-
ఫ్లిప్కార్ట్ గుడ్న్యూస్.. ఇక హైదరాబాద్లోనూ కొత్త ఆఫర్!
హైదరాబాద్: ప్రముఖ ఈ-కామర్స్ సంస్థ ఫ్లిప్కార్ట్ ఇటీవల బెంగళూరు, ఢిల్లీ, కోల్కతా, ముంబైలలో ప్రారంభించిన వీఐపీ సబ్స్క్రిప్షన్ ప్రోగ్రామ్ను ఇప్పుడు హైదరాబాద్కు విస్తరించింది. ఈ సబ్స్క్రిప్షన్ తీసుకున్న కస్టమర్లు ఉచిత డెలివరీ, తగ్గింపు వంటి ఆఫర్లను పొందవచ్చు. ఫ్లిప్కార్ట్ వీఐపీ (Flipkart VIP) సబ్స్క్రిప్షన్ ప్రోగ్రామ్ను కొత్తగా హైదరాబాద్తోపాటు అహ్మదాబాద్, భువనేశ్వర్, కోయంబత్తూర్, గౌహతి, పాట్నా, పూణే, రాంచీలలో వినియోగదారులకు అందుబాటులోకి తెచ్చినట్లు కంపెనీ ప్రకటించింది. కస్టమర్లు సంవత్సరానికి రూ. 499 చెల్లించి ఫ్లిప్కార్ట్ వీఐపీ సబ్స్క్రిప్షన్ తీసుకోవచ్చు. ఫ్లిప్కార్ట్ వీఐపీ సబ్స్క్రిప్షన్ ప్రయోజనాలు ఈ సబ్స్క్రిప్షన్ ప్రోగ్రామ్ లక్షలాది ఉత్పత్తులపై 48-గంటల ఉచిత డెలివరీ, అన్ని ఉత్పత్తులపైనా చెల్లింపుల కోసం సూపర్ కాయిన్స్ను ఉపయోగించి 5 శాతం అదనపు డిస్కౌంట్ పొందవచ్చు. క్లియర్ట్రిప్లో ఒక్క రూపాయికే ఫ్లైట్ క్యాన్సిల్ లేదా రీషెడ్యూల్ చేసుకోవచ్చు. క్లియర్ట్రిప్ హోటల్ బుకింగ్లపై అదనపు ఆఫర్లు, 48 గంటలలోపు రిటన్ పికప్. షాపింగ్ ఫెస్టివల్స్కు ముందస్తు యాక్సెస్ వంటి ప్రయోజనాలు ఉంటాయి. ఇలా ఎలా నమోదు చేసుకోండి.. ఫ్లిప్కార్ట్ వెబ్సైట్ లేదా యాప్ని సందర్శించండి మీ వివరాలతో లాగిన్ చేయండి. ఒకవేళ మీరు ప్లాట్ఫామ్కు కొత్త అయితే, మీ వివరాలను అందించి అకౌంట్ను క్రియేట్ చేసుకోండి. వీఐపీ ల్యాండింగ్ పేజీకి స్క్రోల్ చేసి, 'గెట్ వీఐపీ బెనిఫిట్స్' బటన్పై నొక్కండి చెల్లింపు, తుది ప్రక్రియ కోసం 'కంనిన్వ్యూ' క్లిక్ చేయండి మీకు అనువైన మోడ్ ద్వారా చెల్లింపు వివరాలను నమోదు చేసి ఆర్డర్ను కన్ఫర్మ్ చేఏయండి విజయవంతంగా నమోదు చేసుకున్న తర్వాత, వెబ్సైట్ లేదా యాప్లో కన్ఫర్మేషన్ మెసేజ్ వస్తుంది. -
25 వేల రూట్లు, 10 లక్షల బస్సులు.. ఈకామర్స్ సంస్థ కొత్త సేవలు
ఆన్లైన్ ఈకామర్స్ దిగ్గజ సంస్థ ఫ్లిప్కార్ట్లో వాల్మార్ట్ తన వాటాను పెంచుకున్నప్పటి నుంచి కంపెనీను లాభాలబాట పట్టించేందుకు చర్యలు తీసుకుంటున్నారు. ఇందులో భాగంగా తాజాగా ఫ్లిప్కార్ట్ ఆధ్వర్యంలో ఆన్లైన్ బస్ టికెట్ బుకింగ్ సేవలను ప్రారంభించారు. ఈమేరకు రాష్ట్ర రవాణా కార్పొరేషన్లు, ప్రైవేట్ సంస్థలతో ఒప్పందాన్ని కుదుర్చుకున్నట్లు కంపెనీలు వర్గాలు తెలిపాయి. అయితే ప్రస్తుతానికి ఈ సేవలు బెంగళూరు, ఛండీగఢ్, దిల్లీ, జైపూర్, ఇందోర్, అహ్మదాబాద్, హైదరాబాద్, ముంబై, చెన్నై వంటి ప్రధాన నగరాల్లో అందుబాటులో ఉన్నట్లు కంపెనీ ప్రతినిధులు చెప్పారు. ఇదీ చదవండి: లగేజీ తీసుకురావడానికి రూ.25 కోట్ల కాన్వాయ్! ప్రస్తుతం మార్కెట్లో అందుబాటులో ఉన్న ఆన్లైన్ బస్ బుకింగ్ ప్లాట్ఫామ్లు టికెట్ ధరతోపాటు ఇతర ఛార్జీలు వసూలు చేస్తున్నాయని తెలిపారు. అయితే కొత్తగా వచ్చిన ఫ్లిప్కార్ట్ బుకింగ్ పోర్టల్లో టికెట్ కొంటే ఎలాంటి ఛార్జీలు ఉండవని చెప్పారు. కొత్తసేవలు ప్రారంభించిన సందర్భంగా ఏప్రిల్ 15 వరకు టికెట్ ధరలో 20 శాతం వరకు రాయితీని సైతం పొందవచ్చన్నారు. ఈ అవకాశాన్ని ప్రయాణికులు వినియోగించుకోవాలని పేర్కొన్నారు. దేశవ్యాప్తంగా 25 వేలకు పైగా రూట్లలో 10 లక్షలకు పైగా బస్సులను అనుసందానిస్తూ ఈ సేవలు అందుబాటులోకి తీసుకొచ్చినట్లు వివరించారు. -
కొత్త ఈ-కామర్స్ కంపెనీ.. చవకా.. వీక్నెస్ పట్టేశారు!
దేశంలో సగటు కస్టమర్ల బలహీనతను కంపెనీలు పట్టేస్తున్నాయి. ఇలాంటి కస్టమర్ల కోసం ప్రత్యేక ఈ-కామర్స్ విభాగాలను తెరుస్తున్నాయి. తక్కువ ధరకే నాణ్యమైన ఉత్పత్తులు అంటూ కస్టమర్లను ఆకర్షిస్తున్నాయి. తాజాగా ప్రముఖ ఈ-కామర్స్ సంస్థ అమెజాన్ ఇండియా "బజార్" అనే పేరుతో కొత్త చవక ఉత్పత్తుల విభాగాన్ని పరిచయం చేసింది. ఈ వినూత్న విభాగం కస్టమర్లకు అతి తక్కువ ధరలలో అన్బ్రాండెడ్ ఫ్యాషన్, లైఫ్స్టైల్ ఉత్పత్తులను అందిస్తుంది. భారతీయ వినియోగదారుల విభిన్న అవసరాలు, ప్రాధాన్యతలను తీరుస్తుంది. ఈ కొత్త వెంచర్ ఇప్పుడు అమెజాన్ ఇండియా ఆండ్రాయిడ్ యాప్ ద్వారా వినియోగదారులకు అందుబాటులో ఉంది. ‘ది ఎకనామిక్ టైమ్స్’ ప్రకారం.. ఈ-కామర్స్ దిగ్గజం రూ. 600లోపు ధర కలిగిన దుస్తులు, వాచీలు, బూట్లు, ఆభరణాలు, బ్యాగ్లతో సహా బ్రాండెడ్ ఉత్పత్తులను జాబితా చేయడానికి విక్రేతలను ఆన్బోర్డింగ్ చేసింది. వీటిని ఆర్డర్ చేసే ప్రైమ్ సభ్యులకు 4-5 రోజుల్లోనే డెలివరీ చేయనుంది. సాధారణంగా చవకైన ఉత్పత్తుల డెలివరీకి ఎక్కువ సమయం పడుతుంది. ‘బజార్’ పరిచయాన్ని అమెజాన్ ఇండియా ప్రతినిధి ధ్రువీకరించారు. ది ఎకనామిక్ టైమ్స్ ప్రకారం, భారతదేశం అంతటా ఉన్న తయారీ కేంద్రాల నుండి విక్రేతలు అందించే ఫ్యాషన్, ఇతర వస్తువులను తక్కువ ధరలో కస్టమర్లు కొనుగోలు చేయవచ్చు అని కంపెనీ పేర్కొంది. దేశంలో ఇప్పటికే ఇలాంటి లోకాస్ట్ ఈ-కామర్స్ సంస్థలు కొన్ని ఉన్నాయి. చవక ధర ఉత్పత్తులను విక్రయించడానికి మరో దిగ్గజ ఆన్ షాపింగ్ సంస్థ ఫ్లిప్ కార్ట్ (Flipkart) కూడా షాప్సీ (Shopsy) పేరుతో వేరే యాప్ని నిర్వహిస్తుంది. దీంతోపాటు లోకాస్ట్ ఈ-కామర్స్ మార్కెట్లో పురోగతి సాధిస్తున్న సాఫ్ట్బ్యాంక్-మద్దతు గల మీషోతోనూ అమెజాన్ బజార్ పోటీపడనుంది. -
Flipkart: రెండేళ్లలో రూ.41000 కోట్లు తగ్గిన ఫ్లిప్కార్ట్ విలువ!
న్యూఢిల్లీ: ఈ–కామర్స్ దిగ్గజం ఫ్లిప్కార్ట్ వేల్యుయేషన్ గత రెండేళ్లలో రూ. 41,000 కోట్ల మేర (సుమారు 5 బిలియన్ డాలర్లు) తగ్గింది. 2022 జనవరిలో ఇది 35 బిలియన్ డాలర్లుగా ఉండగా ఈ ఏడాది జనవరి 31 నాటికి 35 బిలియన్ డాలర్ల స్థాయికి పరిమితమైంది. ఫ్లిప్కార్ట్లో వాల్మార్ట్ ఈక్విటీ స్వరూపంలో వచి్చన మార్పుల పరిశీలనతో ఇది వెల్లడైంది. 2022 ఆర్థిక సంవత్సరంలో ఫ్లిప్కార్ట్లో వాల్మార్ట్ 8 శాతం వాటాని 3.2 బిలియన్ డాలర్లకు విక్రయించింది. తద్వారా సంస్థ వేల్యుయేషన్ 40 బిలియన్ డాలర్లుగా లెక్కగట్టినట్లయింది. మరోవైపు, 2024 ఆర్థిక సంవత్సరంలో వాల్మార్ట్ 3.5 బిలియన్ డాలర్లతో తన వాటాను 10 శాతం పెంచుకోవడంతో వేల్యుయేషన్ 35 బిలియన్ డాలర్లుగా లెక్కగట్టినట్లయింది. అయితే, వేల్యుయేషన్ తగ్గిపోయిందనడానికి లేదని, 2023లో ఫోన్పే సంస్థను విడగొట్టడం వల్ల సర్దుబాటు అయినట్లుగా మాత్రమే భావించాల్సి ఉంటుందని ఫ్లిప్కార్ట్ వర్గాలు తెలిపాయి. సంస్థ వేల్యుయేషన్ ప్రస్తుతం 38–40 బిలియన్ డాలర్లుగా ఉంటుందని సంబంధిత వర్గాలు వివరించాయి. -
రేపటి నుంచి బిగ్ అప్గ్రేడ్ సేల్ ప్రారంభం
ఫ్లిప్కార్ట్ బిగ్ అప్గ్రేడ్ సేల్ ఈనెల 9 నుంచి ప్రారంభంకానున్నట్లు కంపెనీ తెలిపింది. ఈ ఈవెంట్కు సంబంధించిన టీజర్ ఇప్పటికే ఈ-కామర్స్ ప్లాట్ఫామ్లో ప్రత్యేక్షమైంది. వారం రోజుల పాటు సాగే ఈ సేల్ ఫిబ్రవరి 15 వరకు కొనసాగనుంది. ఈ సేల్లో భాగంగా పలు ప్రముఖ ఫోన్లపై ఆకర్షణీయ డిస్కౌంట్లు, ఆఫర్లు అందుబాటులో ఉండనున్నట్లు కంపెనీ తెలిపింది. ఫ్లిఫ్కార్ట్ అధికారిక సైట్ బిగ్ అప్డేట్ సేల్ పేజ్లో ప్రచురితమైన వివరాల ప్రకారం.. ఐఫోన్ 15 ఈ సేల్లో తక్కువ ధరకు అందుబాటులో ఉంది. ఈ హాట్ డివైజ్ ప్రస్తుతం రూ.72,999కి లభించనుంది. ఇదీ చదవండి: బంగారం ధర ఆల్టైమ్హైకు చేరనుందా..? ఐఫోన్ 14, శాంసంగ్ గెలాక్సీ ఎస్23 ఎఫ్ఈ, రియల్మి 12 ప్రొ+, వివో టీ2 ప్రొ, శాంసంగ్ గెలాక్సీ ఎస్23 5జీ, మోటో జీ34 5జీ, రెడ్మి 12, పోకో ఎం6 ప్రొ, రియల్మి సీ53, పోకో ఎం6, రెడ్మి 13సీ, పోకో సీ51, మోటో జీ54, రియల్మి 11ఎక్స్ వంటి ఫోన్లపైనా ఫ్లిప్కార్ట్ సేల్ ఆఫర్లు అందుబాటులో ఉంటాయని తెలిపింది. -
యూపీఐ సేవల్లోకి ఈ-కామర్స్ దిగ్గజ సంస్థ
చేతిలో నగదుతో ఇప్పుడు పెద్దగా అవసరం ఉండటం లేదు. మొబైల్ ఫోనులో యూపీఐ యాప్ ఉంటే చాలు. క్షణాల్లో చెల్లింపులు పూర్తయిపోతాయి. కిరాణాకొట్టులోని చిన్న వస్తువుల నుంచి పెద్ద వస్తువుల వరకు అన్నింటికీ యూపీఐ వాడుతున్నారు. ప్రస్తుతం అన్ని బ్యాంకులు యూపీఐని అందుబాటులోకి తీసుకొచ్చాయి. వీటితోపాటు తమ వినియోగదారులకు మరింత సేవలందించేలా ఈ కామర్స్ సంస్థలు మరోఅడుగు ముందుకేసి ఇతర బ్యాంకులతో కలిసి యూపీఐను పరిచయం చేస్తున్నాయి. తాజాగా ఈ-కామర్స్ సంస్థ ఫ్లిప్కార్ట్ యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్ (యూపీఐ) సేవల్లోకి అడుగుపెట్టింది. యాక్సిస్ బ్యాంక్తో భాగస్వామ్యం కుదుర్చుకుని ఈ సేవలను ప్రారంభించినట్లు సంస్థ ప్రకటించింది. తొలుత ఆండ్రాయిడ్ మొబైల్ వినియోగదార్లకు మాత్రమే ఈ సేవలు అందుబాటులో ఉంటాయని తెలిపింది. ఇదీ చదవండి: రొమాంటిక్ సాంగ్.. ముఖేశ్-నీతాల డ్యాన్స్ చూశారా? వినియోగదార్లు ఫ్లిప్కార్ట్ యాప్లో, యూపీఐ ఐడీ క్రియేట్ చేసుకోవడం ద్వారా వ్యాపారులు, ఇతరులకు చెల్లింపులు చేసుకోవచ్చు. థర్డ్పార్టీ యూపీఐ యాప్లైన పేటీఎం, ఫోన్పే, గూగుల్ పే, అమెజాన్ పే వంటి వాటిపై ఆధారపడటాన్ని తగ్గించుకునేందుకే ఈ సేవలు తీసుకొచ్చినట్లు సంస్థ తెలిపింది. -
ఫ్లిప్కార్ట్ కొత్త వ్యూహం.. వేలాదిమందికి ఉద్యోగాలు!
దేశీయ ఈ కామర్స్ దిగ్గజం ఫ్లిప్కార్ట్ (Flipkart) తాజాగా 'నేషనల్ స్కిల్స్ డెవలప్మెంట్ కార్పొరేషన్' (NSDC)తో ఒక అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది. దీని ద్వారా విద్యార్థులకు, ఔత్సాహికులకు ఈ-కామర్స్ సెక్టార్లో మాత్రమే కాకుండా బిజినెస్, రిటైల్, వేర్హౌసింగ్ రంగాలలో నైపుణ్యాలను పెంపొందించడానికి యోచిస్తోంది. ఈ ఒప్పంద కార్యక్రమంలో ఎడ్యుకేషన్, స్కిల్ డెవలప్మెంట్ అండ్ ఎంటర్ప్రెన్యూర్షిప్ మినిష్టర్ 'అతుల్ కుమార్ తివారీ', NSDC COO వేద్ మణి తివారీ పాల్గొన్నారు. భారతదేశంలో వేగంగా అభివృద్ధి చెందుతున్న ఈ కామర్స్ రంగంలో వృత్తిని కొనసాగించాలనుకుని వారికి ఉచిత ఆన్లైన్ కోర్సులను అందించడమే ప్రధాన ఉద్దేశ్యంగా ఈ ఒప్పందం జరిగింది. ఫ్రీ ఆన్లైన్ కోర్సులను నైపుణ్యాలను పెంచుకుంటే.. ఈ కామర్స్ అండ్ రిటైల్ రంగాలలో ఉద్యోగాలు తెచ్చుకోవడం సులభతరం అవుతుంది. ఈ కామర్స్ రంగంలో ఫ్లిప్కార్ట్ నిబద్ధతను బలపరుస్తూ.. వేర్హౌసింగ్ రంగంలో అభ్యర్థులకు ఫ్లిప్కార్ట్ సప్లై చైన్ అకాడమీ ఆధ్వర్యంలో శిక్షణ ఇవ్వడం ద్వారా వారికి కోర్స్ విజయవంతంగా పూర్తి చేసినట్లు సర్టిఫికెట్ కూడా అందిస్తుంది. ఎంఓయూపై సంతకం చేసిన సందర్భంగా ఎన్ఎస్డీసీ డైరెక్టర్ వేద్ మణి తివారీ మాట్లాడుతూ.. పరిశ్రమ అవసరాలకు అనుగుణంగా పౌరులను ఉద్యోగ నైపుణ్యాలతో సన్నద్ధం చేసేందుకు ఎన్ఎస్డీసీ చేస్తున్న ప్రయత్నాల్లో ఇది ఓ ముఖ్యమైన మైలురాయి. ఫ్లిప్కార్ట్తో కలిసి ఈ-కామర్స్, రిటైల్ అండ్ లాజిస్టిక్స్ రంగాలలో విజయం సాధించడానికి అవసరమైన నైపుణ్యం కల్పించడం మా లక్ష్యం. ఉద్యోగార్ధులు వారి ఎంపికకు తగిన ఉద్యోగాన్ని పొందటంలో సహాయపడటానికి మేము ఈ కూటమిని దేశం అంతటా తీసుకెళ్లడానికి ప్లాన్ చేస్తున్నట్లు వెల్లడించారు. ఇదీ చదవండి: టాటాతో రిలయన్స్ డీల్! అంబానీ నెక్స్ట్ ప్లాన్ ఏంటి? ఈ సందర్భంగా ఫ్లిప్కార్ట్ గ్రూప్ చీఫ్ కార్పోరేట్ అఫైర్స్ ఆఫీసర్ 'రజనీష్ కుమార్' మాట్లాడుతూ.. ఫ్లిప్కార్ట్ ఈ-కామర్స్ ప్రయాణంలో మిలియన్ల కొద్దీ స్థానిక వ్యాపారాలకు మద్దతు ఇవ్వడానికి, దేశంలో ఆర్థిక వృద్ధి తోడ్పాటుకు కట్టుబడి ఉంది. నేషనల్ స్కిల్స్ డెవలప్మెంట్ కార్పొరేషన్ (NSDC)తో కామర్స్ అండ్ రిటైల్ రంగాలలో నైపుణ్యాలను అందించడమే లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపారు. -
Flipkart Orders: ఆర్డర్ చేసిన రోజే డెలివరీ.. కానీ..
వాల్మార్ట్ నిర్వహిస్తున్న ఫ్లిప్కార్ట్లో ఇకపై ఏదైనా ఆర్డర్ చేస్తే అదేరోజు డెలివరీ ఇచ్చేలా కంపెనీలు చర్యలు తీసుకుంటున్నట్లు తెలిసింది. దేశంలోని 20 ప్రధాననగరాల్లో ప్రయోగాత్మకంగా ఈ సేవలు ప్రారంభించనున్నట్లు కొన్ని మీడియా కథనాల ద్వారా తెలిసింది. తెలుగు రాష్ట్రాల్లో హైదరాబాద్, విజయవాడతో పాటు అహ్మదాబాద్, బెంగళూరు, భువనేశ్వర్, కోయంబత్తూరు, చెన్నై, దిల్లీ, గువాహటి, ఇందోర్, జైపుర్, కోల్కతా, లఖ్నవూ, లుథియానా, ముంబయి, నాగ్పూర్, పుణె, పట్నా, రాయ్పుర్, సిలిగురి నగరాల్లో ఈ సేవల్ని మొదలు పెట్టనున్నారు. త్వరలోనే ఈ కొత్త సదుపాయం ప్రయోగాత్మకంగా అమలు చేస్తామని ఫ్లిప్కార్ట్ పేర్కొంది. అయితే కచ్చితమైన తేదీని మాత్రం వెల్లడించలేదు. రానున్న నెలల్లో దేశంలోని మరిన్ని నగరాలకు ఈ సేవలను తీసుకురావాలని యోచిస్తున్నట్లు తెలిపింది. మధ్యాహ్నంలోపే ఆర్డర్.. బ్యూటీ, లైఫ్ స్టైల్, బుక్స్, మొబైల్స్, ఫ్యాషన్, గృహోపకరణాలు, ఎలక్ట్రానిక్ విభాగాలకు చెందిన వస్తువులను బుక్ చేసిన రోజే అందించాలనేది లక్ష్యం. అయితే ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలంటే మధ్యాహ్నం ఒంటి గంట లోపే వస్తువులను బుక్ చేసుకోవాలి. ఇదీ చదవండి: బడ్జెట్ 2024-25 కథనాల కోసం క్లిక్ చేయండి అప్పుడు అదే రోజు అర్ధరాత్రి 12 గంటలలోపు వస్తువులు డెలివరీ చేయనున్నారు. మధ్యాహ్నం ఒంటి గంట తర్వాత బుక్ చేసినట్లయితే మరుసటి రోజు డెలివరీ అందుతుందని తెలిసింది. -
ఐఫోన్ కొనుగోలుపై రూ.13000 డిస్కౌంట్! - పూర్తి వివరాలు
యాపిల్ ఐఫోన్ 15 సిరీస్ కొనాలనుకునే వారి కోసం ఫ్లిప్కార్ట్ ఓ అద్భుతమైన ఆఫర్ తీసుకువచ్చింది. రూ.79900 ప్రారంభ ధర వద్ద అందుబాటులో ఉన్న ఈ మొబైల్ మీద బ్యాంక్ ఆఫర్లు, ఎక్స్ఛేంజ్ డీల్ వంటివి అందుబాటులో ఉన్నాయి. ఫ్లిప్కార్ట్లో కొత్త ఐఫోన్ 15 సిరీస్ ఇప్పుడు రూ.13000 డిస్కౌంట్తో కొనుగోలు చేయవచ్చు. అంటే రూ.79900 ఖరీదైన ఐఫోన్ 15 సిరీస్ 128జీబీ మోడల్ 66999 రూపాయలకు కొనేయొచ్చు. 256 జీబీ అండ్ 512 జీబీ మోడల్స్ వరుసగా రూ.76999, రూ.96999 ధరలకు అందుబాటులో ఉన్నాయి. బ్యాంక్ కార్డ్ ఉపయోగించి రూ. 2000, పాత ఫోన్ ఎక్స్ఛేంజ్ చేస్తే రూ. 54990 వరకు తగ్గింపు పొందవచ్చు. ఎక్స్చేంజ్ ఆఫర్ కింద లభించే డిస్కౌంట్ అనేది మీ ఫోన్ కండిషన్ మీద ఆధారపడి ఉంటుంది. నో కాస్ట్ ఈఎమ్ఐ, యూపీఐ తగ్గింపుల ద్వారా కూడా కొంత డబ్బు ఆడ చేసుకోవచ్చు. ఇదీ చదవండి: ఆటో రిక్షా.. అదే స్కూటర్ - ఇప్పటి వరకు ఇలాంటి వెహికల్ చూసుండరు! ఐఫోన్ 15 ప్రో కోసం.. ఐఫోన్ 14 ప్రో మ్యాక్స్ ఎక్స్చేంజ్ చేసుకుంటే రూ.46149 తగ్గింపు పొందవచ్చు. అదే సమయంలో ఐఫోన్ 12 వంటి పాత మోడల్ ఎక్స్చేంజ్ మీద రూ. 20850 తగ్గింపు పొందవచ్చు. ఈ తగ్గింపు ఎక్స్చేంజ్ చేసే మొబైల్ కండిషన్ మీద ఆధారపడి ఉంటుందని గుర్తుంచుకోవాలి. -
దిగ్గజ సంస్థలో చీలిక.. కోఫౌండర్ కొత్త కంపెనీ..!
ఈ-కామర్స్ వ్యాపారంలో ఫ్లిప్కార్ట్ అగ్రగామిగా దూసుకెళ్తోంది. దాన్ని స్థాపించి విజయవంతంగా తీర్చిదిద్దిన బిన్నీ బన్సాల్ తాజాగా మరో ఈ-కామర్స్ బిజినెస్ను ప్రారంభించనున్నట్లు తెలిసింది. ఫ్లిప్కార్ట్ సహ వ్యవస్థాపకుడు బిన్నీ బన్సాల్ గతంలోనే ఫ్లిప్కార్ట్లో తన మిగిలిన వాటాను కూడా విక్రయించిన సంగతి తెలిసిందే. ఫ్లిప్కార్ట్ పూర్తిగా వాల్మార్ట్ యాజమాన్యంలోకి వెళ్లిపోయిన నేపథ్యంలో కంపెనీను విడిచి బిన్నీ బన్సాల్ ఈ-కామర్స్ మార్కెట్లో మరో కొత్త వ్యాపారాన్ని ప్రారంభించేందుకు సిద్ధమవుతున్నారు. కొత్త కంపెనీ పెడుతున్నట్లు బిన్నీ ఇప్పటికే చెప్పారు. జనవరి 2024 ప్రారంభంలో ఆయన తన కొత్త కంపెనీ ‘ఆప్డోర్’ OppDoorను ప్రకటించారు. ఈ కంపెనీ ప్రపంచవ్యాప్తంగా ఈ-కామర్స్ కంపెనీల అభివృద్ధి, విస్తరణకు ఎండ్ టూ ఎండ్ సోల్యూషన్స్ను అందించనుందని తెలిసింది. ‘ఆప్డోర్’ మొదట యూఎస్, కెనడా, మెక్సికో, యూకే, జర్మనీ, సింగపూర్, జపాన్ , ఆస్ట్రేలియా వంటి దేశాల్లో ఈ-కామర్స్ కంపెనీలపై దృష్టి పెట్టనున్నట్లు సమాచారం. ఇదీ చదవండి: బిన్నీ బన్సల్ కూడా.. ఫ్లిప్కార్ట్ నుంచి ఫౌండర్లు ఇద్దరూ అవుట్! ఫ్లిప్కార్ట్ మరో కోఫౌండర్ సచిన్ బన్సాల్ నవీ అనే ఫిన్టెక్ వెంచర్ ఏర్పాటు కోసం కొన్ని సంవత్సరాల కిందటే ఫ్లిప్కార్ట్ను విడిచిపెట్టిన సంగతి తెలిసిందే. గత 16 సంవత్సరాలుగా ఫ్లిప్కార్ట్ గ్రూప్ సాధించిన విజయాల పట్ల బిన్నీ బన్సల్ గర్వాన్ని వ్యక్తం చేశారు. సమర్థవంతమైన నాయకత్వ బృందంతో కంపెనీ బలమైన స్థానంలో ఉందన్నారు. -
కత్తికట్టిన కంపెనీలు.. వందలాది ఉద్యోగులకు ఉద్వాసన!
టెక్ పరిశ్రమలో జోరుందుకున్న లేఆఫ్లు ఈ-కామర్స్, ఫుడ్ డెలివరీ వంటి ఇతర పరిశ్రమలకూ విస్తరిస్తున్నాయి. ఈ పరిశ్రమలలో పనిచేస్తున్న వందలాది మంది చిన్నపాటి ఉద్యోగులకూ ఉద్వాసన తప్పడం లేదు. కొత్త ఏడాదిలో ఇప్పటికే లేఆఫ్లను ప్రకటించిన అమెజాన్, గూగుల్ వంటి టెక్ దిగ్గజాల సరసన ఈ-కామర్స్ మేజర్ ఫ్లిప్కార్ట్, ఫుడ్ డెలివరీ సంస్థ స్విగ్గీ కూడా చేరాయి. వందలాది మంది ఉద్యోగులను తొలగించేందుకు సిద్ధమయ్యాయి. ఈ లేఆఫ్లు నిధుల కొరతతో సతమతమవుతున్న స్టార్టప్ రంగం కష్టాలను తెలియజేస్తున్నాయి. స్విగ్గిలో 400 మంది! ఖర్చులను తగ్గించుకుని, లాభదాయకత వైపు పయనించడానికి ఫుడ్ డెలివరీ ప్లాట్ఫామ్ స్విగ్గీ దాదాపు 350-400 మంది ఉద్యోగులను లేదా దాని వర్క్ఫోర్స్లో దాదాపు 7 శాతం మందిని తొలగించనున్నట్లు మీడియా నివేదికలు చెబుతున్నాయి. స్విగ్గీలోని టెక్ టీమ్తో పాటు కస్టమర్ కేర్ విభాగంలో పనిచేసే ఉద్యోగుపైనే లేఆఫ్ల ప్రభావం ఎక్కువగా ఉంటుందని తెలిసింది. లిస్టింగ్కు సిద్ధమవుతున్న స్విగ్గీలో ఇది రెండో రౌండ్ లేఆఫ్. గతేడాది జనవరిలో స్విగ్గీ 380 ఉద్యోగాలను తొలగించింది. ఫ్లిప్కార్ట్లో 1000 మంది ప్రముఖ ఈ-కామర్స్ సంస్థ ఫ్లిప్కార్ట్ వందలాది మంది ఉద్యోగుల కడుపు కొట్టేందుకు సిద్ధమైంది. వ్యయ నియంత్రణ వ్యూహంలో భాగంగా ఫ్లిప్కార్ట్ పనితీరు ఆధారంగా 1,000 మంది ఉద్యోగులను లేదా 5 శాతం వర్క్ఫోర్స్ను వదులుకుంటున్నట్లు పలు నివేదికలు పేర్కన్నాయి. -
బిన్నీ బన్సల్ కూడా.. ఫ్లిప్కార్ట్ నుంచి ఫౌండర్లు ఇద్దరూ అవుట్!
ప్రముఖ ఈ-కామర్స్ దిగ్గజం ఫ్లిప్కార్ట్లో మరో పరిణామం చోటు చేసుకుంది. కంపెనీ సహ వ్యవస్థాపకుడు బిన్నీ బన్సల్ ఫ్లిప్కార్ట్ బోర్డు నుంచి అధికారికంగా రాజీనామా చేశారు. స్టార్టప్లో తన మిగిలిన వాటాను విక్రయించిన కొన్ని రోజుల తర్వాతే ఈ పరిణామం చోటు చేసుకోవడం గమనార్హం. సచిన్ బన్సాల్ బాటలోనే.. నవీ అనే ఫిన్టెక్ వెంచర్ ఏర్పాటు కోసం కొన్ని సంవత్సరాల క్రితం ఫ్లిప్కార్ట్ను విడిచిపెట్టిన మరో సహ వ్యవస్థాపకుడు సచిన్ బన్సాల్ అడుగుజాడలనే బిన్నీ బన్సల్ కూడా అనుసరించనున్నారని ఇంతకు ముందే పలు నివేదికలు పేర్కొన్నాయి. ఆయన కూడా ఈ-కామర్స్ రంగంలో మరో వెంచర్ను ఏర్పాటు చేస్తారని, అందుకే ఆయన ఫ్లిప్కార్ట్ నుంచి తప్పుకొన్నారని భావిస్తున్నారు. గత 16 సంవత్సరాలుగా ఫ్లిప్కార్ట్ గ్రూప్ సాధించిన విజయాల పట్ల బిన్నీ బన్సల్ గర్వాన్ని వ్యక్తం చేశారు. సమర్థవంతమైన నాయకత్వ బృందంతో కంపెనీ బలమైన స్థానంలో ఉందన్నారు. "ఈ నమ్మకంతో, కంపెనీ సమర్థుల చేతుల్లో ఉందని తెలుసుకుని, నేను పక్కకు తప్పుకోవాలని నిర్ణయించుకున్నాను. ఈ బృందం కస్టమర్లకు మెరుగైన అనుభవాలను అందించడాన్ని ఇలాగే కొనసాగించాలని ఆకాంక్షిస్తున్నాను. సంస్థకు బలమైన మద్దతుదారునిగా కొనసాగుతాను" అని బిన్నీ బన్సల్ ఈ సందర్భంగా పేర్కొన్నారు. ఫ్లిప్కార్ట్తో దేశంలో షాపింగ్ అనుభవాన్ని మెరుగ్గా మార్చిన బిన్నీ బన్సల్ గొప్ప ఆలోచనలను ఫ్లిప్కార్ట్ సీఈవో, బోర్డ్ మెంబర్ అయిన కళ్యాణ్ కృష్ణమూర్తి కొనియాడారు. అంకితభావంతో కూడిన టీమ్వర్క్ వల్లే ఫ్లిప్కార్ట్ ఈ స్థాయికి ఎదిగిందన్నారు. ఫ్లిప్కార్ట్ను బెంగళూరు ప్రధాన కేంద్రంగా 2007లో సచిన్ బన్సల్, బిన్నీ బన్సల్ ప్రారంభించారు. -
ఈ కామర్స్ ఎలిఫెంట్ ఫ్లిప్కార్ట్
న్యూఢిల్లీ: దేశ ఈ కామర్స్ మార్కెట్లో ఫ్లిప్కార్ట్ తన స్థానాన్ని మరింత బలోపేతం చేసుకుంటోంది. 48 శాతం మార్కెట్ వాటాతో వాల్మార్ట్కు చెందిన ఫ్లిప్కార్ట్ మొదటి స్థానంలో ఉన్నట్టు అలియన్స్ బెర్న్స్టీన్ తాజా నివేదిక వెల్లడించింది. అదే సమయంలో జపాన్ సాఫ్ట్బ్యాంక్ పెట్టుబడులు కలిగిన మీషో వేగంగా చొచ్చుకుపోతోంది. గత ఆర్థిక సంవత్సరంలో ఫ్లిప్కార్ట్ 21 శాతం మేర యూజర్లను పెంచుకోగా, మీషో 32 శాతం కొత్త యూజర్లను జోడించుకుంది. అదే సమయంలో అమెజాన్ యూజర్ల వృద్ధి 13 శాతానికే పరిమితమైంది. ‘2022–23 సంవత్సరంలో భారత ఈ–కామర్స్లో 48 శాతం వాటాతో ఫ్లిప్కార్ట్ మార్కెట్ లీడర్గా ఉంది. పరిశ్రమ కంటే వేగంగా ఫ్లిప్కార్ట్ వృద్ధి చెందుతోంది. మొబైల్స్, వ్రస్తాలు ఫ్లిప్కార్ట్కు రెండు పెద్ద విభాగాలుగా ఉన్నాయి. మొబైల్స్లో 50 శాతం, వ్రస్తాల్లో 30 శాతం వాటా కలిగి ఉంది. ఆన్లైన్ స్మార్ట్ఫోన్లలో 48 శాతం, ఆన్లైన్ ఫ్యాషన్ విభాగంలో 60 శాతం చొప్పున మార్కెట్ వాటా ఫ్లిప్కార్ట్ కలిగి ఉంటుందని అంచనా’ అని ఈ నివేదిక తెలిపింది. చిన్న పట్టణాలపై మీషో గురి జీరో కమీషన్ నమూనాలో ద్వితీయ శ్రేణి, చిన్న పట్టణాలపై మీషో వ్యూహాత్మకంగా దృష్టి సారించడం ద్వారా మార్కెట్ వాటాను వేగంగా పెంచుకుంటున్నట్టు బెర్న్స్టీన్ నివేదిక వెల్లడించింది. భారత్లో ఈ కామర్స్ యాప్ డౌన్లోడ్లలో 48 శాతం మేర మీషోనే ఉంటున్నట్టు పేర్కొంది. ‘గడిచిన 12 నెలల్లో మీషో ఆర్డర్ల పరిమాణం 43 శాతం మేర పెరిగింది. ఆదాయంలో 54 శాతం వృద్ధి నెలకొంది. మళ్లీ, మళ్లీ కొనుగోలు చేసే కస్టమర్లు 80 శాతంగా ఉన్నారు. మీషోలో 80 శాతం విక్రేతలు రిటైల్ వ్యాపారవేత్తలు కాగా, ప్లాట్ఫామ్పై 95 శాతం కొనుగోళ్లు అన్బ్రాండెడ్వే ఉంటున్నాయి. నెలవారీ 12 కోట్ల సగటు యూజర్లతో మీషో భారత్లో అత్యంత వేగంగా వృద్ధి చెందుతున్న ఈ–కామర్స్ కంపెనీ. ప్రస్తుతం మీషో స్థూల వాణిజ్య విలువ (జీఎంవీ) 5 బిలియన్ డాలర్ల కంటే ఎక్కువ’అని ఈ నివేదిక వెల్లడించింది. ఫ్యాషన్లో మింత్రా టాప్... ఫ్యాషన్ ఈ–కామర్స్లో రిలయన్స్కు చెందిన అజియో 30 శాతం మార్కెట్ వాటా కలిగి ఉన్నట్టు బెర్న్స్టీన్ నివేదిక తెలిపింది. ఫ్లిప్కార్ట్ గ్రూప్ సంస్థ మింత్రా ఈ విభాగంలో 50% మార్కెట్ వాటాతో మొదటి స్థానంలో ఉంది. 2023 డిసెంబర్లో పోటీ సంస్థల కంటే మింత్రాయే మెరుగ్గా 25 శాతం మేర వృద్ధిని నమోదు చేసింది. ఈ–గ్రోసరీలో బ్లింకిట్ చాలా వేగంగా వృద్ధి చెందుతోంది. ఉత్పత్తుల శ్రేణి, కస్టమర్లకు చేరువ విషయంలో జెప్టో బ్లింకిట్తో పోలిస్తే వెనుకనే ఉన్నట్టు ఈ నివేదిక వెల్లడించింది. బ్లింకిట్ 40 శాతం వాటాతో మొదటి స్థానంలో ఉంటే, స్విగ్గీ ఇన్స్టామార్ట్ 37–39% వాటా, జెప్టో 20% వాటాతో తర్వాతి రెండు స్థానాల్లో ఉన్నాయి. -
ఇదేం ‘సేల్’ బాబోయ్.. అంతా మోసం! ఐఫోన్15 ఆర్డర్ చేస్తే..
ప్రముఖ ఈ-కామర్స్ సంస్థ ఫ్లిప్కార్ట్ కస్టమర్లను బెంబేలెత్తిస్తోంది. ప్రత్యేక సేల్ పేరుతో భారీ తగ్గింపులు ఇస్తూ కస్టమర్లను ఆకట్టుకుంటోంది. దీంతో అత్యధికంగా ఉత్పత్తులు అమ్ముడుపోతున్నాయి. అయితే తమకు లోపాలతోకూడిన ఉత్పత్తులు డెలివరీ అవుతున్నాయని కస్టమర్ల నుంచి ఫిర్యాదులు వెల్లువెత్తున్నాయి. ఫ్లిప్కార్ట్ రిపబ్లిక్ డే సేల్ సందర్భంగా ఓ వ్యక్తి ఐఫోన్ 15 ఆర్డర్ చేయగా అది నకిలీ బ్యాటరీతో వచ్చింది. ఈ మేరకు తనకు వచ్చిన లోపభూయిష్టమైన ఐఫోన్ 15కు సంబంధించిన ఫోటోలు, వీడియోను సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ‘ఎక్స్’ (ట్విటర్)లో షేర్ చేశాడు. నలికీ బ్యాటరీతో వచ్చిన ఈ ఐఫోన్ 15ను రీప్లేస్ చేయడానికి ఫ్లిప్కార్ట్ నిరాకరించిందని వాపోయాడు. “నేను జనవరి 13న ఫ్లిప్కార్ట్ నుంచి iPhone 15ని ఆర్డర్ చేశాను. జనవరి 15న డెలివరీ వచ్చింది. కానీ Flipkart మోసం చేసింది. లోపభూయిష్టమైన ఐఫోన్ 15ని పంపించింది. బాక్స్ ప్యాకేజింగ్ కూడా నకిలీదే. ఇప్పుడు దీన్ని రీప్లేస్ చేయడం లేదు” అని అజయ్ రాజావత్ అనే యూజర్ ‘ఎక్స్’లో రాసుకొచ్చారు. దీనిపై యూజర్లు మిశ్రమంగా స్పందించారు. I ordered iPhone 15 from Flipkart on 13th Jan and I got it on 15th Jan but Flipkart has done fraud they have delivered defective iPhone15 and box packaging was also fake. Now they are not replacing OrderID-OD330202240897143100@flipkartsupport @jagograhakjago @stufflistings pic.twitter.com/dfLEh3FSnk — Ajay Rajawat (@1234ajaysmart) January 18, 2024 -
‘ఆన్లైన్ షాపింగ్ చేయొద్దనేది ఇందుకే’..కళ్లు బైర్లు కమ్మేలా
ఆన్లైన్లో ల్యాప్ట్యాప్ కొనుగోలు చేసిన ఓ వినియోగదారుడికి ఫ్లిప్కార్ట్ ఝలక్ ఇచ్చింది. మధ్యప్రదేశ్కు చెందిన ఓ యూజర్ రిపబ్లిక్ డే సేల్ సందర్భంగా ఫ్లిప్కార్ట్ సేల్లో రూ.1.13 లక్షల విలువైన ల్యాప్టాప్ను కొనుగోలు చేశాడు. బదులుగా ఫ్లిప్కార్ట్ తనకు పాత, డొక్కు ల్యాప్ట్యాప్ను పంపిందని వాపోయాడు. ఇలాంటి చేదు అనుభవాల్ని ఎదుర్కొన్నప్పుడే ఆన్లైన్లో షాపింగ్ చేయాలంటే బయపడాల్సి వస్తుందని అంటున్నాడు. ‘రిపబ్లిక్ డే సేల్లో లక్షకు పై ధరలో ఫ్లిప్కార్ట్లో ఆసుస్ ల్యాప్టాప్ని ఆర్డర్ చేశాను. కానీ ఫ్లిప్కార్ట్ నాకు పాత ల్యాప్ట్యాప్ను పంపింది. అందుకే ఈకామర్స్ ప్లాట్ఫామ్స్ నుండి ఆర్డర్ చేసిన ప్రొడక్ట్లను నమ్మకండి అంటూ బాధితుడు సౌరో ముఖర్జీ వీడియోను ఎక్స్.కామ్లో షేర్ చేశారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. సౌరౌ ముఖర్జీ జనవరి 13న రూ.1.13లక్షలు విలువ చేసే ల్యాప్ట్యాప్ను ఆన్లైన్లో కొనుగోలు చేశాడు. మరుసటి రోజే ల్యాప్ట్యాప్ చేతికి వచ్చింది. వెంటనే సౌరౌ తాను పార్శిల్ను ఓపెన్ చేస్తానని, వీడియో తీయాలని సదరు డెలివరీ బాయ్ను కోరాడు. చెప్పినట్లుగానే డెలివరీ బాయ్ పార్శిల్ను వీడియో తీస్తుంటే ముఖర్జీ దానిని ఓపెన్ చేసి చూస్తాడు. పార్శిల్ ఓపెన్ చేసిన అతనికి కళ్లు బైర్లు కమ్మేలా.. తాను ఖరీదైన ల్యాప్ట్యాప్ బుక్ చేస్తే..మట్టికొట్టుకుపోయిన పాత ల్యాప్ట్యాప్ వచ్చినట్లు గుర్తిస్తాడు. ల్యాప్ట్యాప్ ఓపెన్ చేసి నేను బ్లాక్ ల్యాప్టాప్ని ఆర్డర్ పెట్టాను’ అని ముఖర్జీ వీడియోలో చెబుతుంటే పక్కనే ఉన్న డెలివరీ ఏజెంట్ మాటకలుపుతూ ఇది ఉపయోగించిన ల్యాప్ట్యాప్లా ఉందని అని అంటున్న సంభాషణలు స్పష్టంగా వినపడుతున్నాయి. I ordered a brand new Asus Laptop from Flipkart in this Republic Day sale and I received some old discarded laptop. Never trust products ordered from online platforms. @flipkartsupport @Flipkart #flipkartscam pic.twitter.com/EMEBBhnh2V — Souro Mukherjee (Gutenberg) (@souro9737) January 14, 2024 ఇక ల్యాప్ట్యాప్ పార్శిల్ ఓపెన్ చేసిన అనంతరం ఆన్లైన్లో మీరు ఏదైనా వస్తువును కొనుగోలు చేస్తే ఇలా వీడియోలు తీసుకోవడం మంచిదని, నకిలి పార్శిళ్ల నుంచి సురక్షితంగా ఉంచేలా అవి మనల్ని కాపాడుతాయని అని అన్నాడు. ఇక తనకు ఎదురైన చేదు అనుభవాన్ని ఫ్లిప్ కార్ట్ ప్రతినిధులకు ఎక్స్.కామ్లో ట్యాగ్ చేశాడు. కొత్త ల్యాప్ట్యాప్ను కొనుగోలు చేసే పాత ల్యాప్ట్యాప్ను పంపారని మెసేజ్ చేయగా.. మీ అసౌకర్యానికి చింతిస్తున్నాం. సంబంధిత వివరాల్ని పంపమని మెసేజ్ చేసింది. -
ఫ్లిప్కార్ట్ వినియోగదారులకు బంపరాఫర్!
వినియోగదారులకు ఫ్లిప్కార్ట్ శుభవార్త చెప్పింది. ఫ్లిప్కార్ట్ తర్వలో ఈ ఏడాది తన తొలి ప్రత్యేక సేల్ను నిర్వహించేందుకు సిద్ధమైంది. ఫ్లిప్కార్ట్ రిపబ్లిక్ డే సేల్ జనవరి 14 నుంచి జనవరి 19 వరకు కొనసాగనుంది. ఇక ఈ సేల్లో ఫ్లిప్కార్ట్ ఐఫోన్15, ఐఫోన్ 14, ఐఫోన్ 13, ఐఫోన్ 12, పిక్సెల్ 7ఏ, శాంసంగ్ గెలాక్సీ ఎస్21 ఎఫ్ఈ 5జీ, మోటరోలా ఎడ్జ్ 40 నియో, శాంసంగ్ గెలాక్సీ ఎస్ 22 5జీ, పిక్సెల్ 8, వివో టీ2 ప్రో, ఒప్పో రెనో 10 ప్రో, వివో టీ2ఎక్స్, పోకో ఎక్స్ 5, రియల్ మీ 11, రెడ్మీ 12, శాంసంగ్ గెలాక్సీ ఎఫ్ 34 5జీ ఫోన్లపై డిస్కౌంట్లు ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. ఇక ఐఫోన్ 15పై డిస్కౌంట్ ఇస్తుంది. ఈ ఫోన్ అసలు ధర రూ.79,900 నుండి ఉండగా ఫ్లిప్కార్ట్ రూ.72,999కే అమ్ముతుంది. విజయ్ సేల్స్ ఐఫోన్ 15 సిరీస్ 128జీబీ ఇంట్రర్నల్ స్టోరేజ్ వేరియంట్ ధర రూ. 70,900కి అమ్ముతుంది. కొనుగోలుదారులు బ్యాంక్ ఆఫర్, ఎక్స్ఛేంజ్ డిస్కౌంట్లు పొందవచ్చు. తద్వారా దీని ధర మరింత తగ్గే అవకాశం ఉంది. ఫోన్లతో పాటు ల్యాప్టాప్లు, స్మార్ట్వాచ్లపై కూడా వరుసగా 75 శాతం, 65 శాతం తగ్గింపు ఉండనుంది. ఈ డిస్కౌంట్లపై ఫ్లిప్కార్ట్ మరిన్ని వివరాల్ని వెల్లడించాల్సి ఉంది. -
ఉద్యోగుల కడుపు కొట్టేందుకు సిద్ధమైన ఫ్లిప్కార్ట్!
Flipkart layoffs: ప్రముఖ ఈ-కామర్స్ సంస్థ ఫ్లిప్కార్ట్ వందలాది మంది ఉద్యోగుల కడుపు కొట్టేందుకు సిద్ధమైంది. ఎకనామిక్ టైమ్స్ నివేదిక ప్రకారం.. వ్యయ నియంత్రణ వ్యూహంలో భాగంగా ఫ్లిప్కార్ట్ పనితీరు ఆధారంగా 5-7 శాతం వర్క్ఫోర్స్ తగ్గించేందుకు ప్లాన్ చేస్తోంది. ఈ తొలగింపులు మార్చి-ఏప్రిల్ 2024 నాటికి పూర్తవుతాయని అంచనా వేస్తున్నారు. మరోవైపు ఒక సంవత్సరంపాటు నియామకాలను సైతం ఈ ఈ-కామర్స్ దిగ్గజం నిలిపేసింది. ఫ్లిప్కార్ట్ గత రెండేళ్లుగా పనితీరు ఆధారంగా ఏటా ఉద్యోగాలను తొలగిస్తూ వస్తోంది. 1500 మందిపై ప్రభావం మింత్రా మినహా కంపెనీ ప్రస్తుత ఉద్యోగుల సంఖ్య 22,000గా ఉంది. ప్రస్తుతం చేపట్టనున్న తొలగింపులు 1100-1500 మంది ఉద్యోగులపై ప్రభావం చూపనున్నాయి. కాగా కంపెనీ పునర్నిర్మాణం, 2024కు సంబంధించిన రోడ్మ్యాప్ వచ్చే నెలలో జరిగే సీనియర్ ఎగ్జిక్యూటివ్ల సమావేశంలో ఖరారవుతాయని నివేదిక సూచిస్తోంది. ఇదే బాటాలో పేటీఎం, అమెజాన్, మీషో వంటి ఇతర సంస్థలు కూడా ఇటీవల వ్యయ నియంత్రణ, పునర్నిర్మాణ చర్యలు చేపట్టాయి. అదానీ గ్రూప్నకు 20 శాతం వాటా ఉన్న క్లియర్ట్రిప్తో సహకారాన్ని కూడా ఫ్లిప్కార్ట్ పరిశీలిస్తోంది. ఎయిర్లైన్ బుకింగ్లపై దృష్టి సారించే క్లియర్ట్రిప్నకు సంబంధించిన హోటల్ వ్యాపారంలో ఫ్లిప్కార్ట్ పెట్టుబడి పెట్టే అవకావం ఉంది. వాల్మార్ట్, ఇతర సంస్థల నుంచి సమీకరిస్తున్న 1 బిలియన్ డాలర్ల నిధులు ఫ్లిప్కార్ట్ వ్యూహాత్మక ప్రణాళికలకు మద్దతు ఇస్తాయని అంచనా వేస్తున్నారు. -
అదనపు ఛార్జీలు లేకుండా ఫుడ్, క్యాబ్ సర్వీసు..!
బిర్యానీ తినాలని ఆన్లైన్లో ఆర్డర్ పెడితే నేరుగా రెస్టారెంట్కు వెళ్లి తినే ఖర్చుకంటే అధికంగా ఛార్జీలు కనిపిస్తూంటాయి. హైదరాబాద్లోని ఏదైనా ప్రముఖ రెస్టారెంట్లో రూ.250కి దొరికే బిర్యానీ.. ఆన్లైన్లో ఆర్డర్ చేస్తే జీఎస్టీ, కన్వేయన్స్, ఇంటర్నెట్ హ్యాండ్లింగ్, ప్యాకింగ్, డెలివరీ ఛార్జీలన్నీ కలిపి రూ.300 పైగానే ఖర్చవుతోంది. రెస్టారెంట్ నుంచి ఇంటి దూరం పెరిగితే ఛార్జీలు మరింత పెరిగే అవకాశం ఉంటుంది. ఇదిలా ఉండగా.. నిత్యం ఏదో అవసరానికి ఎమర్జెన్సీలో ఒకప్రదేశం నుంచి మరో ప్రదేశానికి ప్రయాణించాలంటే ఆన్లైన్లో క్యాబ్, బైక్ బుక్ చేస్తూంటారు. మార్నింగ్, ఈవినింగ్ సమయంలో ‘పీక్, సర్జ్ అవర్స్’ పేరుతో సాధారణం కంటే అదనంగా ఛార్జ్ చేస్తూంటారు. ఇలా కొన్ని సంస్థలు చేస్తున్న వ్యవహారాలపై నియంత్రణ లేకుండా పోయింది. దాంతో వినియోగదారులపై భారంపడుతోంది. అలాంటి వ్యవస్థలను సవాళు చేస్తూ కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ ఓఎన్డీసీ (ఓపెన్ నెట్వర్క్ డిజిటల్ కామర్స్) వేదికను అందుబాటులోకి తీసుకొచ్చింది. డీపీఐఐటీ(డిపార్ట్మెంట్ ఫర్ ప్రమోషన్ ఆఫ్ ఇండస్ట్రీ అండ్ ఇంటర్నల్ ట్రేడ్) ఆధ్వర్యంలో వినియోగదారులకు నిర్దేశిత ధరల్లోనే ఫుడ్ డెలివరీలతో పాటు, క్యాబ్ సర్వీసులు, ఆన్లైన్లో వస్తువుల విక్రయం వంటి సేవలందిస్తున్నారు. మధ్యవర్తుల ప్రమేయం లేకుండా రెస్టారెంట్ ధరలు, వినియోగదారుడు ఉన్న దూరం ఆధారంగా నిర్దేశిత రుసుముతోనే ఆర్డర్లను చేర్చడం ఈ వేదిక ప్రత్యేకత. ఉదాహరణకు నగరంలోని ఓ ప్రముఖ రెస్టారెంట్లో బిర్యానీ రూ.300 ధర ఉంటే ఓఎన్డీసీ ద్వారా బుక్ చేస్తే డెలివరీ ఛార్జీలు కలిపి సుమారు రూ.325కి లభిస్తుంది. ఇంటర్నెట్, ప్యాకేజింగ్ ఛార్జీలు అంటూ అదనపు బాదుడు ఉండదు. 1,15,000 మందికి పైగా డెలివరీబాయ్స్తో బెంగళూరు, కొచ్చి, మైసూరు, కోల్కతా నగరాల్లో ఈ వేదిక కార్యకలాపాలు నిర్వహిస్తోంది. ఆ ప్రాంతాల్లో వీరంతా రూ.160కోట్ల ఆదాయాన్ని పొందారు. హైదరాబాద్లోనూ ఇటీవల ఓఎన్డీసీ సేవలు ప్రారంభించింది. తెలంగాణ గిగ్వర్కర్స్ అసోసియేషన్కు చెందిన డెలివరీబాయ్లు ఇందులో భాగస్వాములైనట్లు ఆ సంస్థ పేర్కొంది. ఓఎన్డీసీకు సంబంధించి ప్రత్యేకమైన యాప్ ఏమీ లేదు. యూపీఐ పేమెంట్ యాప్ల ద్వారానే నేరుగా ఆర్డర్ ఇవ్వొచ్చు. ప్రస్తుతం పేటీఎం ద్వారా ఇది నగరవాసులకు అందుబాటులో ఉంది. హైదరాబాద్కు చెందిన 25వేల మంది డెలివరీబాయ్లు ఇందులో పనిచేస్తున్నారు. ఇదీ చదవండి: ఫ్రీ సినిమా పేరిట సైబర్ మోసం.. ఏం చేస్తున్నారంటే.. హైదరాబాద్లో ఏటా కోటి కంటే ఎక్కువ బిర్యానీలు అమ్ముడవుతున్నాయి. 15 వేలకు పైగా రెస్టారెంట్లు ఉన్నాయి. ఏటా కేవలం ఆన్లైన్ ద్వారానే రూ.500 కోట్ల వ్యాపారం జరుగుతోందని మార్కెట్ విశ్లేషకుల అంచనా. కేంద్రం ప్రారంభించిన ఓఎన్డీసీ వేదిక ఎక్కువమందికి చేరువైతే సుమారు రూ.50కోట్ల మేర వినియోగదారులకు ఆదా అయ్యే అవకాశం ఉందని తెలిసింది. -
ఫ్లిప్కార్ట్కు 600 మిలియన్ డాలర్లు
న్యూఢిల్లీ: దేశీ ఈ–కామర్స్ సంస్థ ఫ్లిప్కార్ట్కు అమెరికన్ రిటైల్ దిగ్గజం 600 మిలియన్ డాలర్లు సమకూర్చనుంది. ఫ్లిప్కార్ట్ ప్రస్తుత వేల్యుయేషన్కు అదనంగా 5–10% లెక్కగట్టి వాల్మార్ట్ ఈ నిధులు అందిస్తున్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. అయితే, తాజా నిధుల సమీకరణ తర్వాత కంపెనీ వేల్యుయేషన్ ఎంత స్థాయిలో ఉంటుందనేది వెల్లడి కాలేదు. ఇది 40 బిలియన్ డాలర్ల లోపే ఉంటుందని ఇతర వర్గాలు తెలిపాయి. ఫ్లిప్కార్ట్ చివరిసారి 37.6 బిలియన్ డాలర్ల విలువతో జీఐసీ, కెనడా పెన్షన్ ప్లాన్ ఇన్వెస్ట్మెంట్ బోర్డ్, సాఫ్ట్బ్యాంక్ విజన్ ఫండ్ 2 తదితర సంస్థల నుంచి 3.6 బిలియన్ డాలర్లను సమీకరించింది. -
కొనుగోలు దారులకు బంపరాఫర్, ఫ్లిప్కార్ట్లో 80 శాతం భారీ డిస్కౌంట్కే..
ప్రముఖ దేశీయ ఈకామర్స్ దిగ్గజం ఫ్లిప్కార్ట్ కొనుగోలు దారులకు శుభవార్త చెప్పింది. మరికొద్ది రోజుల్లో ప్రారంభం కానున్న కొత్త ఏడాదిని పురస్కరించుకుని డిసెంబర్ 9 నుంచి ఫ్లిప్ కార్ట్ బిగ్ ఇయర్ ఎండ్ సేల్ నుంచి ప్రారంభించింది. డిసెంబర్ 9న ప్రారంభమై డిసెంబర్ 16 వరకు కొనసాగే సేల్లో 80 శాతం డిస్కౌంట్ పొందవచ్చు. ఇయర్ ఎండ్ సేల్స్లో ఎలక్ట్రానిక్స్, ఫ్యాషన్, సహా పలు కేటగిరీల్లోని ఉత్పత్తులపై 80 శాతం వరకు తగ్గింపు పొందవచ్చని ఫ్లిప్కార్ట్ ప్రతినిధులు తెలిపారు. వీటితో పాటు ఫ్లిప్కార్ట్ హెచ్డీఎఫ్సీ, పంజాబ్ నేషనల్ బ్యాంక్తో పాటు ఇతర ఫైనాన్స్ కంపెనీ ద్వారా జరిపే కొనుగోళ్లపై ఇన్స్టంట్ డిస్కౌంట్, క్యాష్బ్యాక్, ఎక్స్ఛేంజ్ ఆఫర్లు, నో-కాస్ట్ ఈఎంఐ ఆఫర్లు పొందవచ్చు. ఐఫోన్14 రిటైల్ ధర రూ.69,900 ఉండగా.. ఈ సేల్ ద్వారా రూ.55,000కే కొనుగోలు చేయవచ్చని ఫ్లిప్కార్ట్ పేర్కొంది. మోటోరోలా ఎడ్జ్ 40 పైనా ఫ్లిప్కార్ట్ రాయితీ అందిస్తోంది. రూ.34,999 ధర వద్ద విడుదలైన ఈ ఫోన్ రూ.25,499కే లభిస్తుంది. ఇన్ఫీనిక్స్ హాట్ 30ఐ ను రూ.7,149కే కొనుగోలు చేయవచ్చు. నథింగ్ ఫోన్2 ధర రూ.39,999 కాగా.. తాజా సేల్లో రూ.34,999కే కొనుగోలు చేయవచ్చు. -
యాపిల్ ఐఫోన్ లవర్స్కి బంపరాఫర్!
యాపిల్ ఐఫోన్ లవర్స్కి బంపరాఫర్. యాపిల్ కంపెనీకి చెందిన ఐఫోన్లను తక్కువ ధరకే అమ్మకాలు నిర్వహిస్తున్నట్లు ప్రముఖ ఈకామర్స్ సంస్థ ఫ్లిప్కార్ట్ తెలిపింది. డిస్కౌంట్లు, బ్యాంక్ ఆఫర్లు, ఇతర ఎక్ఛేంజ్ ఆఫర్లు అన్నీ కలుపుకుని రూ.30,000లోపే దక్కించుకునే అవకాశాన్ని కల్పిస్తుంది. ఐఫోన్ 12 సిరీస్ మార్కెట్ ధర రూ.49,900 ఉండగా రూ.40,999కే ఫ్లిప్ కార్ట్ విక్రయిస్తుంది. ఈ ఫ్లాట్ఫామ్ ద్వారా చేసే ఐఫోన్ కొనుగోలుపై 17 డిస్కౌంట్ను పొందవచ్చు. ఇతర బ్యాంక్ ఆఫర్లు సైతం అందుబాటులో ఉండగా.. దీని ధర మరింత తగ్గనుంది. ఫ్లిప్కార్ట్ యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డ్, సిటీబ్యాంక్ క్రిడెట్ కార్డ్, యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డ్లపై ఈఎంఐలో ఐఫోన్ను కొనుగోలు చేస్తే రూ.1000 డిస్కౌంట్ లభిస్తుంది. మీ వద్ద పాత ఫోన్ ఉంటే దానిని ఇచ్చేసి ఈ యాపిల్ ఫోన్ను ఎక్ఛేంజ్ కింద తక్కువ ధరకే సొంతం చేసుకోవచ్చు. ఐఫోన్ 12 అమ్మకాలు నిలిపివేత ఈ ఏడాది సెప్టెంబరులో ఫ్రాన్స్ అధికారులు ఐఫోన్ 12 అమ్మకాలను నిలిపివేయాలని ఆదేశించినట్లు పలు నివేదికలు వెలుగులోకి వచ్చాయి. ఐఫోన్ 12 అనుమతించిన దానికంటే ఎక్కువ రేడియేషన్ను విడుదల చేస్తుంది. అయితే, ఐఫోన్ 12 గ్లోబల్ రేడియేషన్ ప్రమాణాలకు అనుగుణంగా అంతర్జాతీయ సంస్థలు ధృవీకరించాయని యాపిల్ తనను తాను సమర్థించుకుంది. టెక్ దిగ్గజం ఫ్రాన్స్లోని ఐఫోన్ 12 వినియోగదారుల కోసం ఫ్రెంచ్ రెగ్యులేటర్లు ప్రోటోకాల్కు అనుగుణంగా సాఫ్ట్వేర్ అప్డేట్ను కూడా విడుదల చేసింది. అదే సమయంలో , ఫ్రాన్స్ యూరోపియన్ యూనియన్ రేడియేషన్ ఎక్స్పోజర్ పరిమితులను ఉల్లంఘించినందున దేశంలో ఐఫోన్ 12 అమ్మకాలను నిలిపివేసింది. ఐఫోన్ 12 అక్కడ అమ్ముడవుతుందో లేదో తెలుసుకునేందుకు తమ ఏజెంట్లను యాపిల్ స్టోర్లకు పంపుతామని ఆ దేశ అధికారులు చెప్పారు. అమ్మకాలు నిలిపివేస్తున్నట్లు ఆదేశాలు జారీ చేసినప్పటికీ, ఫోన్ ఇప్పటికీ విక్రయిస్తున్నట్లు గుర్తించేతే ఇప్పటికే వినియోగదారులకు విక్రయించిన ఫోన్లను రీకాల్ చేస్తామని వారు తెలిపారు. -
బిగ్ డీల్స్: రూ.15 వేల కంటే తక్కువకే బెస్ట్ 5జీ ఫోన్లు!
దేశవ్యాప్తంగా 5జీ నెట్వర్క్ విస్తృతం అవుతున్న నేపథ్యంలో చాలా మంది 5జీ ఫోన్లు కావాలని కోరుకుంటున్నారు. అయితే ఎక్కువ ధర కారణంగా కొనలేకపోతున్నారు. అలాంటి వారికి ఇదే మంచి సమయం. ప్రముఖ ఈ-కామర్స్ సంస్థ ఫ్లిప్కార్ట్లో బిగ్ దీపావళి సేల్ (Flipkart Big Diwali Sale) ప్రారంభమైంది. ఈ ఫ్లిప్కార్ట్ బిగ్ దీపావళి సేల్లో 5జీ ఫోన్లపై అద్భుతమైన డీల్స్ అందుబాటులో ఉన్నాయి. ప్రముఖ బ్రాండ్ల 5జీ ఫోన్లు చాలా తక్కువ ధరకే లభిస్తున్నాయి. శాంసంగ్, ఐకూ, పోకో వంటి ప్రముఖ బ్రాండ్లకు చెందిన రూ. 15,000లోపు లభించే టాప్ మూడు 5జీ ఫోన్ డీల్స్ గురించి ఇక్కడ తెలియజేస్తున్నాం. శాంసంగ్ గెలాక్సీ ఎం14 5జీ శాంసంగ్ గెలాక్సీ ఎం14 5జీ (Samsung Galaxy M14 5G), శాంసంగ్ గెలాక్సీ ఎఫ్14 (Samsung Galaxy F14) రెండూ ఒకే విధమైన స్పెసిఫికేషన్లను అందిస్తాయి. M సిరీస్ వెర్షన్లో అదనంగా 2-మెగాపిక్సెల్ రియర్ కెమెరా ఉంటుంది. రెండెంటిలోనూ ఒకే విధమైన పర్ఫార్మెన్స్ ఉంటుంది. రెండు ఫోన్లూ 6000 mAh బ్యాటరీతో వస్తాయి. అయితే వీటికి ఛార్జర్ రాదు. ప్రత్యేకంగా కొనుక్కోవాల్సి ఉంటుంది. ఫ్లిప్కార్ట్ బిగ్ దీపావళి సేల్లో శాంసంగ్ గెలాక్సీ ఎం14 5జీ ఫోన్ రూ. 11,967కి అందుబాటులో ఉండగా, శాంసంగ్ గెలాక్సీ ఎఫ్14 ధర రూ.11,490 ఉంది. ఎస్బీఐ క్రెడిట్ కార్డ్లతో కొటే అదనంగా 10 శాతం తగ్గింపు ఉంటుంది. ఐకూ జెడ్6 లైట్ 5జీ ఐకూ జెడ్6 లైట్ 5జీ (iQOO Z6 Lite 5G) అనేది బడ్జెట్ ఫ్రెండ్లీ 5జీ ఫోన్. దీని ధర రూ. 13,989. స్నాప్డ్రాగన్ 4 జెన్ 1 చిప్సెట్తో వచ్చే ఈ ఫోన్ రోజువారీ ఉపయోగం, సాధారణ గేమింగ్ కోసం మంచి పనితీరును అందిస్తుంది. 120Hz స్క్రీన్ ఉన్న ఈ ఫోన్ మెరుగైన గేమింగ్, మీడియా వినియోగ అనుభవాన్ని అందిస్తుంది. పోకో ఎం6 ప్రో 5జీ రూ. 10 వేల లోపు సెగ్మెంట్లో వచ్చే పోకో ఎం6 ప్రో 5జీ (Poco M6 Pro 5G) రోజువారీ వినియోగం, సాధారణ గేమింగ్ కోసం స్నాప్డ్రాగన్ 4 జెన్ 2 చిప్సెట్ను అందిస్తుంది. 5,000mAh బ్యాటరీ, 18W ఛార్జింగ్ సపోర్ట్తో సుదీర్ఘ బ్యాటరీ లైఫ్ను ఆశించవచ్చు. ఫ్లిప్కార్ట్ బిగ్ దీపావళి సేల్లో ఇది ధర రూ. 9,999లకే లభిస్తోంది. -
ఫ్లిప్కార్ట్ నష్టాలు పెరిగాయ్
న్యూఢిల్లీ: మార్చితో ముగిసిన గత ఆర్థిక సంవత్సరం(2022–23)లో ఈకామర్స్ దిగ్గజం ఫ్లిప్కార్ట్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ నిరుత్సాహకర ఫలితాలు ప్రకటించింది. కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన నికర నష్టం భారీగా పెరిగి రూ. 4,891 కోట్లకు చేరింది. అంతక్రితం ఏడాది(2021–22) ఇదే కాలంలో రూ. 3,371 కోట్ల నష్టం మాత్రమే నమోదైంది. బిజినెస్ ఇంటెలిజెన్స్ ప్లాట్ఫామ్ టోఫ్లర్ వివరాల ప్రకారం స్టాండెలోన్ నష్టాలు సైతం 44 శాతం పెరిగి రూ. 4,839 కోట్లను దాటాయి. అంతక్రితం రూ. 3,362 కోట్ల నష్టం ప్రకటించింది. కాగా.. కన్సాలిడేటెడ్ ఆదాయం 9 శాతంపైగా ఎగసి రూ. 56,013 కోట్లకు చేరింది. 2021–22లో మొత్తం ఆదాయం రూ. 51,176 కోట్లుగా నమోదైంది. మొత్తం వ్యయాలు రూ. 60,858 కోట్లకు చేరాయి. -
ఆన్లైన్లో ఏవి ఎక్కువ కొంటున్నారంటే..
పండుగ సీజన్లో ఈకామర్స్ ప్లాట్ఫామ్లు ఆఫర్లు ప్రకటించాయి. అయితే కొందరు వారి ఆర్థికస్థోమత తగినట్లు ఆయా వస్తువులు కొనుగోలు చేస్తుంటారు. కొన్నిసార్లు కొనే వస్తువులకు సరిపడా డబ్బు లేకపోయినా అప్పుచేసి మరీ వాటిని తీసుకుంటాం. అయితే కొంచెం ఆలస్యం అయినా ఎక్కువ మంది భారతీయులు ప్రీమియం వస్తువులనే తీసుకుంటున్నట్లు కొన్ని సర్వేలు చెబుతున్నాయి. అయితే అందులో అధికంగా డిమాండ్ ఉన్న వాటి గురించి తెలుసుకుందాం. ఆఫర్ సీజన్లో మొబైల్ ఫోన్ల కొనుగోళ్లకు ప్రత్యేకస్థానం ఉంది. అయితే ఈసారీ దాని ప్రస్థానం కొనసాగుతుంది. ప్రస్తుతం ఫ్యాషన్ వస్తువులు కూడా బాగా ప్రాచుర్యం పొందుతున్నాయి. రెండు వర్గాలలోనూ ప్రీమియం ఉత్పత్తులకు అధిక డిమాండ్ ఉన్నట్లు తెలుస్తుంది. అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ 2023లో భాగంగా ఈ-కామర్స్ ప్లాట్ఫారమ్ ద్వారా ప్రైమ్ ఎర్లీ యాక్సెస్ దశలో సేల్ ప్రారంభమైన మొదటి గంటలో సెకనుకు 75 కంటే ఎక్కువ స్మార్ట్ఫోన్లను కొనుగోలు చేశారు. మొదటి 48 గంటల్లో విక్రయించిన ప్రతి ఐదు స్మార్ట్ఫోన్లలో నాలుగు 5జీ మోడళ్లు అని సర్వే తెలిపింది. ప్రీమియం స్మార్ట్ఫోన్లు గత ఏడాదితో పోలిస్తే 3 రెట్లు వృద్ధిని సాధించాయి. ల్యాప్టాప్లు కూడా గత సంవత్సరంతో పోలిస్తే 40శాతం అధికంగా అమ్ముడయ్యాయి. ఫ్లిప్కార్ట్ ద్వారా కూడా ఎలక్ట్రానిక్స్, మొబైల్ ఫోన్ల విభాగంలో ప్రీమియం ఉత్పత్తులను కొనుగోలు చేశారు. గతేడాది బిగ్ బిలియన్ డేస్ సేల్తో పోలిస్తే ప్రీమియం స్మార్ట్ఫోన్ సెగ్మెంట్ 1.7 రెట్లు పెరిగింది. పండగ సీజన్ అమ్మకాల్లో భాగంగా 15లక్షల ఐఫోన్లను విక్రయించారు. ధరల తగ్గింపు, ఆకర్షణీయమైన ఆఫర్ల కారణంగా అన్ని విభాగాల్లో అమ్మకాలు ఊపందుకున్నట్లు తెలిసింది. -
‘బిగ్ దసరా సేల్’లో అదిరిపోయే ఆఫర్లు
ప్రముఖ ఈకామర్స్ దిగ్గజం ఫ్లిప్కార్ట్ మరో భారీ సేల్కు సిద్ధమైంది. దసరా పండుగ పర్వదినాన్ని పురస్కరించుకుని ‘బిగ్ దసరా సేల్’ పేరుతో ఈ నెల 22 నుంచి 29 వరకు ప్రత్యేక సేల్ నిర్వహిస్తుంది. ఈ సేల్లో భాగంగా ఆయా బ్యాంక్ క్రెడిట్ కార్డ్, డెబిట్ కార్డ్లపై షాపింగ్ చేసిన కస్టమర్లకు పది శాతం డిస్కౌంట్, ఐసీఐసీఐ బ్యాంక్ డెబిట్ లేదా క్రెడిట్ కార్డులపై ఫ్లిప్ కార్ట్ ప్లస్ మెంబర్లకు పది శాతం ఈ నెల 21 నుంచి డిస్కౌంట్ అందిస్తున్నట్లు ఫ్లిప్కార్ట్ వెల్లడించింది. ఇక,సూపర్ కాయిన్ల ద్వారా ఐదు శాతం అదనపు డిస్కౌంట్ అందుకోవచ్చునని తెలిపింది. దసరా సేల్లో స్మార్ట్ ఫోన్లు, స్మార్ట్ వాచీలు, ఎలక్ట్రానిక్ ఉత్పత్తులు, హోం అప్లయెన్సెస్, దుస్తులపై ఆఫర్లు అందచేస్తున్న ఫ్లిప్ కార్ట్ .. పలు కంపెనీలకు చెందిన అన్నీ రకాల స్మార్ట్ఫోన్లపై ఆఫర్లను అందిస్తున్నట్లు ఫ్లిప్కార్ట్ ప్రతినిధులు చెబుతున్నారు. ఐఫోన్ 14తోపాటు పలు స్మార్ట్ ఫోన్లపై త్వరలో ఆఫర్లు ప్రకటించనున్నది. కాగా, ఫ్లిప్కార్ట్ కొద్ది రోజుల క్రితం బిగ్ బిలియన్ డేస్ సేల్స్లో కొనుగోలు దారులకు ఆఫర్లను అందించిన విషయం తెలిసిందే.
Pagination
ఓటర్ మిత్రమా.. జాగ్రత్త! ఆ సౌండ్ వస్తేనే మీరు ఓటేసినట్టు!
ఇది కదా క్రేజ్ అంటే.. సీఎం జగన్ ఇంటర్వ్యూకి మిలియన్ల వ్యూస్
Sakshi.com ఇప్పుడు సరికొత్తగా మీ ముందుకు
కాపులు, ముస్లింలకు రిజర్వేషన్లు అక్కర్లేదు: పవన్కళ్యాణ్
రైతు కుమార్తె విజయం.. రిషబ్ శెట్టి అభినందనలు
పులివెందుల ప్రజలకు ఇద్దరిపైనా ప్రేమే: వైఎస్ భారతి
RCB Vs PBKS: కోహ్లి అరుదైన రికార్డు.. ఐపీఎల్ చరిత్రలోనే తొలి క్రికెటర్గా
Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ కేసులో బిగ్ ట్విస్ట్..
బిజీగా ఉండటం ఇంత డేంజరా! హెచ్చరిస్తున్న సైకాలజిస్ట్లు
కారులో వాసన బాగుందని తెగ పీల్చుకుంటున్నారా.?
పటిష్ట బందోబస్తు
72 ప్రత్యేక పోలింగ్ కేంద్రాలు
● రామగుండం కమిషనరేట్లో పర్యవేక్షణ కేంద్రం ● మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో మరింత అప్రమత్తం ● నిరంతరం పర్యవేక్షణ చేస్తున్న పోలీసు ఉన్నతాధికారులు
నేడే లోక్సభ పోలింగ్
రంగంపల్లిలో ఓటు వేయనున్న కలెక్టర్
ఉరుములు.. మెరుపులు
బైక్ నడిపి.. చాయ్ తాగి
ఓటరూ.. ఒక్క నిమిషం..!
పకడ్బందీగా సిద్ధం
నేడే లోక్సభ పోలింగ్
తప్పక చదవండి
- ఉద్దానానికి ఊపిరి
- పర్యాటకం కళకళ
- పెత్తందారుల వెన్నులో వణకు తెప్పిస్తున్న కొత్తతరం..!
- నాడు చదువులు ఉత్త మిథ్య.. నేడు జీవితకాల భరోసా!
- బాబు షాక్కు.. జగన్ ట్రీట్మెంట్
- ఓటర్ మిత్రమా.. జాగ్రత్త! ఆ సౌండ్ వస్తేనే మీరు ఓటేసినట్టు!
- పవన్ వ్యూహానికి వంగా గీత కౌంటర్ వ్యూహమిదే..!
- సీఎం వైఎస్ జగన్ చేయూత.. పారిశ్రామికవేత్తలుగా మహిళలు
- RRRకి కమ్మటి దెబ్బ.. పరువు తీసేసిన బీజేపీ!
- దారి తప్పిన మేధావి.. ఎందుకీ మార్పు?
Advertisement