నిడదవోలు: పట్టణంలోని తాడేపల్లిగూడెం ప్రధాన రహదారిలో రైల్వే కాలిబాట వంతెన వద్ద గంజాయి తాగుతున్న ఐదుగురు యువకులను పట్టణ పోలీసులు సోమవారం రాత్రి అరెస్టు చేశారు. ముందుగా అందిన సమాచారంతో ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు పట్టణ ఎస్సై పి.నాగరాజు తన సిబ్బంది, రెవెన్యూ అధికారులతో కలిసి వారిపై దాడి చేశారు. తల్లిదండ్రుల సమక్షంలో ఆ యువకులకు సీఐ కె.వెంకటేశ్వరరావు, ఎస్సై పి.నాగరాజు పట్టణ పోలీస్ స్టేషన్లో మంగళవారం కౌన్సెలింగ్ ఇచ్చారు.
ఆన్లైన్లో మెరిట్ లిస్ట్
కాకినాడ క్రైం: నేషనల్ రూరల్ హెల్త్ మిషన్ (ఎన్ఆర్హెచ్ఎం) గతంలో ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా పరిధిలో ప్రకటించిన ఉద్యోగ దరఖాస్తులకు సంబంధించి జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ మంగళవారం తుది మెరిట్ లిస్ట్ విడుదల చేసింది. అభ్యర్థులు ఈస్ట్గోదావరి.ఏపీ.జీఓవీ.ఇన్, కోనసీమ.ఏపీ.జీఓవీ.ఇన్, కాకినాడ.ఏపీ.జీఓవీ.ఇన్ వెబ్సైట్లలో తమ పేర్లు పరిశీలించుకోవచ్చు. అభ్యంతరాలుంటే గురువారం సాయంత్రం 5 గంటలోగా కాకినాడలోని తమ కార్యాలయంలో సమర్పించాలని జిల్లా వైద్య, ఆరోగ్య శాఖాధికారి నరసింహ నాయక్ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు.