Sakshi News home page

కేంద్ర పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలి

Published Sun, Apr 14 2024 1:35 AM

మాట్లాడుతున్న బీజేపీ రాష్ట్ర సంఘటన 
మంత్రి చంద్రశేఖర్‌   - Sakshi

గద్వాల రూరల్‌: గత పదేళ్లలో కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న వివిధ సంక్షేమాభివృద్ధి పథకాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెల్లాలని బీజేపీ రాష్ట్ర సంఘటన మంత్రి చంద్రశేఖర్‌ అన్నారు. శనివారం జిల్లా కేంద్రంలో పార్టీ ముఖ్యకార్యకర్తల సమావేశం నిర్వహించగా.. ఆయన ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. ప్రధాని మోదీ పాలన, ప్రభుత్వ పథకాలపై ఇంటింటి, సోషల్‌ మీడియా ద్వారా ప్రచారం చేసి పార్టీ గెలుపునకు అందరూ కృషి చేయాలన్నారు. అదేవిధంగా ప్రతిఇంటికి కనీసం మూడు సార్లు వెళ్లి ప్రభుత్వ పథకాలు, మోదీ పాలనను వివరించి బూత్‌ మెనేజ్‌మెంట్‌ కార్యక్రమాన్ని పకడ్బందీగా నిర్వహించాలన్నారు. ప్రపంచంలోనే భారతదేశాన్ని విశ్వగురువుగా నిలిపేందుకు మోదీ అహర్నిషలు కృషి చేస్తున్నారని ఈ విషయాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలన్నారు. రాబోయే ఎన్నికల్లో బీజేపీ 400 సీట్లకుపైగా గెలవబోతుందని, ప్రతిబూత్‌లలో కనీసం 370పైగా మెజారిటీ వచ్చేలా కార్యకర్తలు కృషి చేయాలన్నారు. కార్యక్రమంలో క్లస్టర్‌ ఇంచార్జీ బంగారు శృతి, పార్లమెంట్‌ ప్రభారి అశోక్‌రెడ్డి, జెడ్పీ చైర్మన్‌ లోక్‌నాథ్‌రెడ్డి, జిల్లా అధ్యక్షుడు రాంచంద్రారెడ్డి, సీనియర్‌ నాయకులు అ య్యంగారి ప్రభాకర్‌, అప్సర్‌పాష, డీకే స్నిగ్ధారెడ్డి, రా మాంజనేయులు, మిర్జాపురం వెంకటేశ్వర్‌రెడ్డి, బండ ల వెంకట్రాములు, పద్మావతి, కృష్ణవేణి పాల్గొన్నారు.

Advertisement
Advertisement