కువైట్‌లో అనంతపల్లి వాసి మృతి | Sakshi
Sakshi News home page

కువైట్‌లో అనంతపల్లి వాసి మృతి

Published Fri, Nov 17 2023 1:26 AM

 గంగాధర్‌గౌడ్‌ (ఫైల్‌)
 - Sakshi

చందుర్తి (వేములవాడ): జీవనోపాధి కోసం గల్ఫ్‌ వెళ్లిన ఓ యువకుడిని విధి గుండెపోటు రూపంలో బలి తీసుకుంది. ఈ సంఘటన చందుర్తి మండలం అనంతపల్లి గ్రామంలో గురువారం విషాదాన్ని నింపింది. గ్రామస్తుల కథనం ప్రకారం.. అనంతపల్లి గ్రామానికి చెందిన బుర్ర గంగాధర్‌గౌడ్‌(44) ఉపాధి కోసం మూడేళ్ల క్రితం కువైట్‌ వెళ్లాడు. అక్కడ పెట్రోల్‌ బంక్‌లో పని చేస్తున్నాడు. ఇటీవల స్వగ్రామానికి వచ్చి రెండు నెల కిత్రం మళ్లీ కువైట్‌కు వెళ్లా డు. బుధవారం తాను పనిచేస్తున్న సమయంలోనే గుండెనొప్పి రావడంతో అతడి స్నేహితులు వెంటనే అసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ గురువారం మృతి చెందినట్లు ఫోన్‌ ద్వారా మృతుడి బంధువులకు సమాచారం అందింది. మృతుడికి భార్య లక్ష్మి, కుమారుడు మనివర్ధన్‌, కూతురు మణిదీప్తిలు ఉన్నారు.

Advertisement
Advertisement