కథలాపూర్(వేములవాడ): మండల కేంద్రంలో శు క్రవారం సాయంత్రం కేంద్ర పోలీస్ బలగాల ఆధ్వర్యంలో కవాతు నిర్వహించారు. మెట్పల్లి డీఎస్పీ ఉ మామహేశ్వర్రావు, ఎస్సైలు నవీన్కుమార్, కిరణ్ కుమార్, అనిల్, కిరణ్, పోలీసులు పాల్గొన్నారు.
21 నుంచి 23 వరకు నీటి సరఫరా బంద్
జగిత్యాల: జిల్లా కేంద్రంలోని కొత్తబస్టాండ్ అవుట్ గేట్ సమీపంలో ప్రధాన పైప్లైన్ లీకవుతున్న నేపథ్యంలో దాని మరమ్మతుకు ఈనెల 21 నుంచి 23 వరకు మంచినీటి సరఫరా బంద్ చేస్తున్నట్లు మున్సిపల్ కమిషనర్ అనిల్బాబు తెలిపారు. కొత్తబస్టాండ్ వాటర్ ట్యాంక్ పరిధిలోని అరవింద్నగర్, పురాణిపేట, మోతెమాలవాడ, శ్రీరాంనగర్, ఎల్జీరామ్లాడ్జ్, వాణీనగర్, బీట్బజార్, తులసీనగర్, భాగ్యనగర్, అటవీశాఖ కార్యాలయం, కృష్ణానగర్, సాయిరాంనగర్, బస్డిపో ఏరియా, టవర్ ఏరియా, మోచీ బజార్, కరీంనగర్రోడ్, ఇస్లాంపుర, అంగడిబజార్ ప్రాంతాల్లో నీటి సరఫరా నిలిపివేయడం జరుగుతుందని, ఈనెల 24 నుంచి యథావిధిగా సరఫరా చేస్తామని పేర్కొన్నారు.