-
నష్టాల్లో ఇన్ఫోసిస్.. ఆ ఒక్కటే కారణమా..!
ప్రముఖ టెక్ దిగ్గజం 'ఇన్ఫోసిస్' (Infosys) కంపెనీ షేర్లు గత ఐదు రోజుల నుంచి తగ్గుముఖం పట్టాయి. ఈ రోజు కూడా సంస్థ షేర్స్ రెండు శాతం తగ్గినట్లు తెలుస్తోంది. కంపెనీ షేర్స్ తగ్గడానికి కారణం ఏంటి, మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. నిజానికి డిసెంబర్ 22 సాయంత్రం మెమోరండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్ (MoU) రద్దు చేసుకున్నట్లు ఇన్ఫోసిస్ కంపెనీ ప్రకటించిన తర్వాత సంస్థ షేర్లు పతనమవ్వడం స్టార్ట్ అయ్యింది. అయితే ఈ ప్రకటన ముందు వరకు దూసుకెళ్లిన షేర్లు ఒక్కసారిగా పడిపోవడం చాలా మందిని ఆశ్చర్యానికి గురయ్యేలా చేసింది. మూడు రోజుల వరుస సెలవుల తర్వాత డిసెంబర్ 26న(మంగళవారం) కంపెనీ ట్రేడింగ్ ప్రారంభమయ్యే సమయానికి స్టాక్ రూ. 1,534 స్థాయికి పడిపోయింది. ట్రేడింగ్ ముగిసే సమయానికి కొంత తేరుకుని 1.08 శాతం నష్టంతో రూ. 1546 వద్ద నిలిచింది. ఇదీ చదవండి: అప్పులపాలు.. యంత్రాలన్నీ తుప్పుపట్టి పనికిరాని దశలో.. టాటా రాకతో అంతా తారుమారు! ఇన్ఫోసిస్ కంపెనీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సొల్యూషన్స్ కోసం కుదుర్చుకున్న అవగాహన ఒప్పందాన్ని (MOU) సదరు కంపెనీ రద్దు చేసుకుందని ఇన్ఫోసిస్ వెల్లడించింది. దీంతో సంస్థ చేసుకున్న 1.5 బిలియన్ డాలర్లు లేదా సుమారు రూ.12 వేల కోట్ల డీల్ క్యాన్సిల్ అయింది. ఈ కారణంగానే కంపెనీ షేర్స్ ప్రస్తుతం తగ్గు ముఖం పట్టినట్లు స్పష్టమవుతోంది. -
కొత్త విభాగంలో అడుగెట్టిన ఫోన్పే - వివరాలు
బెంగళూరు: ఫిన్టెక్ సంస్థ ఫోన్పే తాజాగా స్టాక్ బ్రోకింగ్ విభాగంలోకి ప్రవేశించింది. షేర్డాట్మార్కెట్ పేరిట ప్రత్యేక ప్లాట్ఫాంను ప్రారంభించింది. బీఎస్ఈ ఎండీ సుందరరామన్ రామమూర్తి బుధవారం దీన్ని ఆవిష్కరించారు. ప్రాథమికంగా స్టాక్స్, ఈటీఎఫ్లతో ప్రారంభించి క్రమంగా ఫ్యూచర్స్, ఆప్షన్స్ తదితర సెగ్మెంట్స్ను కూడా ఇందులో అందుబాటులోకి తేనుంది. దీనికి ఉజ్వల్ జైన్ సీఈవోగా వ్యవహరిస్తారు. స్టాక్ బ్రోకింగ్ సెగ్మెంట్లోకి ఎంట్రీ ద్వారా తమ ఆర్థిక సేవల పోర్ట్ఫోలియో సంపూర్ణమైందని ఫోన్పే వ్యవస్థాపకుడు, సీఈవో సమీర్ నిగమ్ తెలిపారు. మరోవైపు, 2025 నాటికల్లా ఫోన్పే నిర్వహణ లాభాలను సాధించే అవకాశం ఉందని సమీర్ నిగమ్ తెలిపారు. -
ఓనర్ ఆస్తుల గురించి ఎవరికీ తెలియని విషయాలు..!
-
రామోజీ, శైలజకు సీఐడీ నోటీసులు
సాక్షి, అమరావతి: మార్గదర్శి చిట్ఫండ్స్ ప్రైవేట్ లిమిటెడ్ అక్రమ వ్యవహారాలకు సంబంధించిన కేసులో విచారించేందుకు సంస్థ చైర్మన్ చెరుకూరి రామోజీరావు, ఎండీ చెరుకూరి శైలజకు సీఐడీ అధికారులు నోటీసులు జారీ చేశారు. దర్యాప్తులో భాగంగా రామోజీరావు, శైలజను విచారించాల్సిన అవసరం ఉందని నిర్ధారించిన సీఐడీ వారిద్దరిని ఈ నెల 29న గానీ 31న గానీ లేదా ఏప్రిల్ 3న గానీ 6న గానీ విచారించాలని నిర్ణయించింది. ఈ నేపథ్యంలో ముందుగా సమాచారం అందజేస్తూ వారికి అనువైన తేదీని తెలియచేయాలని సూచించింది. రామోజీరావు, శైలజ వారి నివాసంలోగానీ కార్యాలయంలోగానీ విచారణకు హాజరు కావాలని సీఐడీ నోటీసుల్లో పేర్కొంది. చిట్ఫండ్ చట్టం నిబంధనలను ఉల్లంఘించి నిధులు మళ్లించడంపై ఏ–1గా రామోజీరావు, ఏ–2గా శైలజతోపాటు మార్గదర్శి చిట్ఫండ్స్ మేనేజర్లపై సీఐడీ అధికారులు ఇప్పటికే కేసులు నమోదుచేసిన విషయం తెలిసిందే. మార్గదర్శి చిట్ఫండ్స్ కార్యాలయాల్లో సీఐడీ అధికారులు విస్తృతంగా నిర్వహించిన తనిఖీల్లో అక్రమాలు వెలుగులోకి వచ్చాయి. చిట్ఫండ్ చట్టానికి విరుద్ధంగా చందాదారుల సొమ్మును మ్యూచువల్ ఫండ్స్, షేర్ మార్కెట్లలో పెట్టుబడులుగా పెట్టడం, ఆర్బీఐ నిబంధనలకు విరుద్ధంగా డిపాజిట్లు సేకరిస్తున్నట్లు ఆధారాలతో సహా వెల్లడైంది. ఈ నేపథ్యంలో ఐపీసీ సెక్షన్లు 420, 409, 120 బి, 477 రెడ్విత్ 34, కేంద్ర చిట్ఫండ్స్ చట్టం–1982, ఆర్థిక సంస్థల రాష్ట్ర డిపాజిట్దారుల హక్కుల పరిరక్షణ చట్టం కింద ఎఫ్ఐఆర్ నమోదైంది. ఈ కేసులో సీఐడీ అధికారులు నలుగురు మార్గదర్శి చిట్ఫండ్స్ మేనేజర్లను అరెస్టు చేశారు. అదో ఆర్థిక నేర సామ్రాజ్యం... మార్గదర్శి చిట్ఫండ్స్లో చందాదారుల సొమ్మును చట్ట విరుద్ధంగా మళ్లించడం ద్వారా రామోజీరావు యథేచ్ఛగా ఆర్థిక నేరాలకు పాల్పడ్డారు. కేంద్ర ప్రభుత్వ చిట్ఫండ్స్ చట్టం–1982, రిజర్వ్బ్యాంకు చట్టం, ఏపీ ఆర్థిక సంస్థల డిపాజిట్దారుల హక్కుల పరిరక్షణ చట్టాలను ఉల్లంఘించారు. మార్గదర్శి చిట్ ఫండ్స్ సంస్థ బ్రాంచి కార్యాలయాల్లో స్టాంపులు–రిజిస్ట్రేషన్ల శాఖ గత ఏడాది అక్టోబర్, నవంబర్ నెలల్లో, హైదరాబాద్లోని ప్రధాన కార్యాలయంలో డిసెంబరులో నిర్వహించిన సోదాలతో ఈ అక్రమాల బాగోతం బట్టబయలైంది. సొమ్ములు రాష్ట్రంలోని చందాదారులవి కాగా ఆర్థిక ప్రయోజనాలు మాత్రం పొరుగు రాష్ట్రంలో మకాం వేసిన రామోజీరావువని వెల్లడైంది. రాష్ట్ర చందాదారుల కష్టార్జితానికి రక్షణ లేదని గుర్తించిన స్టాంపులు–రిజిస్ట్రేషన్ల శాఖ దీనిపై సీఐడీకి ఫిర్యాదు చేసింది. ఈ క్రమంలో విశాఖపట్నం, రాజమహేంద్రవరం, ఏలూరు, విజయవాడ, గుంటూరు, నరసరావుపేట, అనంతపురంలోని మార్గదర్శి చిట్ ఫండ్స్ కార్యాలయాల్లో సీఐడీ నిర్వహించిన సోదాల్లో మరిన్ని అక్రమాలు బయటపడ్డాయి. మరోవైపు స్టాంపులు– రిజిస్ట్రేషన్ల శాఖ ప్రత్యేకంగా ఓ చార్టెడ్ అకౌంటెంట్ ద్వారా మార్గదర్శి చిట్ ఫండ్స్ ఆర్థిక నివేదిక (ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్)లను పరిశీలించగా పలు అక్రమాలు వెలుగులోకి వచ్చాయి. ఎంతోమంది చందాదారులు తాము మోసపోయినట్లు సీఐడీకి ఫిర్యాదులు చేస్తున్నారు. మనీలాండరింగ్కు పాల్పడి¯] ట్లు తేలడంతో ఈ అంశంపై దర్యాప్తు చేయాలని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ)కు సీఐడీ నివేదించింది. మార్గదర్శిలో గుర్తించిన అక్రమాలు ఇవీ.. అక్రమ డిపాజిట్లు.. రిజర్వ్ బ్యాంకు నిబంధనలకు విరుద్ధంగా మార్గదర్శి చిట్ఫండ్స్ అక్రమ డిపాజిట్లను సేకరిస్తోంది. చందాదారులు పాడిన చిట్ మొత్తాన్ని వారికి వెంటనే చెల్లించడం లేదు. ఆ మొత్తంపై 4 శాతం నుంచి 5 శాతం వరకు చందాదారుడికి వడ్డీ చెల్లిస్తామని చెబుతూ ఓ రశీదు ఇస్తున్నారు. అంటే మార్గదర్శి సంస్థ ఆ చిట్ మొత్తాన్ని డిపాజిట్గా స్వీకరిస్తున్నట్టే. చిట్ఫండ్ కంపెనీలు డిపాజిట్లు స్వీకరించడాన్ని చట్టం నిషేధించింది. అయినప్పటికీ మార్గదర్శి చిట్ ఫండ్స్ సంస్థ నిబంధనలకు విరుద్ధంగా ‘ ప్రత్యేక రశీదు’ ముసుగులో డిపాజిట్లు సేకరించింది. గతంలో కూడా మార్గదర్శి ఫైనాన్షియర్స్ పేరిట రూ.15 వేల కోట్ల అక్రమ డిపాజిట్లు సేకరించిన చరిత్ర రామోజీరావుది. అదే తరహాలో ప్రస్తుతం మార్గదర్శి చిట్ఫండ్స్ ముసుగులో అక్రమ డిపాజిట్లు సేకరిస్తున్నారు. నిధుల మళ్లింపు.. అక్రమ పెట్టుబడులు చిట్ఫండ్ చట్టానికి విరుద్ధంగా రామోజీరావు చందాదారుల సొమ్మును అక్రమ పెట్టుబడులకు మళ్లించారు. మార్గదర్శి చిట్ ఫండ్స్ కార్యాలయాల నుంచి భారీగా నిధులను మార్గదర్శి ప్రధాన కార్యాలయానికి బదిలీ చేశారు. ఆ నిధులను మార్గదర్శి యాజమాన్యం మార్కెట్ రిస్క్ అత్యధికంగా ఉండే మ్యూచువల్ ఫండ్స్లో పెట్టుబడిగా పెట్టింది. మార్గదర్శి చిట్స్ ప్రైవేట్ లిమిటెడ్–చెన్నై, మార్గదర్శి చిట్స్ (కర్ణాటక) ప్రైవేట్ లిమిటెడ్–బెంగళూరు, ఉషాకిరణ్ మీడియా ప్రైవేట్ లిమిటెడ్– హైదరాబాద్లను అనుబంధ కంపెనీలుగా చూపిస్తూ నిధులను అక్రమంగా మళ్లించారు. ఆ మూడు అనుబంధ కంపెనీల్లో రూ.1,05,80,000 పెట్టుబడి పెట్టినట్టు బ్యాలెన్స్ షీట్లో చూపించారు. అయితే ఆ కంపెనీల షేర్ హోల్డర్స్ జాబితా పరిశీలించగా ఒక్క ఉషా కిరణ్ మీడియా ప్రైవేట్ లిమిటెడ్లోనే 88.5 శాతం వాటాతో రూ.2 కోట్లు పెయిడ్ అప్ క్యాపిటల్గా పెట్టుబడి పెట్టినట్లు నిర్ధారణ అయ్యింది. బ్యాలన్స్ షీట్లో నోట్ నంబర్ 7 కింద రూ.459.98 కోట్లు చూపించారు. అయితే ఆ మొత్తాన్ని నిబంధనలకు విరుద్ధంగా మ్యూచువల్ ఫండ్స్లో పెట్టుబడి పెట్టినట్టు పరిశీలనలో వెల్లడైంది. అందుబాటులో ఉన్న కొన్ని బ్యాంకు ఖాతాలను పరిశీలించగా ఐసీఐసీఐ ప్రుడెని్షయల్ మ్యూచువల్ ఫండ్స్లో మూడుసార్లు రూ.29 కోట్లు, రూ.10 కోట్లు, రూ.8 కోట్లు చొప్పున, ఎడెల్వైసీస్ ఆర్బిట్రేడ్ ఫండ్స్లో రూ.10 కోట్లు చొప్పున నిబంధనలకు విరుద్ధంగా పెట్టుబడులు పెట్టినట్లు వెల్లడైంది. పూర్తి బ్యాంకు ఖాతాలను పరిశీలిస్తే ఇంకా ఎన్ని పెట్టుబడులు పెట్టారో తెలుస్తుంది. పోంజీ తరహా మోసం.. రామోజీరావు పోంజీ (గొలుసుకట్టు) తరహా మోసాలకు పాల్పడుతున్నారు. మార్గదర్శి సంస్థ చిట్టీలలో 30 శాతం నుంచి 40 శాతం టికెట్లు (సభ్యత్వాలు) యాజమాన్యం పేరిట ఉంచు తోంది. ఆ టికెట్లకు చెల్లించాల్సిన చందాలను చెల్లించడం లేదు. ఇతర చందాదారులు చెల్లించిన చందాలను తాము చెల్లించినట్లు రికార్డుల్లో చూపిస్తోంది. వాటిపై మళ్లీ 5 శాతం కమీషన్ తీసుకుంటోంది. చందాదారుల సొమ్మును వ్యక్తిగత ప్రయోజనాలకు వాడుకుంటోంది. చందాదారుల హక్కులకు విఘాతం రాష్ట్రంలో మార్గదర్శి చిట్ఫండ్స్ తమ బ్రాంచిల్లో చందాదారులు చెల్లించిన మొత్తాలను నిబంధనలకు విరుద్ధంగా పక్క రాష్ట్రానికి తరలించింది. మార్గదర్శి చిట్ ఫండ్స్ మేనేజర్లకు (ఫోర్మేన్) చట్టప్రకారం ఉండాల్సిన చెక్ పవర్తో సహా ఎలాంటి అధికారాలు లేవు. బ్యాంకు వ్యవహారాలు, చెక్ పవర్ అంతా హైదరాబాద్లోని మార్గదర్శి చిట్ఫండ్స్ ఎండీ శైలజతోపాటు ఆ సంస్థ ప్రధాన కార్యాలయంలోని 11 మందికే ఉంది. రాష్ట్రంలో చందాదారులు చెల్లించిన మొత్తానికి బాధ్యులెవరని ప్రశ్నిస్తే సమాధానమే లేదు. -
కోట్లు వచ్చేలా చేస్తాం.. రెండు గంటల్లో రూ.65 లక్షలు స్వాహా!
హిమాయత్నగర్: షేర్ మార్కెట్పై నగర వాసికి ఉన్న మక్కువను క్యాష్ చేసుకున్నారు సైబర్ నేరగాళ్లు. ఆయన అకౌంట్ను హ్యాక్ చేసి తెలియకుండా అతి తక్కువ ధరకు షేర్స్ను అమ్మేశారు. మళ్లీ షేర్ హోల్డర్తోనే ఎక్కువ రేట్కు షేర్స్ను కొనుగోలు చేపించి రూ.లక్షలు నష్టపోయేలా చేయడంతో.. బాధితుడు శుక్రవారం సిటీసైబర్క్రైం ఏసీపీ కేవీఎం ప్రసాద్ను కలిసి ఫిర్యాదు చేశాడు. వివరాల్లోకి వెళితే.. నల్లకుంటకు చెందిన హరీష్చంద్రారెడ్డి కొంతకాలంగా షేర్ మార్కెట్ బిజినెస్ చేస్తున్నాడు. షేర్స్ను కొనుగోలు చేసి ఎల్ఐఎస్బ్లూ ఫైనాన్షియల్ త్రూ అమ్మడం, కొనడం చేస్తుంటాడు. ఈ క్రమంలో పరిచయం అయిన సైబర్ కేటుగాళ్లు హరీష్చంద్రారెడ్డి అకౌంట్ను హ్యాక్ చేశారు. రూ.700 విలువ గల షేర్స్ను కేవలం రూ.100కు ఇతరులకు అమ్మేశారు. ఈ విషయం తెలుసుకున్న హరీష్చంద్రారెడ్డి వెబ్సైట్లో ఉన్న వారిని ప్రశ్నించగా.. కోట్లు వచ్చేలా చేస్తామని నమ్మించారు. లాభాలు లేని వాటిని రూ.700–800 చొప్పున కొనుగోలు చేయించారు. ఇలా పలు దఫాలుగా కేవలం రెండు గంటల్లో రూ.65 లక్షలు స్వాహా చేశారు. మోసపోయినట్లు గుర్తించిన హరీష్చంద్రారెడ్డి సైబర్ క్రైం పోలీసులను ఆశ్రయించాడు. మీ డబ్బంతా ఏజెంట్ తినేశాడంటూ.. వృద్ధుడికి రూ.25లక్షలు టొకరా ఇన్సురెన్స్ ఎక్స్పైరీ అయినా సరే..సైబర్ కేటుగాళ్లు మాత్రం అమాయకుల్ని వదలట్లేదు. మీకు రావాల్సిన దానికంటే తక్కువ డబ్బును పొందారు. మీకేం బాధ అనిపించడం లేదా అంటూ సింపతితో లక్షలు కాజేశారు. కుల్సుంపురాకు చెందిన వృద్ధుడు రెండు సంస్థల్లో ఇన్సురెన్స్ చేశాడు. అది చాలా కాలం క్రితం ఎక్స్పైరీ కూడా అయ్యింది. తాజాగా రెండు రోజుల క్రితం ఓ వ్యక్తి కాల్ చేసి ఆధార్, పాన్, బ్యాంక్ డిటైల్స్ తీసుకున్నాడు. కొంత డబ్బు కట్టాలనడంతో వృద్ధుడు చెల్లించాడు. రూ.3 లక్షలు వస్తాయని నమ్మించి పలు దఫాలుగా అతడి నుంచి రూ.25లక్షలు కాజేశారు. దీంతో బాధితుడు శుక్రవారం సిటీసైబర్ క్రైం పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఏసీపీ కేవీఎం ప్రసాద్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. చదవండి: దేవుడా క్షమించు నీ హుండీ ఎత్తుకెళ్తున్నా!.. వీడియో వైరల్
Pagination
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
కాంగ్రెస్కు పాకిస్తాన్ మద్దతు ఉంది: అనురాగ్ ఠాకూర్
టాలీవుడ్ హీరో డ్రీమ్ ప్రాజెక్ట్.. రెబల్ స్టార్ ఎంట్రీ!
ఇరాన్ నుంచి పారిపోయి కొచ్చికి భారత మత్స్యకారులు
పాఠశాల నేపథ్యంలో వస్తోన్న సత్య.. ఆసక్తిగా ట్రైలర్!
Best Pictures Of The Day : ఈ రోజు ఉత్తమ చిత్రాలు (06-05-2024)
Video: కేసీఆర్ బస్సును తనిఖీ చేసిన ఎన్నికల అధికారులు
'దేవర' షూటింగ్లో తేనెటీగల కలకలం.. 20 మందికి గాయాలు
ఎస్ఆర్హెచ్తో ముంబై కీలక పోరు.. కొత్త ప్లేయర్ ఎంట్రీ
వారితో భయంకరమైన అనుభవాలు ఎదుర్కొన్నా: హీరామండి నటి
కేజ్రీవాల్కు మరో షాక్.. ‘ఎల్జీ’ సంచలన నిర్ణయం
తప్పక చదవండి
- అలా చేస్తే ఆ కిక్కే వేరు! అతడితో లవ్లో ఉన్నా: నటి
- సూపర్ మచ్చీ.. ఇలాంటి గ్రూపు డ్యాన్స్ మీరెపుడైనా చూశారా?
- డైరెక్టర్తో హీరోయిన్ పెళ్లి.. మామయ్యను మండపానికి రానివ్వలేదట!
- మాచర్లలో సీఎం జగన్ ప్రచారం.. పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)
- పూంచ్ ఉగ్రదాడి.. టెర్రరిస్టులపై రూ.20 లక్షల రివార్డు
- కాంగ్రెస్ కీలక నిర్ణయం: బరిలోకి మాజీ ముఖ్యమంత్రులు
- ‘SRH కాదు.. పరుగుల విధ్వంసానికి మారు పేరు ఆ జట్టే’
- సమ్మర్లో కొబ్బరిబోండంలోని నీటిని నేరుగా తాగేస్తున్నారా..?
- చంద్రబాబు మోసాల చరిత్రను గుర్తు తెచ్చుకోండి: సీఎం జగన్
- కల్వకుంట్ల కవితకు బిగ్ షాక్
Advertisement