కమలేష్‌ మృతిపై దర్యాప్తు జరిపించాలి | Sakshi
Sakshi News home page

కమలేష్‌ మృతిపై దర్యాప్తు జరిపించాలి

Published Sat, Nov 25 2023 12:26 AM

-

ఏలూరు (టూటౌన్‌): ఇటీవల పెదవేగి గురుకుల పాఠశాలలో అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన దాసి కమలేష్‌(14) మృతిపై శాఖాపరమైన దర్యాప్తు జరిపించి నిజాన్ని వెలికి తీయాలని మృతుడి తండ్రి దాసే వెంకటేశ్వరరావు శుక్రవారం కలెక్టర్‌ ప్రసన్న వెంకటేష్‌కు ఫిర్యాదు చేశారు. ఈనెల 20న రాత్రి 10.30 గంటలకు తన కుమారుడు అనుమానాస్పదంగా మృతి చెందాడని తనకు అదే రోజు రాత్రి 12.30 గంటలకు ఫోన్‌ ద్వారా సమాచారం ఇచ్చారని పేర్కొన్నారు. తన కుమారుడి మృతదేహాన్ని చూడటానికి కూడా అనుమతించలేదన్నాడు. తన స్వగ్రామమైన భీమడోలు మండలం అర్జావారిగూడెంలోని బంధుమిత్రులకు సమాచారం ఇవ్వడంతో వారు వచ్చిన తర్వాత పెదవేగి గురుకుల పాఠశాలకు వెళ్ళి ప్రశ్నించగా ప్రిన్సిపాల్‌, సిబ్బంది పొంతన లేని సమాధానాలు చెప్పారన్నారు. తన కుమారుడి ముఖం, కంటిపై, శరీరంపై దాడి జరిగిన ఆనవాళ్లు ఉన్నట్లు ఆయన చెప్పారు. దీనిపై సమగ్ర విచారణ జరిపించి తన కుటుంబానికి న్యాయం చేయాలని విజ్ఞప్తి చేశారు.

Advertisement

తప్పక చదవండి

Advertisement