Sakshi News home page

పెళ్లి చేసుకొని మోసం చేశాడు

Published Sun, Apr 14 2024 2:10 AM

భర్తతో కలిసి ఉన్న ఫొటో చూపుతున్న బాధితురాలు  - Sakshi

నిజామాబాద్‌నాగారం: తనను గ్రామానికి చెందిన దీపక్‌ ప్రేమ పెళ్లి చేసుకొని మోసం చేశాడని నిజామాబాద్‌ రూరల్‌ మండలం ఆకుల కొండూర్‌కు చెందిన మాదస్తు విఘ్నేశ్వరి తెలిపింది. నగరంలోని ప్రెస్‌క్లబ్‌లో కుటుంబ సభ్యులతో కలిసి శనివారం ఆమె వివరాలను వెల్లడించింది. గ్రామానికి చెందిన దీపక్‌, తాను ప్రేమించుకున్నామని, హైదరాబాద్‌లో పనిచేస్తున్న తన వద్దకు వచ్చి ఉద్యోగంలో చేరాడని విఘ్నేశ్వరి తెలిపింది. దీపక్‌ తన అక్కాబావల వద్దకు తనను తీసుకెళ్లి తామిద్దరం ప్రేమించుకుంటున్నామని, పెళ్లికి అమ్మానాన్నలను ఒప్పించాలని కోరాడని, వారు అభ్యంతరం చెప్పకపోవ డంతో దీపక్‌ను తాను పూర్తిగా నమ్మానని పేర్కొంది. 2023 అక్టోబర్‌ 17న హైదరాబాద్‌లోని బల్కంపేట్‌ ఎల్లమ్మ ఆలయంలో పెళ్లి చేసుకున్నామని తెలిపింది. తాను గర్భం దాల్చగా, 2024 జనవరి 5న మాయమాటలు చెప్పి అబార్షన్‌ చేయించాడని, మార్చి 20 వరకు తనతో ఉన్న దీపక్‌ను వాళ్ల అక్క, తాత, బాబాయ్‌ వచ్చి తీసుకెళ్లారని ఆవేదన వ్యక్తం చేసింది. ఈనెల 2వ తేదీన తాను రూరల్‌పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేసినప్పటికీ పోలీసులు పట్టించుకోవడం లేదని, తన భర్తను తనకు అప్పగించాలని కోరింది. సమావేశంలో ఐ ద్వా అధ్యక్షురాలు సబ్బని లత తదితరులు పాల్గొన్నారు.

Advertisement
Advertisement