నల్లజర్ల: మండలంలోని అనంతపల్లికి చెందిన కెల్లా రాజేష్(26)మృతిచెంది ఉండటాన్ని నల్లజర్ల పోలీసులు కనుగొన్నారు. ఎస్ఐ నరసింహమూర్తి అందించిన వివరాల ప్రకారం అనంతపల్లికి చెందిన కెల్లా శ్రీనివాస్, పార్వతిల పెద్దకుమారుడు రాజేష్ పదిరోజులుగా కనపడటం లేదని పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇంటర్ వరకు చదువుకున్న రాజేష్ నిలకడ లేక దురలవాట్లకు బానిసయ్యాడని గ్రామస్తులు చెబుతున్నారు.
పోలీసుల సూచనల మేరకు పలు ప్రాంతాలలో రాజేష్ ఆచూకీ కోసం గాలిస్తుండగా పోలవరం కుడికాలువలో అచ్చన్నపాలెం వద్ద గుర్తు తెలియని మృతదేహం ఉంది. మృతదేహాన్ని చేపలు తినడంతో బాగాపాడై ఉంది. కుటుంబ సభ్యులు అతడు వేసుకున్న దుస్తుల ఆధారంగా గుర్తించారు. ఈ మేరకు అనుమానాస్పద మృతిగా పోలీసులు కేసు నమోదు చేశారు. మృతదేహాన్ని తాడేపల్లిగూడెం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.