కాంగ్రెస్‌ గెలుపు కోసం కృషిచేయాలి | Sakshi
Sakshi News home page

కాంగ్రెస్‌ గెలుపు కోసం కృషిచేయాలి

Published Mon, Apr 8 2024 1:20 AM

లండన్‌ ప్రజాదీవెన సభలో గంప వేణుగోపాల్‌ - Sakshi

రాయికల్‌:(జగిత్యాల): తెలంగాణలో కాంగ్రెస్‌ పార్టీ ఎంపీ అభ్యర్థుల గెలుపు కోసం ప్రతిఒక్కరూ కృషిచేయాలని లండన్‌ టీపీసీసీ ఎన్‌ఆర్‌ఐ సెల్‌ కన్వీనర్‌ గంప వేణుగోపాల్‌ కోరారు. ఆదివారం లండన్‌లో ప్రజాదీవెన సభలో భాగంగా ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ప్రధాని మోదీ రాజకీయ పార్టీల నాయకులను ఈడీ పేరిట బెదిరిస్తున్నారని, వాటిని ఎప్పటికప్పుడు సోషల్‌ మీడియా ద్వారా ప్రజలకు వివరించాలని, తెలంగాణ ప్రభుత్వం ఆరుగ్యారంటీ స్కీంలను క్షేత్రస్థాయిలోకి తీసుకెళ్లాలని సూచించారు. కార్యక్రమంలో కో–కన్వీనర్‌ సుధాకర్‌గౌడ్‌, ప్రధానకార్యదర్శి శ్రీధర్‌, సభ్యులు శ్రీనివాస్‌రెడ్డి, మధుకర్‌, మహిపాల్‌రెడ్డి, అవినాష్‌, కిట్టురెడ్డి తదితరులు పాల్గొన్నారు.

టీపీసీసీ ఎన్‌ఆర్‌ఐ సెల్‌ కన్వీనర్‌ గంప వేణుగోపాల్‌

లండన్‌లో ప్రజాదీవెనసభ

Advertisement
Advertisement