చిట్యాల: క్రీడలతో మానసికోల్లాసం కలుగుతుందని భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు అన్నారు. ఆదివారం మండలకేంద్రంలోని పీఏసీఎస్ ఆవరణలో క్రికెట్ పోటీల ట్రోఫీని ఆవి ష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ క్రీడాకారులు క్రీడలలో ఓడినా గెలిచినా క్రీడా స్ఫూ ర్తితో ఆడాలన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పా ర్టీ జిల్లా, మండల నాయకులు రాంనర్సింహారెడ్డి, చిలుకల రాయకోంరు, ఎంపీటీసీ అనిల్, మండల కోఆప్షన్ సభ్యుడు ఎండీ.రాజ్మహ్మద్, గడ్డం కొంరయ్య, దొడ్డి కిష్టయ్య, దబ్బెట రమేష్, లక్ష్మణ్, రాజు, నరేష్, తరాజ్కుమార్, క్రీడా కమిటీ అధ్యక్ష కార్యదర్శులు మహేందర్, అనిల్ పాల్గొన్నారు.