బార్డర్‌ చెక్‌పోస్టుల్లో పోలీసుల తనిఖీలు | Sakshi
Sakshi News home page

బార్డర్‌ చెక్‌పోస్టుల్లో పోలీసుల తనిఖీలు

Published Mon, Apr 8 2024 1:15 AM

తనిఖీలు చేస్తున్న పోలీసులు  - Sakshi

కాళేశ్వరం: మహదేవపూర్‌ మండలం కాళేశ్వరం బార్డర్‌ చెక్‌పోస్టు వద్ద పోలీసులు తనిఖీలు చేపట్టారు. ఛత్తీస్‌గఢ్‌–తెలంగాణ రాష్ట్ర సరిహద్దుల్లో ఎన్‌కౌంటర్‌లో జిల్లాకు చెందిన అన్నె సంతోష్‌ అలియాస్‌ సాగరన్న మృతి చెందిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో మహదేవపూర్‌ సీఐ రాజేశ్వర్‌రావు, ఎస్సై భవానిసేన్‌ తెలంగాణ, మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రాల సరిహద్దుల్లోని కాళేశ్వరంలో మీదుగా వచ్చిపోయే వాహనాలను క్షుణ్ణంగా తనిఖీ చేశారు. అనుమానితులు కనిపిస్తే విచారించి వదిలేశారు. వారివెంట సివిల్‌, సీఆర్‌పీఎఫ్‌ పోలీసులు ఉన్నారు.

Advertisement
Advertisement