేటలో.. లింగంపేట(ఎల్లారెడ్డి): మండలంలోని పలు గ్రామాల్లో సోమవారం రాత్రి కురిసిన అకాల వర్షానికి అన్నదాతలు ఆగమయ్యారు. కొనుగోలు కేంద్రాల్లో ఆరబెట్టిన ధాన్యం పూర్తిగా తడిసిపోయింది. తడిసిన ధాన్యాన్ని వర్షం నీటి నుంచి తీయడానికి రైతులు అవస్థలు పడ్డారు. అధికారులు ధాన్యం తూకం వెంట వెంటనే వేయాలని రైతులు కోరుతున్నారు. వాతావరణలో తరుచూ మార్పులతో ఆరిన ధాన్యం తూకంలో జాప్యం కారణంగా తడిసిపోతుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
Advertisement
Photos
View allVideo
View allమారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఎండుతున్న జలకళ
రెండు యుద్ధాలు – ఒక నాయకుడు
షూటింగ్... పార్టీయింగ్...
బాక్ సరికొత్త అనుభూతి ఇస్తుంది : తమన్నా
అజిత్కి జోడీగా...
బయటే డాబు.. లోపల బాబ్బాబు! రెండు నాల్కల చంద్రం
Lok sabha elections 2024: కాంగ్రెస్, ఆప్...మిత్రభేదం
జగన్ మళ్లీ సీఎం కావడం రాష్ట్రానికి అవసరం
బిందువే సిరుల సింధువు
చెన్నైకి గేమ్
తప్పక చదవండి
- సీఎం జగన్ ఎన్నికల ప్రచార సభల రేపటి షెడ్యూల్ ఇదే..
- మస్క్కు లైన్ క్లియర్?..చైనాలో టెస్లా సెల్ఫ్ డ్రైవింగ్ కార్లు..
- ములాయం సింగ్ కుటుంబం అంటే బీజేపీకి భయం
- చేరిన మూడునెలలకే ఓలా క్యాబ్స్ సీఈవో రాజీనామా.. 200 మంది ఉద్యోగుల తొలగింపు
- కేజ్రీవాల్ కొత్త ఆదేశాలు: మీడియాతో వెల్లడించిన అతిషి
- సీఎం మమత సర్కార్కు సుప్రీం కోర్టులో ఊరట
- బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
- యూసీసీ వల్ల ప్రయోజనం లేదు: మమతా బెనర్జీ
- ‘కాపులను పవన్ కల్యాణ్ ఎదగనీయటం లేదు’
- కాంగ్రెస్ అనుకున్నదాన్ని జరగనివ్వను: ప్రధాని మోదీ
Advertisement