-
కోటాలో విద్యార్థి అదృశ్యం కలకలం.. వారంలో రెండో ఘటన
జేఈఈ (JEE) విద్యార్థి రచిత్ అదృశ్యం మరవక ముందే రాజస్థాన్లోని కోటాలో 18 ఏళ్ల నీట్(NEET) కోచింగ్ విద్యార్థి అదృశ్యం కలకలం రేపతోంది. రెండు రోజుల క్రితం సికార్ జిల్లాకు చెందిన యవరాజ్ అనే విద్యార్థి అదృశ్యం అయినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం అతను నీట్ మెడికల్ ప్రవేక్ష పరీక్ష కోసం కోటాలో కోచింగ్ తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. యువరాజు కోటాలోని ట్రాన్స్పోర్టు నగరలోని హాస్టల్లో ఉంటున్నాడు. శనివారం ఉదయం 7 గంటలకు క్లాస్కు హాజరయ్యేందుకు బయటకు వెళ్లి యూవరాజ్ అదృశ్యం అయ్యాడు. అతను తన మొబైల్ ఫోన్ను హాస్టల్లోనే వదిలి వెళ్లాడు. వారం రోజుల క్రితమే రచిత్ సోంధ్య అనే విద్యార్థి అదృశ్యం అయిన విషయం తెలిసిందే. 16 ఏళ్ల జేఈఈ(JEE) విద్యార్థి రచిత్.. హాస్టల్ నుంచి క్లాస్కు బయలుదేరి అదృశ్యం అయ్యారు. సీసీటీవీ ఫుటేజుల వివరాల ప్రకారంలో కోటాలోని అటవీ ప్రాంతంలోకి వెళ్లినట్లు తెలుస్తోంది. మధ్యప్రదేశ్కు చెందిన రచిత్ .. హాస్టల్ నుంచి బయటకు వచ్చి.. ఒక క్యాబ్లో అటవీ ప్రాంతానికి వెళ్లినట్లు పోలీసులు గుర్తించారు. గత సోమవారం రచిత్ బ్యాగ్, మొబైల్ ఫోన్, హాస్టల్ రూం తాళం చెవిని అటవీ ప్రాంతానికి సమీపంలోని గరడియా మహాదేవ్ ఆలయం వద్ద పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అయితే ఈ ఇద్దరు విద్యార్థుల అదృశ్యంపై పోలీసులు కేసు నమోదు చేసుకొని.. వెతుకుతున్నారు. వారికోసం పోలీసులు ప్రత్యేకంగా ఎస్డీఆర్ఎఫ్ బృందాలను రంగంలోకి దించి సెర్చ్ ఆపరేషన్ కొనసాగిస్తున్నాయి. -
నా కొడుకు దొరికాడు..తల్లి కృతజ్ఞతలు..
-
భారతీయ విద్యార్థి నాలుగేళ్లుగా మిస్సింగ్.. ఆచూకీ చెబితే 8 లక్షల రివార్డ్
న్యూయార్క్: అమెరికాలోని న్యూజెర్సీలో భారతీయ విద్యార్థి నాలుగేళ్ల క్రితం అదృశ్యమైంది. అప్పటి నుంచి ఆమె ఆచూకీ తెలియరాలేదు. అయితే ఆ యువతి జాడ తెలిపిన వారికి 10 వేల డాలర్లు(భారత కరెన్సీ ప్రకారం సుమారు 8.32 లక్షలు) ఇవ్వనున్నట్లు యూఎస్ దర్యాప్తు సంస్థ ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (ఎఫ్బీఐ) ప్రకటించింది. వివరాలు.. 29 ఏళ్ల మయూషీ భగత్.. 2019, ఏప్రిల్ 29వ తేదీన జెర్సీ సిటీలోని తన అపార్ట్మెంట్ నుంచి బయటకు వెళ్లి కనిపించకుండాపోయింది. తల్లిదండ్రులు ఫోన్ చేస్తేమో స్విచ్చాఫ్ వచ్చింది. ఆమె స్నేహితుల్ని సంప్రదించినా ఎలాంటి సమాచారం లభించలేదు.దీంతో కూతురు అదృశ్యంపై ఆమె కుటుంబ సభ్యులు మే 1వ తేదీన పోలీసులకు ఫిర్యాదు చేశారు. ‘మయూషీ ఇంటి నుంచి వెళ్లిన సమయంలో కలర్ పైజామా, బ్లాక్ టీ షర్ట్ ధరించింది’ అని ఫిర్యాదులో పేర్కొన్నారు. యువతి మిస్సింగ్పై న్యూజెర్సీలోని ఎఫ్బీఐ నెవార్క్ ఫీల్డ్ ఆఫీస్, జెర్సీ సిటీ పోలీసు శాఖ ఆమె కోసం గత నాలుగేళ్లుగా కోసం వెతుకుతూనే ఉంది. పలు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి గాలింపు చర్యలు చేపట్టినా.. ఎలాంటి ఫలితం దక్కలేదు. అయితే మయూషీ ఆచూకీ ఇంకా తెలియరాకపోవడంతో తాజాగా ఎఫ్బీఐ ఓ ప్రకటన చేసింది. యువతి సమాచారం ఇచ్చిన వారికి పదివేల డాలర్ల రివార్డు ఇవ్వనున్నట్లు ఎఫ్బీఐ తెలిపింది. చదవండి: జన్మనిచ్చిన తల్లికై తపిస్తున్న ఓ కూతురి గాథ వింటే..కన్నీళ్లు ఆగవు..! ఎవరీ మయూషీ భగత్ మయూషీ భగత్.. భారతీయ విద్యార్థి. 1994లో వడోదరాలో జన్మించింది. 2016లో ఎఫ్ 1 స్టూడెంట్ వీసాపై అమెరికా వెళ్లిన ఆమె అక్కడ న్యూయార్క్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో ఎంఎస్ చేస్తోంది. మయూషి భగత్ ఎత్తు 5 అడుగుల 10 అంగుళాలు ఉంటుందని. గోధుమ రంగు కళ్ళు, నల్లటి జుట్టు కలిగి ఉంటుందని అధికారులు వివరాలు వెల్లడించారు. ఆమె 2016లో ఎఫ్1 స్టూడెంట్ వీసాపై అమెరికాకు వచ్చింది. FBI గత ఏడాది జూలైలో తన వెబ్సైట్లోని ‘మోస్ట్ వాంటెడ్’ పేజీలో మయూషీ ‘తప్పిపోయిన వ్యక్తుల’ పోస్టర్ను ప్రదర్శించింది. -
Alex Baty: బ్రిటన్లో పాపం పసివాడు!
అనగనగా అలెక్స్ బాటీ. ఓ 11 ఏళ్ల పాల బుగ్గల పసివాడు. సొంతూరు బ్రిటన్లోని గ్రేటర్ మాంచెస్టర్. తల్లి, తాతయ్య విదేశీ యాత్రకు వెళ్దామంటే సంబరంగా వాళ్లతో కలిసి స్పెయిన్ బయల్దేరాడు. ఆ యాత్ర ఏకంగా ఆరేళ్లకు పైగా సాగుతుందని అప్పుడతనికి తెలియదు పాపం! ఎందుకంటే అప్పట్నుంచీ అతను బ్రిటన్ తిరిగి రానే లేదు. సరికదా, ఆచూకీ కూడా తెలియకుండా పోయాడు! అతనే కాదు, నాటినుంచీ అతని తల్లి, తాతయ్య కూడా నేటికీ పత్తా లేరు!! ఈ ఉదంతం అప్పట్లో సంచలనం సృష్టించింది. ఈ కేసును ప్రతిష్టాత్మకంగా తీసుకున్న బ్రిటన్ పోలీసులు ముమ్మరంగా దర్యాప్తు కూడా చేశారు. అలెక్స్ కోసం యూరప్ అంతటా వెదికీ వెదికీ అలసిపోయారు. ఇక తమవల్ల కాదంటూ చేతులెత్తేశారు. అదుగో, అలాంటి స్థితిలో మూడు రోజుల క్రితం అనుకోకుండా ఫ్రాన్స్లో దొరికాడు అలెక్స్. ఈ లాస్ట్ అండ్ ఫౌండ్ స్టోరీ ఇప్పుడు బ్రిటన్ అంతటా టాక్ ఆఫ్ ద టౌన్గా మారింది! ఇలా దొరికాడు... వాయవ్య ఫ్రాన్స్లోని టౌలోస్ అనే కొండ ప్రాంతంలో గత బుధవారం అర్ధరాత్రి దాటాక ఓ 17 ఏళ్ల కుర్రాడు హోరు వానలో తడుస్తూ, హైవే పక్కగా పేవ్మెంట్పై ఒంటరిగా నడుస్తూ పోతున్నాడు. అటుగా వెళ్తున్న ఫాబియన్ అసిడినీ అనే ఓ ట్రక్ డ్రైవర్ కంటపడ్డాడు. అది మారుమూల ప్రాంతం, పైగా ఎవరూ బయట తిరగని వేళ కావడంతో అనుమానం వచి్చన ఆ డ్రైవర్ మనవాణ్ని దగ్గరికి తీశాడు. తొలుత బెదురు చూపులతో మారుపేరు చెప్పినా, అనునయించి అడిగేసరికి అసలు పేరు, తాను తప్పిపోయిన వృత్తాంతంమొత్తం చెప్పుకొచ్చాడు. ‘కొన్నేళ్ల కింద మా అమ్మే నన్ను కిడ్నాప్ చేసింది’ అంటూ ముక్తాయించాడు. దాంతో బిత్తరపోయిన అసిడినీ వెంటనే అతన్ని స్థానిక పోలీస్ స్టేషన్లో అప్పజెప్పాడు. వాళ్లు బ్రిటన్కు సమాచారమివ్వడం, ఫొటో చూసిన నానమ్మ అలెక్స్ను గుర్తు పట్టడం, ఇద్దరూ వీడియో కాల్లో మాట్లాడుకుని ఆనందబాష్పాలు రాల్చడం చకచకా జరిగిపోయాయి. ఏం జరిగిందంటే... అలెక్స్ అమ్మానాన్నలు చాన్నాళ్ల క్రితమే విడిపోయారు. అలెక్స్ కోరిక మేరకు కోర్టు అతన్ని నానమ్మ సంరక్షణలో ఉంచింది. ఆమె అనుమతి లేకుండానే 11 ఏళ్ల అలెక్స్ను తల్లి, తాతయ్య కలిసి విహారయాత్ర పేరిట 2017లో స్పెయిన్ తీసుకెళ్లారు. అప్పటినుంచీ ముగ్గురూ అయిపు లేకుండా పోయారు. పెద్దవాళ్లిద్దరూ అప్పటికి కొంతకాలంగా ఆధ్యాతి్మక బాట పట్టినట్టు దర్యాప్తులో తేలింది. తమతో పాటు అలెక్స్ కూడా ఆ ప్రత్యామ్నాయ జీవనం గడపాలనే ఉద్దేశంతో అతన్ని తీసుకుని స్పెయిన్లో ఓ ఆరామం వంటి ప్రదేశానికి వెళ్లినట్టు పోలీసులు ముక్తాయించారు. తాము తొలుత ఓ విలాసవంతమైన ఇంట్లో ఒక రకమైన ఆధ్యాతి్మక సమూహంతో కలిసి కొన్నేళ్ల పాటు గడిపామన్న అలెక్స్ తాజా వాంగ్మూలం కూడా దీన్ని ధ్రువీకరించింది. తర్వాత అమ్మ, తాతయ్య ఇద్దరూ అలెక్స్ను తీసుకుని 2021లో ఫ్రాన్స్లో ప్రత్యామ్నాయ జీవన శైలికి పేరున్న పైరెనీస్ ప్రాంతానికి మారినట్టు భావిస్తున్నారు. అలెక్స్ దొరికిన చోటు కూడా అక్కడికి కొద్ది దూరంలోనే ఉంది. ఆ జీవన విధానం తనకు నచ్చక నానమ్మ చెంతకు చేరేందుకు తప్పించుకుని వచ్చేశానని అలెక్స్ చెప్పుకొచ్చాడు. అతన్ని ఒకట్రెండు రోజుల్లో నానమ్మ దగ్గరికి చేర్చేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. అతని అమ్మ, తాతయ్యలపై కిడ్నాపింగ్ కేసు ఇప్పటికీ పెండింగ్లోనే ఉండటం విశేషం! తాజా వివరాల ఆధారంగా వారిని తెరపైకి తీసుకొచ్చే పనిలో పడ్డారు బ్రిటన్ పోలీసులు. – సాక్షి, నేషనల్ డెస్క్ -
కడపలో తల్లీతనయుల అదృశ్యం!
కడప అర్బన్ : కడప నగరం టూటౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో తల్లీ, ఇద్దరు కుమారులు అదృశ్యమయ్యారు. వివరాలు ఇలా.. సాధుచెంగన్న వీధికి చెందిన షేక్ ఫర్హత్ అంజుమ్కు(35), బెల్లంమండివీధిలో నివాసం ఉంటున్న షేక్ అల్తాఫ్తో వివాహమైంది. వీరికి ఇద్దరు కుమారులు షేక్ అబ్దుల్లా(13), షేక్ ఇబ్రహీం(11)లు ఉన్నారు. ఆ తర్వాత భార్యాభర్తలు మనస్పర్థలతో విడిపోయారు. ఈ క్రమంలో ఆమె తన ఇద్దరు కుమారులతో కలిసి తల్లి షేక్ ముంతాజ్ బేగం వద్ద ఉంటోంది. ఈ నేపథ్యంలో ఈనెల 8వ తేదీ మధ్యాహ్నం మూడు గంటల సమయంలో మాసాపేటలోని ఓ స్కూల్లో చదువుతున్న తన ఇద్దరు కుమారులను తీసుకుని వస్తానని తల్లికి చెప్పి ఫర్హత్ వెళ్లింది. తరువాత తన కుమార్తె, ఇద్దరు మనుమల ఆచూకీ తెలియరాలేదని ముంతాజ్ బేగం పోలీసులకు ఫిర్యాదు చేసింది. వారి ఆచూకీ తెలిసిన వారు 9121100513, 9121100517, 9121100518 ఫోన్ నంబర్లలో లేదా పోలీస్ స్టేషన్లోగానీ, డయల్ 100కు గానీ సమాచారం ఇవ్వాలని కడప టు టౌన్ పోలీసు స్టేషన్ ఎస్ఐ సంజీవరాయుడు కోరారు. ఇవి చదవండి: అనుమానాస్పద స్థితిలో భార్య మృతి! భర్తే ఇలా చేశాడని.. -
కూతురు జాడ కోసం తుది శ్వాస వరకు ఆరాటపడ్డ ఓ తల్లి వ్యథ!
కాలం ఎప్పుడూ.. బంధాల కోసం పాకులాడే అనురాగాలతో పాటు, ఆ బలహీనతలతో ఆటలాడుకునే నైజాన్ని సరితూకమేస్తుంది. జరిగినదాంట్లో పాపపుణ్యాలను పక్కనపెడితే చివరికి మిగిలిన వ్యథే.. ఎన్నో హెచ్చరికలను జారీ చేస్తుంది. సుమారు యాభై ఏళ్ల క్రితం అదృశ్యమైన ‘అమీ బిల్లిగ్’ అనే అమ్మాయి ఉదంతం అలాంటిదే. అమెరికా, ఫ్లోరిడాలోని మయామిలో ‘కోకోనట్ గ్రోవ్’ సమీపంలో నివసించే నెడ్ బిల్లిగ్, సుసాన్ బిల్లిగ్ దంపతులు.. కూతురు అమీ, కొడుకు జోస్తో కలసి సంతోషంగా జీవించేవారు. తండ్రి నెడ్ ఆర్ట్ గ్యాలరీ నడుపుకుంటుంటే.. తల్లి సుసాన్ ఇంటీరియర్ డిజైనర్గా పనిచేస్తూ .. వచ్చినదానితోనే పిల్లల్ని ప్రాణంగా చూసుకునేవారు. జోస్ కంటే అమీ సుమారు పదేళ్లు పెద్దది. అమ్మాయికి యుక్త వయసు వచ్చేనాటికి.. ఆ కుటుంబాన్ని ఊహించని ఉపద్రవం ముంచెత్తింది. అది 1974 మార్చి 5, మధ్యాహ్నం 12 దాటింది. పదిహేడేళ్ల అమీ.. స్కూల్ నుంచి ఇంటికి వచ్చింది. రాగానే ఆర్ట్ గ్యాలరీకి కాల్ చేసి.. తండ్రితో మాట్లాడింది. ‘డాడ్.. నేను మా స్నేహితులతో కలసి హోటల్లో లంచ్కి వెళ్తున్నా.. నాకు 2 డాలర్లు కావాలి’ అని కోరింది. ‘సరే.. గ్యాలరీకి వచ్చి తీసుకెళ్లమ్మా’ అన్నాడు నెడ్. వెంటనే రెడీ అయ్యి.. కెమెరా పట్టుకుని.. ‘అటు నుంచి అటే వెళ్తా మమ్మీ’ అని తల్లికి చెప్పి.. తండ్రి దగ్గరకు బయలుదేరింది అమీ. ఇంటి నుంచి గ్యాలరీకి పావుగంట పడుతుంది. దాంతో కాసేపట్లో కూతురు వస్తుందని నెడ్ ఎదురు చూడసాగాడు. గంటదాటినా రాలేదు. ‘ఒకవేళ డబ్బులు వద్దనుకుని వెళ్లిపోయిందేమో’ అని సరిపెట్టుకున్నాడు నెడ్. సాయంత్రం ఇంటికెళ్లి చూస్తే.. కూతురు ఇంకా ఇల్లు చేరలేదు. మధ్యాహ్నం వెళ్లిన అమ్మాయి.. రాత్రి కావస్తున్నా రాకపోయేసరికి భయమేసింది. పైగా అమీ డబ్బులు తీసుకోవడానికి తన దగ్గరకు కూడా రాలేదనే భర్త మాటలు విని.. సుసాన్కి గుండె ఆగినంత పనైంది. వెంటనే ఆమె స్నేహితుల్ని ఆరా తీస్తే.. తెలియదనే సమాధానమే వినిపించింది. పోలీసుల్ని ఆశ్రయిస్తే.. ‘ఈ రోజుకి చూడండి.. రేపటికీ రాకపోతే కేసు నమోదు చేసుకుందాం’ అనే బదులొచ్చింది. మరునాడు కూడా అమీ అడ్రస్ లేకపోయేసరికి.. అన్నమాట ప్రకారం పోలీసులు రంగంలోకి దిగారు. ఆ వెతుకులాటలోనే వైల్డ్వుడ్ ఎగ్జిట్ అనే హైవే రోడ్లో అమీ తీసుకెళ్లిన కెమెరా దొరికింది. దానిలోని ఏ ఫొటో.. తదుపరి విచారణకు సహకరించలేదు. కొన్ని రోజులకు.. నెడ్ దంపతులకు ఓ నంబర్ నుంచి బెదిరింపు కాల్స్ రావడం మొదలయ్యాయి. ఆ కాల్స్లో ప్రతిసారి.. ‘మమ్మీ, డాడీ కాపాడండి’ అంటూ ఏడ్చే అస్పష్టమైన అమ్మాయి స్వరం వారిని వణికించింది. ‘పోలీసులకు చెప్పకుండా 30 వేల డాలర్లు ఇస్తే.. మీ అమ్మాయిని వదిలిపెడతాం.. లేదంటే చంపేస్తాం’ అనే హెచ్చరిక.. వారి కన్నపేగును మెలిపెట్టింది. దాంతో వారు చెప్పిన సమయానికి.. అడిగినంత డబ్బు పంపించేశారు. అయితే రోజులు గడిచినా అమీ తిరిగి రాలేదు. కనీసం ఆ నంబర్ నుంచి ఫోన్ కాల్స్ కూడా లేవు. తిరిగి కాల్ చేస్తే కలవలేదు. దాంతో నెడ్ దంపతులకు అనుమానం వచ్చి పోలీసులకు సమాచారం ఇచ్చారు. కూపీ లాగిన పోలీసులు.. ఆ బెదిరింపు కాల్స్ చేసింది చార్ల్స్, లారే గ్లాసర్ అనే కవలలని గుర్తించి, అదుపులోకి తీసుకున్నారు. చివరికి వాళ్లు కేవలం డబ్బు కోసం మాత్రమే అలా చేశారని.. అమీ మిస్సింగ్కి వాళ్లకి ఏ సంబంధం లేదని తేలింది. అమీ తల్లిదండ్రుల ఎమోషన్స్తో ఆడుకున్నందుకు కోర్టు వారికి జైలు శిక్ష విధించింది. మరికొన్ని రోజులకు.. ‘ది అవుట్లాస్’ అనే మోటర్సైకిల్ గ్యాంగ్.. అమీని కిడ్నాప్ చేసుండొచ్చు అనే కొందరు స్థానికుల అనుమానం.. నెడ్ దంపతుల్ని బెదరగొట్టింది. దాంతో నెడ్ ఫ్యామిలీ ఫ్రెండ్ ఒకరు.. పోలీసులతో సంబంధం లేకుండా.. ఓ అనుమానిత బైక్ ముఠా సభ్యులతో నెడ్ కుటుంబానికి రహస్య సమావేశం ఏర్పాటు చేశాడు. అమీ ఫొటోలు చూసిన ఆ ముఠా సభ్యుల్లో కొందరు.. ‘మేము అమీనైతే చూడలేదు. కానీ, గతంలో కొందరు అమ్మాయిల్ని కిడ్నాప్ చేసి అమ్ముకున్న మాట వాస్తవమే’ అని ఒప్పుకున్నారు. అందులో కొందరు కేవలం క్రెడిట్ కార్డ్స్ కోసం, బైక్స్ కోసమే అమ్మాయిల్ని కిడ్నాప్ చేసి, విక్రయించినట్టు చెప్పారు. అమీ వివరాలు ఇతర బైకర్స్ నుంచి సంపాదిస్తామని నెడ్ ఫ్యామిలీకి మాటిచ్చారు. కానీ వాళ్ల నుంచి ఆ తర్వాత ఎలాంటి సహాయమూ అందలేదు, సమాచారమూ రాలేదు. అయితే అంతకు ఐదేళ్ల క్రితం బైకర్ ముఠాకు చిక్కిన ‘గినా ఆండ్రూ’ అనే అమ్మాయి తప్పించుకుని క్షేమంగా తిరిగి రావడంతో.. అమీ కూడా అలాగే తిరిగి వస్తుందని ఆశపడింది నెడ్ కుటుంబం. కానీ అలా జరగలేదు. అమీ తల్లి సుసాన్.. కూతురి ఫొటోలు పట్టుకుని పిచ్చిదానిలా చాలా చోట్ల వెతికింది. ఆ క్రమంలోనే తమ ఇంటికి 160 మైళ్ల దూరంలో ఉన్న ఒక కన్వీనియెన్స్ స్టోర్ మేనేజర్ని కలిసింది. అమీ ఫొటో చూసి గుర్తుపట్టిన ఆ మేనేజర్.. ‘అమీ ఇద్దరు బైకర్స్తో కలసి చాలాసార్లు మా స్టోర్కి వచ్చింది. ఆమె వెజిటేరియన్ కావడంతో తను నాకు బాగా గుర్తుంది’ అని చెప్పాడు. అతని మాట విన్న కొన్ని పత్రికలు.. అమీ తన ఇష్టప్రకారమే కుటుంబానికి దూరంగా పారిపోయిందనే కథనాలను అల్లాయి. ఆ ఊహాగానాల్లో ఏడాది గడిచిపోయింది. సుసాన్ మాత్రం తన ప్రయత్నాలు ఆపలేదు. ఎవరి మాటలూ నమ్మలేదు. ఒకరోజు ఓ కొత్త నంబర్ నుంచి నెడ్ కుటుంబానికి కాల్ వచ్చింది. ‘నా పేరు జాన్సన్.. అమీ గురించి మరచిపొండి, తనని వెతకొద్దు.. నేనో సెక్స్ రాకెట్ సభ్యుడ్ని. తనని బంధించింది నేనే’ అని బెదిరించాడు అవతలి వ్యక్తి. కాసేపటికే ఫోన్ కట్ అయ్యింది. అతడి నుంచి వరసగా కాల్స్ వస్తూనే ఉన్నాయి. కానీ అతడు పబ్లిక్ బూత్ నుంచి కాల్స్ చేస్తుండడంతో పోలీసులు పట్టుకోలేకపోయారు. ఆ బెదిరింపు కాల్స్ నెడ్ కుటుంబాన్ని మరింత కుంగదీశాయి. ‘అమీ మాట వినలేదని నాలుక కత్తిరించాం. మీరు ఇలానే అమీ కోసం వెతుకుతూ ఉంటే ఆమెను చంపేస్తాం. అమీని కిడ్నాప్ చేసినట్లే.. నిన్ను కూడా కిడ్నాప్ చేస్తాం’ అని సుసాన్ని వీలు చిక్కినప్పుడల్లా హడలెత్తించాడు జాన్సన్. అసభ్యకరమైన పదజాలంతో హింసించేవాడు. వేధింపులు ఎక్కువైనా.. ఏదో ఒకరోజు జాన్సన్.. అమీ గురించి నిజం చెబుతాడేమోనన్న ఆశతో ఫోన్ నంబర్ మార్చలేదు నెడ్ కుటుంబం. ఇక 1975 చివరిలో డేవిడ్ అనే ఒక ముఠా సభ్యుడు సుసాన్ని వ్యక్తిగతంగా కలిశాడు. ‘ఒక వార్తాపత్రికలో అమీ ఫొటో చూసి, గుర్తుపట్టి వచ్చాను. ఆమె నాకు బాగా తెలుసు’ అని చెప్పాడు. ‘ఎలా తెలుసు?’ అని అడిగితే.. ‘చట్టవిరుద్ధంగా ఒక ముఠాకి కొంత డబ్బు ఇచ్చి.. కొన్ని నెలలకుగాను అమీని నేను కొన్నాను. ఆమె నా దగ్గరున్నంత కాలం దిగులుగానే ఉంది. మూగది కావడంతో తన బాధ నాకు అర్థం కాలేదు’ అని చెప్పాడు. ఆ అమ్మాయి మూగది అనడంతో.. జాన్సన్ మాటలు గుర్తొచ్చాయి సుసాన్కి. అమీ ఒంటిమీదుండే రహస్య పుట్టుమచ్చల వివరాలు డేవిడ్ నోట వినడంతో.. తన నమ్మకం బలపడింది. అయితే సుసాన్ ఆవేదన చూడలేకపోయిన డేవిడ్.. అమీని వెతకడంలో సాయం చేస్తానని మాటిచ్చాడు. ఆ మాట ప్రకారమే డేవిడ్.. ఒకరోజు సుసాన్ని అసాంఘిక ప్రదేశానికి తీసుకెళ్లి.. అక్కడున్న ఓ ముఠా దగ్గర అమీ గురించి ఆరా తీశాడు. తీరా వారికి డేవిడ్ మీద అనుమానం వచ్చి దాడికి దిగారు. అదృష్టవశాత్తూ సుసాన్ తప్పించుకోగలిగింది. సరిగ్గా ఐదువారాలకు కాళ్లు, చేతులకు కట్లతో డేవిడ్.. సుసాన్ దగ్గరకు వచ్చాడు. ఓక్లహామా, తుల్సాలోని ఒక బార్లో అమీ పనిచేస్తున్నట్లు తెలిసిందని సమాచారమిచ్చి వెళ్లిపోయాడు. తిరిగి ఎప్పుడూ సుసాన్ని అతడు కలుసుకోలేదు. కూతురు మీద బెంగతో సుసాన్కి గుండెపోటు వచ్చింది. అయినా సరే.. కూతురి కోసం తుల్సా వెళ్లి.. అక్కడే కొన్ని నెలల పాటు ఉండి.. సమీపంలోని బార్లు, టాటూ సెంటర్స్ అన్నీ వెతికింది. అయితే అమీ ఫొటో చూసిన కొందరు.. డేవిడ్ చెప్పినట్లే ఆమె మూగ అమ్మాయిగా గుర్తు చేసుకున్నారు. ఏళ్లు గడిచాయి. జాన్సన్ వేధింపులూ ఆగలేదు. సుసాన్కి మరో రెండుసార్లూ గుండెపోటు వచ్చింది. అమీ మిస్ అయిన నాటికి బాలుడిగా ఉన్న జోస్ పెద్దవాడయ్యాడు. తల్లితో పాటు తన అక్క కోసం వెతకడం మొదలుపెట్టాడు. ఇక తండ్రి నెడ్ 1993లో ఊపిరితిత్తుల క్యాన్సర్ బారినపడ్డాడు. చనిపోయే ముందు చివరిసారిగా అమీని చూడాలని ఆరాటపడ్డాడు. జాన్సన్ కాల్ కోసం ఎదురు చూసిన సుసాన్.. నెడ్ పరిస్థితి వివరించి.. తన కూతుర్ని చూపించమని వేడుకుంది. అయినా జాన్సన్ నుంచి సమాధానం రాలేదు. చివరికి నెడ్ తన కోరిక తీరకుండానే మరణించాడు. హెన్రీ(ఎడమవైపు), అమీ(కుడివైపు) సుమారు 20 ఏళ్లకి.. పోలీసులు జాన్సన్ని అదుపులోకి తీసుకోగలిగారు. అయితే అతడి పూర్తిపేరు హెన్రీ జాన్సన్ బ్లెయిర్ అని.. కస్టమ్స్ డిపార్ట్మెంట్ మాజీ ఉద్యోగి అని గుర్తించారు. తీరా అధికారులు తమదైన శైలిలో విచారిస్తే.. ‘అమీ నాకు తెలియదు. కేవలం సెక్సువల్ ప్లెజర్ కోసమే నెడ్ కుటుంబానికి అలా బూటకపు కాల్స్ చేసేవాడ్ని’ అని చెప్పాడు. అతడో ‘మానసిక రోగి, మద్యానికి బానిస’ అని అతడి సన్నిహితులు తెలిపారు. అతడు మరికొందరికి చేసిన ఇలాంటి బూటకపు కాల్స్ అధికారికంగా నిరూపితమయ్యాయి. దాంతో నెడ్ కుటుంబానికి హెన్రీ జాన్సన్ కలిగించిన మనోవ్యథకు జైలు శిక్ష పడింది. అయితే హెన్రీ జాన్సన్.. అమీకి సుపరిచితుడేనని తేల్చాయి కొన్ని ఆనవాళ్లు. అమీ ఫొటోస్లో ఉన్న ఒక తెల్ల కారు.. హెన్రీ జాన్సన్ దగ్గరుంది. అలాగే అమీ తన డైరీలో ఒక చోట ‘హంక్ అనే స్నేహితుడు నన్ను దక్షిణ అమెరికా తీసుకెళ్తా అన్నాడు’ అని రాసుకుంది. ఆశ్చర్యకరంగా కస్టమ్స్ ఏంజెంట్గా హెన్రీ జాన్సన్ మారుపేరు హంక్. అయితే స్పష్టమైన మరే ఇతర సాక్ష్యాలు లేకపోవడంతో హెన్రీ ఈ కేసు నుంచి బయట పడ్డాడు. ఇక 1997లో ఒక మహిళ.. పోలీస్ స్టేషన్కి వచ్చి ‘పాల్ బ్రాండ్’ అనే వ్యక్తి నా భర్త, మోటర్సైకిల్ ముఠా మాజీ సభ్యుడు, అతడు చనిపోతూ అమీ వివరాలు చెప్పాడు’ అని షాకిచ్చింది. ఆమె మాటలకు అమెరికా మొత్తం ఉలిక్కిపడింది. పాల్ ఆమెతో చెప్పిన మాటల సారాంశం ఇలా ఉంది. ‘ఒకసారి అమీ.. మోటర్సైకిల్ ముఠా సభ్యులను అవమానించిందనే కక్షతో ఆమెను కిడ్నాప్ చేసి, ఫ్లోరిడా ఎవర్గ్లేడ్స్ పార్టీకి తీసుకెళ్లాం. ఆమెపై పలుమార్లు లైంగికదాడి చేశాం. ఆమెను లొంగదీసుకోవడానికి చాలాసార్లు డ్రగ్స్ ఇంజెక్ట్ చేయడంతో ఆమె చనిపోయింది. దాంతో ఆ రాత్రికే ఓ చిత్తడి నేలలో ఆమెను పూడ్చిపెట్టాం’ అని చనిపోయే ముందు భార్యతో చెప్పాడట పాల్. దీన్ని నమ్మేందుకు ఒక ఆధారం ఉంది. అమీ మిస్ అయిన కోకోనట్ గ్రోవ్కి.. పాల్ చెప్పిన క్రైమ్ జరిగిన ఎవర్గ్లేడ్స్కి మార్గం మధ్యలోనే అమీ తీసుకెళ్లిన కెమెరా దొరికింది. మొదట పాల్ మాటల్ని నమ్మిన సుసాన్ కుటుంబం.. అమీకి స్మారక చిహ్నం కూడా కట్టించింది. కానీ పాల్ పబ్లిసిటీ కోసం ఈ కథను సృష్టించి ఉంటాడేమో అనే ఆలోచన రావడంతో మళ్లీ అమీ కోసం వెతకడం మొదలుపెట్టింది ఆ కుటుంబం. దురదృష్టవశాత్తు సుసాన్ .. 2005, జూన్ 7న ఎనభై ఏళ్ల వయసులో మరణించింది. ఇప్పుడు అమీని వెతికే బాధ్యతను.. జోస్ అందుకున్నాడు. అసలు.. అమీ ఎవరినైనా గుడ్డిగా నమ్మి మోసపోయిందా? లేక బలవంతంగా అపహరణకు గురైందా? హెన్రీ జాన్సన్ మాటల్లో వాస్తవమెంత? పాల్ తన భార్యకు చెప్పింది నిజమేనా? డేవిడ్ ఏమయ్యాడు? ఇలా ఎన్నో ప్రశ్నలు నేటికీ మిస్టరీనే. ∙సంహిత నిమ్మన (చదవండి: -
భర్తతో గొడవ పడి.. ఆపై భార్య..
సంగారెడ్డి: కుటుంబ సమస్యలతో గొడవపడిన భార్య కనిపించకుండా పోయిన ఘటన సోమవారం నర్సాపూర్ మండలం గంగారాం తండాలో చోటు చేసుకుంది. కనిపించకుండా పోయిన గృహిణి తల్లి తెలిపిన వివరాల ప్రకారం.. తండాకు చెందిన జర్పుల బుజ్జి కుమార్తె శివానిని సలాబత్ తండాకు చెందిన చంద్రకాంత్కు ఇచ్చి నాలుగేళ్ల క్రితం పెళ్లి చేశారు. భర్తతో కుటుంబ సమస్యలపై గొడవ పడిన శివాని తల్లి గారింటి వద్దనే ఉంటుంది. ఈ క్రమంలో ఆదివారం ఇంట్లో చెప్పకుండా వెళ్లిపోయిందని శివాని తల్లి బుజ్జి పోలీసులకు ఫిర్యాదు చేశారు. -
మిస్సింగ్ కాదు మోసం.. ఆదినారాయణ అదృశ్యం కేసులో బిగ్ ట్విస్ట్
సాక్షి, కోడూరు(అవనిగడ్డ): కృష్ణానదిలో దూకి ఆత్మహత్యకు పాల్పడినట్లు సూసైడ్ నోట్ ద్వారా నమ్మించే ప్రయత్నం చేసిన ఆదినారాయణ మిస్సింగ్ కేసులో కొత్త కోణం వెలుగు చూసింది. పోలీసుల కథనం మేరకు.. పెడన మండలంలోని కాకర్లపూడి శివారు ముత్రాస్పాలెం గ్రామానికి చెందిన యరగాని ఆదినారాయణ ఈ నెల 25వ తేదీన ఇంటి వద్ద నుంచి తన ద్విచక్రవాహనంపై ఉల్లిపాలెం–భవానీపురం వారధి వద్దకు చేరాడు. రాత్రి 7గంటల సమయంలో ఆదినారాయణ తన బైక్ను వారధిపై ఉంచి, అందులో తాను చనిపోతున్నట్లుగా సూసైడ్ నోట్ రాసి బైక్ ట్యాంక్ కవర్లో పెట్టాడు. ఇదే సూసైడ్ నోట్ను తన భార్య నవ్యశ్రీ ఫోన్కు కూడా పంపాడు. అప్పుల బాధలు ఎక్కువ కావడంతోనే తాను ఆత్మహత్యకు పాల్పడుతున్నానని, తన కోసం ఎవరూ గాలించవద్దని, గాలించినా కూడా తన మృతదేహం దొరకదంటూ ఆదినారాయణ సూసైడ్ నోట్లో పేర్కొన్నాడు. కోడూరు వంతెన సెంటర్లో నడుచుకుంటూ వెళ్తున్న ఆదినారాయణ రెండు రోజుల పాటు ముమ్మర గాలింపు.. ఆదినారాయణ బైక్తో పాటు సూసైడ్ నోట్ కూడా వారధిపై ఉండడంతో పోలీసులు ఆదినారాయణ వారధిపై నుంచి కృష్ణానదిలోకి దూకి ఆత్మహత్యకు పాల్పడినట్లు భావించారు. ఇందులో భాగంగా రెండు రోజుల పాటు కోడూరు, పెడన పోలీసులు, ఎన్ఢీఆర్ఎప్ బృందాలు, స్థానిక మత్స్యకారుల సహాయంతో కృష్ణానదిని జల్లెడ పట్టారు. బందరు, కోడూరు మండలాల్లో ప్రవహించే నది ప్రాంతమంతా వెతికినా కూడా ఆదినారాయణ ఆచూకీ లభించలేదు. సహజంగా ఓ వ్యక్తి నదిలో దూకితే 36గంటల లోపు నీటిలో పైకి తేలతాడని, అయితే ఆదినారాయణ ఆచూకీ లభించకపోవడంతో పోలీసులు మరో కోణంలో తమ దర్యాప్తును ప్రారంభించారు. సీసీ టీవీ ఫుటేజీల్లో ఆచూకీ.. ఆదినారాయణ నదిలో దూకలేదని పోలీసులకు అనుమానం రావడంతో పెడన దగ్గర నుంచి కోడూరు వరకు ఉన్న అన్ని సీసీ టీవీ ఫుటేజీలను పోలీసులు నిశితంగా పరిశీలించారు. ఇంటి వద్ద నుంచి బయలుదేరినప్పుడు ఆదినారాయణ వద్ద బ్యాగ్ లేదని, బందరులోని ఓ దుకాణంలో బ్యాగ్ను కొనుగోలు చేసినట్లు గుర్తించారు. అక్కడ నుంచి బైక్పై చిన్నాపురం మీదగా ఉల్లిపాలెం వస్తున్నట్లు సీసీ టీవీల్లో రికార్డు అయింది. ఉల్లిపాలెం వారధి వద్ద ఆదినారాయణ తాను ఇంటి వద్ద వేసుకున్న దుస్తులను మార్చుకొని, ముఖానికి మాస్క్ ధరించి ఆటోలో కోడూరు వెళ్లడాన్ని గుర్తించారు. కోడూరు వంతెన సెంటర్లోని గంగాభవానీ అమ్మవారి దేవాలయం వద్ద ఆదినారాయణ ఆటో దిగడంతో పాటు చేతిలో బ్యాగు పట్టుకొని, మరో బ్యాగు తగిలించుకొని నవ్వుతూ సెల్ఫోన్ల్లో మాట్లాడుకుంటూ అక్కడ తిరగడం సీసీ టీవీల్లో రికార్డు అయ్యింది. కోడూరు నుంచి అవనిగడ్డకు బైక్ను లిఫ్ట్ అడిగి వెళ్లడాన్ని పోలీసులు గుర్తించారు. తప్పుదోవ పట్టించేందుకు.. విషయాన్ని తప్పుదోవ పట్టించేందుకు వారధి వద్ద బైక్, సూసైడ్ నోట్ పెట్టి ఆదినారాయణ బయట ప్రాంతాలకు పరారయ్యాడని పోలీసులు చెప్పారు. చేసిన అప్పులు కట్టకుండా తప్పించుకొనేందుకు ఈ తరహాలో మోసానికి పాల్పడినట్లు తమ విచారణలో తేలిందన్నారు. ఆదినారాయణ ఆచూకీ కోసం పోలీసులు గాలింపు కొనసాగుతుందని, దీనిపై పూర్తిస్థాయిలో విచారణ కూడా కొనసాగుతుందని ఎస్ఐ రాజేంద్రప్రసాద్ తెలిపారు. పెడన పోలీసులు దీనిపై ప్రత్యేక దృష్టి సారించారని ఎస్ఐ చెప్పారు. -
నిలోఫర్ ఆస్పత్రిలో మిస్సైన బాలుడి ఆచూకీ లభ్యం
-
బాలిక మృతి కేసులో వీడని మిస్టరీ..?
బిట్రగుంట: బోగోలు మండలం జువ్వలదిన్నె ఫిషింగ్ హార్బర్ సమీపంలో గత నెల 30న అనుమానాస్పద స్థితిలో లభ్యమైన పదేళ్ల బాలిక మృతి కేసు మిస్టరీగా మారింది. పది రోజులు గడిచినా కేసు దర్యాప్తులో పురోగతి కనిపించకపోవడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. గత నెల 30న వేకువన ఫిషింగ్ హార్బర్ సమీపంలో సముద్రంలో బాలిక మృతదేహాన్ని స్థానిక మత్స్యకారులు గుర్తించిన విషయం తెలిసిందే. బాలిక పెదవులు, మొహం నీలిరంగులో మారి ఉండడం, ముక్కు నుంచి నురగ వచ్చి ఉండడం మినహా ఎటువంటి దెబ్బలు, చేపలు కొరికిన గాయాలు లేకపోవడంతో ఘటన జరిగిన కొద్ది గంటల్లోనే మృతదేహం వెలుగుచూసినట్లుగా భావించారు. సమాచారం అందుకున్న పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం కావలి ఏరియా వైద్యశాలకు తరలించి చేతులు దులుపుకొన్నారు. బాలిక ఎవరనేది తెలిస్తే మృతికి గల కారణాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉన్నా ఆ దిశగా ఎటువంటి చర్యలు చేపట్టిన దాఖలాలు లేవు. జిల్లాతో పాటు సమీప జిల్లాల్లో నమోదైన మిస్సింగ్ కేసులు, వలస కార్మికుల వివరాలను కూడా పూర్తిస్థాయిలో పరిశీలించలేదనే విమర్శలు ఉన్నాయి. ఫిషింగ్ హార్బర్తో పాటు రామాయపట్నం పోర్టు నిర్మాణానికి ఇతర ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో కూలీలు వచ్చి ఉన్నారు. వీరికి సంబంధించి కూడా ఎవరైనా కనిపించకుండా పోయారా అనే కోణంలో కూడా దర్యాప్తు ముందుకు సాగలేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. బాలిక ప్రమాదవశాత్తు సముద్రంలో పడి చనిపోతే తప్పనిసరిగా తల్లిదండ్రులు మిస్సింగ్ కేసు నమోదు చేసి ఉండేవారు. ఎక్కడా మిస్సింగ్ కేసు నమోదవకపోవడం, బాలిక తల్లిదండ్రుల జాడా లేకపోవడంతో అంతా మిస్టరీగా మారింది. పోలీసులు ప్రాథమిక వివరాల పరిశీలనలో విఫలం కావడంతో పాటు సాంకేతిక ఆధారాల సేకరణకు ఎటువంటి ప్రయత్నాలు చేసినట్లుగా కనిపించడం లేదు. ఎక్కడో చనిపోతే ఇక్కడికి కొట్టుకొచ్చిందంటూ కేసును పక్కన పెట్టేసినట్లుగా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఈ విషయంపై బిట్రగుంట ఎస్సై శేఖర్బాబును సంప్రదించగా మృతి చెందిన బాలికకు సంబంధించి ఇంకా ఎటువంటి వివరాలు లభ్యం కాలేదని తెలిపారు. రాష్ట్రంలో మిస్సింగ్ కేసులకు సంబంధించిన వివరాలు అన్నీ పరిశీలించినా ఎటువంటి సమాచారం సరిపోలేదన్నారు. పోస్టుమార్టం రిపోర్టు వచ్చిన తరువాత మృతికి కారణాలు తెలిసే అవకాశం ఉందని తెలిపారు. -
ఓ అమాయకురాలి విషాద గాథ! చంపింది స్నేహితుడా?.. ప్రేమికుడా?..
నిజాలను అబద్ధాలుగా.. అబద్ధాలను నిజాలుగా మార్చేయడం నేరగాళ్లకు వెన్నతో పెట్టిన విద్య. అలాంటివాళ్ల గారడీలో చిక్కిన అమాయకుల కథ ప్రపంచానికి తెలియకుండానే ముగిసిపోతుంది. చరిత్రలో మిస్టరీగా మిగిలిపోతుంది. కాథీ ఫోర్డ్ వ్యథ అలాంటిదే. వెస్ట్ వర్జీనియాలోని గోర్మానియా, మేరీల్యాండ్ సమీపంలో ఉన్న ఓల్డ్మిల్ రెస్టారెంట్ అది. 1988 ఫిబ్రవరి 17 మధ్యాహ్నం ఒంటిగంటకు ఓ ఫోన్ మోగింది. అందులో వెయిట్రెస్గా పని చేస్తున్న కాథీ ఫోర్డ్ అనే 19 ఏళ్ల అమ్మాయి ఆ ఫోన్ లిఫ్ట్ చేసింది. ఆ రెస్టారెంట్ ఆమె తల్లిదండ్రులదే. అందులో తను పార్ట్టైమ్ జాబ్ చేస్తూ ఉండేది. ఫోన్ పెట్టెయ్యగానే ఆమె చాలా కంగారుగా, అందులో పనిచేసే మరో ఉద్యోగినితో ‘కాల్ చేసింది ఓ మేజిస్ట్రేట్ అట, మైనర్లకు మద్యం అమ్ముతున్న బార్లు, రెస్టారెంట్లపై పోలీస్ విభాగం కఠినంగా వ్యవహరిస్తోందని అతడు హెచ్చరించాడు’ అని ఇతర వివరాలేమీ చెప్పకుండా అక్కడి నుంచి పరుగుతీసింది. ఆమె అదే కంగారుతో ఇంటికి వెళ్లి స్నానం చేసి, డ్రెస్ మార్చుకుని.. సరిగ్గా గంటకి రెస్టారెంట్కి తిరిగి వచ్చింది. అంతే వేగంగా తన పర్స్ అందుకుని, తన తండ్రి కారులో బయలుదేరింది. అదే ఆమె కనిపించిన ఆఖరి దృశ్యం. సాయంత్రం దాకా ఆమె కోసం ఎదురు చూసిన తల్లిదండ్రులు.. పోలీసులకు కంప్లైంట్ ఇచ్చారు. మరునాడు కాథీ బాయ్ఫ్రెండ్ డార్విన్ పోలీసుల్ని కలసి.. గోర్మానియాకు చెందిన డిప్యూటీ షెరీఫ్ పాల్ ఫెర్రెల్పై తనకు అనుమానం ఉందని, కాథీకి అతడితో పరిచయం ఉందని చెప్పాడు. పైగా గతరాత్రి కాథీని ఫెర్రెల్ నివాస గృహానికి సమీపంలో చూశానని సాక్ష్యమిచ్చాడు. దాంతో అదేరోజు ఫెర్రెల్ని అదుపులోకి తీసుకుని పోలీసులు విచారించారు. ‘కాథీ నాకు ప్రియురాలి కంటే ముందు గొప్ప స్నేహితురాలు.. గత రాత్రి ఎనిమిదిన్నర సమయంలో స్థానిక క్లబ్హౌస్కి నా కోసం కాథీ కాల్ చేసి, కలుద్దాం అంటూ ఏడ్చింది. హైస్కూల్ పార్కింగ్ స్థలంలో ఎదురుచూస్తా త్వరగా రా అన్నాను. సుమారు 20 నిమిషాలు ఎదురు చూసినా తను రాలేదు’ అంటూ ఫెర్రెల్ బదులిచ్చాడు. ఫెర్రెల్ అప్పటికే బెర్నార్డ్ అనే మహిళతో రిలేషన్లో ఉన్నాడు. వారికి ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. 1988 జనవరిలోనే ఫెర్రెల్ వెస్ట్ వర్జీనియాలోని గ్రాంట్ కౌంటీలో డిప్యూటీ షెరీఫ్గా జాయిన్ అయ్యాడు. సరిగ్గా నెలకు కాథీ మిస్ అయ్యింది. ‘1987 నుంచే మా మధ్య పరిచయం ఉంది. మా కలయిక చాలా రహస్యంగా నడిచేది. ఇటు బెర్నార్డ్కి కానీ, అటు కాథీ బాయ్ ఫ్రెండ్కి కానీ తెలియకుండా జాగ్రత్తపడేవాళ్లం. జాబ్ వచ్చిన తర్వాత కాథీకి సమీపంలో బిస్మార్క్ రోడ్లో ఇల్లు అద్దెకు తీసుకుని ఒంటరిగా ఉండేవాడ్ని. అప్పుడప్పుడు కాథీ నా దగ్గరకు వచ్చేది’ అని ఫెర్రెల్ చెప్పాడు. ఆధారాలు లేక అతడ్ని వదిలిపెట్టేశారు. సరిగ్గా వారానికి ఓల్డ్మిల్ రెస్టారెంట్కి ఓ లేఖ వచ్చింది. అందులో ‘నేను క్షేమంగానే ఉన్నాను.. నా కోసం వెతకొద్దు’ అని కాథీ రాసినట్లుంది. అయినా డార్విన్.. కాథీ కోసం వెతకడం ఆపలేదు. మరో రెండు వారాలకు ఫెర్రెల్ నివాసం ఉండే ఇంటికి కిలోమీటర్లోపే, అడవిలో కాథీ తీసుకెళ్లిన కారు కాలి బూడిదై కనిపించింది. ఎక్కడా కాథీ ఆనవాళ్లు కానీ, మృతదేహం కానీ కనిపించలేదు. వెంటనే.. రెస్టారెంట్కి వచ్చిన లేఖలోని చేతిరాతపై నిఘా పెట్టారు అధికారులు. అది ఫెర్రెల్ చేతిరాతేనని తేలడంతో కేసు బిగుసుకుంది. అయితే ఫెర్రెల్ ఇంకో షాకిచ్చాడు.. ‘ఆ కారు అక్కడున్న విషయం నాకు ముందే తెలుసు. కాథీ కేసు విషయంలో నన్ను విచారించి, వదిలిపెట్టిన మరునాడే కాథీ కోసం వెతుకుతుంటే.. ఆ కారు అక్కడ కనిపించింది. కాథీ శవం కారులో ఉందేమోనన్న భయంతో ఎవరికీ చెప్పలేదు. ఎవరో నన్ను ఇరికిస్తున్నారని అర్థమై ఆ లేఖ రాసి తప్పించుకోవాలని అనుకున్నా’ అన్నాడు. మరోవైపు ఫెర్రెల్ బెడ్రూమ్లో గోడ మీద రక్తం మరకలు ఉండటంతో ఆ శాంపిల్స్ ల్యాబ్కి పంపించారు పోలీసులు. అది ఓ మహిళ రక్తమని తేలింది కానీ కాథీదో కాదో తేల్చలేకపోయారు. దాని గురించి ఫెర్రెల్ని అడిగితే.. ఆ మరకలు తాను అద్దెకు రాకముందు నుంచే ఆ గోడ మీద ఉన్నాయని చెప్పాడు. ఇక ఫెర్రెల్ నివాసానికి పొరుగున ఉండే కిమ్ నెల్సన్ అనే మహిళ.. ఫిబ్రవరి 17 రాత్రి తనకు సమీపంలో ఓ అమ్మాయి అరుపులు, తుపాకీ శబ్దాలు వినిపించాయని సాక్ష్యమిచ్చింది. దాంతో కాథీని చంపి మృతదేహాన్ని ఫెర్రెల్ ఎక్కడో దాచేశాడని నమ్మేవాళ్లు పెరిగిపోయారు. అలా సుమారు పదిహేనేళ్లు జైల్లోనే ఉండిపోయాడు ఫెర్రెల్. మరోవైపు అతడు.. పరిచయస్తులైన ఆడవారికి అజ్ఞాత ఫోన్ కాల్స్ చేసి.. అసభ్యకరమైన మాటలు మాట్లాడేవాడని తేలింది. తను చెప్పిన చోటుకు రావాలని బెదిరించేవాడని కొందరు మహిళలు సాక్ష్యమిచ్చారు. ఆ ఆరోపణలను ఫెర్రెల్ అంగీకరించినప్పటికీ.. ఈ ఫోన్ కాల్స్కి, కాథీ మిస్సింగ్కి సంబంధం లేదని వాదించాడు. అయితే కాథీకి ఆ రోజు కాల్ చేసింది ఫెర్రెలే అయ్యుంటాడని, ఏదో చెప్పి బెదిరించడంతోనే ఆమె వెళ్లి ఉంటుందని.. గతంలో ఇద్దరి మధ్య ఉన్న స్నేహపూర్వకమైన సంబంధాన్ని అతడు కావాలనే తప్పుగా క్రియేట్ చేసి చెబుతున్నాడని కొందరు అధికారులు భావించారు. అయితే అతడు నిర్దోషి అనేందుకు మార్టిన్ అనే ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్ట్ ఓ జంటను సాక్ష్యంగా తీసుకొచ్చాడు. కాథీ కనిపించకుండా పోయిన ఏడాదికి.. టెన్నెసీ గుండా వెళుతుంటే మార్గంమధ్యలో ఓ రెస్టారెంట్లో కాథీ.. వెయిట్రెస్గా పనిచేయడం చూశామని ఆ జంట చెప్పుకొచ్చింది. ‘మీరు కాథీనే కదా?’ అని అడ గటానికి ప్రయత్నించినప్పుడు ఆమె కిచెన్లోకి పారిపోయిందని వాళ్లు చెప్పారు. మరోవైపు తనతో ఆ రోజు పోలీసులు బలవంతపు సాక్ష్యం చెప్పించారని కిమ్ వెల్లడించింది. దాంతో ఫెర్రెల్ పట్ల సానుభూతిపరులు పెరిగారు. 2002లో అతడికి పెరోల్ లభించింది. అయితే కాథీ తమని వదిలి ఉండాలనుకునే మనిషి కాదని.. తనను ఎవరో చంపేసి ఉంటారని ఆమె కుటుంబం నమ్మింది. ఈ కేసులో కాథీ స్నేహితులు కొందరు అసలు నేరస్థుడు డార్విన్ కావచ్చన్నారు. ఎందుకంటే కాథీ నిత్యం డార్విన్కే భయపడుతూ బతికేదని వాళ్లు గుర్తుచేసుకున్నారు. ఈ ఉదంతంలో కాథీ చనిపోయిందా? లేక పారిపోయిందా? డార్విన్ చంపేసి.. కేసు ఫెర్రెల్ని చుట్టుకునేలా ప్లాన్ చేశాడా? లేక ఫెర్రెలే చంపేసి.. అమాయకంగా నాటకం ఆడాడా? కాథీకి ఆ రోజు మధ్యాహ్నాం కాల్ చేసింది ఎవరు? ఇలా అన్నీ మిస్టరీగానే మిగిలాయి. --సంహిత నిమ్మన (చదవండి: కూతుర్నే పెళ్లాడిన ఓ నీచపు తండ్రి కథ..ఆఖరికి ఆమె కొడుకుని సైతం..) -
హైదరాబాద్ లో విషాదంతమైన బాలుడి మిస్సింగ్
-
మహిళల అదృశ్యంపై తప్పుడు లెక్కలు
సాక్షి, అమరావతి: మహిళల అదృశ్యంపై తెలుగుదేశం పార్టీ తప్పుడు లెక్కలతో అవాస్తవాలు ప్రచారం చేస్తోందని వైఎస్సార్సీపీ మహిళా విభాగం రాష్ట్ర అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ పోతుల సునీత ధ్వజమెత్తారు. ఆమె శుక్రవారం తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ ‘రాష్ట్రంలో 2019–21 మధ్య 24,557 మిస్సింగ్ కేసుల్లో 23,399 మంది ఆచూకీ లభించింది. వారిని పోలీసులు కుటుంబ సభ్యులకు అప్పగించారు. ఇంకా ఆచూకీ తేలాల్సింది 1,158 కేసుల్లోనే.. వాస్తవాలిలా ఉంటే.. చంద్రబాబు, లోకేశ్, పవన్ కాకి లెక్కలతో ప్రజల్ని నమ్మించే ప్రయత్నం చేస్తున్నారు. చంద్రబాబు దుశ్శాసన పాలనలో ఎన్నో అఘాయిత్యాలు జరిగాయి. కాల్మనీ సెక్స్రాకెట్, వనజాక్షి, రిషితేశ్వరి వంటి ఘటనల్ని మహిళలు మరువరు. మహిళలపై వేధింపుల్లో నాడు రాష్ట్రం దేశంలోనే 4వ స్థానంలో, అక్రమ రవాణాలో రెండో స్థానంలో ఉండేది. స్వార్థ రాజకీయాలకు మహిళల్ని అడ్డుపెట్టుకునే నీచుడు చంద్రబాబు. ఆనాడు లక్ష్మీపార్వతిని అడ్డం పెట్టుకుని ఎన్టీఆర్కు వెన్నుపోటు పొడిచాడు. ఇటీవల సొంత భార్యను కూడా స్వార్థ రాజకీయానికి వాడుకోవాలని చూసిన దుర్మార్గుడు. బాబు దత్తపుత్రుడైన పవన్ ఉన్మాదంతో ప్రభుత్వంపై దు్రష్పచారం చేస్తున్నాడు’ అని దుయ్యబట్టారు. సీఎం జగనన్న అంటే రాష్ట్ర ప్రజలకు ఒక నమ్మకం, ధైర్యమని సునీత చెప్పారు. -
మిర్యాలగూడకు చెందిన బీటెక్ విద్యార్థి మిస్సింగ్ విషాదాంతం
-
అంతు చిక్కని మిస్టరీ..మార్లిన్ శాంటానా మూడు రోజుల పాప కథ..
కొన్నిసార్లు ఆకస్మిక ప్రమాదాల నుంచి తేరుకునేలోపే జరగాల్సిన నష్టం జరిగిపోతుంది. జీవితమే ఒక పీడకలగా మిగిలిపోతుంది. శాంటానా కుటుంబానికి ఆనందం, విషాదం రెండూ ఒకదాని వెంట ఒకటి కవలపిల్లల్లా వచ్చాయి. కేవలం ఆనందమే మిగులుంటే ఈ రోజు ఈ కథ మిస్టరీ అయ్యేదే కాదు. అసలు మార్లీన్ శాంటానా ఎవరు? తనకేమైంది? మార్లీన్ శాంటానా కేవలం మూడు రోజుల పాప. కడుపులో ఉన్నప్పుడే తనకు మార్లీన్ అనే పేరుపెట్టాలని ఆ తల్లిదండ్రులు కలలుగన్నారు. కానీ అలా జరగలేదు. అది 1985 అక్టోబర్ 21. రాత్రి తొమ్మిది దాటింది. అమెరికా, న్యూయార్క్లోని బ్రూక్లిన్లోని బ్రూక్డేల్ హాస్పిటల్ ముందు జనాలంతా ఒక్కొక్కరుగా పలుచబడుతున్నారు. పేషెంట్స్ రద్దీ తగ్గి.. డాక్టర్లు, నర్సులు అంతా సేదతీరుతున్నారు. అప్పుడే ఫ్రాన్సిస్కా శాంటానా అనే మూడురోజుల బాలింత డిశ్చార్జ్ అయ్యి.. తన పాపను ఎత్తుకుని ఆసుపత్రి రూమ్ నుంచి బయటికొచ్చింది. భార్యతో పాటు తన బుల్లి ప్రిన్సెస్ని ఇంటికి తీసుకుని వెళ్లడానికి ఫ్రాన్సిస్కా భర్త థామస్ చాలా సంబరంగా ఎదురుచూస్తున్నాడు. సాయం కోసం ఇంటి నుంచి.. ఫ్రాన్సిస్కా వాళ్ల ఇద్దరు అత్తలూ ఆసుపత్రికి వచ్చారు. నలుగురూ కలసి.. పాపను, లగేజ్ని తీసుకుని.. ఆసుపత్రి ప్రాంగణం నుంచి కొంచెం ముందుకు వెళ్లారు. సరిగ్గా అప్పుడే సుమారు పాతికేళ్ల అపరిచితురాలు వాళ్ల దగ్గరకు వచ్చి.. ‘ఎక్కడికి వెళ్తున్నారు’ అంటూ మాట కలిపింది. ‘ఇప్పుడే డిశ్చార్జ్ చేశారు. ఇంటికి వెళ్తున్నాం’ అని చెప్పింది ఫ్రాన్సిస్కా. ఆమె ప్రశ్నలైతే వేస్తుంది కానీ.. చూపులు మాత్రం వాళ్లవైపు లేవు. పరిసరాలను గమనిస్తున్న కంగారు.. ఆమె కళ్లల్లో తొణికిసలాడుతోంది. స్ట్రీట్లైట్ వెలుగుల్లో అది స్పష్టంగా కనిపిస్తోంది. కానీ థామస్ ఫ్యామిలీ మాత్రం అదంతా పట్టించుకునే స్థితిలో లేదు. వాళ్ల హడావుడిలో వాళ్లున్నారు. అప్పుడే సడెన్గా ‘నేను మీ కోసం ఉదయం నుంచి ఎదురు చూస్తున్నా’ అంది ఆమె. ఆ మాటలకు ఫ్రాన్సిస్కా అర్థం కానట్లుగా ఆమెవైపు అయోమయంగా చూసింది. ఆమె భయాన్ని పసిగట్టేసిన ఆ మహిళ.. వెంటనే తుపాకీ బయటికి తీసింది. క్షణాల్లో పసిపాప తలకు గురిపెట్టి ‘అరిస్తే చంపేస్తా, నేను చెప్పిందే చెయ్యాలి’ అంది. థామస్ కుటుంబానికి గుండె ఆగినంత పనైంది. ఆమె కళ్లు పెద్దవి చేస్తూ.. గద్దిస్తూ వాళ్లను చాలా దూరం నడిపించింది. గుండె లోతుల్లోంచి దుఃఖం తన్నుకొస్తున్నా.. పాప కోసం చెప్పింది చెప్పినట్లే చేయడానికి వాళ్లు సిద్ధపడ్డారు. ఊహించని ఆ ప్రమాదానికి ఎలా స్పందించాలో, ఎలా తప్పించుకోవాలో థామస్కి అర్థం కాలేదు. దాదాపు రోడ్లన్నీ నిర్మానుష్యంగానే ఉన్నాయి. అరకొర అలికిడి ఉన్నా, సమీపంలో ఎవ్వరూ లేరు. కాస్త దూరంలో జంక్ యార్డ్ దగ్గర ‘ఆగండి’ అంటూ గదమాయించింది. ‘ప్లీజ్ మమ్మల్ని వదిలిపెట్టు.. మేము పాప పుట్టిన ఆనందంలో ఉన్నాం. మా దగ్గర విలువైనవి కూడా ఏం లేవు’ అంటూ ఫ్రాన్సిస్కాతో పాటు అంతా ఆ స్త్రీని వేడుకుంటూనే ఉన్నారు. కానీ ఆమె వినిపించుకోలేదు. అప్పటి దాకా ఆమె ఒక దోపిడీదారని, డబ్బు లేదా విలువైన వస్తువులు లాక్కోవడానికే దాడి చేసిందని అనుకున్నారు. కానీ వారి అంచనాలను తారుమారు చేస్తూ.. పసిపాపను తన చేతికి ఇవ్వాలని.. గన్ ట్రిగ్గర్ మీద వేలును ప్రెస్ చేయడానికి సిద్ధంగా ఉన్నట్లు భయపెట్టింది. ‘నా బిడ్డను ఏం చేయొద్దు ప్లీజ్’ అని ఏడుస్తూ నిస్సహాయంగా పాపను ఆ స్త్రీ చేతుల్లో పెట్టింది ఫాన్సిస్కా. అలా పెట్టగానే ఒక్క ఉదుటున అందరినీ తోసిపడేసిన ఆ మహిళ.. పాపతో సహా పరుగందుకుంది. క్షణాల్లో అక్కడ దగ్గర్లో స్టార్ట్ చేసి ఉన్న కారు ఎక్కి ‘పోనీ త్వరగా’ అంది. శాంటానా ఫ్యామిలీ ఆ షాక్లోంచి తేరుకునే లోపే కారు వేగం అందుకుంది. ‘నా పాప.. ప్లీజ్ నా పాపను నాకు ఇచ్చేయండి, కారు ఆపండి’ అంటూ బాలింత ఫ్రాన్సిస్కా కారు వెనుకే పరుగు తీసిన దృశ్యం.. ఆ కుటుంబాన్ని ఎంతగానో కలచివేసింది. వెంటనే వారంతా పోలీస్స్టేషన్కి పరుగుతీసి, జరిగిందంతా చెప్పారు. పోలీసుల విచారణలో ఓ సీసీ ఫుటేజ్ దొరికింది. దానిలో పాపను తీసుకుని ఆమె పారిపోయే సీన్ దూరం నుంచి కనిపించింది. కానీ స్పష్టత లేదు. కాలక్రమంలో పత్రికలే పాపకు మార్లీన్ అని నామకరణం చేశాయి. అయితే ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే.. పాప కిడ్నాప్కి ముందు ఆ మహిళను ఫ్రాన్సిస్కా.. ఆసుపత్రిలోని పిల్లల వార్డ్లో కలుసుకుంది. అక్టోబర్ 19 మధ్యాహ్నసమయంలో ఆ స్త్రీ.. ఫ్రాన్సిస్కాతో మాట్లాడిందట. ‘నేను వేరే పాప కోసం వచ్చాను. కానీ మీ పాప చాలా అందంగా ఉంది. అసలు ఏడవకుండా ఎంత ముద్దుగా ఉందో.. నాకు మీ పాప బాగా నచ్చింది’ అని పొగిడిందట. ఆ రోజు ఆ పొగడ్తలకు సంతోషించిందే తప్ప అనుమానించలేదు. అదే అపరాధభావం ఫ్రాన్సిస్కాను వేధించింది. ఈ ఘటనకు ముందు న్యూయార్క్లోని మరో ఆసుపత్రిలో క్రిస్టోఫర్ మోర్గాన్ అనే రెండు నెలల బాబు అపహరణకు గురయ్యాడు. కొన్ని నెలల తర్వాత ఒకరి ఇంట్లో సజీవంగా దొరికాడు. వారు తాము పోగొట్టుకున్న బిడ్డ స్థానంలో క్రిస్టోఫర్ని చట్టవిరుద్ధంగా దత్తత తీసుకుని పెంచుకుంటున్నారని తేలింది. దాంతో మార్లీన్ని ఎత్తుకెళ్లిన స్త్రీ వృత్తిరీత్యా నేరస్థురాలు కాకపోవచ్చని.. బహుశా ఆమె బిడ్డను పోగొట్టుకుని, తన పాప స్థానంలో మార్లీన్ని పెంచుకుంటుంది కాబోలని చాలామంది భావించారు. అదే అనుమానంతో పోలీసులు చుట్టుపక్కల ఆసుపత్రులన్నీ జల్లెడపట్టి.. గర్భస్రావాలు లేదా ప్రసవాలు జరిగిన చాలామంది మహిళలను విచారించారు. కానీ ఏ ఆచూకీ రాబట్టలేకపోయారు. నేటికీ మార్లీన్ ఆచూకీ తేలలేదు. కేవలం రోజుల పాపే కావడం, రియల్ ఫొటో ఒక్కటి కూడా లేకపోవడంతో గత 38 ఏళ్లుగా.. మార్లీన్ ఊహాచిత్రాలు పెరిగాయి తప్ప ఫలితం లేదు. మార్లీన్ కుటుంబ సభ్యులు మాత్రం ఆమె ప్రతి పుట్టిన రోజునూ జరుపుకుంటున్నారు. ఆమె రాక కోసం ఇప్పటికీ ఎదురు చూస్తూనే ఉన్నారు. --సంహిత (చదవండి: ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన క్లబ్..ఇందులో చేరాలంటే.) -
వీరు ఎక్కడికి వెళ్లారు.. అసలేం జరిగింది?
హైదరాబాద్: ఇంట్లో నుంచి బయటకు వెళ్లిన తల్లీ కూతుళ్లు కనిపించకుండా పోయిన ఘటన శుక్రవారం మేడిపల్లి పోలీస్స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. ఎస్సై సందీప్కుమార్ వివరాల ప్రకారం మేడిపల్లి పీఅండ్టీ కాలనీలో నివసించే డి.వెంకటేశ్వర్లు, ఈశ్వరమ్మ(37) భార్యాభర్తలు. ఈశ్వరమ్మ గృహిణి. వీరికి పూర్వజ(19), హరిణి(18) కూతుళ్లు. ప్రస్తుతం వీరు చదువుకుంటున్నారు. ఈ నెల 20వ తేదీన మధ్యాహ్నం 1.30 గంటల సమయంలో ఇంట్లో చెప్పకుండా ఈశ్వరమ్మ, ఇద్దరు కుమార్తెలు వెళ్లిపోయారు. ఎంత వెతికినా కనిపించకపోవడంతో వెంకటేశ్వర్లు మేడిపల్లి పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. అన్నదమ్ములను చిదిమేసిన రోడ్డు ప్రమాదం! -
పోస్టల్ ఉద్యోగుల అలసత్వమే..
సాక్షి, ఆదిలాబాద్/ఉట్నూర్: ఆదిలాబాద్ జిల్లా ఉట్నూర్లో పదో తరగతి జవాబు పత్రాల బండిల్ మిస్సింగ్ కేసులో పోస్టల్ సిబ్బంది నిర్లక్ష్యమే కనిపిస్తోంది. సోమవారం ప్రథమ భాష పరీక్ష తర్వాత జవాబు పత్రాలను పరీక్ష కేంద్రాల చీఫ్ సూపరింటెండెంట్లు, డిపార్ట్మెంటల్ అధికారులు ఉట్నూర్ పోస్టాఫీసుకు అందించారు. ఇక్కడ బండిళ్లను తయారు చేసి బస్సు ద్వారా వరంగల్కు పంపించాలి. పోస్టాఫీస్ నుంచి ఆటోలో సిబ్బంది ఎంటీఎస్, ఈడీ ప్యాకర్ వెంటఉండి వాటిని బస్టాండ్కు తరలించాలి. అయితే ఈ సిబ్బంది ఎవరూ వెంట లేకుండానే ఆటోలో వేసి వారు తమ ద్విచక్ర వాహనం ద్వారా వెళ్లారు. బస్టాండ్కు వెళ్లిన తర్వాత 11 బండిల్స్ (కట్ట) నుంచి ఒకటి మిస్ అయ్యింది. పోస్టుమాస్టర్ ఫిర్యాదు మేరకు సోమవారం సాయంత్రం ఉట్నూర్ పోలీసులు కేసు నమోదు చేసుకొని పేపర్ బండిల్ కోసం వెతికినప్పటికీ దొరకలేదు. మంగళవారం ఉదయం కలెక్టర్ రాహుల్ రాజ్ ఆదేశాల మేరకు అదనపు కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్, డీఈవో ప్రణీత ఉట్నూర్ చేరుకున్నారు. మొదట పోస్టాఫీసుకు వెళ్లగా సెలవు కారణంగా వారు అందుబాటులో లేరు. దీంతో వీరు స్థానిక పోలీసు స్టేషన్కు చేరుకొని డీఎస్పీ నాగేందర్ను కలిసి వివరాలు తెలుసుకున్నారు. అక్కడి నుంచి ఎంపీడీవో కార్యాలయానికి చేరుకున్న అధికారులు పూర్తి విషయాలపై ఆరా తీశారు. కాగా, నిజామాబాద్ పోస్టల్ డిపార్ట్మెంట్ సూపరింటెండెంట్ ఉమామహేశ్వర్రావు ఉట్నూర్ చేరుకొని బండిల్ మిస్సింగ్ విషయంలో విచారించారు. ఇదిలా ఉంటే పోలీసులు పోస్టల్ కార్యాలయం నుంచి బస్టాండ్ వరకు ఆటో వెళ్లిన దారిలో రోడ్డు పక్కన ఉన్న సీసీ కెమెరాలను తనిఖీ చేశారు. మంగళవారం సాయంత్రం వరకు పేపర్ బండిల్ దొరకలేదు. పరీక్ష రాసిన 9 మంది విద్యార్థుల జవాబు పత్రాల బండిల్ మిస్సింగ్తో ఆ విద్యార్థుల్లో ఆందోళన వ్యక్తమవుతుంది. ఇద్దరిపై వేటు టెన్త్ జవాబు పత్రాల బండిల్ మిస్సింగ్ ఘటనలో పోస్టాఫీస్ ఉద్యోగి ఎంటీఎస్ రజితపై సస్పెన్షన్ వేటుపడింది. ఈ క్రమంలోనే ఆమె అస్వస్థతకు గురికాగా ఆదిలాబాద్లోని రిమ్స్ కు తరలించారు. మరో ఔట్సోర్సింగ్ ఉద్యోగి నాగరాజును బాధ్యతల నుంచి తప్పించారు. -
తండ్రి మిస్సింగ్ కేసులో క్రికెటర్కు ఊరట
టీమిండియా క్రికెటర్ కేదార్ జాదవ్కు తండ్రి మిస్సింగ్ కేసులో ఊరట లభించింది. సోమవారం తన తండ్రి మహదేవ్ జాదవ్ కనిపించడం లేదంటూ పుణేలోని అలంకార్ పోలీసులను ఆశ్రయించి మిస్సింగ్ కేసు ఫైల్ చేశాడు. కాగా మంగళవారం సాయంత్రం కేదార్ జాదవ్ తండ్రి మహదేవ్ జాదవ్ ముంద్వా ఏరియాలో ఉన్నట్లు అక్కడి సీసీ కెమెరాల ద్వారా గుర్తించారు. వెంటనే అక్కడికి చేరుకున్న పోలీసులు మహదేవ్ జాదవ్ను తమ వెంట తీసుకొచ్చి కేదార్ జాదవ్ కుటుంబసభ్యులకు అప్పగించారు. కేదార్ జాదవ్ తన తల్లిదండ్రులు మహదేవ్ జాదవ్, మందాకినిలతో కలిసి పుణేలోని కొథ్రూడ్లోని సిటీప్రైడ్ థియేటర్ సమీపంలో నివసిస్తున్నాడు. 75 సంవత్సరాల వయసు ఉన్న మహదేవ్ జాదవ్ డిమెన్షియా వ్యాధితో బాధపడుతున్నారు. ఇంట్లోని పార్క్లో మార్నింగ్ వాక్ చేస్తున్న మహదేవ్ ఆ తర్వాత గేట్ తీసుకొని బయటికి వెళ్లారు. కొథ్రూడ్ జంక్షన్లో ఆటో ఎక్కి వెళ్లిపోయారు. ఆ తర్వాత కనిపించకుండా పోయినట్లు పోలీసులు సీసీటీవీ ఫుటేజీ ద్వారా గుర్తించారు. దీంతో అలంకార్ పోలీసులను ఆశ్రయించిన కేదార్ జాదవ్ తండ్రి మిస్సింగ్ కేసు ఫైల్ చేశాడు. ''కేదార్ జాదవ్ తండ్రి మహదేవ్ జాదవ్ కొంతకాలంగా మతిమరుపు(డిమెన్షియా) వ్యాధితో బాధపడుతున్నాడు. సోమవారం మార్నింగ్ వాక్ కోసమని బయటికి వెళ్లిన మహదేవ్ జాదవ్ ముంద్వా ఏరియాకు చేరుకున్నాడు. తాను ఎక్కడ ఉన్నానో తెలియక కాస్త అయోమయానికి గురయ్యాడు. సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా మహదేవ్ కదలికలను గుర్తించాం. ప్రస్తుతం అతని మానసిక స్థితి సరిగ్గానే ఉందని.. కుటుంబసభ్యులకు అప్పగించామని'' సీనియర్ ఇన్స్పెక్టర్ అజిత్ లక్డే తెలిపారు. తన తండ్రిని క్షేమంగా అప్పగించినందుకు కేదార్ జాదవ్ అలంకార్ పోలీసులకు కృతజ్ఞతలు తెలిపాడు. ఇక 2014లో టీమిండియా తరపున అంతర్జాతీయ క్రికెట్లో అరంగేట్రం చేసిన కేదార్ జాదవ్ 73 వన్డేల్లో 1389 పరుగులు, 9 టి20ల్లో 122 పరుగులు సాధించాడు. గతంలో సీఎస్కే, ఎస్ఆర్హెచ్లకు ప్రాతినిధ్యం వహించిన కేదార్ జాదవ్ 2022లో జరిగిన వేలంలో అమ్ముడిపోని ఆటగాడిగా మిగిలిపోయాడు. చదవండి: హ్యాట్రిక్ గోల్స్తో రికార్డు.. సెంచరీ కొట్టిన మెస్సీ 'నెట్ బౌలర్గా ఆఫర్.. బోర్డు పరీక్షలను స్కిప్ చేశా' -
Hyderabad: ఇద్దరు బాలికల అదృశ్యం
సాక్షి, బంజారాహిల్స్: ఫిలింనగర్లోని రౌండ్ టేబుల్ ప్రభుత్వ పాఠశాలలో 7వ తరగతి చదువుతున్న వి.శిరీష (12) అనే బాలిక అనుమానాస్పద స్థితిలో అదృశ్యమైంది. అయితే తమ కూతురిని డబ్బు కోసం కిడ్నాప్ చేశారంటూ తండ్రి వి.కృష్ణ ఆరోపించారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఫిలింనగర్లోని దుర్గా భవానీనగర్లో నివసించే వి.శిరీష స్థానికంగా ఏడో తరగతి చదువుతోంది. ఈ నెల 12న ఉదయం తల్లిదండ్రులు జీహెచ్ఎంసీలో పనులకు వెళ్లగా, ఇంట్లో ఉన్న సోదరి కనిపించడం లేదంటూ కొడుకు నరేష్ తండ్రికి ఫోన్ చేసి చెప్పాడు. హుటాహుటిన ఇంటికి చేరుకున్న కృష్ణ, సుజాత దంపతులు అన్ని ప్రాంతాల్లో గాలించినా ఫలితం లేకుండా పోయింది. తనకు వరుసకు మేనల్లుడు వి.మల్లేష్ (22) కూడా కనిపించడం లేదని, అతడిపైనే తమకు అనుమానం ఉందని పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో కృష్ణ పేర్కొన్నాడు. డబ్బుల కోసం తన కూతురిని కిడ్నాప్ చేశారని, సీసీ కెమెరా ఫుటేజీలో మల్లేష్ తల్లి సరోజమ్మ తన కూతురిని తీసుకెళ్తున్న దృశ్యం కనిపించిందన్నారు. మల్లేష్ ఇటీవల తనను రూ. 50 వేలు అడిగాడని, తాను లేవని చెప్పడంతో కక్ష పెంచుకొని తన కూతురికి మాయమాటలు చెప్పి కిడ్నాప్ చేశారని ఆరోపించారు. బంజారాహిల్స్ పోలీసులు మిస్సింగ్ కేసు నమోదు చేసి బాలిక ఆచూకీ కోసం గాలిస్తున్నారు. శిరీష ఆచూకీ తెలిసిన వారు 8712660458 నంబర్లో సంప్రదించాలని పోలీసులు కోరారు. బంజారాహిల్స్లో 9వ తరగతి విద్యార్థిని బంజారాహిల్స్: అనుమానాస్పదస్థితిలో 9వ తరగతి విద్యార్థిని అదృశ్యమైన ఘటన బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... బంజారాహిల్స్ రోడ్ నం 10లోని నూర్నగర్లో నివసించే అమ్రీన్ బేగం(14) సెయింట్ నిజామియా హైస్కూల్లో చదువుతోంది. ఈ నెల 21న జహిరానగర్లోని షాహిన్ కన్వెన్షన్ హాల్లో పదో తరగతి విద్యార్థులకు నిర్వహించిన ఫేర్వెల్ పార్టీకి హాజరైంది. రాత్రి 11 గంటల ప్రాంతంలో సోదరుడు హనీఫ్ ఫోన్ చేయగా కార్యక్రమం ఇంకా జరుగుతున్నదని, కొద్దిసేపట్లో వస్తానని తెలిపింది. అయితే సోదరుడు కొంత సమయం తర్వాత హాల్ వద్దకు వచ్చి చూడగా కనిపించలేదు. రాత్రి ఒంటిగంట వరకు బంధుమిత్రుల ఇళ్లల్లో గాలించినా ఫలితం లేకుండా పోయింది. దీంతో షాహిన్ కన్వెన్షన్ హాల్ నుంచి రాత్రి 11.30 గంటల ప్రాంతంలో తన చెల్లెలు అదృశ్యమైందని పోలీసులకు హనీఫ్ ఫిర్యాదు చేయడంతో మిస్సింగ్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
30 ఏళ్ల క్రితం అదృశ్యమైన మహిళ బామ్మగా ప్రత్యక్షమై..
ఒక మహిళ 30 ఏళ్ల క్రితం కనిపిచకుండా పోయింది. ఇక కనిపించదు, ఈ మిస్సిగ్ కేసు వీడదు అనుకుని కేసు క్లోజ్ చేసి మరీ.. ఆమె చనిపోయిందని ప్రకటించారు అధికారులు. ఆ తర్వాత అనుహ్యంగా ఝలక్ ఇస్తూ.. ఆ మహిళ బతికి ఉన్నానంటూ ఓ నర్సింగ్ హోంలో ప్రత్యక్షమైంది. దీంతో ఒక్కసారిగా కంగుతిన్న పోలీసులు ఆమె గురించి పూర్తి స్థాయిలో విచారించడం ప్రారంభించారు. విచారణలో.. ప్యాటిసియా కోప్టా అనే మహిళ చివరిసారిగా 1992లో పెన్సిల్వేనియాలోని పీటర్స్బర్గ్లో కనిపిపించింది. ఆ తర్వాత నుంచి ఆమె కనిపించకుండా పోయింది. దీంతో పోలీసులు సదరు మహిళ కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు మిస్సింగ్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేయడం ప్రారంభించారు. ఐతే ఆమె 1999లో ఉత్తర ప్యూర్టోరికో వీధుల్లో తిరుగుతున్నట్లు గుర్తించారు. ఇక ఆ తర్వాత నుంచి ఆమె ఆచూకి మిస్టరీగా ఉండిపోయింది. కట్ చేస్తే ప్రస్తుతం ఆమె కరేబియన్ ద్వీపంలోని నర్సింగ్ హోంలో నివశిస్తోందని ఒక సామాజిక కార్యకర్త ద్వారా తెలుసుకుని పోలీసులు ఆశ్చర్యపోతారు. వాస్తవానికి ఆమె తన ఊరిలో వీధుల్లో పాఠాలు చెప్పే ఒక టీచర్గా మంచి పేరుంది. మరి ఆమె ప్యూర్టో రికోకి ఎలా వెళ్లిందో తెలియదు గానీ అక్కడ ఆమె తన గతాన్ని రహస్యంగా ఉంచింది. ఆ తర్వాత ఆమె క్రమంగా డిమోన్షియా అనే మతిస్థిమితంకి సంబంధించిన మానసిక వ్యాధి బారిన పడింది. ఐతే ఆమెకు సడెన్గా తన గతం గుర్తుకొచ్చి తన వివరాలను వెల్లడించడం ప్రారంభించింది. ఇంతలో ఆ సామాజికి కార్యకర్త సాయంతో రంగంలోకి దిగిన పోలీసులు సదరు నర్సింగ్హోమ్ని సంప్రదించారు. ఆమెకు డీఎన్ఏ టెస్ట్లు నిర్వహించి 30 ఏళ్ల క్రితం కనిపించకుండా పోయిన మహిళగా నిర్థారించారు. ఐతే ఆమహిళకు ప్రసత్తు 80 ఏళ్లు. వైద్యులు ఆమె కొన్ని మానసిక రుగ్మతలతో వ్యాధితో బాధపడుతున్నట్లు తెలిపారు. ఆమె ఒకనొక దశలో దేశం విడిచి పారిపోవాలనుకుందని కూడా చెప్పారు. ఐతే సదరు మహిళ తప్పిపోవడానికి ముందు ఆమెకు వివాహమైందని, ఆమె భర్త బాబ్ కోప్టా అని అధికారులు తెలిపారు. పాపాం ఆయన ఆమె కోసం ఎదురు చూస్తూ మరో పెళ్లి కూడా చేసుకోకుండా ఉండిపోయారు. ఇన్నేళ్ల తర్వాత ఆమె సజీవంగా ఉందని చెప్పడం చాలా రిలీఫ్్గా ఉందని కోప్టా చెబుతున్నారు. ఆమెకు ఇద్దరు చెల్లెళ్లు, ఒక కవల చెల్లెలు ఉన్నారు. అయితే వారంతా చనిపోగా ప్రస్తుతం ఆమెకు ఇప్పుడూ ఒక చిన్న చెల్లెలు మాత్రమే మిగిలి ఉందని చెప్పారు. సదరు మహిళ చెల్లెలు మాట్లాడుతూ.. 80 ఏళ్ల వయసులో ఆమె మా వద్దకు చేరుకోవడం చాలా షాకింగ్గా, ఆనందంగా ఉందని చెబుతోంది. విచిత్రమేమిటంటే పెళ్లికి ముందుగానీ, ఆతర్వాత గానీ ఎప్పుడూ కూడా ఆమె పూర్టో రికో నగరానికి వెళ్లిందే లేదు. (చదవండి: ఢిల్లీలోని ఆటో రిక్షాలో యూఎస్ సెక్రటరీ) -
ఆస్ట్రేలియా చరిత్రలో అపఖ్యాతి.. ఆ ముగ్గురు పిల్లలు ఏమయ్యారు?
కోటి కలలతో సాగే ఆ కుటుంబానికి ఊహించని పీడకల ఎదురైంది. ఉల్కిపడి తేరుకునే లోపే.. ఆ తల్లికి కడుపుకోత మిగిలింది. ఆస్ట్రేలియా చరిత్రలోనే అపఖ్యాతి మూటకట్టుకున్న కథల్లో బ్యూమాంట్ చిల్డ్రన్ మిస్సింగ్ కేసు ఒకటి. సరిగ్గా యాభై ఏడేళ్ల క్రితం జరిగిన ఈ ఘటన.. ఎందరో తల్లిదండ్రులకు గుణపాఠం. అది 1966 జనవరి 26. మధ్యాహ్నం 12 దాటింది. దక్షిణ ఆస్ట్రేలియా, అడలాయిడ్ శివారు ప్రాంతలోని 109 హార్డింగ్ స్ట్రీట్ బస్టాప్లో నాన్సీ అనే 39 ఏళ్ల మహిళ.. తన పిల్లల కోసం వెయిట్ చేస్తోంది. ఆరోజు ఆ దేశమంతా ఆస్ట్రేలియా డే సెలబ్రేషన్ లో ఉంటే ఆమె మాత్రం టెన్షన్లో ఉంది. ‘ఇంకా బీచ్లోనే ఆడుకుంటున్నారేమోలే.. తర్వాత బస్కి వస్తారు’ అనుకుంటూ 2 గంటలయ్యేదాకా ఎదురు చూసింది. ఆ బస్టాప్లో ఆగిన ప్రతి బస్సు ఆమెని నిరాశపరుస్తూనే ఉంది. గడిచే ప్రతి నిమిషం ఆమె గుండె వేగాన్ని పెంచుతూనే ఉంది. ‘ఒకవేళ ఆటపట్టించడానికి ఇంటికి వెళ్లాపోయారేమో?’ అదే అనుమానంతో ఇంటికి పరుగుతీసింది. తలుపు తీసి ఉండటంతో.. పట్టలేనంత ఆనందంగా లోపలికి నడిచింది. కానీ లోపల పిల్లల్లేరు. డ్యూటీ నుంచి ముందే వచ్చేసిన భర్త జిమ్ బ్యూమాంట్ ఉన్నాడు. పొంగుకొచ్చే దుఃఖం ఆపుకోలేక భర్తని హత్తుకుని.. ఏడుస్తూ జరిగిందంతా చెప్పింది. వెంటనే బీచ్కి వెళ్తే.. అక్కడా పిల్లల్లేరు. జిమ్, నాన్సీలు ఆ ముందురోజే తమ ముగ్గురు పిల్లలతో కలిసి.. సుమారు 3 కిలోమీటర్ల దూరంలో ఉన్న గ్లెనెల్గ్ బీచ్కి వెళ్లారు. అయితే పిల్లలకు సముద్ర తీరాల్లో ఆడుకోవాలనే ఆశ తీరలేదు. అందుకే మరునాడు (జనవరి 26) ఉదయం లేవగానే.. గ్లెనెల్గ్ బీచ్కి వెళ్తామని రిక్వెస్ట్ చేశారు. రిక్వెస్ట్ కాస్తా పేచీ అయ్యింది. నిజానికి పెద్దమ్మాయి జెన్(9) తెలివితేటల మీద.. జిమ్ దంపతులకు చాలా నమ్మకం. సముద్రం లోపలికంటా వెళ్లకూడదని.. అపరిచితులతో మాట్లాడకూడదని.. ఇలా చాలా విషయాలను అర్థం చేసుకోవడంలో జెన్.. 15 ఏళ్ల అమ్మాయిలా ప్రవర్తించేది. అందుకే రెండో కూతురు అర్నా(7)ని, కొడుకు గ్రాంట్(4)ని.. జెన్ కి అప్పగించి.. బస్సు టికెట్స్కి కొంత డబ్బులిచ్చి.. ఉదయం పదయ్యేసరికి బీచ్కి వెళ్లే బస్సు ఎక్కించింది నాన్సీ. 12 అయ్యేసరికి తిరిగి వస్తామన్నారు పిల్లలు. కానీ రెండైనా రాలేదు. బీచ్లోనూ లేరు. తెలిసిన ప్రతి వీధిలోనూ వెతికారు. ఎక్కడా దొరకలేదు. దాంతో పోలీసుల్ని ఆశ్రయించారు. కిడ్నాప్ భయంతో విమానాశ్రయాలు, రైల్వే స్టేషన్స్, అంతర్రాష్ట్ర రహదారులు ఇలా అన్నీ వెతికారు అధికారులు. సముద్రంలో కొట్టుకు పోయారేమోనన్న అనుమానంతో బీచ్ పరిసరప్రాంతాలనూ గాలించారు. 24 గంటల్లోనే దేశం మొత్తం ఈ కేసు గురించి తెలుసుకుంది. కానీ ఏ ఆధారం లభించలేదు. గ్లెనెల్గ్ బీచ్ సమీపంలోని.. సుమారు ముప్ఫై ఏళ్ల వయసున్న ఆరడుగుల సన్నటి వ్యక్తితో ఈ పిల్లల్ని చూశామని.. పిల్లలు అతడితో చాలాసేపు.. బీచ్లో నవ్వుతూ ఆడుకున్నారని.. కొందరు ప్రత్యక్షసాక్షులు చెప్పారు. ‘ఆ ముగ్గురు పిల్లలు డబ్బులు పోగొట్టుకున్నారు, మీలో ఎవరైనా చూశారా?’ అంటూ ఆ సన్నటి వ్యక్తి సాక్షుల్లో కొందరిని అడిగాడట. పిల్లలు సముద్రంలోకి దిగినప్పుడు ఆ వ్యక్తే కావాలని వాళ్ల డబ్బులు తీసేసి.. పిల్లల నమ్మకాన్ని సంపాదించడానికి.. సాయం చేసే వ్యక్తిలా నటించి ఉంటాడనే వాదన బలపడింది. సాక్షులు చెప్పిన పోలికలతో ఊహాచిత్రాలు కూడా గీయించి పత్రికల్లో ప్రచురించారు. పిల్లలు అదృశ్యమైన మూడు రోజుల తర్వాత ఒక మహిళ పోలీసుల్ని కలిసి.. ‘జనవరి 26 రాత్రి 7 గంటలకు పటావాలోంగా బోట్ హెవెన్ లో బ్యూమాంట్ పిల్లల్ని పోలిన ముగ్గురు పిల్లలతో నేను మాట్లాడాను’ అని చెప్పింది. దాంతో ఆ ఏరియా మొత్తం ఎమర్జెన్సీ ఆపరేషన్ నిర్వహించారు పోలీసులు. కానీ ఫలితం లేదు. ఇక బీచ్ సమీపంలోని వెంజెల్స్ బేకరీ యజమాని.. ఆరోజు జెన్ తన దగ్గరకు 1 పౌండ్ నోట్ తెచ్చిందని.. మీట్ పఫ్స్ కొని తీసుకెళ్లిందని చెప్పాడు. నాన్సీ.. నేనంత డబ్బు ఇవ్వలేదని కేవలం 6 షిల్లింగ్స్ చిల్లర మాత్రమే ఇచ్చానని చెప్పింది. దాంతో బీచ్లో ప్రత్యక్షసాక్షుల మాటకు బలం చేకూరింది. ఎవరో ఒక వ్యక్తి పిల్లలతో కావాలనే స్నేహం చేసుకున్నాడని.. తెలివిగా మోసం చేసి వాళ్లని తీసుకుని వెళ్లాడని నిర్ధారించుకున్నారు పోలీసులు. కొన్ని నెలల గడిచాయి. డాఫ్నే గ్రెగరీ అనే స్థానికురాలు.. పోలీసుల్ని కలిసి ఓ షాకింగ్ విషయం చెప్పింది. జనవరి 26 రాత్రి.. ఖాళీగా ఉన్న పక్కింట్లోకి ఒక వ్యక్తి ఇద్దరు ఆడపిల్లల్ని, ఒక చిన్న పిల్లాడ్ని తీసుకొచ్చాడని.. కాసేపటికి ఆ పిల్లాడు తప్పించుకునే ప్రయత్నం చేస్తే ఆ వ్యక్తి పట్టుకున్నాడని.. ఆ మరునాడు ఆ ఇల్లు ఖాళీగానే కనిపించిందని చెప్పింది. ముందే ఎందుకు చెప్పలేదంటే భయపడ్డానని బదులిచ్చింది. అయితే ఆమె చెప్పినదానికి ఏ ఆధారం లేదు. రెండేళ్ల తర్వాత.. జిన్ దంపతులకు ఓ లేఖ వచ్చింది. అది స్వయంగా జెన్ రాసినట్లు ఉండటంతో వాళ్లు నివ్వెరపోయారు. ‘నన్ను(జెన్), తమ్ముడ్ని, చెల్లెల్ని దిమెన్ (కిడ్నాపర్) బాగా చూసుకుంటున్నాడు.. మేము సంతోషంగా ఉన్నాం’ అనేదే దాని సారాంశం. నెల తిరగకుండానే మరో లేఖ వచ్చింది. ఈసారి దిమెన్ స్వయంగా రాశాడు. తనని తాను పిల్లలకు గార్డియన్గా ప్రకటించుకున్న ఆ వ్యక్తి.. ‘మీ బాధ చూడలేక పిల్లల్ని తిరిగి ఇవ్వాలని దిమెన్ భావిస్తున్నాడు. ఫలానా చోటికి రండి.. ఎవరికీ చెప్పొద్దు’ అని రాశాడు. చెప్పినట్లే జిన్ దంపతులు.. రహస్యంగా ఓ డిటెక్టివ్ని నియమించుకుని.. దిమెన్ చెప్పిన చోటికి వెళ్లారు. కానీ పిల్లలు రాలేదు. కొన్ని రోజులకి మూడో లేఖ వచ్చింది. అందులో ఇలా ఉంది. ‘పిల్లల్ని తీసుకెళ్లేందుకు మీరు మాత్రమే కాకుండా.. మారువేషంలో డిటెక్టివ్ని తీసుకొచ్చారు. అందుకే దిమెన్ నమ్మకాన్ని కోల్పోయారు. ఇక పిల్లలు మీ దగ్గరకు రారు’ అని ఉంది. అన్ని ఉత్తరాల మీద విక్టోరియాలోని డాండెనాంగ్ పోస్టల్మార్క్ ఉంది. 1992 నాటికి లేఖలపైనున్న వేలిముద్రల సాయంతో ఫోరెన్సిక్ పరీక్షలు జరిపి.. 41 ఏళ్ల వ్యక్తిని పట్టుకున్నారు. కానీ అతడు వాటిని ఫన్ కోసం రాశానని చెప్పడంతో.. ఆధారాలు లేక, ఆ లేఖలను బూటకపు లేఖలుగా కొట్టిపారేశారు. చాలామంది అనుమానితుల్ని.. సీరియల్ కిల్లర్స్ని అదుపులోకి తీసుకుని విచారించారు. కొందరు మతిస్థిమితం కోల్పోయిన పాత నేరగాళ్ల మాటలు విని.. పిల్లల మృతదేహాలైనా దొరుకుతాయనే ఆలోచనతో.. అనుమానిత ప్రాంతాల్లో తవ్వకాలు కూడా జరిపారు. ఎక్కడా ఏ ఆచూకీ దొరకలేదు. నాన్సీ 2019లో తన 92 ఏళ్ల వయసులో నర్సింగ్హోమ్లో.. పిల్లల్ని తిరిగి చూడకుండానే చనిపోయింది. జిమ్ ఇంకా అడలాయిడ్లో జీవిస్తున్నాడు. అయితే ఈ జంట పిల్లల గురించే గొడవపడి.. విడాకులు తీసుకుంది. నాన్సీ తన చివరి జీవితంలో పిల్లల్నే కాదు భర్తని కూడా దూరం చేసుకుని బతికింది. ఏది ఏమైనా పిల్లల్ని తీసుకుని వెళ్లింది ఎవరు? అసలు పిల్లలు ఏమయ్యారు? ఆరోజు పిల్లల్ని కలిసిన వ్యక్తి ఎవరు? అనే ప్రశ్నలు నేటికీ తేలలేదు. కదిలించిన తల్లి ప్రేమ 1967లో ఆస్ట్రేలియా ‘డైలీ టెలిగ్రాఫ్’కి ఇచ్చిన ఇంటర్వ్యూలో.. నాన్సీ మాటలు అందరి హృదయాలను కదిలించాయి. ‘మీకు తెలుసా? నేను సాధారణంగా కలలు కనేదాన్ని కాదు. కానీ పిల్లల గురించి కలగన్నాను. వాళ్లు రాత్రి ఇంటి వెనుక తలుపు తట్టారు. వెళ్లి చూస్తే ‘హలో అమ్మా’ అన్నారు. ’మీరు ఎక్కడ ఉన్నారు?’ అని నేను అడిగాను. వెనుక లాబీస్లో నిలబడి నవ్వుతున్నారు. వాళ్లని పట్టుకుని చాలా ఏడ్చాను. ఇదే నేను కన్న మొదటికల’ అంటూ తన మదిలోని ఆవేదనను పంచుకుంది. ప్రధాన నిందితుడు హ్యారీ ఫిప్స్ 2004లో చనిపోయాడు. అతడి మరణం తర్వాత 2007లో అతడి కుమారుడు హేద్న్.. తన తండ్రిపై ఆరోపణలు చేశాడు. స్థానిక ఫ్యాక్టరీ యజమానిగా, అడలాయిడ్ సామాజిక శ్రేణిలో అప్పటి సభ్యుడిగా గౌరవమర్యాదలతో బతికిన ఫిప్స్ మంచివాడు కాదని.. 1966లో బ్యూమాంట్ పిల్లలను అతడే కిడ్నాప్ చేశాడని, అప్పటికి తన వయసు 15 ఏళ్లని, తన తండ్రి తనను కూడా లైంగికంగా వేధించాడని చెప్పాడు. పైగా ఫిప్స్కి 1 పౌండ్ నోట్లను పంచే అలవాటుందని చెప్పాడు. గ్లెనెల్గ్ బీచ్కి 300 మీటర్ల దూరంలోనే ఫిప్స్ జీవించాడు. 2013 నాటికి హేద్న్ తన నమ్మకాన్ని.. చిన్నప్పుడు తను చూసినదాన్ని కలిపి.. ‘ది శాటిన్మెన్’ అనే పుస్తకాన్ని కూడా రాశాడు. హేద్న్ చెప్పిన విషయాలన్నీ కేసుకు సరిపోలడంతో.. ఫిప్స్నే నేరగాడని చాలా మంది నమ్ముతారు. అయితే ఫిప్స్ ఇతర కుటుంబ సభ్యులు హేద్న్ వాదనని తప్పుబట్టారు. - సంహిత నిమ్మన -
ఏడు నెలల క్రితమే ప్రేమ వివాహం.. బయటకు వెళ్లి వస్తానని చెప్పి
సాక్షి, హైదరాబాద్, సంగారెడ్డి: బయటకు వెళ్లి వస్తానని చెప్పిన వ్యక్తి కనిపించకుండాపోయాడు. పటాన్చెరు మండలం అమీన్పూర్ ఎస్ఐ సోమేశ్వరి కథనం ప్రకారం.. మెదక్ జిల్లా నర్సపూర్ మండలం హమీద్నగర్కు చెందిన ప్రణయ్కుమార్రెడ్డి, సాయిలత ప్రేమ వివాహం చేసుకున్నారు. ఏడునెలల క్రితం ఉపాధి నిమిత్తం అమీన్పూర్ మున్సిపాలిటీలోని భవానీపురం కాలనీకి వచ్చారు. ఈ నెల 22వ తేదీ రాత్రి పదిగంటలకు బయటకు వెళుతున్నానని చెప్పాడు. రాత్రయినా తిరిగి రాలేదు. భర్త కోసం భార్య సాయిలత తెలిసినవారి వద్ద, బంధువుల వద్ద వెతికినా ఆచూకీ లభించలేదు. ఐదురోజులు దాటినా జాడ తెలియకపోవడంతో సోమవారం ఫిర్యాదు చేసింది. -
3 నెలల క్రితమే పెళ్లి.. వివాహితను బైక్పై తీసుకెళ్లిన యువకుడు
సాక్షి,మెదక్ : నార్సింగిలో ఇద్దరి అదృశ్యం మిస్టరీగా మారింది. మండల కేంద్రానికి చెందిన వివాహిత, మరో యువకుడు ఒకే బైక్పై సోమవారం రామాయంపేటలో కలిసి తిరిగినట్టు సీసీ కెమెరాలో రికార్డు అయినట్టు తెలిసింది. అయితే ఆ బైక్ , ఇద్దరి చెప్పులు మంగళవారం ఉదయం నార్సింగి చెరువు వద్ద లభ్యమయ్యాయి. కూతురు కనిపించడం లేదని ఆమె తండ్రి పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేయగా, మిస్సింగ్ కేసు నమోదైంది. సదరు యువతికి మూడు నెలల క్రితం వివాహం జరిగింది. శివరాత్రి పండగ నిమిత్తం ఈనెల తొమ్మిదివ తేదీన ఆమెను అత్తగారింటినుంచి నార్సింగి తీసుకొచ్చారు. చెరువు వద్ద బైక్, చెప్పులు లభించడంతో ఇద్దరూ ఆత్మహత్య చేసుకొని ఉంటారని ముందుగా అందరూ అనుమానించారు. విషయం తెలియగానే గ్రామస్తులు, బాధిత కుటుంబ సభ్యులు పెద్ద సంఖ్యలో చెరువు వద్దకు చేరుకున్నారు. పోలీసులు గజ ఈతగాళ్లు, వలలతో చెరువులో గాలించినా ఇద్దరి ఆచూకీ లభించలేదు. అయితే అందరి దృష్టిని మళ్లించడానికే బైక్, చెప్పులు చెరువు వద్ద విడిచి వెళ్లినట్టు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. కాగా మిస్టరీగా మారిన ఈకేసును త్వరలోనే చేధిస్తామని నార్సింగి ఎస్ఐ నర్సింలు పేర్కొన్నారు. -
రాముతో ఐటీ ఉద్యోగిని ప్రేమ.. పెద్దలు అంగీకరించలేదని..
సాక్షి, హైదారాబాద్: విధులకు వెళ్తున్నానని ఇంట్లో చెప్పి బయటకు వెళ్లిన ఓ ఐటీ ఉద్యోగిని అదృశ్యమైన ఘటన నల్లకుంట పోలీస్ స్టేషన్ పరిధిలో ఆలస్యంగా వెలుగు చూసింది. ఎస్సై ఎం.అంజయ్య వివరాల ప్రకారం.. ప్రైవేటు ఉద్యోగి పగడాల ఉమా శంకర్ కుటుంబ సభ్యులతో కలిసి రాంనగర్ గుండు సమీపంలో గల దుర్గా నివాస్ అపార్ట్మెంట్లోని 301 ఫ్లాట్లో నివాసముంటున్నారు. ఆయన ఏకైక కుమార్తె శ్రీశివనాగ హర్షిత(24) హైటెక్ సిటీలోని ఓ ఐటీ కంపెనీలో ఉద్యోగం చేస్తోంది. గత నెల 24న ఉదయం 8 గంటల సమయంలో విధులకు వెళ్తున్నానని ఇంట్లో చెప్పి వెళ్లి నేటికీ తిరిగి రాలేదు. దీంతో ఆందోళన చెందిన తండ్రి ఉమా శంకర్ తమ కుమార్తె కనిపించడం లేదంటూ శనివారం సాయంత్రం నల్లకుంట పోలీసులకు ఫిర్యాదు చేశారు. కాగా హర్షిత, రాము అనే యువకుడు ప్రేమించుకున్నారని, వారి ప్రేమను తాము అంగీకరించలేదని ఉమా శంకర్ పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. మిస్సింగ్ కేసుగా నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. -
ఆరు నెలల క్రితం అదృశ్యం! చివరికి అస్థిపంజరంగా ఆచూకీ లభ్యం
సాక్షి, బనశంకరి: ఆరు నెలల క్రితం అదృశ్యమైన నేపాలీ మహిళ నిర్జీన ప్రాంతంలో అస్థిపంజరంగా కనిపించింది. హుళిమావు పోలీస్స్టేషన్ పరిధిలోని అక్షయనగర అపార్టుమెంట్ వెనుకభాగంలో పొదల మధ్య చెట్టుకు వేలాడుతున్న స్థితిలో ఉన్న అస్థి పంజరం నేపాలీకి చెందిన పుష్పదామి (22)గా పోలీసులు గుర్తించారు. భర్తతో గొడవ పడి... నేపాల్కు చెందిన పుష్పాదామి, భర్త అమర్దామి అక్షయనగరలో నివాసం ఉంటున్నారు. భర్త మద్యానికి బానిస. దీంతో అతన్ని భరించలేక నేపాల్కు వెళ్లాలని నిర్ణయించుకుంది. ఇదే విషయంపై ఇద్దరి మధ్య గొడవలు తలెత్తాయి. గత ఏడాది జులై 8న భర్తపై కోపంతో ఇంటి నుంచి పుష్పదామి బయటకు వెళ్లి తిరిగి రాలేదు. భార్య కనిపించకపోవడంతో భర్త పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసులు పలు ప్రాంతాల్లో గాలించినప్పటికీ ఆమె ఆచూకీ లభించలేదు. ఈ ఘటనపై ఆగ్నేయ విభాగ డీసీపీ సీకే.బాబా శుక్రవారం విలేకరులతో మాట్లాడుతూ... ఉరి వేసుకున్న స్థితిలో గురువారం ఉదయం 9.30 గంటల సమయంలో హుళిమావు పరిధిలోని అపార్టుమెంట్ వెనుక భాగంలోని పొదల్లో మనిషి తలపుర్రె,అస్థి పంజరం లభ్యమైంది. అస్థిపంజరం పైన పాదరక్షలు, మెడలో ఉన్న నెక్లెస్, ఇతర వస్తువులు అక్కడ పక్కనే లభించాయి. అక్కడ ఎక్కువగా సంచారం లేకపోవడం నిర్జీన ప్రదేశం కావడంతో ఆ వస్తువులు ఎవరూ తీసుకోలేదు. ఆమె ఆత్మహత్యకు పాల్పడినట్లు తెలిసిందని సీకే బాబా తెలిపారు. వీరికి ఒక కుమారుడు ఉన్నాడు. (చదవండి: మొబైల్ చూడొద్దని మందలించారని...)
Pagination
ఆ బీప్ సౌండ్ వస్తేనే.. మీ ఓటు వేసినట్టు
ఇది కదా క్రేజ్ అంటే.. సీఎం జగన్ ఇంటర్వ్యూకి మిలియన్ల వ్యూస్
Sakshi.com ఇప్పుడు సరికొత్తగా మీ ముందుకు
కాపులు, ముస్లింలకు రిజర్వేషన్లు అక్కర్లేదు: పవన్కళ్యాణ్
రైతు కుమార్తె విజయం.. రిషబ్ శెట్టి అభినందనలు
పులివెందుల ప్రజలకు ఇద్దరిపైనా ప్రేమే: వైఎస్ భారతి
RCB Vs PBKS: కోహ్లి అరుదైన రికార్డు.. ఐపీఎల్ చరిత్రలోనే తొలి క్రికెటర్గా
Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ కేసులో బిగ్ ట్విస్ట్..
బిజీగా ఉండటం ఇంత డేంజరా! హెచ్చరిస్తున్న సైకాలజిస్ట్లు
కారులో వాసన బాగుందని తెగ పీల్చుకుంటున్నారా.?
తప్పక చదవండి
- ‘సంతోషం’.. కేజ్రీవాల్కు మద్యంతర బెయిల్పై దీదీ
- నామినేషన్ దాఖలుకు బీజేపీ అభ్యర్థి పరుగులు.. చివరికి ఏమైందంటే..
- సింపతీ కోసమే కేజ్రీవాల్ అరెస్ట్
- అమిత్ షా నివాసంలో పద్మగ్రహీతలకు విందు....మెనులో ఎలాంటి రెసిపీలు ఉన్నాయంటే..
- టాలీవుడ్లో అది చాలా కష్టం.. అసౌకర్యంగా అనిపిస్తుంది: సంయుక్త
- రెడ్ లిప్స్టిక్ను ఉత్తరకొరియా ఎందుకు బ్యాన్ చేసిందో తెలుసా!
- డాగ్ లవర్స్ బీ అలర్ట్ : ప్రమాదకరమైన కుక్కలపై తమిళనాడు నిషేధం
- ముద్రగడ మరో లేఖ.. కీలక వ్యాఖ్యలు
- ఈ పథకాలు ఎంత అవసరమో ఆలోచించండి: సీఎం జగన్
- ఆ బీప్ సౌండ్ వస్తేనే.. మీ ఓటు వేసినట్టు
Advertisement