Sakshi News home page

డీఆర్‌ఎం కార్యాలయ భవనానికి ఎనర్జీ కన్జర్వేషన్‌ అవార్డు

Published Thu, Dec 21 2023 1:14 AM

డీఆర్‌ఎం కార్యాలయ భవనం  - Sakshi

గుంతకల్లు: గుంతకల్లు డివిజనల్‌ రైల్వే మేనేజర్‌ కార్యాలయ భవనానికి ఎనర్జీ కన్జర్వేషన్‌ గోల్డ్‌ అవార్డు దక్కింది. ఈ మేరకు డీఆర్‌ఎం మనీష్‌ అగర్వాల్‌ బుధవారం తెలిపారు. స్టేట్‌ ఎనర్జీ కన్జర్వేషన్‌ అవార్డులను ఏటా ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాలు అందజేయడం ఆనవాయితీగా వస్తోంది. ఈ క్రమంలో దక్షిణ మధ్య రైల్వే పరిధిలోని తెలంగాణలో ఐదు, ఆంధ్రప్రదేశ్‌లో రెండు అవార్డులు డీఆర్‌ఎం కార్యాలయ భవనం దక్కించుకుంది. ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ఇంధన పరిరక్షణ మిషన్‌, ఇంధన మంత్రిత్వశాఖ ఆధ్వర్యంలో బుధవారం విజయవాడలోని వివంత హోటల్‌లో జరిగిన కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్‌ సేట్ట్‌ ఎనర్జీ కన్జర్వేషన్‌ అవార్డును డీఆర్‌ఎం మనీష్‌ అగర్వాల్‌ అందుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... ప్రణాళికాబద్ధంగా విద్యుత్‌ పొదుపు చేయడం ద్వారా అవార్డు దక్కినట్లు తెలిపారు. ఎలక్ట్రికల్‌ విభాగం అధికారులను రైల్వే జీఎం అరుణ్‌కుమార్‌జైన్‌ అభినందించారు.

Advertisement

What’s your opinion

Advertisement