● పక్కాగా అమలు చేయాలని డీఈవో ఆదేశం
ఆదిలాబాద్టౌన్: జిల్లాలోని ప్రభుత్వ, స్థానిక సంస్థల పాఠశాలలు, కేజీబీవీలు, ఆదర్శ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థుల ఫేస్ రికగ్నేషన్ అటెండెన్స్ను ప్రతిరోజు విధిగా నమోదు చేయాలని డీఈవో ప్రణీత సూచించారు. రాష్ట్ర విద్యాశాఖ ప్రత్యేక ఉత్తర్వులు జారీ చేసిన నేపథ్యంలో ఆమె పలు సూచనలు చేశారు. విద్యార్థుల ఆన్లైన్ హాజరు నమోదు కోసం ప్రత్యేక యాప్ రూపొందించినట్లు పేర్కొన్నారు. పాఠశాల స్థాయిలో తరగతి ఉపాధ్యాయులు, ప్రధానోపాధ్యాయులు, కాంప్లెక్స్స్థాయిలో కాంప్లె క్స్ ప్రధానోపాధ్యాయులు, సీఆర్పీలు, మండలస్థాయిలో మండల విద్యాధికారులు, ఎంఐఎస్ కోఆర్డినేటర్, డేటా ఎంట్రీ ఆపరేటర్లు ఈ హాజరు బాధ్యతలు పర్యవేక్షించాలని సూ చించారు. ప్రతి విద్యార్థి హాజరు తప్పనిసరిగా నమోదు చేయాలని ఆదేశించారు.