ఊహ మహంతికి అంతర్జాతీయ గ్లోరీ అవార్డు | Sakshi
Sakshi News home page

ఊహ మహంతికి అంతర్జాతీయ గ్లోరీ అవార్డు

Published Thu, Mar 23 2023 1:16 AM

అవార్డు అందుకుంటున్న ఊహ మహంతి 
 - Sakshi

డాబాగార్డెన్స్‌: ఉత్తరాంధ్ర జిల్లాలో అనేక స్వచ్ఛంద సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్న రూరల్‌ డెవలప్‌మెంట్‌ వెల్ఫేర్‌ సొసైటీ డైరెక్టర్‌ ఊహ మహంతికి మనం ఫౌండేషన్‌ ఇంటర్నేషనల్‌ గ్లోరీ అవార్డు ప్రకటించారు. బుధవారం నగరంలో నిర్వహించిన కార్యక్రమంలో విశాఖ సీబీఐ కోర్టు ప్రిన్సిపల్‌ జడ్జి సత్య వెంకట హిమబిందు చేతుల మీదుగా ఊహ మహంతి అవార్డు అందుకున్నారు. మారుమూల ప్రాంతాల పేదలకు విస్తృతంగా సేవా కార్యక్రమాలు చేపట్టాలని ప్రిన్సిపల్‌ జడ్జి సూచించారు. భవిష్యత్‌లో పేద గిరిజన బాలికల అభ్యున్నతికి మరింత కృషి చేస్తానని అవార్డు గ్రహీత పేర్కొన్నారు.

Advertisement
Advertisement