అమ్మ.. శక్తిస్వరూపిణి | Sakshi
Sakshi News home page

అమ్మ.. శక్తిస్వరూపిణి

Published Sun, Nov 26 2023 11:36 PM

కుంకుమ పూజలు చేస్తున్న భక్తులు.
భక్తులతో కుంకుమార్చన చేయిస్తున్న స్వామీజీ - Sakshi

కాకినాడ రూరల్‌: ప్రపంచంలో అన్నింటి కన్నా శక్తిమంతమైనది అమ్మ అని కాకినాడ శ్రీపీఠం అధిపతి పరిపూర్ణానంద స్వామి అన్నారు. స్వామీజీ పర్యవేక్షణలో పీఠంలో జరుగుతున్న మహాశక్తి యాగం ఆదివారం 13వ రోజుకు చేరింది. ఈ సందర్భంగా ఉదయం నక్షత్ర శాంతి, తిథి పూజల అనంతరం భక్తులతో స్వామీజీ లలితా సహస్ర నామావళితో కుంకుమార్చన చేయించారు. విశిష్టమైన కార్తిక పౌర్ణమిని పురస్కరించుకుని సాయంత్రం కోటి దీపోత్సవాల అనంతరం మహాశక్తి యాగం వేదిక వద్ద రాత్రి ఐశ్వర్య దీపం వెలిగించారు. ఈ సందర్భంగా స్వామీజీ మాట్లాడుతూ, అమ్మ దయ ఉంటే అసాధ్యం ఏమీ ఉండదని అన్నారు. మహాశక్తి యాగం చేసేందుకు తన వెనుక ఎవరూ లేరని, అంతా ఐశ్వర్యాంబిక కృపతో జరుగుతోందని చెప్పారు. పదమూడో రోజుకు 49 లక్షల కుంకుమార్చనలు పూర్తయ్యాయన్నారు. వచ్చే దేవీ నవరాత్రులకు కాకినాడలో ఒకే రోజున లక్ష మందితో లలితా సహస్ర నామార్చన చేయించాలనే సంకల్పం ఉందని చెప్పారు. రాత్రి బగళాముఖి హోమం అందరూ చేసేలా ఏర్పాట్లు చేశారు.

1/1

Advertisement
Advertisement