టీడీపీ నేతపై కేసు నమోదు | Sakshi
Sakshi News home page

టీడీపీ నేతపై కేసు నమోదు

Published Mon, Apr 8 2024 1:25 AM

రంజాన్‌ తోఫా బ్యాగులను 
స్వాధీనం చేసుకుంటున్న పోలీసులు   - Sakshi

అనంతపురం: టీడీపీ నేత జయరాంనాయుడిపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఎన్నికల కోడ్‌ నేపథ్యంలో ఆదివారం ఉదయం అనంతపురం వన్‌టౌన్‌ పోలీసులు టీవీ టవర్‌ సమీపంలో వాహన తనిఖీలు చేపట్టారు. ఆ సమయంలో అటుగా వచ్చిన ఆటోను అడ్డుకుని పరిశీలించారు. అందులో జయరాంనాయుడు ఫొటోలు ముద్రించిన బ్యాగ్‌ల్లో నిత్యావసర సరుకులను రంజాన్‌ తోఫా పేరుతో పంపిణీ చేస్తున్నట్లుగా గుర్తించిన పోలీసులు వాటిని స్వాధీనం చేసుకున్నారు. ఎంసీసీ ఉల్లంఘన కింద జయరాంనాయుడితో పాటు బ్యాగ్‌లు పంపిణీ చేస్తున్న చంద్రశేఖర్‌, శశాంక్‌పై కేసు నమోదు చేశారు. ఆటోతో పాటు నిత్యావసర సరుకులు స్వాధీనం చేసుకున్నారు. తనిఖీల్లో వన్‌టౌన్‌ సీఐ రెడ్డప్ప, ఫ్లయింగ్‌ స్క్వాడ్‌ బృందం ఇన్‌చార్జ్‌ శ్రీనివాసులు, సిబ్బంది పాల్గొన్నారు.

Advertisement
Advertisement