-
భారీ వర్షం.. నిలిచిన విమానాలు
ప్రపంచంలోనే రద్దీగా ఉండే ఎయిర్పోర్ట్ల్లో దుబాయ్ అంతర్జాతీయ విమానాశ్రయం ఒకటి. ఇటీవల కురిసిన భారీ వర్షాల కారణంగా వరదలు ముంచెత్తడంతో భారత్ నుంచి దుబాయ్ వెళ్లే విమానాలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. దాంతో ఎయిర్ ఇండియా, ఇండిగో తమ సర్వీసులను రద్దు చేసినట్లు ప్రకటించాయి. దిల్లీ విమానాశ్రయంలో దుబాయ్కి వెళ్లే పది విమానాలు, దుబాయ్ నుంచి వచ్చే తొమ్మిది విమానాలను రద్దు చేస్తున్నట్లు బుధవారం ప్రకటించారు. భారత్లోని వివిధ నగరాల నుంచి ఎయిరిండియా దుబాయ్కి వారానికి 72 విమానాలను నడుపుతోంది. #6ETravelAdvisory: Flights to/fro #Dubai stand canceled until 12 PM on Apr 18, due to Airport restrictions and operational challenges caused by bad weather and road blockages. Do explore our alternate flight options or request for a full refund by visiting https://t.co/xe8o6KQdpT — IndiGo (@IndiGo6E) April 17, 2024 ‘రాబోయే కొద్ది రోజుల్లోనే పూర్తి స్థాయిలో విమానాలను నడిపేలా చర్యలు తీసుకుంటాం. ప్రస్తుతం బాధిత ప్రయాణికులకు వసతి కల్పించడానికి కృషిచేస్తున్నాం. 16, 17 తేదీల్లో ప్రయాణాలకోసం టికెట్ బుక్చేసినవారు ఒకసారి తేదీ మార్చుకునేందుకు అవకాశం కల్పించనున్నాం. దాంతో వారు తమ గమ్యస్థానాలు చేరేలా ఏర్పాటు చేస్తున్నాం’అని ఒక ప్రతినిధి చెప్పారు. #TravelUpdate: SpiceJet flights to/from Dubai (DXB) are affected due to adverse weather conditions in Dubai. Please refer link https://t.co/rNJZcxc6Wo for an alternate flight, or a full refund. You may also get in touch with our 24/7 Customer Care Helpline Numbers at +91 (0)124… — SpiceJet (@flyspicejet) April 17, 2024 ఇదీ చదవండి: ఎన్పీసీఐ సమావేశం..గూగుల్పే, ఫోన్పేకు లేని ఆహ్వానం! ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్, విస్తారా, ఇండిగో, స్పైస్జెట్తో సహా ఇతర విమానయాన సంస్థలు దుబాయ్కి వెళ్లే మార్గంలో అంతరాయాన్ని ఎదుర్కొన్నాయి. ప్రతికూల వాతావరణ పరిస్థితుల కారణంగా దుబాయ్కి వెళ్లే అన్ని సర్వీసులను రద్దు చేసినట్లు ఇండిగో తన సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ‘ఎక్స్’లో ప్రకటించింది. 2023 ఏడాదికిగాను ప్రపంచంలోనే అత్యంత రద్దీగా ఉండే రెండో విమానాశ్రయంగా దుబాయ్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ గుర్తింపు పొందిన విషయం తెలిసిందే. -
కలల కెరియర్ కుప్పకూలుతోంది! 1400 మంది జీవితాలు..
SpiceJet layoff : ఎయిర్లైన్స్లో పనిచేయాలని చాలా మంది కలలు కంటూ ఉంటారు. ఎయిర్ క్రాఫ్ట్లలో పైలట్లుగా, ఇతర సిబ్బందిగా పనిచేయడం ఎంతో మందికి డ్రీమ్ కెరియర్. ఆకర్షణీయమైన వేతనాలతో పాటు దీన్నో ఉత్తమ ప్రొఫెషన్గా చూస్తారు. అలాంటి కలల కెరియర్ కుప్పకూలిపోతోంది.. 1400 మంది జీవితాలు రోడ్డు మీదకు వస్తున్నాయి. 15 శాతం మంది లేఆఫ్ చౌక ధరల్లో విమాన ప్రయాణాన్ని అందించే ఎయిర్లైన్గా పేరొందిన స్పైస్జెట్ తీవ్రమైన నగదు కొరతతో సతమతమవుతోంది. దీంతో ఖర్చులను తగ్గించుకోవడానికి తమ వర్క్ఫోర్స్లో దాదాపు 15 శాతం మంది అంటే సుమారు 1400 మంది ఉద్యోగులను తొలగిస్తోంది. ఈ చర్య ద్వారా పెట్టుబడిదారుల ఆసక్తిని నిలుపుకోవాలని ప్రయత్నిస్తోంది. ఉద్యోగుల తొలగింపు విషయాన్ని స్పైస్జెట్ ధ్రువీకరించినట్లు ఎకనామిక్ టైమ్స్ పేర్కొంది. ఆపరేషనల్ అవసరాల కోసం కంపెనీలో అన్ని రకాల ఖర్చులను సర్దుబాటు చేసుకోవడంలో భాగంగా లేఆఫ్లు అమలు చేస్తున్నట్లు స్పైస్జెట్ ప్రతినిధిని ఉటంకిస్తూ పేర్కొంది. తొలగింపులు అనివార్యం స్పైస్జెట్లో ఉద్యోగుల జీతాల బిల్లు రూ. 60 కోట్లు ఉంది. ఈ కారణంగానే ఉద్యోగుల తొలగింపులు అనివార్యమైనట్లు కంపెనీ అంతర్గత పరిణామాలు తెలిసినవారు చెబుతున్నారు. తొలగింపుల గురించి ఉద్యోగులకు కంపెనీ ఇప్పటికే సమాచారం ఇస్తున్నట్లు తెలుస్తోంది. కాగా స్పెస్జెట్ కొన్ని నెలలుగా జీతాల చెల్లింపులో జాప్యం చేస్తోంది. చాలా మందికి జనవరి నెల జీతం ఇప్పటికీ అందలేదు. ప్రస్తుతం స్పైస్జెట్లో 9,000 మంది ఉద్యోగులు ఉన్నారు. ఈ సంస్థ 30 విమానాలను నడుపుతోంది. 2019లో స్పైస్జెట్లో గరిష్ట స్థాయిలో 16,000 మంది ఉద్యోగులు ఉండేవారు. 118 విమానాలను ఈ సంస్థ నడిపేది. రూ. 2,200 కోట్ల నిధులు పొందే ప్రక్రియలో ఉన్నామని, అయితే కొంత మంది ఇన్వెస్టర్లలో విశ్వాసం కొరవడిందని స్పైస్జెట్ చెబుతోంది. “ఫండింగ్ జాప్యాలు ఏవీ లేవు. మా ఫండ్ ఇన్ఫ్యూషన్తో బాగా పురోగమిస్తున్నాం. తదనుగుణంగా ఇప్పటికే బహిరంగ ప్రకటనలు చేశాం. తదుపరి పురోగతిని త్వరలో తెలియజేస్తాం. చాలా మంది ఇన్వెస్టర్లు మాతో చేరుతున్నారు” అని స్పైస్జెట్ ప్రతినిధి పేర్కొన్నారు. -
Kolkata: విమానంలో మహిళతో అసభ్య ప్రవర్తన
కలకత్తా: పశ్చిమబెంగాల్ రాజధాని కలకత్తా నుంచి బాగ్డోరా వెళుతున్న స్పైస్జెట్ విమానంలో తోటి మహిళా ప్రయాణికురాలితో ఒక వ్యక్తి అసభ్యంగా ప్రవర్తించాడు. ఈ మేరకు ఎయిర్లైన్స్ ఆదివారం(ఫిబ్రవరి 4) ఒక ప్రకటన విడుదల చేసింది. ఈ ఘటన జనవరి 31నాడు జరిగినట్లు ఎయిర్లైన్స్ వెల్లడించింది. పక్క సీట్లో కూర్చున్న వ్యక్తి తనతో అసభ్యంగా ప్రవర్తిస్తున్నాడని మహిళా ప్రయాణికురాలు ఫిర్యాదు చేసిన వెంటనే అతని సీటు మార్చినట్లు ఎయిర్లైన్స్ సిబ్బంది తెలిపారు. అయితే తాను అసభ్యంగా ప్రవర్తించలేదని ఆ వ్యక్తి సిబ్బందికి స్పష్టం చేశాడు. ‘విమానం బాగ్డోరాలో ల్యాండ్ అయిన వెంటనే ఇద్దరు ప్రయాణికులను సీఐఎస్ఎఫ్ సిబ్బంది వద్దకు తీసుకెళ్లాం. తనకు క్షమాపణలు చెప్పాలని మహిళా ప్రయాణికురాలు ఆ వ్యక్తిని కోరింది. అసభ్యంగా ప్రవర్తించిన వ్యక్తి క్షమాపణలు చెప్పాడు. దీంతో ఆ మహిళా ప్రయాణికురాలు ఎలాంటి రాతపూర్వక ఫిర్యాదు చేయకుండానే వెళ్లిపోయింది’ అని ఎయిర్లైన్స్ సిబ్బంది తెలిపారు. గడిచిన కొన్ని నెలల్లో విమానాల్లో ఇలాంటి పలు సంఘటనలు నమోదయ్యాయి. న్యూయార్క్ నుంచి ఢిల్లీ వస్తున్న విమానంలో ఒక వ్యక్తి వయసులో పెద్దదైన మహిళపై మూత్ర విసర్జన చేశాడని కేసు నమోదైంది. ఈ కేసులో నిందితుడిని అరెస్టు చేశారు. నెల జైలు తర్వాత అతడికి బెయిల్ వచ్చింది. ఇదీచదవండి.. రాష్ట్ర హోదా కోసం లడఖ్లో నిరసనలు -
స్పైస్జెట్ విమానం టాయిలెట్లో చిక్కుకున్న ప్రయాణికుడు
ముంబయి: స్పైస్జెట్ విమానం టాయిలెట్స్లో చిక్కుకుని ఓ ప్రయాణికుడు నరకయాతన అనుభవించాడు. ముంబయి నుంచి బెంగళూరు వరకు వెళ్లే స్పైస్జెట్ విమానంలో ఈ ఘటన జరిగింది. టేకాఫ్ అయిన దగ్గర నుంచి బెంగళూరులో ల్యాండ్ అయ్యేవరకు గంటకుపైగా టాయిలెట్లోనే ఉండిపోయాడు. విమానం ముంబయిలో టేకాఫ్ అయ్యాక ఓ వ్యక్తి టాయిలెట్స్కి వెళ్లాడు. తిరిగి వచ్చే క్రమంలో టాయిలెట్స్ డోర్ లాక్ అయిపోయింది. ఎంత ప్రయత్నించినా రాలేదు. క్రూ సిబ్బంది అతనికి సహాయం చేసే ప్రయత్నం చేశారు. తీరా బెంగళూరులో ల్యాండ్ అయ్యాక.. ఇంజినీర్ వచ్చి డోర్ ఓపెన్ చేసేవరకు బాధిత వ్యక్తి టాయిలెట్స్లోనే ఉండిపోయాడు. The note from the crew to the passenger locked on #Spicejet flight. #Avgeek #Aviation pic.twitter.com/pPrvXq8mJm — Aman Gulati 🇮🇳 (@iam_amangulati) January 17, 2024 "జనవరి 16న ముంబయి నుంచి బెంగళూరుకు వెళ్తున్న స్పైస్జెట్ విమానంలో దురదృష్టవశాత్తూ ఒక ప్రయాణికుడు సుమారు గంటసేపు టాయిలెట్స్లో చిక్కుకుపోయాడు. డోర్ లాక్ లోపం కారణంగా విమానం గాలిలో ప్రయాణించింది. ప్రయాణమంతా మా సిబ్బంది ఆ ప్రయాణికునికి మార్గనిర్దేశం చేశారు. ఈ అసౌకర్యానికి చింతిస్తున్నాం." అని స్పైస్జెట్ తెలిపింది. ఇదీ చదవండి: రిపబ్లిక్ డే వేళ ఢిల్లీలో గోడలపై ఖలిస్థానీ రాతల కలకలం -
దివాలా తీసిన ‘గో ఫస్ట్’పై 3 కంపెనీల కన్ను!
న్యూఢిల్లీ: దివాలా తీసిన గో ఫస్ట్ ఎయిర్లైన్స్ను కొనుగోలు చేయడానికి మూడు సంస్థలు పోటీపడుతున్నాయి. దేశీ విమానయాన సంస్థ స్పైస్జెట్, షార్జాకి చెందిన ఏవియేషన్ కంపెనీ స్కై వన్, ఆఫ్రికా కేంద్రంగా పని చేసే సాఫ్రిక్ ఇన్వెస్ట్మెంట్స్ వీటిలో ఉన్నాయి. గో ఫస్ట్ కొనుగోలుపై ఆసక్తిగా ఉన్నట్లు స్టాక్ ఎక్సే్చంజీలకు స్పైస్జెట్ తెలియజేసింది. మదింపు ప్రక్రియను పూర్తి చేసిన తర్వాత త్వరలోనే తమ ఆఫర్ ప్రకటించే యోచనలో ఉన్నట్లు వివరించింది. మదింపు ప్రక్రియను చేపట్టేందుకు గత పది రోజులుగా ఈ మూడు సంస్థల నుంచి దివాలా పరిష్కార నిపుణుడు (ఆర్పీ) శైలేంద్ర అజ్మీరాకు అభ్యర్ధనలు వచి్చనట్లు తెలుస్తోంది. వాస్తవానికి గో ఫస్ట్ కొనుగోలు కోసం బిడ్లు దాఖలు చేసేందుకు గడువు నవంబర్ 22తో ముగిసింది. అయితే, గడువు లోపల స్పందించని కంపెనీలు.. ఆ తర్వాత ఆసక్తి వ్యక్తం చేయడం గమనార్హం. తాజా పరిస్థితుల నేపథ్యంలో బిడ్డింగ్ డెడ్లైన్ను మరికొంత కాలం పొడిగించాలని బిడ్డర్లు కోరినట్లు సమాచారం. దీనిపై రుణదాతల కమిటీ (సీఓసీ) నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుందని సంబంధిత వర్గాలు తెలిపాయి. ఆర్థిక సంక్షోభంలో చిక్కుకున్న గో ఫస్ట్ మే 3 నుంచి కార్యకలాపాలు నిలిపివేసిన సంగతి తెలిసిందే. మరోవైపు, ఒడుదుడుకులు ఎదుర్కొంటున్న స్పైస్జెట్, ఆర్థికంగా నిలదొక్కుకునేందుకు 270 మిలియన్ డాలర్లను సమీకరించుకునే ప్రయత్నాల్లో ఉంది.
Pagination
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
ఐసీయూలో అమ్మ... కలుస్తానంటే వెళ్లనివ్వలేదు: ప్రముఖ టీవీ నటి
యూనీసెఫ్ ఇండియా నేషనల్ అంబాసిడర్గా 'కరీనా కపూర్'
‘ఆప్’ స్టార్ క్యాంపెయినర్ల లిస్టులో కేజ్రీవాల్ పేరు
టీ20 వరల్డ్కప్ వస్తోంది.. బుమ్రాకు విశ్రాంతి ఇవ్వండి: జాఫర్
హీరామండి సిరీస్లో పెద్ద తప్పులు.. ఇవి కూడా చూసుకోరా?
భూకబ్జాలు చేసేవారికి ఈ యాక్ట్ రావడం ఇష్టముండదు: సజ్జల
ప్రధాని మోదీ కీలక వ్యాఖ్యలు.. 25 ఏళ్లలో..
రేపు దేశవ్యాప్తంగా నీట్ పరీక్ష.. ఏపీలో 29 పరీక్షా కేంద్రాలు
Best Pictures Of The Day : ఈ రోజు ఉత్తమ చిత్రాలు (03-05-2024))
లైంగిక ఆరోపణల కేసు.. రేవణ్ణ అరెస్టు
తప్పక చదవండి
- ట్రెండింగ్లో 'హీరామండి'.. సిరీస్పై అద్భుతమైన ప్రశంసలు
- పూంచ్లో ఉగ్రదాడి.. సైనికులకు గాయాలు
- ఐసీయూలో అమ్మ... కలుస్తానంటే వెళ్లనివ్వలేదు: ప్రముఖ టీవీ నటి
- రాకాసి నర్సుకు 760 ఏళ్ల జైలు శిక్ష : అసలు ఏమైందంటే..!
- బీజేపీలో చేరిన ఢిల్లీ మాజీ కాంగ్రెస్ చీఫ్ అరవిందర్ సింగ్
- నాలుగుసార్లు అబార్షన్ అయిందా? క్లారిటీ ఇచ్చిన స్టార్ హీరోయిన్
- రాయ్బరేలి బరిలో రాహుల్.. వయనాడ్ ఓటర్ల ఫీలింగ్ ఇదే..!
- బాలుడి ఊపిరితిత్తుల్లోకి ఎల్ఈడీ బల్బు.. డాక్టర్లు ఏం చేశారంటే..
- చంద్రబాబు మేనిఫెస్టో మాయలు గుర్తున్నాయా?: సీఎం జగన్
- Tech Layoffs 2024: షాకింగ్ రిపోర్ట్: ఒక్క నెలలోనే 21 వేల టెకీలకు ఉద్వాసన
Advertisement