వేర్వేరు ప్రమాదాల్లో ఆరుగురికి గాయాలు | Sakshi
Sakshi News home page

వేర్వేరు ప్రమాదాల్లో ఆరుగురికి గాయాలు

Published Wed, Mar 22 2023 11:56 PM

-

మదనపల్లె : వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో ఆరు మంది గాయపడ్డారు. తంబళ్లపల్లె మండలం మెరుసుపల్లికు చెందిన నరేష్‌ (26) భార్య లావణ్య (21), వీరి పిల్లలు అక్షయ (5), మునీంద్రనాయుడు (1) లు మంగళవారం రాత్రి సొంతపనిపై ద్విచక్రవాహనంలో మదనపలెల్లోని బసినికొండకు వచ్చారు. తిరుగు ప్రయాణంలో వీరి వాహనాన్ని మరో గుర్తు తెలియని వాహనం ఢీకొంది. ప్రమాదంలో నరేష్‌తో పాటు భార్య,పిల్లలు గాయపడ్డారు. గమనించిన స్థానికులు జిల్లా ఆస్పత్రికి తరలించారు. కురబలకోట మండలం సింగన్నగారిపల్లెకు చెందిన శ్రీనాథ్‌ (30) మంగళవారం రాత్రి అంగళ్లుకు వస్తుండగా మార్గమధ్యంలోని దొమ్మనబావి వద్ద ద్విచక్రవాహనాన్ని కారు ఢీకొంది. ప్రమాదంలో గాయపడిన బాధితుడిని మదనపల్లె జిల్లా ఆస్పత్రికి తరలించారు. మరో ప్రమాదంలో చిన్నమండ్యం మండలం కలిబండకు చెందిన శివయ్య (47) మంగళవారం రాత్రి మదనపల్లెకు వచ్చి తిరిగి ద్విచక్రవాహనంలో ఇంటికి వెళుతుండగా గుర్తు తెలియని వాహనం గుర్రంకొండ మండలం రెడ్డికోట మలుపు వద్ద గుర్తు తెలియని వాహనం ఢీకొనింది. ప్రమాదంలో బాధితుడు గాయపడ్డాడు. మదనపల్లె జిల్లా ఆస్పత్రిలో చిక్సిత పొందుతున్నాడు.

Advertisement

తప్పక చదవండి

Advertisement