-
ఓటీటీలోకి వచ్చేసిన ‘ఆపరేషన్ వాలెంటైన్’.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ నటించిన లెలెస్ట్ మూవీ ‘ఆపరేషన్ వాలెంటైన్’. పుల్వామా దాడి నేపథ్యంలో తెరకెక్కిన ఈ చిత్రం మార్చి 1న ప్రేక్షకుల ముందుకు వచ్చి, మిక్స్డ్ టాక్ని సంపాదించుకుంది. తాజాగా ఈ మూవీ ఓటీటీలోకి వచ్చేసింది. ప్రముఖ ఓటీటీ ఫ్లాట్ఫామ్ అమెజాన్ ప్రైమ్ వీడియోలో ఈ చిత్రం స్ట్రీమింగ్ అవుతోంది. తెలుగు, తమిళంలో తెరకెక్కిన ఈ చిత్రానికి శక్తి ప్రతాప్ సింగ్ దర్శకత్వం వహించారు. మానుషి చిల్లర్ హీరోయిన్. నవదీప్, మిర్ సర్వర్, రుహానీ శర్మ కీలక పాత్రలు పోషించారు. ‘ఆపరేషన్ వాలెంటైన్’ కథేంటంటే..? అర్జున్ రుద్ర దేవ్ అలియాస్ రుద్ర(వరుణ్ తేజ్) భారతీయ వైమానిక దళంలో వింగ్ కమాండర్గా పని చేస్తుంటాడు. అక్కడే పని చేసే రాడార్ ఆఫీసర్ అహనా గిల్(మానుషి చిల్లర్)తో ప్రేమలో ఉంటాడు. అహనా చెప్పినా వినకుండా.. గగనవీధిలో అనేక ప్రయోగాలు చేస్తుంటాడు అర్జున్. అలా ఓ సారి ప్రాజెక్ట్ వజ్ర చేపట్టి.. తొలి ప్రయత్నంలోనే విఫలం అవుతాడు. ఈ ప్రయోగంలో తన ప్రాణ స్నేహితుడు వింగ్ కమాండర్ కబీర్(నవదీప్) ప్రాణాలు కోల్పోతాడు. దీంతో ఎయిర్ ఫోర్స్ అధికారులు ప్రాజెక్ట్ వజ్రను బ్యాన్ చేస్తారు. గాయాలను నుంచి కోలుకున్న రుద్ర.. 2019లో ఆపరేషన్ వాలెంటైన్ కోసం రంగంలోకి దిగుతాడు. అసలు ఆపరేషన్ వాలైంటైన్ లక్ష్యమేంటి? ఎందుకు చేపట్టాల్సి వచ్చింది? అర్జున్ రుద్ర తన టీమ్తో కలిసి పాకిస్తాన్ కళ్లు గప్పి ఆ దేశ బార్డర్ని క్రాస్ చేసి ఉగ్రవాదుల స్థావరాలను ఎలా ధ్వంసం చేశాడు? ప్రాజెక్ట్ వజ్ర లక్ష్యమేంటి? చివరకు అది సక్సెస్ అయిందా లేదా? అనేదే మిగతా కథ they risked it all to honour the fallen, witness the operation come alive!#OperationValentineOnPrime, watch nowhttps://t.co/4AlFuYMpRi pic.twitter.com/aOoAv4lHQa — prime video IN (@PrimeVideoIN) March 22, 2024 . -
నెల రోజుల్లోపే ఓటీటీకి మెగా హీరో యాక్షన్ థ్రిల్లర్.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ నటించిన బిగ్గెస్ట్ ఏరియల్ వార్ డ్రామా ఆపరేషన్ వాలెంటైన్ . శక్తి ప్రతాప్ సింగ్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో మానుషి చిల్లర్ హీరోయిన్గా నటించగా.. నవదీప్ కీలక పాత్ర పోపించాడు. మార్చి 1న తెలుగు,హిందీ భాషల్లో విడుదలై మిక్స్డ్ టాక్ను సొంతం చేసుకుంది. దేశంలోని వైమానిక దళ వీరుల అలుపెరుగని పోరాటం.. దేశాన్ని రక్షించడంలో వారు ఎదుర్కొంటున్న సవాళ్ల నేపథ్యంలో ‘ఆపరేషన్ వాలెంటైన్ రూపొందించారు. ఎయిర్ ఫోర్స్ నేపథ్యంలో వచ్చిన ఈ చిత్రంలో హీరో వరుణ్ తేజ్ ఇండియన్ ఎయిర్ పైలట్గా కనిపించారు. హీరోయిన్ మానుషీ చిల్లర్ రాడార్ ఆఫీసర్ పాత్రలో మెప్పించారు. పుల్వామా ఎటాక్ జరిగిన తర్వాత ప్రతీకారంగా ఇండియన్ ఎయిర్ఫోర్స్ అతిపెద్ద వైమానిక దాడిని ఈ చిత్రంలో చూపించారు.ఈ సినిమా తెలుగు, హిందీ రెండు భాషల్లోనూ థియేటర్లలో విడుదలైంది. అయితే తాజాగా ఈ చిత్రం ఓటీటీకి సంబంధించిన క్రేజీ అప్డేట్ వచ్చేసింది. ఈ సినిమా రిలీజైన నెల రోజుల్లోపే ఓటీటీలో సందడి చేయనుంది. ఇప్పటికే ఈ మూవీ హక్కులన అమెజాన్ ప్రైమ్ దక్కించకున్న సంగతి తెలిసిందే. ఈ ఫర్ఫెక్ట్ యాక్షన్ థ్రిల్లర్ మార్చి 29 నుంచి స్ట్రీమింగ్ కానన్నట్లు తెలుస్తోంది. అయితే దీనిపై ఇంకా అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. ఇదే తేదీ ఫిక్స్ అయితే ఈ మూవీ నెల రోజుల్లోపే ఓటీటీలో చూసేయొచ్చు. కాగా.. ఈ చిత్రంలో నవదీప్, పరేష్ పహుజా, రుహానీ శర్మ, అలీ రెజా ప్రధాన పాత్రల్లో కనిపించారు. #OperationValentine OTT RELEASE MARCH 29 @PrimeVideoIN pic.twitter.com/2RQAdlDuEq — OTTGURU (@OTTGURU1) March 9, 2024 -
'ఆపరేషన్ వాలెంటైన్' ఓటీటీలో ఎంట్రీ అప్పుడేనా..?
వరుణ్ తేజ్ హీరోగా శక్తి ప్రతాప్ సింగ్ హడా తెరకెక్కించిన చిత్రం 'ఆపరేషన్ వాలెంటైన్' మార్చి 1న విడుదలైన ఈ సినిమాను సోనీ పిక్చర్స్ ఇంటర్నేషనల్ ప్రొడక్షన్స్ సంస్థ నిర్మించింది. మానుషి చిల్లర్ ఇందులో కథానాయిక. ఈ మధ్య కాలంలో వరుణ్కు మంచి విజయాన్ని అందించిన ఈ చిత్రం త్వరలో ఓటీటీలోకి రానుంది. పుల్వామా ఎటాక్ వంటి నిజమైన సంఘటనల నుంచి ప్రేరణ పొంది ఈ దేశభక్తి చిత్రాన్ని మేకర్స్ రూపొందించారు. మన వైమానిక దళ వీరుల అసమానమైన ధైర్య సాహసాల్ని, దేశాన్ని రక్షించడంలో వారు ఎదుర్కొంటున్న సవాళ్లను దీంట్లో చక్కగా చూపించాడు దర్శకుడు. ఇందులో వరుణ్ తేజ్ ఇండియన్ ఎయిర్ పైలట్గా కనిపించగా.. మానుషి రాడార్ ఆఫీసర్గా మెప్పించింది. ఆపరేషన్ వాలంటైన్ సినిమా ఓటీటీ హక్కులను అమెజాన్ ప్రైమ్ వీడియోస్ మంచి ధరకే దక్కించుకుంది. ముందుగా చేసుకున్న ఒప్పందం ప్రకారం సినిమా రిలీజైన 30 రోజుల తర్వాత ఓటీటీలోకి రానుంది. అంటే మార్చి 29 నుంచి ఈ సినిమా ఓటీటీలో స్ట్రీమింగ్ కానున్నట్లు సమాచారం. ఒక వేళ ఆ తేదీలో కుదరకపోతే ఏప్రిల్ మొదటి వారంలో గ్యారెంటీగా అమెజాన్ ప్రైమ్లో స్ట్రీమింగ్ అవుతుందని తెలుస్తోంది. కానీ ఇప్పటి వరకు ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. తెలుగుతో పాటు దక్షిణాది భాషలకు సంబంధించి నెలలోపు స్ట్రీమింగ్ అవ్వొచ్చు. హిందీ వెర్షన్ మాత్రం ఎనిమిది వారాల తర్వాత ఉండనుందని సమాచారం. -
'ఆపరేషన్ వాలంటైన్' ఓటీటీ పార్ట్నర్ ఫిక్స్.. వచ్చేది అప్పుడేనా?
దేశభక్తి నేపథ్యంలో మెగాహీరో వరుణ్ తేజ్ నటించిన లేటెస్ట్ మూవీ 'ఆపరేషన్ వాలంటైన్'. గతంలో పలుమార్లు వాయిదా పడిన ఈ చిత్రం ఎట్టకేలకు థియేటర్లలోకి వచ్చేసింది. తెలుగు, హిందీ భాషల్లో రిలీజైపోయింది. గురువారం సాయంత్రమే ప్రీమియర్లు పడగా పాజిటివ్ టాక్ వచ్చింది. అలానే ఈ మూవీ ఓటీటీ పార్ట్నర్ కూడా ఎవరనేది తెలిసిపోయింది. ఇంతకీ ఏంటి సంగతి? (ఇదీ చదవండి: ‘ఆపరేషన్ వాలెంటైన్’ సినిమా రివ్యూ) మెగాహీరోల్లో డిఫరెంట్ సినిమాలు చేస్తూ వరుణ్ తేజ్ గుర్తింపు తెచ్చుకుంటున్నాడు. హిట్ ఫ్లాప్ సంగతి పక్కనబెడితే ఒక్కో చిత్రం భిన్నంగా ఉండేలా ప్లాన్ చేసుకుంటున్నాడు. అలా పుల్వామా దాడి, భారత్-పాక్ వైరం తదితర అంశాలతో తీసిన చిత్రమే 'ఆపరేషన్ వాలంటైన్'. దేశభక్తి సినిమాలు ఇష్టపడే వాళ్లకు ఈ సినిమా నచ్చేస్తుంది. మిగతా వాళ్లకు మాత్రం నచ్చడం నచ్చకపోవడం అనేది చెప్పలేం. ఇకపోతే 'ఆపరేషన్ వాలంటైన్' సినిమా డిజిటల్ హక్కుల్ని భారీ ధరకు అమెజాన్ ప్రైమ్ వీడియో దక్కించుకుంది. అయితే నాలుగు వారాల డీల్ మాట్లాడుకున్నారని తెలుస్తోంది. అంటే ఏప్రిల్ తొలి వారంలో ఈ చిత్రం ఓటీటీలోకి రావొచ్చని సమాచారం. తెలుగుతో పాటు దక్షిణాది భాషలకు సంబంధించి నెలలోపు స్ట్రీమింగ్ అవ్వొచ్చు. హిందీ వెర్షన్ మాత్రం ఎనిమిది వారాల తర్వాత ఉండనుందని సమాచారం. (ఇదీ చదవండి: యాంకర్ను పెళ్లి చేసుకున్న టాలీవుడ్ డైరెక్టర్) -
‘ఆపరేషన్ వాలెంటైన్’ రివ్యూ
టైటిల్: ఆపరేషన్ వాలెంటైన్ నటీనటులు: వరుణ్ తేజ్, మానుషి చిల్లర్, నవదీప్, మిర్ సర్వర్, రుహానీ శర్మ తదితరులు నిర్మాతలు: సోనీ పిక్చర్స్, సందీప్ ముద్ద దర్శకత్వం: శక్తి ప్రతాప్ సింగ్ హడా సంగీతం: మిక్కీ జే మేయర్ సినిమాటోగ్రఫీ:హరి కె. వేదాంతం ఎడిటర్: నవీన్ నూలి విడుదల తేది: మార్చి 1, 2024 కథేంటంటే.. అర్జున్ రుద్ర దేవ్ అలియాస్ రుద్ర(వరుణ్ తేజ్) భారతీయ వైమానిక దళంలో వింగ్ కమాండర్గా పని చేస్తుంటాడు. అక్కడే పని చేసే రాడార్ ఆఫీసర్ అహనా గిల్(మానుషి చిల్లర్)తో ప్రేమలో ఉంటాడు. అహనా చెప్పినా వినకుండా.. గగనవీధిలో అనేక ప్రయోగాలు చేస్తుంటాడు అర్జున్. అలా ఓ సారి ప్రాజెక్ట్ వజ్ర చేపట్టి.. తొలి ప్రయత్నంలోనే విఫలం అవుతాడు. ఈ ప్రయోగంలో తన ప్రాణ స్నేహితుడు వింగ్ కమాండర్ కబీర్(నవదీప్) ప్రాణాలు కోల్పోతాడు. దీంతో ఎయిర్ ఫోర్స్ అధికారులు ప్రాజెక్ట్ వజ్రను బ్యాన్ చేస్తారు. గాయాలను నుంచి కోలుకున్న రుద్ర.. 2019లో ఆపరేషన్ వాలెంటైన్ కోసం రంగంలోకి దిగుతాడు. అసలు ఆపరేషన్ వాలైంటైన్ లక్ష్యమేంటి? ఎందుకు చేపట్టాల్సి వచ్చింది? అర్జున్ రుద్ర తన టీమ్తో కలిసి పాకిస్తాన్ కళ్లు గప్పి ఆ దేశ బార్డర్ని క్రాస్ చేసి ఉగ్రవాదుల స్థావరాలను ఎలా ధ్వంసం చేశాడు? ప్రాజెక్ట్ వజ్ర లక్ష్యమేంటి? చివరకు అది సక్సెస్ అయిందా లేదా? అనేది తెలియాలంటే థియేటర్స్లో ‘ఆపరేషన్ వాలెంటైన్’ చూడాల్సిందే. ఎలా ఉందంటే.. 2019 ఫిబ్రవరి 14న జరిగిన పుల్వామా దాడిని దేశం ఇప్పటికి మర్చిపోలేదు. ఈ దాడిలో 40 మందికిపైగా భారతీయ జవాన్లు వీర మరణం పొందారు. దీనికి ప్రతీకారంగా భారత్ బాల్కోట్ స్ట్రైక్ నిర్వహించి సక్సెస్ అయింది. ఈ ఘటనల ఆధారంగానే దర్శకుడు శక్తి ప్రతాప్ సింగ్ ‘ఆపరేషన్ వాలెంటైన్’ తెరకెక్కించాడు. ఇందులో దేశ రక్షణ కోసం వైమానిక దళం ఎలా పని చేస్తుంది అనేది కళ్లకు కట్టినట్లు చూపించారు. వాస్తవానికి వేరే దేశంతో యుద్ధం అనగానే అందరికి సైనిక దళమే గుర్తొస్తుంది. కానీ వారితో పాటు నావిక, వైమానిక దళం కూడా దేశ రక్షణ కోసం పని చేస్తుందనే విషయం చాలా మందికి తెలియకపోవచ్చు. నావిక, వైమానిక దళాలపై సినిమాలు కూడా పెద్దగా రాలేదు. కానీ బాలాకోట్ ఎయిర్ స్ట్రైక్ తర్వాత మన వైమానిక దళం గొప్పదనం ప్రపంచానికి మొత్తం తెలిసింది. గనతలంలో వాళ్లు చేసే పోరాటల గురించి అంతా చర్చించుకున్నారు. బాలీవుడ్లో ఆ నేపథ్యంతో సినిమాలు వచ్చాయి. ఇప్పటికీ వస్తూనే ఉన్నాయి. ఈ మధ్యే ‘ఫైటర్’ అనే సినిమా కూడా ఇదే కాన్సెప్ట్తో వచ్చి..బాక్సాఫీస్ వద్ద బోల్తాపడింది. ఆపరేషన్ వాలెంటైన్ కాన్సెప్ట్ కూడా అలాంటిదే. అయితే ఇలాంటి నేపథ్యంతో తెలుగులో వచ్చిన మొట్టమొదటి సినిమా ‘ఆపరేషన్ వాలెంటైన్ ’ అనే చెప్పొచ్చు. తక్కువ బడ్జెట్(రూ.42 కోట్లు అని సమాచారం) ఇంత రిచ్గా సినిమాను తెరకెక్కించిన దర్శకుడుని అభినందించాల్సిందే. అయితే ఇలాంటి సినిమాల్లో ఎమోషన్స్ చాలా ముఖ్యం. ఆపరేషన్ వాలెంటైన్లో అది మిస్ అయింది. దేశం మొత్తాన్ని కుదిపేసిన పుల్వామా దాడిని మరింత ఎమోషనల్గా, ప్రతి ఒక్క ప్రేక్షకుడికి కనెక్ట్ అయ్యేలా చూపిస్తే బాగుండేదేమో. అలా అని ఎమోషన్ పూర్తిగా పండలేదని చెప్పలేం. దాడిలో ఓ సైనికుడు తన ప్రాణాన్ని అడ్డు పెట్టి చిన్నారిని కాపాడిన సీన్ ప్రతి ఒక్కరిని ఆకట్టుకుంటుంది. ఆ తరహా ఎమోషనల్ సీన్స్ కొచ్చి చోట్ల ఉంటే సినిమా మరింత కనెక్ట్ అయ్యేది. దర్శకుడు వైమానిక దళ సైనికుల ఆపరేషన్స్, సాహసాలపైనే ఎక్కువ ఫోకస్ పెట్టాడు. చాలా సహజంగా వాటిని తెరపై చూపించాడు కానీ కథలోని డ్రామాని మాత్రం తెరపై సరిగా పండించలేకపోయాడు.ప్రాజెక్ట్ వజ్రతో కథను ప్రారంభించాడు. ఆ ఒక్క సీన్తోనే హీరో పాత్ర ఎలాంటిదో తెలియజేశాడు. ఫస్టాప్ అంతా పైలెట్ల టెస్ట్, హీరో హీరోయిన్ల మధ్య ప్రేమ చుట్టునే తిరుగుతుంది. అయితే ప్రేమ కథలో గాఢత తగ్గినట్లు అనిపిస్తుంది. ఇంటర్వెల్ సీన్ సెకండాఫ్పై ఆసక్తిని పెంచుతుంది. అసలు కథంతా సెకండాఫ్లోనే ఉంటుంది. పాకిస్తాన్పై మన సైనికులు దాడి చేసే సన్నివేశాలను అద్భుతంగా తీర్చిదిద్దాడు. పాకిస్తాన్ చేపట్టిన ఆపరేషన్ నెహ్రుని తిప్పికొట్టేందుకు హీరో చేసే సాహసం.. చివరల్లో ఆపరేషన్ వజ్రని ప్రయోగించడం ప్రతీది.. ఆకట్టుకుంటుంది. మన సైనికుల ధైర్యసాహసాలను గుర్తు చేసుకుంటూ థియేటర్స్ని నుంచి బయటకు వస్తారు. ఎవరెలా చేశారంటే.. అర్జున్ రుద్ర దేవ్ పాత్రలో వరుణ్ తేజ్ ఒదిగిపోయాడు. తెరపై నిజమైన వింగ్ కమాండర్గానే కనిపించాడు. ఆయన బాడీ లాంగ్వెజ్, మాటలు ప్రతీది నిజమైన సైనికుడినే గుర్తు చేస్తుంది. సినిమా కోసం ఆయన పడిన కష్టమంతా తెరపై కనిపించింది. ఇక రాడార్ ఆఫీసర్ అహనా గిల్గా మానుషిచిల్లర్ అద్భుతంగా నటించింది. సినిమాలో తన పాత్రను మంచి ప్రాధాన్యత ఉంటుంది. అయితే హీరోహీరోయిన్ల మధ్య ఆన్ స్క్రీన్ కెమిస్ట్రీ మాత్రం అంతగా వర్కౌట్ కాలేదు. కబీర్గా నవదీప్ ఒకటి రెండు సన్నివేశాల్లోనే కనిపించాడు. ఆయన పాత్రకు డైలాగ్స్ కూడా లేవు. మిర్ సర్వర్, రుహానీ శర్మతో పాటు మిగిలిన నటీనటులు తమ పాత్రల పరిధి మేర నటించారు. సాంకేతిక పరంగా సినిమా ఉన్నతంగా ఉంది. మిక్కి జే మేయర్ నేపథ్య సంగీతం సినిమా స్థాయిని పెంచింది. వందేమాతరం సాంగ్ ఆకట్టుకుంటుంది. హరి కె. వేదాంతం సినిమాటోగ్రఫీ బాగుంది. ప్రతి సీన్ చాలా రిచ్గా చిత్రీకరించాడు. ఎడిటింగ్ పర్వాలేదు. నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్లు ఉన్నతంగా ఉన్నాయి.
Pagination
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధర్వంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
తప్పక చదవండి
- వరల్డ్కప్కు వెస్టిండీస్ జట్టు ప్రకటన.. విధ్వంసకర ఆటగాళ్లకు ఛాన్స్
- గుర్తుపట్టలేనంతగా మారిపోయిన టాలీవుడ్ స్టార్ హీరోయిన్
- ICC: నంబర్ వన్గా ఆసీస్.. అందులో మాత్రం టీమిండియానే టాప్
- కోర్టు పెండింగ్లో ఉన్న కేసు గురించి ఎలా మాట్లాడతారు?
- మద్యం పాలసీ కేసు.. మనీష్ సిసోడియాకు ఊరట
- ‘రాహుల్, లాలూ యాదవ్ పేరుందని పోటీ చేయకుండా ఆపలేం’
- ఎక్కువ జీతం కోసం ఎదురు చూస్తున్నారా? అయితే ఇది మీకోసమే
- గేల్, డివిలియర్స్ కాదు.. అతడంటే నాకు వణుకు: గంభీర్
- 'సలార్' పరిస్థితి మరీ ఇంత దారుణమా.. కారణం అదేనా?
- Kushitha Kallapu: ఆరెంజ్ ఆర్మీ విన్తో ‘ఖుషీ’ అవుతున్న ఈ గ్లామర్ లుక్స్ ఎవరివి? (ఫోటోలు)
Advertisement