-
రిజర్వేషన్లను తొలగించే కుట్ర జరుగుతోంది: నిర్మల్ సభలో రాహుల్
సాక్షి, నిర్మల్: దేశంలో రాజ్యాంగాన్ని రద్దు చేసే కుట్ర జరుగుతోందని మండిపడ్డారు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ. రిజర్వేషన్లు కూడా తొలగించే ప్రమాదం ఉందన్నారు. ఇండియా కూటమి ప్రజాస్వామ్యాన్ని కాపాడే సమూహమని తెలిపారు. నిర్మల్లో కాంగ్రెస్ జన జాతర భారీ బహరంగ సభ ఏర్పాటుచ ఏసింది. ఈ సబకు రాహుల్ గాంధీ, సీఎం రేవంత్, మంత్రి సీతక్క తదితరులు హాజరయ్యారు.ఈ సందర్భంగా రాహుల్ మాట్లాడుతూ.. తెలంగాణ ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేస్తున్నామన్నారు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణాన్ని కల్పించామని చెప్పారు. ఆదివాసీ అంటే భూమిపై హక్కులు కలిగిన మొదటి వ్యక్తులు అని అర్థమన్న ఆయన.. ఆదివాసీలకు అన్ని హక్కులు కల్పిస్తామని హామీ ఇచ్చారు. తెలంగాణలో ఉన్న ప్రజా ప్రభుత్వం.. కేంద్రంలో కూడా ఏర్పడబోతోందన్నారు రాహల్ గాంధీ.కాంగ్రెస్ అధికారంలోకి రాగానే.. ఉపాధి హామీ పథకం ద్వారా రోజుకు రూ. 400 ఇస్తామని తెలిపారు.కాంగ్రెస్ దేశంలో కులగణను చేపట్టబోతుందని, కులగణనతో దేశంలో రాజకీయ ముఖచిత్రం మారబోతుందని అన్నారు. ఏ వర్గం వారి దగ్గర ఎంత సొమ్ము ఉందో తెలుసుకోబోతున్నామని చెప్పారు. రిజర్వేషన్లకు మోదీ వ్యతిరేకమని మండిపడ్డారు. 50 శాతం ఉన్న రిజర్వేషన పరిమితికి కాంగ్రెస్ వ్యతిరేకమని స్పష్టం చేశారు. రిజర్వేషన్లు తీసేయడానికే ప్రభుత్వ రంగ సంస్థల్ని ప్రైవేటుపరం చేస్తున్నారని విమర్శించారు. ప్రవైవేటీకరణ అంటేను రిజర్వేషన్లను తొలగించడమని చెప్పారు. -
కంగ్రాట్స్.. నిర్మల!
కర్నూలు కల్చరల్/ఆదోని రూరల్: నిర్మల పోరాట యోధురాలుని, ఆ అమ్మాయి దృఢ సంకల్పం, పోరాట పటిమకు సెల్యూట్ అని జిల్లా కలెక్టర్ డాక్టర్ జి.సృజన ప్రశంసించారు. ఆదోని మండలం పెద్ద హరివాణం గ్రామానికి చెందిన నిర్మల 10వ తరతగతిలో మంచి మార్కులు సాధించినప్పటికీ పేదరికంతో తల్లిదండ్రులు చదువు మాన్పించిన సందర్భంలో కలెక్టర్ ప్రత్యేక శ్రద్ధ తీసుకొని నిర్మలను ఆస్పరి కేజేబీవీలో చేర్పించారు. ఆ విద్యార్థిని ఇంటర్మీడియట్ బైపీసీ గ్రూప్తో మొదటి సంవత్సరం పరీక్షల్లో 440 మార్కులకు 421 మార్కులు సాధించి జిల్లాలో టాపర్గా నిలిచింది. ఈ సందర్భంగా కలెక్టర్ ఆదివారం నిర్మలను క్యాంప్ కార్యాలయానికి పిలిపించుకొని అభినందించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. జిల్లాలో బైపీసీ గ్రూప్లు ఉన్న 8 కేజీబీవీల్లో నిర్మల టాపర్గా నిలవడం అభినందనీయమన్నారు. ఆదోని మండలం పెద్ద హరివాణం గ్రామానికి చెందిన హనుమంతమ్మ, శ్రీనివాస్ దంపతుల కుమార్తె నిర్మల గురించి నేడు రాష్ట్ర వ్యాప్తంగా చర్చించుకుంటున్నారన్నారు. ఆడపిల్లలకు నిర్మల రోల్మోడల్, స్ఫూర్తి ప్రదాత అని ప్రశంసించారు. ఎన్ని ప్రతిఘటనలు ఎదురైనప్పటికీ దృఢ సంకల్పంతో చదువుకోవాలన్న తన కోరికను నెరవేర్చుకొని ఉన్నత ఆశయంతో ముందుకు వెళుతోందన్నారు. విద్యతోనే సాధికారత లభిస్తుందని ఆడపిల్లలు చదువుకొని సామాజికంగా ఆర్థికంగా అభివృద్ధి చెందాలని సూచించారు. బేటీ బచావో బేటీ పడావో కింద నిర్మలకు ఇన్సెంటివ్ ఇవ్వాలని ఇంచార్జ్ ఐసీడీఎస్ పీడీని కలెక్టర్ ఆదేశించారు. విద్యార్థిని ఖాతాలో ఇన్సెంటివ్ జమ చేయడం వల్ల ఇంటర్ తరువాత వారి తల్లిదండ్రులకు ఆర్థిక భారం లేకుండా పైచదువులు చదువుకోడానికి ఉపయోగ పడుతుందన్నారు. సమస్యలతో చదువుకోలేక మధ్యలో చదువు ఆపేసిన వారు ఇంకా ఎవరైనా ఉంటే స్పెషల్ క్యాంపెయిన్ నిర్వహించి అలాంటి వారిని ఈ సంవత్సరం కేవీజీబీల్లో అడ్మిషన్ చేయించాలని ఆదేశించారు. నిర్మల సాధించిన ప్రగతి గురించి అందరికి తెలిసేలా సమావేశం నిర్వహించేందుకు తగిన చర్యలు తీసుకోవాలన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ నిర్మలను శాలువాతో సన్మానించి స్వీట్స్ అందజేశారు. ఇదే స్ఫూర్తితో ఉన్నత చదువులు చదివి జీవితంలో అనేక విజయాలు సాధించాలని సూచించారు. బైపీసీలో 421 మార్కులు సాధించిన నిర్మలతో జిల్ల్లా కలెక్టర్ సృజన, ఇతర అధికారులు కలెక్టర్ చేసిన మేలు జీవితంలో మర్చిపోలేను.. గ్రామంలో ఉన్న జడ్పీహెచ్ఎస్లో పదో తరగతి చదివి 537 మార్కులు సాధించానని, తల్లిదండ్రుల ఆర్థిక సమస్యలతో చదువు వద్దని పెళ్లి చేయాలని నిర్ణయించుకున్నారని అయితే తనకు ఉన్నత చదువులు చదవాలనే కోరిక ఉండడంతో అధికారుల దృష్టికి తీసుకెళ్లానని నిర్మల తెలిపారు. ఈ విషయం ప్రతికల్లో ప్రచురితమై కలెక్టర్ దృష్టికి వెళ్లడం, కలెక్టర్ మేడం వెంటనే స్పందించి కేజీబీవీలో అడ్మిషన్ ఇప్పించారన్నారు. ఈరోజు ఇంటర్ బైపీసీ మొదటి సంవత్సరం పరీక్షల్లో కేజీబీవీల్లో టాపర్గా నిలవడం ఆనందంగా ఉందన్నారు. కార్యక్రమంలో జిల్లా విద్యాఽశాఖాధికారి శామ్యూల్, సమగ్ర శిక్ష ఏపీసీ విజయ జ్యోతి, ఇన్ఛార్జి ఐసీడీఎస్ పీడీ వెంకట లక్ష్మమ్మ, జీసీడీవో సునీత, కేజీబీవీ ఎస్ఓ శరన్స్మైలీ, ఆదోని ఎంఈఓ–2 శ్రీనివాసులు, విద్యార్థిని తల్లిదండ్రులు, బందువులు పాల్గొన్నారు. -
కొయ్యబొమ్మకు ‘మోదీ గ్యారంటీ’
సాక్షి, ఆదిలాబాద్/నిర్మల్: అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలను చిత్తుగా ఓడించా లని, బీజేపీని గెలిపించాలని బీజేపీ ఆది లాబాద్ అభ్యర్థి పాయల్ శంకర్ కోరారు. వారం రోజులుగా ఆదిలాబాద్లో బీజేపీ పుంజుకుంటోందన్నారు. దీంతో బీఆర్ఎస్, కాంగ్రెస్ అభ్యర్థుల్లో వణుకు మొదలైందని పేర్కొన్నారు. అసెంబ్లీ ఎన్నికలకు ఇంకా నాలుగు రోజులే సమయం ఉందని, బీసీని ముఖ్యమంత్రి చేసే బీజేపీని గెలిపించాలని కోరారు. బీఆర్ఎస్, కాంగ్రెస్ రెండే తోడుదొంగలన్నారు. నిజాయతీపాలన కావాలంటే బీజేపీకి ఓటు వేయాలని పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వ ఇస్తున్న ప్రతి రూపాయి ప్రజలకు చేరాలంటే రానున్న ఎన్నికల్లో బీజేపీ గెలవాలన్నారు. "నా తెలంగాణ కుటుంబ సభ్యులందరికీ శుభాభినందనాలు. బాసర సరస్వతీమాత చరణాలకు నా ప్రణామం. ఈ గడ్డపై పుట్టిన ఆదివాసీయోధులు కుమురంభీమ్, రాంజీగోండుకు నా నివాళులు. తన పోరాటంతో రాంజీ గోండు యువతకు ప్రేరణగా నిలిచారు.." అంటూ ప్రధానమంత్రి నరేంద్రమోదీ తన ప్రసంగాన్ని ప్రారంభించారు. జిల్లా కేంద్రంలోని సమీకృత కలెక్టరేట్ రోడ్డులో పాతక్రషర్ ఎదురుగా ఆదివారం నిర్వహించిన సకల జనుల విజయసంకల్ప సభలో ప్రధాని పాల్గొన్నారు. నిర్మల్, ముధోల్, ఖానాపూర్, ఆదిలాబాద్, బోథ్ అభ్యర్థులు ఏలేటి మహేశ్వర్రెడ్డి, రామారావుపటేల్, రమేశ్రాథోడ్, పాయల్ శంకర్, సోయం బాపూరావు తరఫున నిర్వహించిన ఈ ఎన్నికలసభకు భారీగా జనం తరలివచ్చారు. సభాప్రాంగణం నుంచి కనుచూపు మేరంతా జనసంద్రమే కనిపిస్తోందని, కాంగ్రెస్ సుల్తానులు, బీఆర్ఎస్ నిజాంలు ఒక్కసారి వచ్చి చూస్తే.. రాంజీగోండు ప్రేరణ, బీజేపీ గెలుపు ఖాయమన్న విషయం తెలుస్తుందని మోదీ అన్నారు. తమకు తాము రాజకీయ తీస్మార్ఖాన్ అనుకుంటున్నారో, రాజనీతి జ్ఞానిగా భావిస్తున్నారో ఒక్కసారి ఇక్కడికి వచ్చి చూడాలని సూచించారు. తెలంగాణలో బీజేపీ ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందని తెలిపారు. కేసీఆర్ ఎప్పుడో కారు స్టీరింగ్ వేరేవాళ్లకు అప్పగించి ఫామ్హౌస్కు వెళ్లి పడుకుంటున్నాడన్నారు. ఇలాంటి ముఖ్యమంత్రి అవసరమా అని ప్రశ్నించారు. సకల జనుల సౌభాగ్య తెలంగాణ కోసం ప్రజలంతా బీజేపీ వైపు నిలిచారని మోదీ చెప్పారు. కొయ్యబొమ్మకు గ్యారంటీ.. బీఆర్ఎస్, కాంగ్రెస్లకు మేడిన్ ఇండియా అన్న, మేకిన్ ఇండియా అన్న ఇష్టం ఉండదని ప్రధాని ఆరోపించారు. ఈ కారణంగానే ఘనమైన చరిత్ర కలిగిన నిర్మల్ కొయ్యబొమ్మల పరిస్థితి దయనీయంగా మారిందన్నారు. తమ ప్రభుత్వం అధికారంలోకి రాగానే నిర్మల్ కొయ్యబొమ్మలకు పూర్వవైభవం తీసుకువస్తామని, ఇది మోదీ గ్యారంటీ అని స్పష్టం చేశారు. నిజామాబాద్లో ఏర్పాటు చేయనున్న జాతీయ పసుపుబోర్డుతో నిర్మల్ జిల్లా రైతులకూ మేలు కలుగుతుందన్నారు. ఇక్కడి పసుపురైతులు పండించే పసుపు కోసం ప్రపంచం ఎదురుచూస్తోందని తెలిపారు. కోవిడ్ తర్వాత పసుపు విలువ ప్రపంచానికి తెలిసి వచ్చిందన్నారు. వరి రైతులకు మద్దతుగా ధాన్యం క్వింటాల్కు రూ.3,100 చెల్లిస్తామని ప్రకటించామన్నారు. తెలుగులో మాట్లాడుతూ.. ప్రధాని మోదీ తన ప్రసంగాన్ని తెలుగులో ప్రారంభించడంతోపాటు మధ్యమధ్యలో తెలుగులో మాట్లాడుతూ అందరినీ ఆకట్టుకున్నారు. అసలు ప్రధానమంత్రి ఇంతా బాగా తెలుగు మాట్లాడగలరా.. అనేలా భాషను ఉచ్చరించారు. ‘మొదటిసారి తెలంగాణలో బీజేపీ ప్రభుత్వం ఏర్పాటు కానుంది..’ అని అనడంతో సభలో విశేష స్పందన వచ్చింది. ‘ప్రజలను కలవని, సచివాలయానికి వెళ్లని సీఎం అవసరమా..’ అంటూ తెలుగులోనే ప్రశ్నించారు. ‘మోదీ గ్యారంటీ అంటే గ్యారంటీగా పూర్తి అయ్యేది..’ అని చెప్పడం, ప్రతీసారి ‘నా కుటుంబసభ్యులారా..’ అని సంబోధించడం సభికులను ఆకట్టుకుంది. సభ ఆద్యంతం ‘మోదీ.. మోదీ..’ అన్న నినాదాలతో సభాప్రాంగణం మార్మోగింది. ఎంపీ సోయం గైర్హాజరు.. ప్రధాని మోదీ ఎన్నికల ప్రచార సభకు ఆదిలా బాద్ ఎంపీ, బీజేపీ బోథ్ నియోజకవర్గ అభ్యర్థి సోయం బాపురావు గైర్హాజరవడం ప్రాధాన్యత సంతరించుకుంది. అయితే ఆయన ఏ కారణాల వల్ల రాలేదనేది తెలియరాలేదు. ఇది చర్చనీ యాంశమైంది. మరోవైపు పార్లమెంట్ పరిధిలో ని అసెంబ్లీ నియోజకవర్గాల అభ్యర్థులు, ముఖ్య నేతలంతా పాల్గొన్నారు. నిర్మల్, ముధోల్, ఖా నాపూర్, ఆదిలాబాద్, ఆసిఫాబాద్ ఎమ్మెల్యే అభ్యర్థులు ఏలేటి మహేశ్వర్రెడ్డి, రామారావుపటేల్, రమేశ్ రాథోడ్, పాయ ల్ శంకర్, అజ్మీరా ఆత్మారాంనాయక్ హాజరయ్యారు. అలాగే బోథ్ ఎమ్మెల్యే రాథోడ్ బాపురావు, ఉమ్మడి ఆదిలాబా ద్ జెడ్పీ మాజీ చైర్పర్సన్ సుహాసినిరెడ్డి, మాజీ మంత్రి అమర్సింగ్తిలావత్, మాజీ ఎమ్మెల్యే సుమన్రాథోడ్, తదితరులంతా పాల్గొన్నారు. ఇవి కూడా చదవండి: '30వ తేదీన ఏముంది?' అందరికీ గుర్తుండేలా ‘స్వీప్’ హోర్డింగ్లు! -
ఆదర్శప్రాయుడు పీవీ: ఇంద్రకరణ్
నిర్మల్టౌన్: మాజీ ప్రధాని పీవీ నరసింహారావు అందరికీ ఆదర్శప్రాయుడని, ఆయన అడుగుజాడల్లో నడుస్తూ ఆశయాలను కొనసాగిద్దామని రాష్ట్ర మంత్రి అల్లోల ఇంద్రకరణ్రెడ్డి అన్నారు. నిర్మల్ జిల్లా కేంద్రంలోని శాంతినగర్ చౌరస్తా వద్ద ఏర్పాటు చేసిన పీవీ నరసింహారావు విగ్రహాన్ని సోమవారం మంత్రి ఆవిష్కరించారు. అంతకుముందు నిర్మల్కి విచ్చేసిన రాజ్యసభ సభ్యుడు డాక్టర్ కె.కేశవరావుకు స్థానిక ఫారెస్ట్ గెస్ట్హౌస్లో మంత్రి పూలమొక్క అందజేసి స్వాగతం పలికారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ పీవీ హయాంలో 1991 నుంచి 1996 వరకు పార్లమెంట్ సభ్యుడిగా ఉండటం తన అదృష్టమన్నారు. తెలంగాణ బిడ్డ పీవీ ప్రధానమంత్రి అవుతున్నారనే ఉద్దేశంతో తనతోసహా ఏడుగురు టీడీపీ ఎంపీలం ఆయనకు మద్దతు తెలిపామని చెప్పారు. పీవీ చాణక్యనీతితో దేశాన్ని బ్రహ్మాండంగా పాలించి ప్రజల మన్ననలు పొందారని గుర్తుచేశారు. కేశవరావు మాట్లాడుతూ పీవీతో తనకున్న సాన్నిహిత్యాన్ని గుర్తు చేసుకున్నారు. ఉపాధ్యాయులు, మేధావులు విద్యార్థులకు, పిల్లలకు చిన్నప్పటి నుంచే ప్రముఖుల జీవిత చరిత్ర తెలియజేయాలని సూచించారు. -
15న ఆ 9 చోట్ల భారీ ర్యాలీలు
సాక్షి, హైదరాబాద్: ఈ నెల 15న ఏకకాలంలో తొమ్మిది జిల్లాల్లో కొత్త మెడికల్ కాలేజీలు ప్రారంభమవుతున్న నేపథ్యంలో ఆయా జిల్లా కేంద్రాల్లో కనీసం 15 వేల నుంచి 20 వేల మందితో భారీ ర్యాలీలు నిర్వహించాలని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీ రామారావు పిలుపునిచ్చారు. కొత్త మెడికల్ కాలేజీల ప్రారంభం నేపథ్యంలో శుక్రవారం మంత్రులు, ఎమ్మెల్యేలతో కేటీ రామారావు టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ నెల 15న జనగామ, నిర్మల్, కామారెడ్డి, కరీంనగర్, సిరిసిల్ల, ఆసిఫాబాద్, భూపాలపల్లి, వికారాబాద్, ఖమ్మం జిల్లాలలో కొత్త మెడికల్ కాలేజీలు ప్రారంభమవుతున్నాయని వెల్లడించారు. సీఎం కేసీఆర్ ఈ నెల 15న ఏదో ఒక చోట కొత్త మెడికల్ కాలేజీని ప్రారంభిస్తారని, వైద్యారోగ్యశాఖ మంత్రి టి.హరీశ్రావు కామా రెడ్డిలో జరిగే కార్యక్రమంలో పాల్గొంటారని కేటీఆర్ తెలిపారు. దేశంలో జిల్లాకో మెడికల్ కాలేజీ ఉన్న ఏకైక రాష్ట్రంగా తెలంగాణ నిలుస్తోందన్నారు. మంత్రి హరీశ్ మాట్లాడుతూ ప్రతి లక్ష జనాభాకు 22 ఎంబీబీఎస్ సీట్లను కలిగి ఉన్న రాష్ట్రంగా తెలంగాణ అగ్రస్థానంలో ఉందన్నారు.
Pagination
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
సూర్య విధ్వంసకర సెంచరీ.. ఎస్ఆర్హెచ్పై ముంబై విజయం
టీ20 వరల్డ్కప్కు స్కాట్లాండ్ జట్టు ప్రకటన..
పాకిస్తాన్ టీ20 వరల్డ్ కప్ జెర్సీ రివీల్.. ఫోటోలు వైర్
వారి వల్లే మా ఎంగేజ్మెంట్ జరిగింది: అదితిరావు హైదరీ
పెళ్లి చేసుకున్న తెలుగు సీరియల్ నటి (ఫోటోలు)
రాణించిన హెడ్, కమ్మిన్స్.. ముంబై టార్గెట్ ఎంతంటే?
'దీదీ గిరి' అంగీకరించను: పశ్చిమ బెంగాల్ గవర్నర్
బాబే కాదు ప్రధాని మోదీ కూడా యూటర్న్ తీసుకున్నారు: అమర్నాథ్
త్వరలోనే బిడ్డకు జన్మనివ్వనున్న టాలీవుడ్ హీరోయిన్.. భర్తపై అలాంటి పోస్ట్!
తెలంగాణ రైతులకు గుడ్ న్యూస్.. ఖాతాల్లోకి నగదు
తప్పక చదవండి
- సోనాక్షితో ఇంటిమేట్ సీన్స్.. ఆమె తల్లి ఏమన్నారంటే: నటుడు
- అలా చేస్తే ఆ కిక్కే వేరు! అతడితో లవ్లో ఉన్నా: నటి
- హీట్వేవ్ నుంచి ఉపశమనం.. త్వరలో వర్షాలు: వాతావరణ శాఖ
- డైరెక్టర్తో హీరోయిన్ పెళ్లి.. మామయ్యను మండపానికి రానివ్వలేదట!
- మాచర్లలో సీఎం జగన్ ప్రచారం.. పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)
- కాంగ్రెస్ కీలక నిర్ణయం: బరిలోకి మాజీ ముఖ్యమంత్రులు
- హార్దిక్ కాదు!.. రోహిత్ తర్వాత టీమిండియా కెప్టెన్ అతడే!
- సమ్మర్లో కొబ్బరిబోండంలోని నీటిని నేరుగా తాగేస్తున్నారా..?
- చంద్రబాబు మోసాల చరిత్రను గుర్తు తెచ్చుకోండి: సీఎం జగన్
- కల్వకుంట్ల కవితకు బిగ్ షాక్
Advertisement