-
Gujarat Assembly Election 2022: సౌరాష్ట్ర ఎవరికి సై?
సౌరాష్ట్ర.. గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో అత్యంత కీలక ప్రాంతం. పటీదార్ల ఉద్యమానికి కేంద్ర బిందువు. ఈ ఉద్యమ ప్రభావంతో గత ఎన్నికల్లో ఈ ప్రాంతంపై పట్టు కోల్పోయిన బీజేపీ తిరిగి పూర్వవైభవం సాధించడానికి ప్రయత్నిస్తోంది. మరి సౌరాష్ట్ర ఓటర్లు ఎవరకి జై కొడతారు...? సౌరాష్ట్ర కేంద్రంగా 2015లో మొదలైన పటీదార్ (పటేళ్లు) ఉద్యమం రాష్ట్రవ్యాప్తంగా ఉవ్వెత్తున ఎగిసిపడింది. రాష్ట్రంలో అగ్రకులమైన పటేళ్లను ఒబిసిలో చేర్చాలని, వారికి కూడా విద్య, ఉద్యోగాల్లో రిజర్వేషన్లు కల్పించాలన్న డిమాండ్తో యువ నాయకుడు హార్థిక్ పటేల్ నేతృత్వంలో సాగిన ఉద్యమం 2017 ఎన్నికల్లో బీజేపీని బాగా దెబ్బ తీసింది. సౌరాష్ట్రలో పటీదార్లు, ఒబీసీ ఓటర్ల సంఖ్య ఎక్కువ. బీజేపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పటీదార్లు చేసిన ఉద్యమంతో 2017 ఎన్నికల్లో మొత్తం 48 స్థానాలకు గాను 19 సీట్లను మాత్రమే గెలుచుకుంది. ఆ ఎన్నికల్లో హార్దిక్ పటేల్ కాంగ్రెస్కు వెలుపల నుంచి మద్దతు ఇవ్వడంతో ఆ పార్టీ ఏకంగా 28 స్థానాలను గెలుచుకొని తన పట్టు పెంచుకుంది. రాష్ట్రవ్యాప్తంగా బీజేపీని 99 స్థానాలకే పరిమితం చేయగలిగింది. ఇప్పుడపా మాదిరి భావోద్వేగ పరిస్థితుల్లేవు. పటీదార్ల ఉద్యమం చల్లారింది. హార్దిక్ పటేల్ కాంగ్రెస్లో చేరినా 2019 ఎన్నికల్లో ఆ పార్టీ ఒక్క సీటూ గెలవలేకపోయింది. హార్దిక్ ఇప్పుడు బీజేపీలో చేరారు. విరమ్గమ్ స్థానం నుంచి పోటీ చేస్తున్నారు. ఆమ్ ఆద్మీ పార్టీ కూడా బరిలోకి దిగింది. ఈ పరిణామాలన్నీ కాంగ్రెస్కు ఎదురుదెబ్బగా మారేలా ఉన్నాయి. సౌరాష్ట్రలో పటీదార్లు, కొలి జనాభా 40% దాకా ఉంది. 18 అసెంబ్లీ స్థానాల్లో పటీదార్ల ఓట్లు, 10 అసెంబ్లీ స్థానాల్లో కొలి వర్గం ఓట్లు నిర్ణయాత్మకం. ఓబీసీ, క్షత్రియులు, మత్స్యకారులు కూడా ప్రభావం చూపించగలరు. ‘‘సౌరాష్ట్ర యువ ఓటర్లు ఈసారి ఆప్వైపు మొగ్గుతున్నారు. పటీదార్లు వ్యాపారాలంతా ఆప్కు అవకాశమిద్దామని అనుకుంటున్నారు. కొలి, ఇతర ఓబీసీ ఓటర్లు కాంగ్రెస్కి ఓటేయొచ్చు’’ అని రాజకీయ విశ్లేషకుడు దిలీప్ గొహ్లి అభిప్రాయపడ్డారు. బీజేపీ ఓబీసీ మంత్రం సౌరాష్ట్రలో 48 సీట్లలో సగానికిపైగా స్థానాల్లో పటేళ్ల ఆధిక్యం ఉంది. హార్దిక్ వంటి నాయకుల్ని బీజేపీ తమ వైపు తిప్పుకున్నా పటేళ్లలో ఉపకులాల కారణంగా అందరూ బీజేపీ వైపుండే పరిస్థితి లేదు. దీంతో బీజేపీ ఓబీసీలకు టిక్కెట్లు ఎక్కువ ఇచ్చింది. 2017 ఎన్నికల తర్వాత కాంగ్రెస్ నుంచి తొమ్మిది మంది ఎమ్మెల్యేలు బీజేపీలోకి జంపయ్యారు. పటీదార్, కొలి, అహిర్ సామాజిక వర్గాలకు చెందిన కున్వర్జీ బవాలియా, బ్రిజేశ్ మెర్జా, చవడ వంటి అగ్రనాయకులూ కాంగ్రెస్ను వీడి బీజేపీలో చేరడం ఆ పార్టీకి కలిసొచ్చే అంశం. సంపన్న సౌరాష్ట్ర సౌరాష్ట్ర ప్రాంతం మొదట్నుంచి సంపన్న ప్రాంతమే. అరేబియా తీరంలో ఉండే ఈ ప్రాంతంలో సహజవనరులు చాలా ఎక్కువ. నీటి లభ్యత ఎక్కువగా ఉండడం వల్ల పారిశ్రామికంగా అభివృద్ధి చెందింది. ఇటీవల కాలంలో కరువు కోరల్లో చిక్కుకొని విలవిలలాడుతోంది.2019లో సర్దార్ సరోవర్ డ్యామ్ దగ్గర నర్మద నది నుంచి నీళ్ల ట్యాంకర్లతో సరఫరా చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది.ఈ ప్రాంతంలో 11 జిల్లాలున్నాయి. సురేంద్రనగర్, మోర్బీ, రాజ్కోట్, జామ్నగర్, దేవ్భూమి ద్వారక, పోర్బందర్, జునాగఢ్, గిర్ సోమ్నాథ్, అమ్రేలి, భావనగర్, బోతాడ్.. ఈ 11 జిల్లాలకు గాను బీజేపీ 2017 ఎన్నికల్లో మోర్బీ, గిర్ సోమ్నాథ్, అమ్రేలి జిల్లాల్లో ఒక్క సీటు సాధించలేకపోయింది. ఈ సారి ఎన్నికల్లో అధిక ధరలు, రైతు సమస్యలు, నిరుద్యోగం, నీటి సమస్య కీలకం కానున్నాయి. – సాక్షి నేషనల్ డెస్క్ -
బీజేపీ ‘పటీదార్ పవర్’.. వర్కవుట్ అయ్యేనా?
హార్దిక్ పటేల్. ఒకప్పుడు బీజేపీని వ్యతిరేకించిన పటీదార్ నాయకుడు. పటీదార్లను ఓబీసీలుగా గుర్తించాలంటూ కమళదళంపై గళమెత్తిన నేత. ఇప్పుడు ఆ పార్టీ విధానాలకే జై కొడుతున్నారు. కాంగ్రెస్ను వీడిన ఆయన, ఇప్పుడు బీజేపీ గూటికి చేరుతున్నారు. హార్దిక్పై గుజరాత్లో బీజేపీ ఎందుకు భారీ ఆశలు పెట్టుకుంది. ఆయన చేరికతో అక్కడ పార్టీ మరింత బలం పుంజుకుంటుందా? ఎవరీ పటీదార్లు? గుజరాత్లో వారికి ఎందుకంత ప్రాధాన్యం...? పటీదార్లు తాము శ్రీరాముని వారసులమని చెప్పుకుంటారు. వీరిలో లేవా, కడ్వా అని ప్రధానంగా రెండు ఉపకులాలున్నాయి. రాముడి కవల పిల్లలైన లవకుశల్లో లవుడి సంతతి లేవా పటేల్స్ కాగా, కడవా పటేల్స్ కుశుడి సంతతి అంటారు. లేవాలు సౌరాష్ట్ర, మధ్య గుజరాత్లో అధికంగా ఉంటే, ఉత్తర గుజరాత్లో కడ్వాల ప్రాబల్యం ఎక్కువ. పటీదార్లలో 80% మంది లేవా, కడ్వా పటేల్స్. మిగతా 20%లో సత్పంతి, అంజన వంటి ఉపకులాలున్నాయి. ఒకప్పుడు వ్యవసాయదారులైన వీరు ప్రస్తుతం అన్ని రకాల వ్యాపారాల్లోనూ బాగా ఎదిగి ఆర్థిక వ్యవస్థలో కీలకంగా మారారు. హర్దిక్ బలం ఎంతంటే.. గుజరాత్ రాజకీయాల్లో ఉవ్వెత్తున ఎగిసిన కెరటంలా దూసుకొచ్చిన యువ నాయకుడు హార్దిక్ పటేల్. 2015 ముందు వరకు ఆయన పేరు ఎవరికీ తెలీదు. రాష్ట్రంలో అగ్రకుల జాబితాలో ఉన్న పటీదార్లను ఓబీసీలోకి చేర్చాలని, విద్యా, ఉద్యోగాల్లో రిజర్వేషన్ కల్పించాలని డిమాండ్తో దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించారు. ఉద్యమ నాయకుడిగా ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. నిప్పులు చెరిగే ప్రసంగాలతో బీజేపీ ప్రభుత్వాన్ని చీల్చి చెండాడుతూ యూత్లో ఫాలోయింగ్ సంపాదించారు. పటేల్ ఉద్యమం సందర్భంగా రాష్ట్రంలో హింస, గృహ దహనాలు, ప్రభుత్వ ఆస్తుల విధ్వంసం జరిగాయి. 10 మంది ప్రాణాలు కోల్పోయారు. ఆయనపై బీజేపీ దేశద్రోహం సహా ఎన్నో కేసులు పెట్టింది. బెయిల్పై బయటికొచ్చాక కూడా కేంద్రంలో, గుజరాత్లో అధికారంలో ఉన్న బీజేపీ విధానాలపై విమర్శలు కొనసాగిస్తూనే ఉన్నారు. 2017 అసెంబ్లీ ఎన్నికల ముందు కాంగ్రెస్కు బయటి నుంచి మద్దతిచ్చారు. కాంగ్రెస్ గెలవకపోయినా పటీదార్ల ఓట్లను భారీగా చీల్చింది. 2019 సార్వత్రిక ఎన్నికల ముందు హార్దిక్ కాంగ్రెస్లో చేరారు. కానీ గుజరాత్లో 26 లోక్సభ సీట్లలో కాంగ్రెష్ ఒక్కటీ నెగ్గలేదు. 2020లో హార్దిక్ను పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్గా కాంగ్రెస్ నియమించింది. కానీ ఆ తర్వాత ఆశించిన ప్రాధాన్యం లభించక మూడేళ్లలోనే పార్టీ వీడే పరిస్థితులు వచ్చాయి. ముందునుంచే హార్దిక్పై కన్ను నెల క్రితం కాంగ్రెస్కు గుడ్ బై కొట్టిన హార్డిక్, ఆ సందర్భంగా సోనియాగాంధీకి రాసిన లేఖలో ఆర్టికల్ 370 రద్దు, అయోధ్యలో రామమందిర నిర్మాణం తదితరాలను ప్రశంసించారు. దాంతో ఆయన బీజేపీలో చేరతారని అప్పుడే భావించారు. పార్టీ కూడా ఆయన్ను చేర్చుకోవడానికి చాలాకాలంగా ప్రయత్నిస్తూనే ఉంది. అందులో భాగంగా 2015 కోటా ఆందోళన సమయంలో ఆయనపై పెట్టిన కొన్ని కేసుల్ని వెనక్కు తీసుకుంది. రాష్ట్రంలో 20 ఏళ్లుగా అధికారంలో ఉన్న నేపథ్యంలో ప్రభుత్వ వ్యతిరేకతను అధిగమించడానికి అన్ని మార్గాలనూ బీజేపీ వెదుకుతోంది. అందులో భాగంగా అత్యంత కీలకమైన పటీదార్ల ఓట్లపై దృష్టి పెట్టింది. 28 ఏళ్ల హార్దిక్ చేరికతో యువత, రైతులు పార్టీ పట్ల మరింతగా ఆకర్షితులవుతారని అంచనా వేస్తోంది. కోటా కేసుల్లో హార్దిక్ను దోషిగా తేలుస్తూ వచ్చిన తీర్పుపై సుప్రీంకోర్టు స్టే విధించడంతో ఆయన ఎన్నికల్లో పోటీకి లైన్ క్లియరైంది. గురువారం బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సి.ఆర్.పాటిల్ సమక్షంలో హార్దిక్ పార్టీలో చేరనున్నారు. ఎన్నికల్లో ప్రభావమెంత? పటీదార్లు గుజరాత్లో అత్యంత శక్తిమంతమైన సామాజికవర్గం. రాష్ట్ర జనాభాలో వీళ్లు 15% దాకా ఉంటారు. ఠాకూర్ల తర్వాత వీరి సంఖ్యే ఎక్కువ. మొత్తం 182 అసెంబ్లీ సీట్లలో 70 చోట్ల పటీదార్ల ఓట్లు గెలుపోటములపై ప్రభావం చూపిస్తాయి. అయితే ఎన్నికల్లో వీరంతా ఒకేతాటిపై వచ్చి ఓటేయరు. ఉపకులాలూ ఉండటంతో వీరిలోనూ విభేదాలున్నాయి. లేవా పటేల్స్ మొదట్నుంచీ బీజేపీకి గట్టి మద్దతుదార్లు. కడ్వా ఉప కులానికి చెందిన హార్దిక్ 2017 ఎన్నికల్లో కాంగ్రెస్కు మద్దతివ్వడంతో వారంతా ఆ పార్టీ వైపు మళ్లారు. బీజేపీ గెలిచినా సీట్లు 115 నుంచి 99కి పడిపోయాయి. దీన్ని దృష్టిలో ఉంచుకుని ఇటీవలి కేబినెట్ మార్పుచేర్పుల్లో ఏకంగా పటేల్ వర్గానికి చెందిన ఏడుగురికి బీజేపీ స్థానం కల్పించింది. హార్దిక్ చేరికతో కడ్వా పటీదార్ల ఓట్లు ఈసారి తమకేనని నమ్మకం పెట్టుకుంది. – సాక్షి, నేషనల్ డెస్క్ -
జీవితంలో మూడేళ్లు వృథా
అహ్మదాబాద్: కాంగ్రెస్లో ఉండి తన జీవితంలో మూడేళ్లు వృథా చేసుకున్నానని గుజరాత్ పటీదార్ ఉద్యమనేత హార్దిక్ పటేల్ వాపోయారు. ఆయన బుధవారం కాంగ్రెస్కు రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. కాంగ్రెస్ కుల రాజకీయాలు చేస్తోందని హార్దిక్ మండిపడ్డారు. గురువారం అహ్మదాబాద్లో మీడియాతో మాట్లాడారు. గుజరాత్లో అధికార బీజేపీ లేదా ఆమ్ ఆద్మీ పార్టీ లేదా మరో రాజకీయ పార్టీలో చేరికపై నిర్ణయం తీసుకోలేదనన్నారు. తాను ఏ నిర్ణయం తీసుకున్నా ప్రజల ప్రయోజనాల కోసమేనని పేర్కొన్నారు. ఆయోధ్యలో రామమందిర నిర్మాణం, జమ్మూకశ్మీర్లో ఆర్టికల్ 370 రద్దు వంటి ఘనతలు బీజేపీ సాధించిందంటూ ప్రశంసల వర్షం కురిపించారు. కాంగ్రెస్లో ముందుచూపు లేని నేతలు ఉన్నారని, గుజరాత్ ప్రజలపై వివక్ష చూపుతున్నారని ఆరోపించారు. కాంగ్రెస్ సిద్ధాంతం.. వాడుకో, వదిలించుకో గుజరాత్లో తనను కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్గా నియమించినప్పటికీ ఏనాడూ సరైన పని అప్పగించలేదని, గౌరవం కల్పించలేదని హార్దిక్ ఆక్షేపించారు. పటీదార్ కోటా ఉద్యమంతో గుజరాత్లో 2017 అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ ఎంతగానో లాభపడిందన్నారు. అయినప్పటికీ కీలకపార్టీ కార్యక్రమాలకు తనను ఆహ్వానించలేదని ఆవేదన వ్యక్తం చేశారు. గుజరాత్ కాంగ్రెస్లో 25 ఏళ్లుగా 7–8 మందే పెత్తనం చెలాయిస్తున్నారన్నారు. సెకండ్ క్యాడర్ నేతలకు ఏమాత్రం ప్రాధాన్యం ఇవ్వడం లేదన్నారు. వాడుకో, వదిలించుకో.. ఇదే కాంగ్రెస్ సిద్ధాంతమని దుయ్యబట్టారు. కాంగ్రెస్కు ఇప్పుడు కావాల్సింది చింతన్(మేధోమథనం) కాదు, చింత అని హార్దిక్ పటేల్ వ్యాఖ్యానించారు. హార్దిక్ పటేల్కు జైలు భయం: కాంగ్రెస్ హార్దిక్ వ్యాఖ్యలను గుజరాత్ కాంగ్రెస్ అధ్యక్షుడు జగదీష్ ఠాకూర్ తిప్పికొట్టారు. బీజేపీ స్క్రిప్ట్ ప్రకారమే రాజీనామా పత్రం తయారు చేసుకున్నాడని విమర్శించారు. అతడిపై దేశద్రోహం కేసు నమోదయ్యిందని గుర్తుచేశారు. జైలుకు వెళ్లాల్సి వస్తుందన్న భయంతోనే కాంగ్రెస్ను వీడాడన్నారు. -
గుజరాత్ కాంగ్రెస్కు బిగ్ షాక్.. హార్దిక్ పటేల్ రాజీనామా
అహ్మదాబాద్: గుజరాత్లో కాంగ్రెస్కు భారీ ఎదురుదెబ్బ తగిలింది. గుజరాత్ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్, పటీదర్ ఉద్యమ నేత హార్దిక్ పటేల్ రాజీనామా చేశారు. పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి, వర్కింగ్ ప్రెసిడెంట్ పదవికి రాజీనామా చేస్తున్నట్లు ట్విటర్ వేదికగా ప్రకటించారు.. ఈ మేరకు రాజీనామా లేఖను షేర్ చేశారు. ‘కాంగ్రెస్ పార్టీకి, పదవికి రాజీనామా చేస్తున్నాను. ‘నా నిర్ణయాన్ని నా సహచరులు గుజరాత్ ప్రజలు స్వాగతిస్తారనని నమ్ముతున్నాను. కాంగ్రెస్ నుంచి బయటకు రావడం ద్వారా భవిష్యత్తులో గుజరాత్ కోసం సానుకూలంగా పనిచేయగలనని విశ్వసిస్తున్నాను’ అని ట్విటర్లో రాసుకొచ్చారు. కాగా మరి కొద్ది నెలల్లో గుజరాత్ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ క్రమంలో హార్దిక్ పటేల్ రాజీనామా చేయడం కాంగ్రెస్కు బిగ్ షాక్ తగిలినట్లైంది. అంతేగాక కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన హార్దిక్ పటేల్ బీజేపీ లేదా ఆమ్ ఆద్మీ పార్టీలో చేరతారనే ప్రచారం సాగుతోంది. ఈ విషయమై త్వరలోనే క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. ఇక రాజీనామా నేపథ్యంలో గుజరాత్లో పార్టీ పరిస్థితిని కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీకి వివరిస్తూ సుధీర్ఘ లేఖ రాశారు. చాలాకాలంగా కాంగ్రెస్ హైకమాండ్ తీరుపై ఆగ్రహంగా ఉన్న హార్దిక్ పార్టీ సీనియర్ నాయకత్వంపై విమర్శలు గుప్పించారు. భారత్లో క్లిష్ట పరిస్థితుల్లో అవసరం వచ్చినప్పుడు మన నేతలు విదేశాల్లో ఉన్నారని రాహుల్ గాంధీని ఉద్ధేశించి విమర్శించారు. అలాగే రాష్ట్రంలో కాంగ్రెస్ సీనియర్ నాయకులు గుజరాత్ ప్రజల సమస్యలను పట్టించుకోవడం లేదని, తమ మొబైల్ చూసుకుంటూ కాలం గడిపేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ నాయకత్వానికి గుజరాత్పై ఆసక్తి లేదని అన్నారు. గుజరాత్ కాంగ్రెస్ లీడర్లు ఢిల్లీ నుంచి వచ్చిన నాయకులకు సేవలు చేయడంలో మునిగిపోయారని మండిపడ్డారు. కాంగ్రెస్ను సరైన దిశలో ముందుకు నడిపించేందుకు ఎన్ని ప్రయత్నాలు చేసినా.. ఆ పార్టీ ఎల్లప్పుడూ దేశ, సమాజ ప్రయోజనాలకు వ్యతిరేకంగా పనిచేస్తోందని పేర్కొన్నారు. అందుకే ప్రతిచోట పార్టీ తిరస్కరణకు గురవుతోందన్నారు. చదవండి: రాజీవ్ గాంధీ హత్య కేసులో సుప్రీం కోర్టు సంచలన తీర్పు గత కొంత కాలంగా హార్దిక్ కాంగ్రెస్ను వీడుతారంటూ ప్రచారం సాగుతున్న విషయం తెలిసిందే. 2019లో కాంగ్రెస్లో చేరిన హార్దిక్ను పార్టీ నాయకత్వం నిర్లక్ష్యం చేస్తోందని, పట్టించుకోలేదని బహిరంగంగా వెల్లడించారు. పీసీసీ సమావేశాలకు కూడా తనను ఆహ్వానించడం లేదని అసంతృప్తి వ్యక్తం చేశారు.. ఈ నేపథ్యంలో హార్దిక పటేల్ రాజీనామా చేయడం చర్చనీయాంశంగా మారింది. గుజరాత్లోని పటీదార్ ఆందోళన ఉద్యమాన్ని ముందుకు తీసుకొచ్చిన హార్దిక్ పటేల్కు తగిన గౌరవం లభించని కారణంగా పార్టీని వీడినట్లు ఆయన సన్నిహిత వర్గాలు చెబుతున్నాయి. -
ఒక చట్టం... వేల వివాదాలు
124ఏ. బ్రిటిష్ వలస పాలకుల కాలం నాటి దేశద్రోహం చట్టం. సుప్రీంకోర్టు స్టే నేపథ్యంలో దీనిపై అంతటా చర్చ జరుగుతోంది. మన దేశంలో ఇది దుర్వినియోగమవుతుండటం నిజమేనా...? సెక్షన్ 124 ఏలో ఏముంది? ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన ప్రభుత్వంపై ఎవరైనా మాటలతో, చేతలతో, సంకేతాలతో, ప్రదర్శనలతో, విద్వేషపూరిత వ్యాఖ్యలతో శత్రుత్వాన్ని ప్రదర్శిస్తే దేశద్రోహ నేరం కిందకి వస్తుంది. దీని కింద కేసు నమోదైతే బెయిల్ లభించదు. ముందస్తు నోటీసులు లేకుండా అరెస్టు చేయవచ్చు. నేరం రుజువైతే మూడేళ్ల నుంచి యావజ్జీవ కారాగార శిక్ష పడుతుంది. దేశ ద్రోహం కేసులు ఎదుర్కొన్న వారు ప్రభుత్వోద్యోగాలకు అనర్హులు. ఎందుకు తెచ్చారు ? స్వాతంత్య్ర పోరాట సమయంలో బ్రిటిష్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రజల్లో వెల్లువెత్తుతున్న ఆగ్రహ జ్వాలల్ని అణిచేసేందుకు ఈ చట్టాన్ని తెచ్చారు. బ్రిటిషిండియా తొలి లా కమిషనర్ థామస్ మెకాలే రూపొందించిన ఈ చట్టాన్ని 1890లో 124ఏ సెక్షన్ కింద భారత శిక్షా స్మృతిలో చేర్చారు. దీనికింద 1891లో తొలిసారిగా జోగేంద్ర చంద్రబోస్ అనే పత్రికా సంపాదకుడిపై కేసు పెట్టారు. తర్వాత తిలక్ మొదలుకుని గాంధీ దాకా ప్రముఖులెందరో కూడా ఈ చట్టం కింద జైలుపాలయ్యారు. బ్రిటన్ మాత్రం దీన్ని 2009లో రద్దు చేసింది. ఆస్ట్రేలియా, సింగపూర్ కూడా ఈ చట్టాన్ని రద్దు చేశాయి. దిశ రవి నుంచి వరవరరావు వరకు కేంద్రంలో మోదీ ప్రభుత్వం రాజకీయంగా ఎదురు తిరిగిన వారిపై దేశద్రోహ చట్టాన్ని విస్తృతంగా ప్రయోగిస్తోందన్న ఆరోపణలున్నాయి. కశ్మీర్పై వ్యాఖ్యలు చేసినందుకు అరుంధతి రాయ్, రైతు ఉద్యమానికి మద్దతుగా టూల్ కిట్ రూపొందించిన సామాజిక కార్యకర్త దిశ రవి, హత్రాస్లో 19 ఏళ్ల దళిత మహిళ గ్యాంగ్ రేప్ కవరేజీకి వెళ్లిన జర్నలిస్టు సిద్దిఖి కపన్, పటీదార్ కోటా ఆందోళనలో పాల్గొన్న హార్దిక్ పటేల్, భీమా–కొరెగావ్ కేసులో సామాజిక కార్యకర్తలు సుధా భరద్వాజ్, వరవరరావు, కరోనా సంక్షోభంపై వ్యాఖ్యలకు జర్నలిస్టు వినోద్ దువా తదితరులపై దేశద్రోహ ఆరోపణలు మోపారు. ► 2015–20 మధ్య దేశవ్యాప్తంగా సెక్షన్ 124ఏ కింద 356 కేసులు నమోదయ్యాయి ► ఈ ఆరేళ్లలో 548 మంది అరెస్టయ్యారు. ఆరుగురికి మాత్రమే శిక్ష పడింది. ► 2010–20 మధ్య బిహార్లో 168, తమిళనాడులో 139, యూపీలో 115, జార్ఖండ్లో 62, కర్నాటకలో 50, ఒడిశాలో 30 కేసులు నమోదయ్యాయి. – సాక్షి, నేషనల్ డెస్క్
Pagination
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
వైఎస్సార్సీపీ అభ్యర్థులకే మా మద్దతు
బోల్తా కొట్టిన బాబు బుల్బుల్ పిట్ట
‘సిద్ధం’ పాటల సీడీని ఆవిష్కరించిన భారతమ్మ
Lok Sabha Election 2024: ఎన్డీఏకు 150 సీట్లూ కష్టమే
మంత్రి పీఎస్ పనిమనిషి ఇంట్లో కోట్లు
ధైర్యంగా చెబుతున్నా.. సర్వేపల్లిని అభివృద్ధి చేశా
దళితులపై దాడి.. టీడీపీ నేతలపై కేసు
మహిళపై దాడి కేసులో నిందితుడికి శిక్ష
‘దురాయి’ని అడ్డం పెట్టుకుని..
నోటాకు చోటు
తప్పక చదవండి
- ఓటమి భయంతో బరితెగిస్తున్న పచ్చమూకలు
- పారిస్ ఒలింపిక్స్కు భారత రిలే జట్లు అర్హత
- వింటున్నావా ఈసీ.. బాబు కారుకూతలు
- సెన్సెక్స్ ప్లస్, నిఫ్టీ మైనస్
- భారత్ సేవల రంగం నెమ్మది
- Lok Sabha Election 2024: మల్లికార్జున ఖర్గే ‘ఇంట’ గెలిచేనా..?’
- నీకే దిక్కు లేదు.. నా కూతురికి సీటు ఇస్తావా?
- అందరివాడు జగన్ను ఆశీర్వదించండి
- పేదల అక్షరంపై కక్ష
- సూర్య విధ్వంసకర సెంచరీ.. ఎస్ఆర్హెచ్పై ముంబై విజయం
Advertisement