-
అన్నదాతలకు అండగా ఉందాం
సిద్దిపేట జోన్: ఆరుగాలం పండించిన రైతు ధాన్యా నికి మద్దతు ధర అందేలా, చివరి గింజ వరకు కొనేలా అన్నదాతలకు బీఆర్ఎస్ శ్రేణులు అండగా ఉండాలని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్ రావు సూచించారు. ఆయన సిద్దిపేట జిల్లా సిద్దిపేట నియోజకవర్గ ప్రజాప్రతినిధులు, పార్టీ శ్రేణులతో శనివారం టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా రైతు సమస్యలు, సర్కారు వైఫల్యం, పార్టీ ఆధ్వర్యంలో చేపట్టాల్సిన ప్రక్రియపై దిశానిర్దేశం చేశారు. ప్రస్తుతం అకాల వర్షాలతో అతలాకుతల మవుతున్న రైతులకు కష్టకాలంలో అండగా ఉండి మనోధైర్యం చెప్పాలని కోరారు. రోజుకో మాటతో రైతులను మోసగిస్తున్న ప్రభుత్వాన్ని ఎండగట్టాలన్నారు. రూ.500 బోనస్ ఇచ్చే వరకు పోరాడుదామన్నారు. నియోజకవర్గ పరిధిలో ఆయా కొనుగోలు కేంద్రాలను రోజూ పార్టీ ప్రజాప్ర తినిధులు, ముఖ్య నాయకులు సందర్శించి రైతుల సమస్యలను అడిగి తెలుసుకోవాలని, వాటి పరి ష్కారానికి చర్యలు తీసుకోవాలని సూచించారు.మిల్లర్లు, రెవెన్యూ, పౌర సరఫరాల అధికారులను సమన్వయం చేసుకొని ధాన్యం కొనేలా చూడాల న్నారు. తడిసిన ధాన్యం కొనుగోలు విషయంలో ఎలాంటి ఇబ్బందులు కలిగినా తన దృష్టికి తీసుకురావాలని హరీశ్రావు సూచించారు. -
యూకే పార్లమెంట్ బరిలో తెలుగు బిడ్డ
సాక్షి, సిద్దిపేట: యూకే పార్లమెంట్ ఎన్నికల బరిలో తెలంగాణ బిడ్డ నిలిచారు. సిద్దిపేట జిల్లా కోహెడ మండలం శనిగరం గ్రామానికి చెందిన ఉదయ్ నాగరాజు లేబర్ పార్టీ నుంచి పోటీ చేస్తున్నారు. నార్త్ బెడ్ఫోర్డ్షైర్ లేబర్ పార్టీ నుంచి ఆయనను అభ్యర్థిగా ప్రకటించింది. శనిగరం గ్రామానికి చెందిన ఒక సామాన్య మధ్య తరగతి కుటుంబంలో ఉదయ్ జన్మించారు. తల్లిదండ్రులు హనుమంతరావు, నిర్మలాదేవి. బ్రిటన్లోని ప్రఖ్యాత యూనివర్సిటీ కాలేజీ ఆఫ్ లండన్లో పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్లో పీజీ చేశారు. కష్టపడేత త్వం కలిగిన ఉదయ్ అంచెలంచెలుగా ఎదిగారు. ప్రపంచం, భావితరాలపై ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రభావా న్ని ముందుగానే పసిగట్టి ఏఐ పాలసీ లాబ్స్ అనే థింక్ ట్యాంక్ని నెలకొల్పారు. మంచి వక్తగా పేరు సంపాదించా రు. సర్వే ఫలితాల ప్రకారం ఈ ఎన్నికల్లో ఉదయ్ గెలిచే సాధించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని అంటున్నా రు. తెలుగు బిడ్డ బ్రిటన్లో ఎంపీగా పోటీ చేస్తుండటం.. విజయం సాధిస్తారనే అంచనాలు ఉండటంతో తల్లి నిర్మలా దేవి సంతోషం వ్యక్తం చేస్తున్నారు. తెలుగు బిడ్డ ఆ స్థాయికి ఎదగడంతో శనిగరం గ్రామస్తులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. -
12 స్థానాల్లో కాంగ్రెస్దే గెలుపు
మంత్రి దామోదర రాజనర్సింహ జోగిపేట(అందోల్): రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ 12 లోక్సభ స్థానాల్లో గెలుస్తుందని మంత్రి దామోదర రాజనర్సింహ ధీమా వ్యక్తం చేశారు. జోగిపేట వ్యవసాయ మార్కెట్లోని 196 పోలింగ్ కేంద్రంలో తన కూతురు త్రిషతో కలిసి ఆయన ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఉమ్మడి జిల్లాలోని జహీరాబాద్, మెదక్ పార్లమెంట్ స్థానాలను కాంగ్రెస్ గెలుచుకుంటుందని, ప్రజలు దేశంలో కూడా ప్రభుత్వ మార్పు కోరుకుంటున్నారని తెలిపారు. ఇండియా కూటమి అధికారంలోకి వచ్చి రాహుల్ గాంధీ ప్రధానమంత్రి కావడం ఖాయమన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ తర్వాతి స్థానం కోసం బీజేపీ, బీఆర్ఎస్లు పోటీ పడుతున్నాయన్నారు. రాష్ట్రం ప్రభుత్వం అమలు పరుస్తున్న ఆరుగ్యారంటీలకు ప్రజలు ఆకర్షితులై కాంగ్రెస్ వైపు మొగ్గు చూపుతున్నారన్నారు. మున్సిపల్ చైర్మన్ జి.మల్లయ్య, మార్క్ఫెడ్ డైరెక్టర్ ఎస్.జగన్మోహన్రెడ్డి, ప్రవీణ్కుమార్ ఉన్నారు. -
ఓటర్లకు, ఎన్నికల సిబ్బందికి అభినందనలు
సిద్దిపేటరూరల్: జిల్లాలో లోక్సభ ఎన్నికలు ప్రశాంతంగా ముగిసినట్లు ఎన్నికల అధికారి, కలెక్టర్ మిక్కిలినేని మనుచౌదరి తెలిపారు. అన్ని పోలింగ్ కేంద్రాలలో ఎలాంటి ఇబ్బంది లేకుండా, అవాంఛనీయ సంఘటనలు జరగకుండా నిర్వహించామన్నారు. ఉదయం 7 నుంచి సాయంత్రం 6 గంటల వరకు అధిక సంఖ్యలో పాల్గొని ఓటు వేసిన ఓటర్లకు, విధులను సక్రమంగా నిర్వహించిన ఎన్నికల సిబ్బందికి, అధికారులకు, పోలీస్ సిబ్బందికి, కేంద్ర రక్షణ బలగాలకు కలెక్టర్ కృతజ్ఞతలు తెలిపారు. సిద్దిపేట, దుబ్బాక, గజ్వేల్ నియోజకవర్గాలకు చెందిన ఈవీఎంలను నర్సాపూర్ లోని బీవీఆర్ఐటీ కాలేజీలో ఏర్పాటు చేసిన స్ట్రాంగ్ రూంలో భద్రపరిచినట్లు తెలిపారు.కలెక్టర్ మిక్కిలినేని మనుచౌదరి -
ఈవీఎంపై సిరా మరక
ఇరువర్గాల మధ్య ఘర్షణ చిన్నకోడూరు(సిద్దిపేట): మండల కేంద్రంలోని 211, 212 పోలింగ్ కేంద్రాల్లో ఈవీఎంలపై సిరా మరక ఉండటంతో ఇరువర్గాల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. కారు గుర్తు ఎదురుగా ఉన్న బటన్పై సిరా ఇంకు అంటించి ఉండటంతో కాంగ్రెస్, బీజేపీ నాయకులు అభ్యంతరం వ్యక్తం చేశారు. దీంతో కొద్ది సేపు ఆ రెండు పోలింగ్ కేంద్రాల్లో పోలింగ్ ప్రక్రియ నిలిచిపోయింది. ఎన్నికల జనరల్ అబ్జర్వర్ సమీర్, తహసీల్దార్ జయలక్ష్మి, ఆర్ఐ హరీశ్ సిబ్బందితో కలిసి పోలింగ్ కేంద్రాలను పరిశీలించారు. సిరా ఇంకు చుక్కలను తొలగించి యథావిధిగా పోలింగ్ను కొనసాగించారు. -
గజ్వేల్లో ఓటేసిన ప్రముఖులు
గజ్వేల్: అసెంబ్లీ సెగ్మెంట్ పరిధిలో సోమవారం జరిగిన ఎంపీ ఎన్నికల పోలింగ్లో పలువురు ప్రముఖులు ఓటేశారు. డీసీసీ అధ్యక్షుడు తూంకుంట నర్సారెడ్డి తన స్వగ్రామం వర్గల్లో కుటుంబీకులతో కలిసి ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఎమ్మెల్సీ డాక్టర్ యాదవరెడ్డి గజ్వేల్లో ఓటు వేశారు. ఎఫ్డీసీ మాజీ చైర్మన్ వంటేరు ప్రతాప్రెడ్డి బూర్గుపల్లిలో కుటుంబీకులతో ఓటు హక్కును వినియోగించుకున్నారు. రాష్ట్ర వర్కింగ్ జర్నలిస్టుల సంఘం అధ్యక్షుడు విరాహత్అలీ గజ్వేల్లో ఓటు వేశారు. లోక్సత్తా తెలంగాణ, ఏపీ రాష్ట్రాల సమన్వయకర్త బండారు రామ్మోహన్రావు తన స్వగ్రామం ప్రజ్ఞాపూర్లో ఓటు వేశారు. అదేవిధంగా నియోజకవర్గంలోని ముఖ్యనేతలు, ప్రజాప్రతినిధులు తమతమ గ్రామాల్లో ఓటు వేశారు. గజ్వేల్ మున్సిపాలిటీ పరిధిలోని ప్రజ్ఞాపూర్ పోలింగ్ కేంద్రంలో బీఆర్ఎస్ మెదక్ ఎంపీ అభ్యర్థి వెంకట్రామిరెడ్డి, డీసీసీ అధ్యక్షుడు నర్సారెడ్డి అనూహ్యంగా ఎదురుపడి పరస్పరం పలకరించుకున్నారు. పోలింగ్ కేంద్రాన్ని సందర్శించిన సీపీ ప్రజ్ఞాపూర్ పోలింగ్ కేంద్రాన్ని సీపీ అనురాధ సందర్శించారు. ఈ సందర్భంగా పోలింగ్ సరళిని పరిశీలించారు. విధుల్లో ఉన్న పోలీసు సిబ్బందికి బందోబస్తు ఏర్పాట్లపై సూచనలు చేశారు. సీపీపాటు స్థానిక ఏసీపీ పురుషోత్తంరెడ్డి, ఇన్స్పెక్టర్ సైదా, ఎస్బీ ఇన్స్పెక్టర్ కిరణ్లు ఉన్నారు. పోలింగ్ సరళిని పరిశీలించిన అభ్యర్థులు, నేతలు అసెంబ్లీ నియోజకవర్గంలో ఎంపీ ఎన్నికల పోలింగ్ 80 శాతానికిపైగా నమోదైంది. ఈ నియోజకవర్గంలో 2,80,913 మంది ఓటర్లు ఉండగా ఇందులో 1,38,186 మంది పురుషులు, మరో 1,42,722 మంది మహిళలు ఉన్నారు. ఇందులో 22,4730 మందికిపైగా తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. మందకొడిగా ప్రారంభమైన పోలింగ్ ఉదయం 8గంటల తర్వాత పుంజుకున్నది. నియోజకవర్గంలో మొత్తంగా 322 పోలింగ్ కేంద్రాలు ఉండగా 322 మంది ప్రిసైడింగ్ అధికారులు, మరో 322 మంది అసిస్టెంట్ ప్రిసైడింగ్ అధికారులను, మరో 644 మంది ఇతర పోలింగ్ సిబ్బందిని, 240 మంది రిజర్వ్ సిబ్బందిని నియమించారు. నియోజకవర్గంలో 59 సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలను గుర్తించి ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా ఆయా కేంద్రాల్లో భద్రతా పెంచారు. కొండపాక మండలంలో పోలింగ్ కేంద్రాలను జిల్లా కలెక్టర్ మనుచౌదరి సందర్శించారు. నియోజకవర్గంలోని వివిధ కేంద్రాల్లో పోలింగ్ సరళిని మెదక్ బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి వెంకట్రామిరెడ్డి, బీజేపీ మెదక్ ఎంపీ అభ్యర్థి రఘునందన్రావు, డీసీసీ అధ్యక్షుడు నర్సారెడ్డి, మాజీ ఎఫ్డీసీ చైర్మన్ వంటేరు ప్రతాప్రెడ్డిలు పరిశీలించారు. పోలింగ్ కేంద్రాలను సిద్దిపేట సీపీ అనురాధ సందర్శించి బందోబస్తుపై పోలీసు సిబ్బందికి సూచనలు చేశారు. -
భారీ మెజారిటీతో విజయం సాధిస్తా
మెదక్ బీజేపీ ఎంపీ అభ్యర్థి రఘునందన్రావు దుబ్బాక: ప్రజలు బీజేపీకి అనుకూలంగా ఓట్లు వేశారని, వారి ఆశీర్వాదంతో భారీ మెజార్టీతో ఎంపీగా గెలుస్తానని బీజేపీ అభ్యర్థి రఘునందన్రావు అన్నారు. సోమవారం తన స్వగ్రామమైన భూంపల్లి–అక్బర్పేట మండలం బొప్పాపూర్లో సతీమణితో కలిసి ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలు ప్రలోభాలకు గురిచేసినా ప్రజలు మాత్రం బీజేపీ వైపే మొగ్గు చూపారన్నారు. అన్ని వర్గాల ప్రజలు కేంద్రంలో మళ్లీ నరేంద్రమోదీ నాయకత్వాన్నే కోరుకుంటున్నారన్నారు. నీలం మధు ఆరా దుబ్బాకరూరల్: అక్బర్పేట భూంపల్లి మండలం పోతారెడ్డిపేటలో కాంగ్రెస్ మెదక్ ఎంపీ అభ్యర్థి నీలం మధు పోలింగ్ కేంద్రాన్ని పరిశీలించారు. పార్టీ కార్యకర్తలతో మాట్లాడి పోలింగ్ శాతాన్ని తెలుసుకున్నారు. ఆయన వెంట పార్టీ నియోజకవర్గ ఇన్చార్జి చెరుకు శ్రీనివాస్రెడ్డి, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు వెంకటస్వామి గౌడ్, శ్రీనివాస్ గౌడ్, బాల్తె వెంకటేశం, చంద్రసాగర్ తదితరులు ఉన్నారు. చంద్లాపూర్లో ఓటేసిన జెడ్పీ చైర్పర్సన్ చిన్నకోడూరు(సిద్దిపేట): మండలంలో ప్రముఖులు తమ సొంత గ్రామాల్లో ఓటు హక్కు వినియోగించుకున్నారు. జెడ్పీ చైర్పర్సన్ రోజా శర్మ దంపతులు చంద్లాపూర్లో ఓటు వేయగా, ఎమ్మెల్సీ కూర రఘోత్తం రెడ్డి గోనెపల్లిలో ఓటు హక్కు వినియోగించుకున్నారు. బీఆర్ఎస్ గెలుపు పక్కా దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్రెడ్డి దుబ్బాక: మెదక్ లోక్సభ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఘన విజయం సాధించడం ఖాయమని ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్రెడ్డి జోస్యం చెప్పారు. సోమవారం తన స్వగ్రామమైన పోతారంలో కుటుంబ సభ్యులతో కలిసి ఓటుహక్కు వినియోగించుకున్నారు. ఈ సందర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడారు. బీజేపీ, కాంగ్రెస్ల కపట మాటలు ప్రజలు నమ్మలేదన్నారు. పోలింగ్ సరళిని సైతం పరిశీలిస్తే బీఆర్ఎస్కు అనుకూలంగా ఉందన్నారు. వ్యక్తిపై కేసు నమోదు గజ్వేల్రూరల్: బీఆర్ఎస్కు ఓటు వేయాలని డమ్మీ ఈవీఎంతో ప్రచారం నిర్వహిస్తున్న వ్యక్తిపై కేసు నమోదు చేసినట్లు గజ్వేల్ సీఐ సైదా పేర్కొన్నారు. గజ్వేల్ మున్సిపాలిటీ పరిధిలోని ఆర్అండ్ఆర్ కాలనీ(ఏటిగడ్డ కిష్టాపూర్)లోని పోలింగ్ కేంద్రం సమీపంలో సోమవారం డమ్మీ ఈవీఎంలతో ఓటు వేయాలని బీఆర్ఎస్ పార్టీకి చెందిన శ్రీనివాస్గౌడ్ ప్రచారం నిర్వహిస్తున్నారని అందిన సమాచారం మేరకు ఎఫ్ఎస్టీ అధికారుల ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసినట్లు సీఐ తెలిపారు. బీజేపీ కార్యకర్తపై బీఆర్ఎస్ నాయకుల దాడి మర్కూక్(గజ్వేల్): బీజేపీ కార్యకర్తపై బీఆర్ఎస్ నాయకులు దాడిచేసి గాయపరిచారు. ఈ సంఘటన మర్కూక్ మమండలంలోని పాములపర్తి గ్రామంలో సోమవారం చోటుచేసుకుంది. పాములపర్తిలో పోలింగ్ ముగిసిన తరువాత బీజేపీ ఏజెంట్ మురళి ఆశావర్కర్తో కలిసి బైక్పై వెళ్తున్న సమయంలో బీఆర్ఎస్ నాయకులు కొంతమంది వచ్చి మురళిపై దాడి చేసి గాయపరిచారు. అక్కడే ఉన్న బీజేపీ నాయకులు జోక్యం చేసుకోవడంతో అక్కడినుంచి వారు వెళ్లిపోయారు అతడిని మర్కూక్ పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేశారు. -
ఆయన రాహుల్ గాంధీ కాదు.. ‘రాంగ్’ గాంధీ: హరీశ్రావు
సాక్షి, సిద్ధిపేట జిల్లా: రైతుల ఉసురు పోసుకుందంటూ.. బీజేపీని కార్మిక, కర్షక వ్యతిరేక పార్టీగా అభివర్ణించారు మాజీ మంత్రి హరీష్రావు. బడా బడా కార్పొరేట్ సంస్థల గురించి మాత్రమే బీజేపీ ఆలోచించిందని.. 14 లక్షల కోట్లు మాఫీ చేసిందన్నారు. పేదలకు ఒక్క రూపాయి మాఫీ చేయలేదని విమర్శించారు.హుస్నాబాద్ అంబేద్కర్ చౌరస్తాలో కార్నర్ మీటింగ్లో ఆయన మాట్లాడుతూ, బీజేపీ పంచిన బొమ్మలను చూసి ఓటు వేస్తే కడుపు నిండుతుందా? అంటూ ప్రశ్నించారు.అయోధ్య రామాలయం బీజేపీ కట్టలేదు.. ట్రస్ట్ కట్టింది.ఆలయ నిర్మాణానికి తానుకూడా 2 లక్షలు ఇచ్చానని చెప్పారు.నిన్న హైదరాబాద్లో రాహుల్ గాంధీ సభ తుస్సు మంది. 30 వేల కుర్చీలు వేస్తే 3 వేల మంది రాలేదు. కాంగ్రెస్ వాళ్లు వచ్చి ఓటు అడిగితే ఐదు నెలల 12,500 ఇచ్చిన తర్వాతే ఓటు వేస్తామని అక్క చెల్లెళ్లు చెప్పండి. ప్రియాంక గాంధీ గెలిచాక ఇస్తామని హామీ ఇచ్చిన మెడికల్ కాలేజీ హుస్నాబాద్కు వచ్చిందా? రేవంత్ రెడ్డి కంటే రాహుల్ గాంధీ ఎక్కువ అబద్ధాలు మాట్లాడున్నాడు, ఆయన రాహుల్ గాంధీ కాదు రాంగ్ గాంధీ’’ అంటూ హరీశ్ ఎద్దేవా చేశారు.‘‘ఈ కాంగ్రెస్ పాలన వచ్చాక కల్యాణ లక్ష్మి ఖతమయ్యింది. తులం బంగారం తుస్సు మంది. బండి సంజయ్ బొమ్మలు పంచి ఓట్లు వేయమంటున్నాడు. బండి సంజయ్ కి ఓటు వేస్తే అంతా వృధా అయిపోతుంది. కరీంనగర్లో కాంగ్రెస్ పార్టీ మూడోస్థాలో ఉంది. అది గెలిచే ప్రసక్తే లేదు’’ అని హరీశ్రావు పేర్కొన్నారు. -
ప్రజలకు రాహుల్గాంధీ క్షమాపణ చెప్పాలి
జహీరాబాద్ (సంగారెడ్డి)/సిద్దిపేటజోన్: కాంగ్రెస్ పార్టీ జాతీయ నేత రాహూల్గాంధీ ఆరు గ్యారంటీలను అమలు చేస్తామని హామీ ఇచ్చి మరిచిపోయారని మాజీమంత్రి హరీశ్రావు విమర్శించారు. హామీల అమలులో విఫలమైనందుకు రాష్ట్ర ప్రజలకు రాహుల్ గాంధీ బేషరతుగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. పార్లమెంట్ ఎన్నికల ప్రచారానికి ఏం ముఖం పెట్టుకుని రాష్ట్రానికి వచ్చారని హరీశ్రావు ప్రశ్నించారు. అక్కా చెల్లెళ్లకు రాహూల్గాంధీ రూ.8,500 ఇస్తానంటున్నారని, మళ్లీ ఎవరి చెవులో పువ్వు పెడతారని నిలదీశారు.సంగారెడ్డి జిల్లా జహీరాబాద్లో గురువారం బీఆర్ఎస్ పార్లమెంట్ అభ్యర్థి గాలి అనిల్కుమార్కు మద్దతుగా రోడ్ షో నిర్వహించారు. ఈ సందర్భంగా హరీశ్రావు మాట్లాడుతూ..కరెంటు కోతలు పెడుతున్న కాంగ్రెస్కు పార్లమెంట్ ఎన్నికల్లో వాతలు పెట్టాలన్నారు. ఆరు గ్యారంటీ పథకాలు వచ్చిన వారు కాంగ్రెస్కు ఓటు వేయాలని, రాని వారంతా బీఆర్ఎస్కు ఓటు వేయాలని కోరారు. కార్యక్రమంలో పార్లమెంట్ అభ్యర్థి గాలి అనిల్కుమార్, ఎమ్మెల్యే కె.మాణిక్రావు, డీసీఎంఎస్ చైర్మన్ ఎం.శివకుమార్, ఎస్సీ కార్పొరేషన్ మాజీ చైర్మన్ వై.నరోత్తం, బేవరేజస్ కార్పొరేషన్ మాజీ చైర్మన్ దేవిప్రసాద్, బీఆర్ఎస్ నాయకులు కిజర్యాఫై పాల్గొన్నారు.బీజేపీతో కొట్లాడినందుకే కవితకు జైలుబీజేపీతో కొట్లాడేది ఒక్క కేసీఆర్, బీఆర్ఎస్ పార్టీయేనని ఆ పోరాటం ఫలితంగానే ఎమ్మెల్సీ కవిత జైలుకు వెళ్లాల్సి వచ్చిందని హరీశ్రావు తెలిపారు. సిద్దిపేట జిల్లా కేంద్రంలో జరిగిన ముస్లిం, మైనార్టీ ఆత్మీయ సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. బీజేపీ, బీఆర్ఎస్లు ఒక్కటేనని కాంగ్రెస్ పార్టీ నాయకులు చేస్తున్న ప్రచారాన్ని ఆయన తీవ్రంగా ఖండించారు. బీజేపీతో బీఆర్ఎస్ కలిసి ఉంటే కవిత అరెస్ట్ అయ్యేవారా..? అని ప్రశ్నించారు. తెలంగాణ సీఎం రేవంత్రెడ్డి ప్రధాని మోదీతో జత కట్టారని, చాలాసార్లు బహిరంగంగానే ప్రధానిని పొగిడిన విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేశారు. రేవంత్రెడ్డి, బీజేపీ మిలాఖత్ అయి రాష్ట్రంలో బీఆర్ఎస్ను లేకుండా చేయాలని కుట్ర చేస్తున్నారని ఆరోపించారు. -
చివరి శ్వాస వరకు మీ కోసమే పనిచేస్తా
● మీరు మరింత అండగా ఉండాలి ● సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్రావుసిద్దిపేటజోన్: ‘నా చివరి శ్వాస వరకు మీ కోసమే పనిచేస్తా. సమస్యలపై ప్రభుత్వాన్ని నిలదీసేందుకు మీరు మరింత అండగా ఉండాల’ని ఎమ్మెల్యే హరీశ్రావు అన్నారు. బుధవారం పట్టణంలో రియల్ ఎస్టేట్ వ్యాపారులు, గ్రామీణ వైద్యుల ఆత్మీయ సమ్మేళనంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో రియల్ ఎస్టేట్ రంగం తారస్థాయిలో ఉండేదని, ఇప్పుడు కుదేలు అయ్యిందని విమర్శించారు. సిద్దిపేట అంటే గౌరవం ఉందని, దాన్ని కాపాడే బాధ్యత మీదేనన్నారు. వెంకట్రామిరెడ్డి విజయం కోసం ప్రతి ఒక్కరూ పనిచేయాలని సూచించారు. కాంగ్రెస్ మీద కోపంతో బీజేపీకి ఓటు వేస్తే మన పరిస్థితి అగమ్యగోచరంగా ఉంటుందన్నారు. గ్రామాల్లో ప్రజలను చైతన్యం చేయాలని, మీరే ప్రచార సారథులని అన్నారు. అంతకుముందు మాజీ ఎమ్మెల్సీ ఫారూఖ్ మాట్లాడారు. సమావేశంలో మున్సిపల్ మాజీ చైర్మన్ రాజనర్స్, సుడా మాజీ చైర్మన్ రవీందర్ రెడ్డి, పట్టణ పార్టీ అధ్యక్షుడు సంపత్ రెడ్డి, నాయకులు పాల్గొన్నారు. -
No Headline
హుస్నాబాద్: రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అస్థిరపరిచేందుకు బీఆర్ఎస్, బీజేపీ కుట్రలు పన్నుతున్నాయని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. హుస్నాబాద్ పట్టణంలో రెడ్డి కార్పొరేషన్ ఏర్పాటు సందర్భంగా కృతజ్ఞత సమావేశం నిర్వహించారు. పాల్గొన్న మంత్రి పొన్నం మాట్లాడుతూ అన్ని కులాలను కలుపుకొని పావాలని, అందరి సహకారం ఉంటేనే రాజకీయ నాయకుడిగా ఎదుగుతారని తెలిపారు. రెడ్డి కమ్యూనిటీ భవనం కోసం రూ.50లక్షలు కేటాయించిన ప్రొసిడింగ్ను అందజేశారు. ఎన్నికల తర్వాత మరో రూ.50లక్షలు కేటాయించేందుకు కృషి చేస్తామన్నారు. దేశంలో ప్రజాస్వామ్యాన్ని కాపాడుకునేందుకు అందరూ ఐక్యంగా ఉండాల్సిన అవసరం ఉందన్నారు. నాలుగు కాలాల పాటు సమాజానికి సేవ చేయడానికి వచ్చిన సీఎం రేవంత్రెడ్డి ప్రభుత్వాన్ని కూలగొట్టేందుకు బీజేపీ, బీఆర్ఎస్ కుట్రలు చేస్తున్నాయని ఆరోపించారు. మేము అధికారంలోకి వచ్చిన 5 నెలల్లోనే మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, రూ.500లకే గ్యాస్, 200 యూనిట్ల ఉచిత విద్యుత్ ఇచ్చామని తెలిపారు. త్వరలోనే వరి కి రూ.500 బోనస్, రూ.2లక్షల రుణ మాఫీ, కొత్త పెన్షన్లు, ప్రతి నియోజకవర్గానికి 3,500 ఇళ్లు ఇస్తామన్నారు. సమావేశంలో రెడ్డి సంఘం నాయకులు కవ్వ లక్ష్మారెడ్డి, మడప జైపాల్ రెడ్డి, అశోక్రెడ్డి తదితరులు ఉన్నారు. పుట్టిన రోజు సందర్భంగా ప్రత్యేక పూజలు హుస్నాబాద్: మంత్రి పొన్నం ప్రభాకర్ జన్మదినం సందర్భంగా బుధవారం పలు ఆలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించారు. పొట్లపల్లి స్వయంభూ రాజేశ్వర స్వామి ఆలయంలో, హుస్నాబాద్ రేణుకా ఎల్లమ్మ దేవాలయంలో మంత్రి పూజలు చేశారు. అనంతరం హుస్నాబాద్లో రెడ్డి సంఘం, కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో, క్యాంప్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన జన్మదిన వేడుకల్లో మంత్రి పాల్గొని కేక్ కట్ చేశారు. కార్యక్రమాల్లో మాజీ ఎమ్మెల్యే ఆరపల్లె మోహన్, బొమ్మ శ్రీరాంచక్రవర్తి, కాంగ్రెస్, యూత్ కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు. -
No Headline
దుబ్బాకటౌన్: బీసీ బిడ్డనైనా తనకు మెదక్ ప్రజలు ఎంపీగా ఒక్క అవకాశం ఇస్తే అభివృద్ధి చేసి చూపిస్తానని కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి నీలం మధు అన్నారు. బుధవారం రాత్రి దుబ్బాకలో తెలంగాణ తల్లి చౌరస్తాలో రోడ్ షో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో పేదలకు చేసిందేమీలేదని ఆరోపించారు. దేశంలో ప్రయివేటీకరణ ప్రోత్సహిస్తున్న బీజేపీ తగిన బుద్ధి చెప్పాలని ప్రజలను కోరారు. ఎంపీగా గెలువగానే నియోజకవర్గ నిరుద్యోగులకు జాబ్ మేళా నిర్వహించి యువతకు ఉద్యోగాలు ఇప్పిస్తానని హామీనిచ్చారు. రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి రాగానే 5 గ్యారంటీలను అమలు చేసిందన్నారు. హస్తం గుర్తుకు ఓటు వేసి మెదక్ ఎంపీగా తనను భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. ఒక్క అవకాశం ఇవ్వండి కాంగ్రెస్ మెదక్ ఎంపీ అభ్యర్థి నీలం మధు -
రేవంత్రెడ్డి, కేసీఆర్ మాటలు నమ్మొద్దు
● గెలిపిస్తే అందుబాటులో ఉండి అభివృద్ధి చేస్తా ● మెదక్ బీజేపీ ఎంపీ అభ్యర్థి రఘునందన్రావువర్గల్(గజ్వేల్): ‘హామీలు అమలుచేయని సీఎం రేవంత్రెడ్డి, కేసీఆర్ అసత్యపు మాటలు నమ్మొద్దు. బీఆర్ఎస్ అభ్యర్థి వెంకట్రామిరెడ్డిని గెలిపిస్తే ఇక్కడి భూములన్నీ లాక్కుని, రాజ్ పుష్ప బోర్డులు పెడతారు’అని బీజేపీ మెదక్ ఎంపీ అభ్యర్థి రఘునందన్రావు అన్నారు. బుధవారం వర్గల్లో సీనియర్ నాయకులు రాంరెడ్డి, నందన్గౌడ్, బాల్రెడ్డిలతో కలిసి రోడ్షో నిర్వహించారు. ఈ సందర్భంగా రఘునందన్ మాట్లాడుతూ సీఎం రేవంత్ ఇచ్చిన హామీలు నేటికీ అమలు కాలేదన్నారు. పదేళ్ల పాలనలో కేసీఆర్ డబుల్బెడ్రూం ఇళ్లు ఎందుకు ఇవ్వలేదని ప్రశ్నించారు. కేసీఆర్ కాళ్లు మొక్కి ఎమ్మెల్సీ పదవి దక్కించుకుని ఏనాడు కన్పించని వెంకట్రామిరెడ్డికి, మళ్లీ ఎంపీ పదవెందుకని నిలదీశారు. కమలం పువ్వు గుర్తుకు ఓటేసి తనను ఆదరించి గెలిపిస్తే అభివృద్ధి చేసి చూపిస్తానన్నారు. గెలిపిస్తే పార్లమెంట్లో గళం వినిపిస్తా ములుగు(గజ్వేల్): ఎంపీ ఎన్నికల్లో తనను గెలిపిస్తే పార్లమెంట్లో గళం వినిపిస్తానని బీజేపీ ఎంపీ అభ్యర్థి రఘునందన్రావు అన్నారు. బుధవారం రాత్రి ములుగు మండలంలో రోడ్ షో నిర్వహించి ప్రసంగించారు. -
తండాలను పంచాయతీలు చేశాం..
దశాబ్దాల పాటు పరిపాలించిన ఏ ప్రభుత్వం తండాలను పట్టించుకోలేదని, తాము తండాలను పంచాయతీలుగా చేసి అభివృద్ధి చేశామని కేసీఆర్ అన్నారు. మన రిజర్వేషన్లు మనకు ఉండాలంటే బీఆర్ఎస్ అభ్యర్థి గెలవాలని పిలుపునిచ్చారు. కార్నర్ మీటింగ్లో మాజీ మంత్రి హరీశ్రావు, ఎమ్మెల్యే సునీతారెడ్డి, బీఆర్ఎస్ అభ్యర్థి వెంకట్రామిరెడ్డి, ఎమ్మెల్సీ యాదవరెడ్డి, మాజీ ఎమ్మెల్సీ ఫారూక్హుస్సేన్, జెడ్పీ చైర్పర్సన్ హేమలత, కార్మిక బోర్డు మాజీ చైర్మన్ దేవేందర్రెడ్డి, మన్సిపల్ చైర్మన్ అశోక్గౌడ్, జెడ్పీటీసీ బబియానాయక్, బీఆర్ఎస్ నాయకులు ఎర్రోళ్ల శ్రీనివాస్, చంద్రాగౌడ్, గోపి, వెంకట్రెడ్డి, నయిమోద్దీన్, సత్యంగౌడ్, పంబాల భిక్షపతి, తదితరులు పాల్గొన్నారు. -
No Headline
పటాన్చెరుకు రైల్వే కోచ్ సాధిస్తాం పటాన్చెరు: బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి వెంకట్రామిరెడ్డిని గెలిపిస్తే పటాన్చెరుకు రావాల్సిన రైల్వే కోచ్ ఫ్యాక్టరీని సాధిస్తామని మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. బుధవారం రాత్రి సంగారెడ్డి జిల్లా పటాన్చెరులో నిర్వహించిన రోడ్ షోలో కేసీఆర్ పాల్గొని ప్రసంగించారు. ఈ నియోజకవర్గంలో పదేళ్ల కిందట రెండు లక్షల ఓటర్లు ఉండేవారని, ఇప్పుడు నాలుగు లక్షలకు చేరిందన్నారు. తమ ఇండస్ట్రియల్ పాలసీ కారణంగా పటాన్చెరులో అనేక పరిశ్రమలు వచ్చాయని గుర్తు చేశారు. పారిశ్రామిక అవసరాలకు నిరంతరం విద్యుత్తును సరఫరా చేశామని గుర్తు చేశారు. దీంతో దేశంలోని నలు మూలల నుంచి పెట్టుబడులు వచ్చాయని తెలిపారు. ఈ ప్రాంతంలో పరిశ్రమలు రావడంతో వివిధ రాష్ట్రాల నుంచి కార్మికులు, ఉద్యోగులు ఇక్కడికి వచ్చి స్థిరపడ్డారని కేసీఆర్ వివరించారు. కాలుష్య ప్రాంతంగా ఉన్న పటాన్చెరులో స్వచ్ఛమైన మంచినీటి మిషన్ భగీరథ పథకం కింద ఇంటింటికి మంచినీరు సరఫరా చేశామని తెలిపారు. -
మల్లన్న జలాలతో సిరులే..
నర్సాపూర్/నర్సాపూర్రూరల్: మల్లన్నసాగర్ కాలువల ద్వారా సాగు నీరు వస్తే నర్సాపూర్ బంగారు తునక అవుతుందని బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ అన్నారు. బస్సుయాత్రలో భాగంగా బుధవారం సాయంత్రం నర్సాపూర్ చౌరస్తాలో ఏర్పాటు చేసిన కార్నర్ మీటింగ్లో ఆయన మాట్లాడారు. కాళేశ్వరం ప్రాజెక్టుతో నర్సాపూర్ను లింకు చేయడానికి శంకరంపేట నుంచి కాలువల తవ్వకాలు కొనసాగుతున్నాయని చెప్పారు. మల్లన్నసాగర్ నుంచి ఒక్కసారి నీరు రావడం మొదలైతే నర్సాపూర్ సస్యశ్యామలం అవుతుందన్నారు. కాలువల నిర్మాణం పూర్తయి నీళ్లు రావాలంటే మెదక్ ఎంపీగా వెంకట్రామిరెడ్డి గెలవాలన్నారు. మనమంతా కలిసి యుద్ధం చేస్తేనే ఈ ప్రభుత్వం నీళ్లు ఇచ్చే పరిస్థితి ఉందన్నారు. ఎమ్మెల్యేగా సునీతారెడ్డి గెలిచినప్పటి నుంచి కాలువల నిర్మాణంలో స్పీడ్ పెంచే ప్రయత్నాలు చేస్తున్నామని తెలిపారు. నర్సాపూర్ పొలాలు గోదావరి జలాలతో పారాలన్నదే నా కల అన్నారు. నర్సాపూర్ను ఎంతో అభివృద్ధి చేశామని, మున్సిపాలిటీకి రూ. 25 కోట్ల నిధులు ఇచ్చామని, గ్రామ పంచాయతీల అభివృద్ధికి సైతం నిధులు ఇవ్వగా ఈ ప్రభుత్వం ఆ నిధులన్నింటినీ వెనక్కి తీసుకుపోయిందని ఆరోపించారు. కొల్చారంలో మల్లినాథసూరి యూనివర్సిటీ ఏర్పాటు చేయాలని తాను నిర్ణయిస్తే కాంగ్రెస్ ప్రభుత్వం దానిని పట్టించుకోవడం లేదని విమర్శించారు. తమ హయాంలో హల్దీ వాగు, మంజీరాపై 10 చెక్ డ్యాంలు నిర్మించామని, రైతులు బ్రహ్మాండంగా పంటలు పండించారని చెప్పారు. సస్యశ్యామలం చేయడమే నా కల అందుకు ప్రభుత్వంపై యుద్ధం చేద్దాం నర్సాపూర్ కార్నర్ మీటింగ్లో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ -
తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేయండి
● సీపీఐ జాతీయ కార్యవర్గ సభ్యుడు చాడ వెంకట్రెడ్డి హుస్నాబాద్: అకాల వర్షాలతో తడిసిన ధాన్యాన్ని ప్రభుత్వం వెంటనే కొనుగోలు చేయాలని, పంట నష్టంపై సర్వే చేయించాలని సీపీఐ జాతీయ కార్యవర్గ సభ్యుడు చాడ వెంకట్రెడ్డి అన్నారు. హుస్నాబాద్ వ్యవసాయ మార్కెట్లో తడిసిన ధాన్యాన్ని బుధవారం ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా చాడ మాట్లాడుతూ వర్షాలకు దెబ్బతిన్న పంటలకు నష్ట పరిహారం చెల్లించాలన్నారు. అలాగే కాంగ్రెస్ అభ్యర్థికి మద్దతుగా హుస్నాబాద్ పట్టణంలో చాడ బుధవారం ఇంటింటి ప్రచారం నిర్వహించారు. కార్యక్రమంలో సీపీఐ జిల్లా కార్యదర్శి మంద పవన్, రాష్ట్ర సమితి సభ్యుడు మల్లేశ్, నాయకులు పాల్గొన్నారు. -
సుప్రీంకోర్టు మాజీ జడ్జిని కలిసిన కలెక్టర్
కొండపాక (గజ్వేల్): దుద్దెడ శివారులో నాగులబండ వద్ద సుప్రీంకోర్టు మాజీ జడ్జి, కాళేశ్వరం ప్రాజెక్టు అవకతవకలపై విచారణ కమిషన్ చైర్మన్ పినాక చంద్రఘోష్ను బుధవారం కలెక్టర్ మనుచౌదరి మర్యాద పూర్వకంగా కలిశారు. రామగుండం నుంచి హైదరాబాద్కు వెళ్తున్న క్రమంలో ఓ హోటల్లో తేనీటి విందు స్వీకరించే క్రమంలో కొద్దిసేపు ఆగి విశ్రాంతి తీసుకున్నారు. విషయం తెలుసుకున్న కలెక్టర్ కలిశారు. కలెక్టర్ వెంట పోలీస్ అదనపు డీసీపీ (అడ్మిన్) మల్లారెడ్డి, నీటిపారుదల శాఖ ఈఎన్సీ హరిరాం తదితరులు పాల్గొన్నారు.జిల్లా ప్రధాన న్యాయమూర్తిని కలిసిన సీపీ సిద్దిపేటకమాన్: జిల్లా ప్రధాన న్యాయమూర్తి కె.సాయిరమాదేవిని పోలీసు కమిషనర్ అనురాధ బుధవారం మర్యాద పూర్వకంగా కలిసి పుష్పగుచ్ఛం అందజేశారు. పెండింగ్లో ఉన్న కేసుల గురించి చర్చించారు. న్యాయమూర్తిని కలిసిన వారిలో అదనపు డీసీపీ మల్లారెడ్డి ఉన్నారు.మల్బరీ తోటల పరిశీలన నంగునూరు(సిద్దిపేట): ముండ్రాయిలో వర్షానికి దెబ్బతిన్న మల్బరీ తోటలను బుధవారం పట్టు పరిశ్రమ శాఖ అధికారులు పరిశీలించారు. రైతు రాగుల రాజు రెండెకరాల మల్బరీ సాగు చేయగా అకాల వర్షానికి పూర్తిగా ధ్వంసమైంది. అలాగే ఈదురు గాలులతో కూడిన వర్షానికి పురుగులు చనిపోవడంతో తీవ్ర నష్టం వాటిల్లింది. ఏడీఏ ఇంద్రసేనారెడ్డి మాట్లాడుతూ నష్టం వివరాలను ఉన్నతాధికారులకు అందజేసి రైతుకు పరిహారం అందేలా చూస్తామన్నారు.ఆయిల్పామ్ సాగుతో ఆర్థికాభివృద్ధి మిరుదొడ్డి(దుబ్బాక): ఆయిల్పామ్ సాగుతో రైతులు ఆర్థికాభివృద్ధి సాఽధించవచ్చని ఆయిల్ ఫెడ్ డిప్యూటీ మేనేజర్ ప్రవీణ్రెడ్డి అన్నారు. మండల పరిధిలోని చెప్యాలలో ఆయిల్పామ్ సాగుపై హార్టికల్చర్ అధికారులు బుధవారం రైతులకు క్షేత్ర స్థాయిలో శిక్షణ ఇచ్చారు. డ్రిప్, స్ప్రింక్లర్ల వినియోగంపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉద్యాన శాఖ అధికారుల సలహాలు సూచనలు పాటిస్తూ సాగుపై అవగాహన పెంచుకోవాలని చూచించారు. కార్యక్రమంలో డీఐ శంకర్, హార్టికల్చర్ ఏఈ అనిల్కుమార్, వ్యవసాయ విస్తరణ అధికారి రేణుక, ఆయిల్ఫెడ్ డీసీఓ ఆంజనేయులు, రైతులు పాల్గొన్నారు. ‘బాల పురస్కార్’కు దరఖాస్తుల ఆహ్వానంసిద్దిపేటరూరల్: కేంద్ర మహిళా, శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో అందించే ప్రధానమంత్రి రాష్ట్రీయ బాల పురస్కార్ అవార్డుకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నారు. ఆరేళ్ల నుంచి 18 ఏళ్ల వయస్సున్న బాలబాలికలు దరఖాస్తు చేసుకోవచ్చని ఆమె బుధవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఆపదలో, ప్రాణాపాయ స్థితిలో ఉన్న వారిని కాపాడటంలో ధైర్యసాహసాలు చూపినవారు, సాంస్కృతిక కళలు, క్రీడలు, సమాజసేవ, పాండిత్యంలో అత్యుత్తమ ప్రతిభ కనభరిచిన వారు అర్హులని తెలిపారు. వారి వివరాలను ఉపాధ్యాయులు, బాలలు, సంస్థలు అన్ని పత్రాలతో ఆన్లైన్లో జూలై 31లోగా దరఖాస్తు చేసుకోవాలన్నారు. ఎంపికై న బాలలకు డిసెంబర్ 26న వీర్ బాల్ దివస్ పురస్కరించుకుని అవార్డులు అందించనున్నట్లు తెలిపారు. ఆన్లైన్ వెబ్సైట్ http://awards.gov.in ద్వారా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. -
చేనేత పరిశ్రమను నాశనం చేసింది బీఆర్ఎస్సే
● రూ.100 కోట్ల సబ్సిడీ సైతం ఇవ్వలేదు ● మంత్రి కొండా సురేఖదుబ్బాక: చేనేత పరిశ్రమను నిర్వీర్యం చేసింది గత బీఆర్ఎస్ ప్రభుత్వమేనని మంత్రి కొండా సురేఖ అన్నారు. బుధవారం దుబ్బాక చేనేత సహకార సంఘాన్ని సందర్శించారు. నేతన్నల కష్టాలను తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ నేతన్నలకు ఇవ్వాల్సిన రూ.100 కోట్ల సబ్సిడీని ఇవ్వకుండా బీఆర్ఎస్ ప్రభుత్వం దగాకు గురి చేసిందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం చేనేత కార్మికులకు అన్ని విధాలుగా అండగా ఉంటుందన్నారు. త్వరలోనే సీఎం రేవంత్రెడ్డితో చర్చించి చేనేత కార్మికులను ఆదుకుంటామన్నారు. వచ్చేది ‘ఇండియా’ కూటమే.. కేంద్రంలో అధికారంలోకి వచ్చేది ‘ఇండియా’ కూటమేనని మంత్రి కొండా సురేఖ అన్నారు. బీజేపీ ఎన్ని అసత్యపు ప్రచారాలు చేసినా ప్రజలు నమ్మరని అన్నారు. కుటుంబ పాలనతో తెలంగాణను లూటీ చేసిన బీఆర్ఎస్కు బుద్ధి చెప్పినట్లుగానే బీజేపీకి గుణపాఠం చెప్పాలన్నారు సమావేశంలో కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి నీలం మధు, చెరుకు శ్రీనివాస్రెడ్డి, మద్దుల గాల్రెడ్డి ఉన్నారు. రైతుల ఉసురు తీసిండ్రు తొగుట(దుబ్బాక): గత బీఆర్ఎస్ ప్రభుత్వం మల్లన్న సాగర్ నిర్వాసితుల ఉసురు తీసిందని మంత్రి కొండా సురేఖ అన్నారు. కాంగ్రెస్ అభ్యర్థి నీలం మధుకు మద్దతుగా బుధవారం తొగుటలో కార్నర్ మీటింట్ నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రైతుల నుంచి భూములు బలవంతంగా లాక్కున్నారని ఆరోపించారు. నిర్వాసితులకు పరిహారం చెల్లించకుండా గత ప్రభుత్వం మోసంచేసిందని ఆరోపించారు. అవ్వా.. నేను చేనేత బిడ్డనే.. దుబ్బాక: బాగున్నావా అవ్వా.. నేను మీ చేనేత బిడ్డనే.. అంటూ రాట్నం చుడుతున్న 80 ఏళ్ల వృద్ధ కార్మికురాలిని మంత్రి కొండా సురేఖ ఆప్యాయంగా పలకరించారు. ‘మీ కష్టాలు స్వయంగా తెలుసు. ఇప్పుడు మంత్రిని అయ్యా.. మీ కష్టాలు తీరుస్తా’ అంటూ మనోధైర్యం ఇచ్చారు. నీ ఓటు కాంగ్రెస్కు వేయాలని మంత్రి కోరారు. -
కేసీఆర్కు నీరాజనం
గజ్వేల్లో ఘన స్వాగతం గజ్వేల్: బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్కు గజ్వేల్లో ఘన స్వాగతం లభించింది. నర్సాపూర్ ఎన్నికల ప్రచారసభకు వెళ్లే క్రమంలో బుధవారం సాయంత్రం పట్టణంలోని ఇందిరాపార్కు చౌరస్తాలో కొద్దిసేపు ఆగారు. ఈ సందర్భంగా బస్సులో నుంచే కార్యకర్తలు, నాయకులు అభివాదం చేశారు. అప్పటికే గంటకుపైగా వేచి చూస్తున్న ప్రజలు కేసీఆర్ రావడంతో ఒక్కసారిగా పెద్దపెట్టున నినాదాలు చేశారు. అటవీ అభివృద్ధి సంస్థ మాజీ చైర్మన్ వంటేరు ప్రతాప్రెడ్డి బస్సులోకి వెళ్లి కొద్దిసేపు మాట్లాడి ఆశీర్వాదం తీసుకున్నారు. ఈ సందర్భంగా ఎన్నికల ప్రచార సరళిని కేసీఆర్ ప్రతాప్రెడ్డిని అడిగి తెలుసుకున్నారు. మున్సిపల్ కౌన్సిలర్ శీరీష మంగళ హారతులతో స్వాగతం పలికారు. అదేవిధంగా బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు రాధాకృష్ణ, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ మాదాసు శ్రీనివాస్, మున్సిపల్ కౌన్సిలర్ రజిత, మరికొంత మంది మహిళలు కేసీఆర్ను కలిశారు. అంతకుమందు మాజీ మంత్రి హరీశ్రావు సైతం చౌరస్తాలో కొద్దిసేపు ఆగి అభివాదం చేసి వెళ్లారు. -
వసతులు కల్పించాలి
దుబ్బాక: 13వ తేదీన జరిగే పార్లమెంట్ ఎన్నికలకు పోలింగ్ స్టేషన్లలో అన్ని వసతులు కల్పించాలని అదనపు కలెక్టర్, దుబ్బాక అసిస్టెంట్ ఎన్నికల రిటర్నింగ్ అధికారి గరీమా అగర్వాల్ అన్నారు. మంగళవారం దుబ్బాక ఐఓసీ కార్యాలయంలో నియోజకవర్గంలోని పంచాయతీ కార్యదర్శులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఎన్నికల విధులను సిబ్బంది బాధ్యతతో నిర్వహించాలన్నారు. పోలింగ్స్టేషన్లలో ఓఆర్ఎస్ ప్యాకెట్లు, ఇద్దరు వలంటీర్లు, వీల్చైర్ అందుబాటులో ఉంచాలన్నారు. సమావేశంలో డీపీఓ దేవకీదేవి, డీఎల్పీఓ మల్లికార్జున్, ఏఎఆర్ఓ వెంకట్రెడ్డి తదితరులు పాల్గొన్నారు. అదనపు కలెక్టర్, దుబ్బాక ఏఆర్ఓ గరీమా అగర్వాల్ -
తల్లిపాలపై అవగాహన కల్పించాలి
డీఎంహెచ్ఓ శ్రీనివాస్సిద్దిపేటకమాన్: తల్లిపాల ప్రాముఖ్యత, వ్యాధి నిరోధక టీకాలు, అసంక్రమిత వ్యాధుల స్క్రీనింగ్పై ప్రజలకు అవగాహన కల్పించాలని డీఎంహెచ్ఓ డాక్టర్ శ్రీనివాస్ వైద్యాధికారులకు సూచించారు. సిద్దిపేట కలెక్టరేట్లోని వైద్యారోగ్యశాఖ కార్యాలయంలో జిల్లాలోని పల్లె దవాఖానాల్లో పనిచేస్తున్న ఆయుష్ వైద్యాధికారులు, ఎమ్ఎల్హెచ్పీలకు ఆరోగ్య కార్యక్రమాల పనితీరుపై మంగళవారం సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వైద్యసేవల కోసం వచ్చే వారితో సిబ్బంది మర్యాదగా ప్రవర్తించాలన్నారు. ఆరోగ్య కేంద్రం పరిధిలో ఏవైనా ఆరోగ్య సమస్యలు ఉత్పన్నమైతే వైద్య సిబ్బంది గ్రామానికి వెళ్లి క్షేత్ర స్థాయిలో పరిశీలించి కారణాలు తెలుసుకుని నివేదికను పీహెచ్సీ వైద్యాధికారికి అందజేయాలన్నారు. సమావేశంలో డాక్టర్ వినోద్బాబ్జి, డాక్టర్ విజయరాణి, డాక్టర్ రజని, వైద్యాధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. -
కాంగ్రెస్కు బుద్ధి చెప్పండి
దుబ్బాకటౌన్: సాధ్యం కానీ హామీలతో ప్రజలను మోసం చేసి రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వానికి ప్రజలు బుద్ధి చెప్పాలని బీజేపీ దుబ్బాక మున్సిపల్ అధ్యక్షుడు కిష్టమ్మగారి సుభాష్ రెడ్డి అన్నారు. పార్టీ మెదక్ ఎంపీ అభ్యర్థి రఘునందన్రావుకు మద్దతుగా మంగళవారం పట్ట ణంలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. పదేళ్ల కేంద్ర బీజేపీ పాలనలో చేపట్టిన సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించారు. మెదక్ అభివృద్ధి కేవలం రఘునందన్ రావుతోనే సాధ్యమన్నారు. కమలం పువ్వు గుర్తుకు ఓటువేసి ఆయనను గెలిపించాలని కోరారు. ప్రచారంలో నాయకులు పాల్గొన్నారు. ఇంటింటికి బీజేపీ ప్రశాంత్నగర్(సిద్దిపేట): బీజేపీ మెదక్ పార్లమెంట్ అభ్యర్థి రఘునందన్రావుకు మద్దతుగా ఆ పార్టీ శ్రేణులు సిద్దిపేటలో ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు నాయకులు మా ట్లాడారు. దేశం కోసం, ధర్మకోసం, ప్రజల కోసం బీజేపీ ప్రభుత్వం పనిచేస్తుందన్నారు. రఘు నందన్రావును భారీ మెజార్టీతో గెలిపించాలన్నారు. కార్యక్రమంలో పార్టీ పట్టణ అధ్యక్షుడు కోడూరి నరేష్, సిద్దిపేట ఎన్నికల ప్రచార కమిటీ కోకన్వీనర్ తొడుపునూరి వెంకటేశం, సిద్దిపేట పట్టణ ప్రధాన కార్యదర్శులు కెమ్మసారం సంతోష్కుమార్, పిట్ల నరేష్, బొడ్డు సునీల్, పార్టీ సిద్దిపేట జిల్లా కార్యదర్శి బొమ్మగోని పద్మ తదితరులు పాల్గొన్నారు. ఆరు గ్యారెంటీల పేరిట నంగునూరు(సిద్దిపేట): కాంగ్రెస్ పార్టీ ఆరు గ్యారెంటీల పేరిట మోసం చేసి అధికారంలోకి వచ్చిందని, ఆ పార్టీ నాయకుల వాగ్దానాలను ప్రజలు నమ్మొ ద్దని బీజేపీ మండల అధ్యక్షుడు వెంకట్రామిరెడ్డి అన్నారు. పార్టీ మెదక్ పార్లమెంట్ అభ్యర్థి రఘునందన్రావుకు మద్దుతుగా మంగళవారం ప్రచారం నిర్వహించారు. ధాన్యం కొనుగోలు కేంద్రాల వద్ద మజ్జిగ ప్యాకెట్లు పంపిణీ చేశారు. ప్రతీ అభివృద్ధి పనిలో .. గజ్వేల్రూరల్: ప్రతీ అభివృద్ధి పనిలో కేంద్ర ప్రభుత్వ నిధులున్నాయని, ప్రజల సంక్షేమానికి పాటు పడుతున్న బీజేపీకి ఓటువేయాలని ఆ పార్టీ గజ్వేల్ మండల అధ్యక్షుడు పంజాల అశోక్గౌడ్ అన్నారు. మండల పరిధిలోని రిమ్మనగూడలో మంగళవారం బీజేపీ మెదక్ పార్లమెంట్ అభ్యర్థి రఘునందన్రావుకు మద్దతుగా ఎన్నికల ప్రచారం నిర్వహించారు. కార్యక్రమంలో పార్టీ రిమ్మనగూడ గ్రామ బూత్ అధ్యక్షుడు నవీన్ పాల్గొన్నారు. -
కొనసాగుతున్న బాలసంస్కార్ వేసవి శిక్షణా శిబిరం
ప్రశాంత్నగర్(సిద్దిపేట): జిల్లా కేంద్రంలో బాల సంస్కార్ వేసవి శిక్షణా శిబిరం కొనసాగుతోంది. మంగళవారం విద్యార్థులకు కార్టూన్ చిత్రకళలో ప్రముఖ కార్టూనిస్ట్ నెల్లుట్ల రమణారావు శిక్షణ ఇచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గీతలతో నవరసాలను, భావోద్వేగాలను కార్టూన్ ద్వారా వ్యక్తీకరించవచ్చన్నారు. సమకాలీన సమస్యలపై అవగాహనతో కార్టూన్లు వేస్తే ఎందరినో ఆలోచింపజేయ వచ్చని సూచించారు. బాల సంస్కార్ కోర్స్ డైరెక్టర్ తోట సంధ్య, సిద్దిపేట జిల్లా యోగా సన స్పోర్ట్ అసోసియేషన్ అధ్యక్షుడు అశోక్, ప్రముఖ యోగా శిక్షకుడు సతీష్, కవి బసవరాజ్ రాజ్కుమార్ రామణారావును సన్మానించారు. నెమలిని రక్షించిన అధికారులు మద్దూరు(హుస్నాబాద్): మండలంలోని గాగ్గిళ్లాపూర్లో రైతు బండి స్వామికి చెందిన వ్యవసాయ బావిలో ప్రమాదవశాత్తు నెమలి పడిపోయింది. గమనించిన స్థానికులు ఫారెస్టు అధికారులకు సమాచారం అందించారు. మంగళవారం ఫారెస్టు బీట్ ఆఫీసర్ రాముడు సిబ్బందితో కలిసి సంఘటన స్థలానికి చేరుకొని బావిలో పడిన నెమలిని వెలికితీశారు. నీళ్లు తాగించి అడవిలోకి వదిలారు. -
హామీల అమలులో కాలయాపన
చేర్యాల(సిద్దిపేట): పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ భువనగిరి ఎంపీ అభ్యర్థి క్యామ మల్లేష్ని భారీ మెజార్టీతో గెలిపించాలని మున్సిపల్ చైర్ పర్సన్ అంకుగారి స్వరూపరాణి కోరారు. మంగళవారం పట్టణ పరిధిలోని పలువార్డుల్లో బీఆర్ఎస్ కౌన్సిలర్లు, నాయకులు ఇంటింటి ప్రచారం నిర్వహించారు. కేసీఆర్ పాలనలో అందిన సంక్షేమ పథకాల ను ఓటర్లకు వివరించారు. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలను అమలు చేయకుండా కాలయాపన చేస్తోందన్నారు. అన్ని వర్గాల సంక్షేమం కోసం.. కొమురవెల్లి(సిద్దిపేట): బీఆర్ఎస్ భువనగిరి పార్ల మెంట్ అభ్యర్థి క్యామ మల్లేష్ను భారీ మెజార్టీతో గెలిపించాలని బీఆర్ఎస్వీ రాష్ట్ర నాయకుడు ఏర్పాలు మహేష్ ప్రజలను కోరారు. మంగళవారం ఆయనకు మద్దతుగా మండల కేంద్రంలో ఇంటింటి ప్రచారం నిర్వహించారు. మాజీ సీఎం కేసీఆర్ అన్ని వర్గాల సంక్షేమం కోసం పని చేశారన్నారు. కాంగ్రెస్ పార్టీ మోసపూరిత హామీలతో ప్రభుత్వం ఏర్పాటు చేశారని ఆరోపించారు. కార్యక్రమంలో పార్టీ సీని యర్ నాయకుడు గొల్లపల్లి కిష్టయ్య, గ్రామ అధ్యక్షులు కనకమల్లేశం, మాజీ ఉపసర్పంచ్ కొండ శ్రీధర్ తదితరులు పాల్గొన్నారు.
Pagination
మళ్లీ చరిత్ర సృష్టిస్తున్నాం
చేతులు కాలాక ఆకులు పట్టుకున్న ఈసీ
ఓటీటీలోకి వచ్చేసిన మిడిల్ క్లాస్ మూవీ.. స్ట్రీమింగ్ అందులోనే?
వరల్డ్కప్ జట్టులో నో ఛాన్స్: రోహిత్పై కేఎల్ రాహుల్ కామెంట్స్ వైరల్
ఈపీఎఫ్ఓ ఖాతాదారులకు అలెర్ట్.. మారిన విత్ డ్రా నిబంధనలు
ఎన్ఆర్ఐతో విధి ఆడిన వింత నాటకం.. విషాదం
స్వాతి మలివాల్ డ్రామా.. బీజేపీ కుట్రే ఇదంతా: సంచలన వీడియో బయట పెట్టిన ఆప్
Heeramandi Jewellery ఎవరీ సినిమా నగల స్పెషలిస్ట్ జంట
ఆ పని నాది కాదు.. వైరముత్తుకు కౌంటర్ ఇచ్చిన ఇళయరాజా!
ఇంటర్లో ప్రవేశానికి స్పాట్ కౌన్సెలింగ్
‘అధికారులు తీరు మార్చుకోవాలి’
‘కల్తీ కల్లును అరికట్టాలి’
● జిల్లాలో విందులు, వినోదాల పేరిట పెడదారిన టీనేజ్ యువత.. ● సిగరెట్లు, మద్యపానం ఫ్యాషన్గా భావిస్తున్న యువకులు ● విందులు, వినోదాల పేరుతో సెలవులు దుర్వినియోగం ● తల్లిదండ్రుల పర్యవేక్షణ తప్పనిసరి
క్లుప్తంగా
ఆంక్షలు లేకుండా జొన్న కొనుగోళ్లు చేపట్టాలి
‘సూపర్వైజర్ను విధుల నుంచి తొలగించాలి’
‘స్వగృహ’ ఆక్రమణపై ఆర్డీవో విచారణ
‘గ్రూప్–1 ప్రిలిమినరీ’కి 18 కేంద్రాలు
తప్పక చదవండి
- బీజేపీ ఎంపీ- ఆప్ ఎమ్మెల్యే వాగ్వాదం.. వీడియో వైరల్!
- ఇది మోదీ కూలర్.. లోకల్ బ్రాండ్ గురూ!
- ఏపీలో పెట్రోల్ బంకులకు ఈసీ సీరియస్ వార్నింగ్
- పెళ్లయినా సరే ఆ విషయంలో హన్సిక తగ్గేదేలే
- ప్రైవేట్ బస్సులో మంటలు.. తిరుపతిలో తప్పిన ఘోర ప్రమాదం
- వైన్స్ షాపు ముందు యువతి హల్చల్
- పోలింగ్ వేళ జమ్ములో కాల్పుల కలకలం
- Election Commission of India: 2 నెలల్లో 4.24 లక్షల ఫిర్యాదులు
- 16 ఏళ్లకే ఏఐ ఇంజనీర్! మన తెనాలి కుర్రాడే..
- Vizag: కాంబోడియాలో ఉద్యోగాల పేరిట మానవ అక్రమ రవాణా
Advertisement