Sakshi News home page

గ్రంథాలయానికి ఎయిర్‌కూలర్‌ వితరణ

Published Thu, Mar 28 2024 12:45 AM

ఎయిర్‌ కూలర్‌తో గ్రంథాలయ
నిర్వాహకులు, పాఠకులు - Sakshi

కొత్తగూడెంఅర్బన్‌: ఆర్యవైశ్య మహాసభ కొత్తగూడెం పట్టణ అధ్యక్షుడు దారా నగేష్‌, ప్రధాన కార్యదర్శి జూలూరు ఆనంద్‌ ఆధ్వర్యంలో బుధవారం జిల్లా గ్రంధాలయ సంస్థకు ఎయిర్‌ కూలర్‌ వితరణ చేశారు. ఈ సందర్భంగా దాతలు మాట్లాడుతూ పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న అభ్యర్థులకు, గ్రంథాలయ సిబ్బందికి వేసవిలో సౌకర్యంగా ఉండేందుకు వితరణ చేసినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో సంఘం సభ్యులు నరేంద్రుల ఋషికుమార్‌, మేడ గణేష్‌, కొయ్యాడ నగేష్‌, కొదుమూరి సురేష్‌, గ్రంథపాలకులు వరలక్ష్మీదేవి, మణిమృదుల తదితరులు పాల్గొన్నారు.

Advertisement

What’s your opinion

Advertisement