అవకాశం ఇవ్వండి.. అభివృద్ధి చేసి చూపిస్తా | Sakshi
Sakshi News home page

అవకాశం ఇవ్వండి.. అభివృద్ధి చేసి చూపిస్తా

Published Tue, Apr 23 2024 8:25 AM

మాట్లాడుతున్న బాజిరెడ్డి గోవర్ధన్‌ - Sakshi

● నిజామాబాద్‌ బీఆర్‌ఎస్‌ అభ్యర్థి బాజిరెడ్డి గోవర్ధన్‌

సారంగాపూర్‌: తాను ఈ ప్రాంతానికే కొత్త అని, రాజకీయాలు, ప్రజాసేవకు కొత్త కాదని, అవకాశమిస్తే అభివృద్ధి చేసి చూపిస్తానని నిజామాబాద్‌ బీ ఆర్‌ఎస్‌ అభ్యర్థి బాజిరెడ్డి గోవర్ధన్‌ అన్నారు. సోమవారం మండలంలోని పెంబట్ల, కోనాపూర్‌లో కార్నర్‌మీటింగ్‌లో మాట్లాడారు. కేసీఆర్‌ హయాంలో రాష్ట్రం అభివృద్ధి జరిగిందని, దొంగ హామీలిచ్చి అధికారంలోకొచ్చిన కాంగ్రెస్‌ ఆరుగ్యారంటీలు అమలు చేయలేక చతికిల పడిందన్నారు. జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్‌కుమార్‌ మాట్లాడుతూ కేసీఆర్‌ ప్రభుత్వంలోనే చెరువులు, కుంటలు జలకళ సంతరించుకున్నయని, జగిత్యాల ఎంతో అభివృద్ధి చెందిందని వెల్లడించారు. ఎమ్మెల్సీ రమణ మాట్లాడుతూ గోవర్ధన్‌ను భారీ మెజార్టీతో గెలిపించుకోవాలన్నారు. జెడ్పీ చైర్‌పర్సన్‌ దావ వసంత మాట్లాడుతూ.. రాముని పేరుతో ఓట్లు అడిగే పరిస్థితి బీజేపీదన్నారు. మాజీ మంత్రి రాజేశంగౌడ్‌, మార్క్‌ఫెడ్‌ మాజీ చైర్మన్‌ లోక బాపురెడ్డి, లైబ్రరీ చైర్మన్‌ చంద్రశేఖర్‌గౌడ్‌, పార్టీ మండల అధ్యక్షుడు రాజేందర్‌రెడ్డి పాల్గొన్నారు.

Advertisement
Advertisement