-
తండ్రి మరణించిన 10 రోజులకే పనిలో.. సాయం చేస్తానన్న హీరో
ఇంటి పెద్ద దిక్కు మరణిస్తే ఆ కుటుంబ పరిస్థితి ఎంతో దయనీయంగా మారుతుంది. సంపాదనతో ఫ్యామిలీని పోషించే మనిషి లేకుంటే అంతా తలకిందులవుతుంది. చాలా సందర్భాల్లో పిల్లలు బడి మానేసే దుస్థితి ఏర్పడుతుంది. వయసుకు మించిన పని చేయడానికీ వెనుకాడరు. ఇటీవల ఢిల్లీలో జస్ప్రీత్ అనే పిల్లవాడు తన తండ్రిని కోల్పోవడంతో ఆయనలాగే చపాతీలు చేసే పనిలోకి దిగాడు. పదేళ్ల వయసులోనే కుటుంబ బాధ్యతను భుజాన వేసుకున్నాడు. చేయూతనిచ్చేందుకు రెడీతల్లి పంజాబ్లోని గ్రామంలో ఉండగా జస్ప్రీత్ తన సోదరితో కలిసి వాళ్ల ఆంటీ ఇంట్లో ఉంటున్నాడు. ఓ ఫుడ్ వ్లాగర్ ఇతడి పరిస్థితి సోషల్ మీడియా ద్వారా ప్రపంచానికి తెలియజేశాడు. దీంతో ఆనంద్ మహీంద్రా, ఆప్ ఎమ్మెల్యే జర్నైల్ సింగ్, బీజేపీ లీడర్ రాజీవ్ బాబ్బర్ తనకు సాయం చేసేందుకు ముందుకు వచ్చారు. తాజాగా బాలీవుడ్ హీరో అర్జున్ కపూర్ తనకు చేయూతనిచ్చేందుకు రెడీ అయ్యాడు.సెల్యూట్ ఈ పదేళ్ల బాలుడు చిరునవ్వుతో కష్టాలను దాటేందుకు ప్రయత్నిస్తున్నాడు. తండ్రి చనిపోయిన పది రోజులకే ఆయన పనిని చేసేందుకు రంగంలోకి దిగిన అతడి గుండెధైర్యానికి సెల్యూట్ చేస్తున్నాను. అతడికి లేదా అతడి సోదరికి మంచి విద్య అందించేందుకు సాయం చేయాలనుకుంటున్నాను. అతడు ఎక్కడుంటాడో తెలిస్తే చెప్పండి అని ఇన్స్టాగ్రామ్ స్టోరీలో రాసుకొచ్చాడు. ఇది చూసిన జనాలు అర్జున్ది ఎంత గొప్ప మనసు అని కొనియాడుతున్నారు.చదవండి: రూ.15 లక్షల విలువైన జ్యువెలరీ.. తల్లికి రైతుబిడ్డ గిఫ్ట్! -
ఇల్లు తుడిచే మాప్ కాదు, బీబీక్యూ మాప్ సాస్: వీడియో వైరల్
ఇంటర్నెట్లో ఫుడ్కు సంబంధించిన అనేక వీడియోలు సందడి చేస్తూ ఉంటాయి. వీటిల్లో కొన్ని ఆకర్షణీయంగా ఉంటే, మరికొన్ని మాత్రం యాక్.. అనిపిస్తుంటాయి కదా. అలాంటి ఇంట్రస్టింగ్ వీడియోనే ఒకటి నెట్టింట చక్కర్లు కొడుతోంది. View this post on Instagram A post shared by Chef Matt Cooper (@stadiumchef) దోసల పెనం మీద చీపురు కట్టతో తుడవడం చూశాం. మొన్నఒక వ్యక్తి అనేక చికెన్ కాల్చడం కోసం పొడవైన తుడుపుకర్రను వాడేసిన వీడియో ఇంటర్నెట్లో వైరల్ అయింది. తాజాగా ఒక మహిళ మాంసాన్ని గ్రిల్ చేస్తూ, మాప్ స్టిక్ వాడడం నెటిజన్లకు షాకిచ్చింది. ఈ మేరకు ఆమె షేర్ చేసిన వీడియో 45 మిలియన్లకు పైగా వ్యూస్ను సొంతం చేసుకంది. 47వేలకు పైగా కామెంట్లు వెల్లువెత్తాయి.stadiumchef ఇన్స్టాగ్రామ్ రీల్లో ఒక మహిళా చెఫ్ సాస్ కంటైనర్లో తుడుపుకర్రను ముంచి, తరువాత బీబీక్యూలోని మీట్పై పూసింది. బీబీక్యూ మాప్ సాస్ అనే క్యాప్షన్తో షేర్ ఈ చేసిన వీడియోపై వివరణ కూడా ఇచ్చింది. ఇలాంటి మాప్స్ గ్రిల్డ్ మాంసాన్ని చేసేందుకు స్పెషల్గా తయారు చేస్తారని వివరణ ఇచ్చింది. పెద్దమొత్తంలో స్మోక్డ్ మీట్ చేసేటపుడు ఇవి ఉపయోగపడతాయి. మీరు దక్షిణాదికి చెందినవారు కాకపోతే, అర్థం కాదు అని కూడా ఆమె తెలిపింది. ఇంత వివరణ ఇచ్చినా ఇది చూసి వెంటనే కొంతమంది నెటిజన్లు భిన్నంగా స్పందించారు. ‘‘అస్సలు హైజీనిక్గా లేదు..బాబోయ్ బాక్టీరియా మయం రా బాబూ.. నేను తిన’’ అని ఒక యూజర్ కమెంట్ చేయగా, చాలామంది బీబీక్యూ మాప్ను సమర్ధించారు. -
మిస్టర్ బీస్ట్ బర్త్డే గిఫ్ట్ : ఖరీదైన టెస్లా కారు కావాలా నాయనా?
అమెరికన్ యూట్యూబర్, ప్రముఖ సోషల్ మీడియా ఇన్ఫ్లూయెన్సర్ తన ఫాలోయర్లకు బంపర్ ఆఫర్ ప్రకటించాడు. మిస్టర్ బీస్ట్గా పాపులర్ అయిన జిమ్మీ డొనాల్డ్సన్ తన 26వ పుట్టినరోజు (మే 7) సందర్భంగా 26 టెస్లా కార్లను బహుమతిగా ఇవ్వబోతున్నట్టు ప్రకటించాడు. ఇందులో ఒక సైబర్ ట్రక్ కూడా ఉందని ప్రకటించడం విశేషం. కండిషన్స్ అప్లయ్ అంటూ కొన్ని నిబంధనలు కూడా పెట్టాడు. దీంతో ఈ వీడియో నెట్టింట చక్కర్లు కొడుతోంది. వైరల్ కంటెంట్ విచిత్రమైన సవాళ్లతో తనకు తానే సాటి అని నిరూపించుకనే మిస్టర్ బీస్ట్ తాజాగా దీనికి సంబంధించిన వీడియోను తన ఇన్స్టాగ్రామ్ అధికారిక ఖాతాలో పోస్ట్ చేశాడు. అయితే ఇందులో ఒక మతలబు ఉంది. తన పోస్ట్ కింద కామెంట్ చేసి, ఇద్దరు ఫ్రెండ్స్ను ట్యాగ్ చేసిన 26 మందిని ఎంపిక చేసి, 26 కార్లను బహుమతిగా ఇస్తానని ప్రకటించాడు. డ్రా తీసిన అనంతరం విజేతలకు డైరెక్ట్గా మెసేజ్ చేస్తానని, వారం రోజుల్లో (మే 11న) ఎంపికైన వారి వివరాలను ప్రకటిస్తానని తెలిపాడు. అంతేకాదు రకరకాల పేర్లు, లేదా రీపోస్ట్లు లాంటి జిమ్మిక్కులు పనిచేయవని కూడా వెల్లడించాడు. View this post on Instagram A post shared by MrBeast (@mrbeast) 254 మిలియన్లకు పైగా సబ్స్క్రైబర్లతో యూట్యూబ్లో అత్యధిక ఫాలోవర్లున్న వ్యక్తిగా కొనసాగుతున్న మిస్టర్ బీస్ట్ నికర విలువ రూ.4,175 కోట్లు (500 మిలియన్ల డాలర్లు)గా తెలుస్తోంది. 2012 ప్రారంభంలో 13 ఏళ్ల వయస్సులో 6000 పేరిట తొలుత ఓ యూట్యూబ్ ఛానెల్ ప్రారంభించాడు. ఆ తర్వాత బీస్ట్ రియాక్ట్స్, మిస్టర్ బీస్ట్ గేమింగ్, మిస్టర్ బీస్ట్ 2, అలాగే ఒక దాతృత్వ ఛానెల్ బీస్ట్ ఫిలాంత్రరోపీని నడుపుతున్నాడు. దీని ద్వారా అనేక సామాజిక కార్యక్రమాలను విరాళాలిస్తుంటాడు. -
ఇదే మరి మ్యాజిక్ అంటే.. 'జస్ట్ లుకింగ్ లైక్ ఎ వావ్'
ఫోటోషాప్ జిమ్మిక్కులు మామూలుగా ఉండవు. టెక్నాలజీమీద పట్టు ఉంటే చాలు ఉన్నది లేనట్టు, లేనిది ఉన్నట్టు సృష్టించవచ్చు. అలాంటి వారిలో జేమ్స్ అనే ఫోటోషాపర్ది అందె వేసిన చేయి. ఆయన కొంచెం చమత్కారి కూడా. మన ఆర్టిస్టు మోహన్లా...ఫోటోషాప్లో కనికట్టు చేయడంలో చాలా ఫేమస్.అందుకే జేమ్స్కు రోజూ కొన్ని రిక్వెస్ట్లు కుప్పలు తెప్పలుగా వచ్చి పడతాయి. మా ఫోటో కొంచెం ఎడిట్ చేసి ఇవ్వొచ్చు కదా అని అడుగుతారు. జేమ్స్ ఇచ్చే ట్విస్ట్కి ఎలాంటి వారైనా ఫిదా కావాల్సిందే. ఒరిజనల్ ఫోటో చూసేదాకా అది ఎడిట్ చేసిన ఫోటో అని ఎవరూ గుర్తుపట్టలేనంత. ఆశ్చర్యంగా ఉంది కదా. అయితే మచ్చుకు కొన్ని మీరే చూడండి.Some Hilarious Photoshop Requests that will make your day😂😂A Thread 🧵😂 pic.twitter.com/DpZi3krCrH— ✨🤍 (@Phillipong3) May 7, 2024 -
ఖరీదైన కారులో వడా పావ్ : ఢిల్లీ ‘కుమారాంటీ’ మరో సంచలనం
హైదరాబాద్ కుమారాంటీ తరహాలో సంచలనం రేపిన వడా పావ్ గర్ల్ మరోసారి సోషల్ మీడియాలో సందడి చేస్తోంది. ఖరీదైన కారుతో కనిపించి సెన్సేషన్ క్రియేట్ చేసింది. లగ్జరీ, దాదాపు కోటి రూపాయల అద్భుతమైన ఫోర్డ్ మస్టాంగ్లో వడా పావ్ అమ్ముతూ కనిపించిన వీడియో వైరల్గా మారింది.ఢిల్లీకి చెందిన "వడా పావ్ గర్ల్" చంద్రికా దీక్షిత్ మంగోల్పురి ప్రాంతంలో ఒక ఫాస్ట్ ఫుడ్ స్టాల్ను నిర్వహిస్తుంది. రోజూ వందల మందికి వడ పావ్ను విక్రయిస్తుంది. అలా వడా పావ్ గర్ల్గా బాగా ఫేమస్ అయింది. ఇన్స్టాలో 31 లక్షల మందికి పైగా ఫాలోవర్లు ఉన్నారంటే ఆమె క్రేజ్ను అర్థం చేసుకోవచ్చు.తాజాగా ఫోర్డ్ ముస్టాంగ్ కారులో వడాపావ్ అమ్ముతానంటూ ఇన్స్టాలో ఒక వీడియోను పోస్ట్ చేసింది. "వడ పావ్ అమ్మాయి ముస్తాంగ్ కారులో వడా పావ్ అమ్మడం ప్రారంభించింది." అని ప్రకటించింది. అంతేకాదు వెయట్ చేయండి.. వడాపావ్తో పాటు త్వరలో ఒక పెద్ద ప్రకటన రాబోతోంది అని కామెంట్ చేసింది. దీంతో చుట్టుపక్కల ఉన్నవారంతా చప్పట్ల మోత మోగించారు. అమెరికన్ కార్ కంపెనీ ఫోర్డ్ ఇండియాలో ఉత్పత్తిని నిలిపివేసింది. భారత మార్కెట్లో ఈ కారులే టెస్ట్ వెర్షన్ ధర సుమారు 75 లక్షల రూపాయలు ఉంటుందని అంచనా. View this post on Instagram A post shared by Chandrika Gera Dixit official (@chandrika.dixit) కాగా ఇటీవల తనను పోలీసులు అరెస్ట్ చేశారంటూ ఒకవీడియో వైరల్ అయింది. అయితే ఆమెను అరెస్ట్ చేయలేదని ఎటువంటి కేసు నమోదు చేయలేదని పోలీసులు వివరణ ఇచ్చిన సంగతి తెలిసిందే. రెండు రోజుల క్రితం పోస్ట్ చేసిన వీడియోలో, ముస్తాంగ్ కారు నుండి బయటికి రావడం, సరికొత్త ఐఫోన్, ఐవాచ్, ఎయిర్పాడ్లను కొనుగోలు చేయడానికి దుకాణంలోకి వెళ్లిన రీల్స్ చేసింది. అలాగే పోర్స్చేతో సహా ఖరీదైన కార్లతో పోజులిచ్చింది. -
ఇదేం ఫ్యామిలీ రా సామీ! ఏకంగా కోబ్రాకే నేరుగా..!
హిందూ సాంప్రదాయంలో పాములను నాగ దేవతగా భావించి పూజలు నిర్వహించడం వంటివి చేస్తుంటారు. ప్రతి నెలలలో వచ్చే పంచమి, చవితి తిథులకు పుట్టలో పాలు పోయడం, పూజలు చేయడం వంటివి కూడా చేస్తారు. కానీ కొందరు మూఢ భక్తితో చేసే పనులు చాలా భయానకంగా ఉంటాయి. అది భక్తో లేక మూర్ఖత్వం అనాలో తెలియదు. అలాంటి షాకింగ్ ఘటన ఇక్కడ చోటు చేసుకుంది. నిజానికి నాగుపాముని విష్ణవు, శివ స్వరూపాలుగా భావిస్తారు. ఎందుకంటే విష్ణువుకి పాన్పుగా ఆదిశేషుడు, శివుని మెడలో వాసుకిగా నాగులు ఉండటంతో వాటికి పురాణల్లో అత్యంత ప్రాధాన్యత ఇచ్చారు. అలాగే ముఖ్యమైన పర్వదినాల్లో నాగులను పూజించి వేడుకోవడం జరుగుతుంది. అంత వరకు ఓకే కానీ ఏకంగా విషసర్పాలను నేరుగా తెచ్చి పూజించడం అంటే..వామ్మో అనిపిస్తుంది కదా!. మహా అయితే పుట్టకో లేదా దేవాలయాల్లో నాగుల జంట ఉండే ప్రతిమకు పూజలు చేస్తే చాలు. దీని వల్ల ఎలాంటి ప్రమాదం ఉండదు. కానీ ఈ కుటుంబం ఏకంగా మూఢ భక్తితో నల్ల నాగుపాముని తెచ్చి ఓ ప్లేటులో ఉంచి పూజలు చేసేస్తున్నారు. అదేమో ఒక పక్క బుసలు కొడుతూ కాటేసే యత్నం చేస్తున్నా..వీళ్లు మాత్రం భక్తిపారవశ్యంతో పూజలు చేసేస్తున్నారు. మరోవూపు అది కాటేస్తుందేమోనన్న భయంతో ఒక పక్క మనుసులో ఉన్నా సరే పూజల తంతు మాత్రం ఆపడం లేదు. పొరపాటున ఏదైనా జరగరానిది జరిగితే పరిస్థిత ఏంటీ..?. అందుకు సంబంధించిన వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతుంది. వాళ్లు నాగుపాముకి నేరుగా పూజలు చేస్తున్న విధానం చూస్తే..బాబోయ్! అనిపిస్తుంది. View this post on Instagram A post shared by हिंदू धर्म रक्षक (@omkar_sanatanii) (చదవండి: టిష్యూ బ్రెడ్..అచ్చం రుమాలి రోటీ లా..! వీడియో వైరల్) -
టిష్యూ బ్రెడ్..అచ్చం రుమాలి రోటీ లా..!
బ్రెడ్లలో వెరైటీ వెరైటీలను చూశాం. అలాగే వాటితో తయారు చేసే రకరకాల వంటకాలను కూడా చూశాం. కానీ బ్రెడ్ని ఏదో టిష్యూ పేపర్ అంతా లైట్వైట్గా పల్చగా ఉండే బ్రెడ్ని చూశారా. అసలు దీన్ని చూడగానే అలా ఎలా చేశారా అని ఆశ్చర్యపోతారు. అందుకు సంబంధించిన ఒక వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతోంది. దక్షిణ కొరియా ఈ టిష్యూ బ్రెడ్ని తయారు చేసి అమ్మేస్తుంది. ఇది భారత్లో ఉండే రుమాలీ రోటీ మాదిరిగా ఉంది. అక్కడ బేకరి వాళ్లు టిష్యు బ్రెడ్లా పలచటి పొరలాంటి స్లైస్లు మాదిరిగా వచ్చేందుకు ప్రత్యేకమైన పిండిని ఉపయోగిస్తుంది. కాల్చేటప్పుడు సాధారణ బ్రెడ్లానే ఉంటుంది. కానీ స్లైస్లు మాత్రం టిష్యూలు మాదిరిగా ఉంటాయి. చూసేందుకు చక్కని ఆకృతిలో ఉండి తియ్యటి రుచిని కలిగి ఉంటాయట. వెన్న రాస్తే వచ్చే పొరలమాదిరిగా అతి సున్నితంగా ఉన్నాయి ఆ బ్రెడ్ స్లైస్లు. అందువల్ల దీన్ని రుమాలీ రోటీతో పోల్చారు. ఎందుకంటే రుమాలీ పల్చటి పెద్ద రోటీలా ఉంటుంది. నోట్లో వేసుకుంటే ఈజీగా కరిపోయేలా ఉంటుంది. నిజానికి ఈ రుమాలీ రోటీ మొఘల్ యుగం నుంచి ప్రసిద్ధి చెందాయి. పాకిస్థాన్లో కూడా ఈ రోటీలు బాగా ఫేమస్. వీటిని వాళ్లు లాంబూ రోటీలు అని పిలుస్తారు. పంజాబీలో దీని అర్థం పొడవైనది అని. ఆ తర్వాత ఈ రుమాలీ రోటీల్లో రకరకాల స్పైసీ కర్రీని ఉంచి రోల్ చేసి తయారు చేసే వివిధ రెసీపీలు తయారు చేయడం మొదలు పెట్టారు. నిజానికి నాటి చెఫ్లు అదనప్పు నూనెను పీల్చుకునేందుకు ఈ రుమాలీ రోటీలు ఉపయోగించేవారట. ఇక నాటి రాజులు కూడా ఈ రోటీలను చేతి రుమాలు మాదిరిగా భోజనం తర్వాత చేతులను శుభ్రం చేయడానికి వినియోగించేవారట. ఆ తర్వాత క్రమేణ అదే తినేవంటకంగా రూపాంతరం చెందిందని పాకశాస్త్ర నిపుణులు చెబుతున్నారు. View this post on Instagram A post shared by 마이시즌|미식 공간 소개 (@my_season___) (చదవండి: పెళ్లి రోజున ఇలాంటి గిఫ్ట్లు కూడా ఇస్తారా!..ఊహకే రాని బహుమతి!) -
సిగ్నల్ నీడలో
బతుకు గడవాలంటే రోడ్డు మీదకు రాక తప్పదు. వస్తే భయంకరమైన ఎండ. దాంతో పాటు ట్రాఫిక్ సిగ్నల్ దగ్గర వేచి ఉండాల్సిన బాధ. అందుకే పాండిచ్చేరి ప్రభుత్వం ప్రతి ట్రాఫిక్ సిగ్నల్ దగ్గర గ్రీన్షేడ్ ఏర్పాటు చేసింది. వీటిని ఒక స్కూటరిస్ట్ ‘ఎక్స్’లో షేర్ చేశాడు. వైరల్ అయిన ఈ పందిళ్లను చూసి చాలా మంది తమ నగరాల్లో కూడా ఇలా జరిగితే బాగుండని కోరుకుంటున్నారు.మన దేశంలో ఎండలు విపరీతమవడం గతంలో కూడా ఉంది. సాధారణంగా మైదాన్ర΄ాంతాల్లో 40 డిగ్రీల సెల్సియెస్, కొండ ్ర΄ాంతాల్లో 30 డిగ్రీల సెల్సియెస్ దాటితే వడగాడ్పు ఉన్నట్టు వాతావరణ శాఖ ప్రకటిస్తుంది. 2016లో జో«ద్పూర్లో 51 డిగ్రీల రికార్డు టెంపరేచర్ నమోదైంది. 2019లో లాంగెస్ట్ హీట్వేవ్ను దేశం చూసింది. 32 రోజుల ΄ాటు సాగిన వడగాడ్పులకు ఆంధ్రప్రదేశ్ అల్లాడి΄ోయింది విదర్భ, రాజస్థాన్ కాకుండా. అందుకే మన దేశంలో మే నెలను చూసి జనం గడగడ వొణుకుతారు. బయటికొస్తే వాహనదారులకు నిలువ నీడ ఉండదు. ఇలాంటి సమయంలో పాండిచ్చేరిలో ప్రభుత్వం ప్రతి ట్రాఫిక్ సిగ్నల్ దగ్గర గ్రీన్షేడ్స్ ఏర్పాటు చేసింది. దీని వల్ల ఎండలో తిరిగే వారికి నీడ కింద ఉపశమనం దొరికినట్టవుతుంది... దాంతో పాటు ట్రాఫిక్ సిగ్నల్ను పాటించినట్టవుతుంది. ఒక వాహనదారుడు ఇన్స్టాలో రిలీజ్ చేసిన పాండిచ్చేరి గ్రీన్షేడ్స్ను చూసి ప్రతి ఒక్కరూ మా నగరాల్లో కూడా ఇలాంటివి ఏర్పాటు చేస్తే బాగుండు అంటున్నారు. ప్రభుత్వాలు వింటే బాగుండు. -
World Laughter Day: మీ నవ్వుల చల్లదనాన్ని మంచుకొండ అప్పడిగింది...
ఒకరు జోక్ వేస్తే నవ్వడం చాలా వీజీ. నవ్వించడం మాత్రం నవ్వినంత ఈజీ కాదు. టోటల్గా చెప్పొచ్చేదేమిటంటే... నవ్వించడం అనేది అత్యంత కష్టతరమైన టాస్క్. ఈ నవ్వుల మహారాణులు మాత్రం అవలీలగా నవ్వులు పూయిస్తూ సోషల్ మీడియాలో లక్షలాది మంది అభిమానులను సం΄ాదించుకున్నారు.నిఫ్ట్ గ్రాడ్యుయేట్ అయిన కుష కపిల బిల్లీ మసి, సౌత్ దిల్లీ గర్ల్స్లాంటి క్యారెక్టర్లతో నవ్వుల వర్షం కురిపిస్తోంది. ఆమెకు 1.6 మిలియన్ల ఫాలోవర్లు ఉన్నారు. నిత్యజీవిత సంఘటనల ఆధారంగా దిల్లీకి చెందిన డాలీసింగ్ కామేడినీ మేడ్ ఈజీ చేసింది. ముంబైకి చెందిన ప్రజక్తా కోలి కామెడీ వీడియోలు మోస్ట్ ΄ాపులర్ అయ్యాయి. అబ్జర్వేషనల్ కామెడీకి ఆమె వీడియోలు అద్దం పడతాయి. కోలికి యూట్యూబ్లో 6 మిలియన్ల ఫాలోవర్లు ఉన్నారు. స్టాండ్–అప్ కమెడియన్గా దేశవ్యాప్తంగా పేరు తెచ్చుకుంది ప్రశస్తి సింగ్. అమెజాన్ ప్రైమ్ వీడిమో సిరీస్ ‘కామిక్స్థాన్’ సూపర్ హిట్ అయింది. ఎంబీఏ చేసిన ప్రశస్తి ‘నవ్వించడం’ తన ΄్యాషన్ అంటోంది. వీరు మాత్రమే కాదు కనీజ్ సుర్క, శ్రిష్ఠి దీక్షిత్, నిహారిక ఎన్ఎం, సుప్రియ జోషి, సుముఖి సురేష్, ఐశ్వర్య మోహన్రాజ్, సుమైర... లాంటి ఎంతోమంది నవ్వుల ప్రపంచంలో మహారాణులుగా వెలిగి΄ోతున్నారు. -
‘నన్నోడించిన వాడ్నే పెళ్లి చేసుకుంటా’
‘‘బరిలో దూకండి. నన్ను ఓడించండి. ఆ దమ్మున్న మగవాడినే నేను పెళ్లి చేసుకుంటా’’.. పురుషాధిపత్యం కొనసాగుతున్న రోజుల్లో ఓ మహిళ విసిరిన సవాల్ ఇది. సాధారణ మహిళ అయితే చర్చకు అంతగా ఆస్కారం ఉండేది కాదు. కానీ, ఆ సవాల్ విసిరింది హమీదా బాను. ఇంతకీ ఇవాళ గూగుల్ హోం పేజీని గమనించారా?.. అందులో ఉంది ఆమెనే.1940-55 మధ్య.. కుస్తీ పోటీల్లో వందల మందిని ఓడించానని తనకు తానుగా ప్రకటించుకుంది హమీదా బాను. కళ్లారా ఆమె పాల్గొన్న పోటీలు చూసి అప్పటి మీడియా పొగడ్తలతో ఆమెను ఆకాశానికి ఎత్తేసింది. భారతదేశంలో తొలి మల్ల యోధురాలిగా హమిదా బాను పేరు చరిత్రకెక్కింది. ఇప్పుడు.. డూడుల్ రూపంలో ఆ యోధురాలికి గౌరవం ఇచ్చింది గూగుల్.సంప్రదాయ కుటుంబంలో పుట్టి.. హేతుబద్ధమైన పెద్దల్ని ఎదురించి.. ఇంటి నుంచి బయటకు వచ్చేసింది హమీదా. ఉత్తర ప్రదేశ్ మీర్జాపూర్ ఆమె స్వస్థలం. అక్కడి నుంచి ఆమె అలీఘడ్ వలస వెళ్లింది. అక్కడే సలాం పహిల్వాన్ ఆమెకు పరిచయం అయ్యాడు. ఆయన దగ్గర కుస్తీ శిక్షణ తీసుకుంటూ పలు పోటీల్లో పాల్గొందామె. అయితే 1954 ఫిబ్రవరిలో ఆమె ఇచ్చిన ఒక బహిరంగ ప్రకటన తీవ్ర చర్చనీయాంశంగా మారింది. తనను ఓడించిన వాళ్లను వివాహం చేసుకుంటానని ప్రకటించి అటు ప్రజలు, ఇటు మీడియా దృష్టిని ఆకర్షించింది.ఛాలెంజ్లో భాగంగా.. పంజాబ్లో ఒకరిని, కోల్కతాలో ఒకరిని బాను ఓడించింది. ఆ తర్వాత గుజరాత్ బరోడాకు చేరుకున్న ఆమెకు ఘన స్వాగతం లభించింది. అప్పటికి ఆమె వయసు 34 ఏళ్లు. ఆ సవాల్ విసిరిన నాటికి ఆమె 300 మ్యాచ్లు పూర్తి చేసుకుందట. అయితే ఆమెతో తలపడాల్సిన చోటే గామా పహిల్వాన్ ఆఖరి నిమిషంలో పోటీ నుంచి తప్పుకున్నాడు. దీంతో ఆమె బాబా పహిల్వాన్తో తలపడి.. కేవలం నిమిషం వ్యవధిలోనే ఆమె నెగ్గింది.బాను పాపులారిటీ ఏ స్థాయికి చేరిందో.. 1944లో బాంబే క్రానికల్ రాసిన ఒక కథనం చూస్తే తెలుస్తుంది. బాంబేలో ఆమె పాల్గొన్న ఒక మ్యాచ్ చూసేందుకు 20 వేల మంది ప్రేక్షకులు వచ్చారట. అయితే ప్రత్యర్థి గూంగా పహిల్వాన్ అసంబంద్ధమైన డిమాండ్లతో ఆ మ్యాచ్ జరగకుండా పోయింది. దీంతో ఆగ్రహించిన ప్రేక్షకులు స్టేడియంలో బీభత్సం సృష్టించారట.అమెజాన్ ఆఫ్ అలీగఢ్.. ముద్దుగా హమీదా బానుకు అప్పటి మీడియా పెట్టుకున్నపేరు. ఐదడుగల మూడు అంగుళాలు, 108 కేజీల బరువుతో.. రోజుకు ఐదున్నర లీటర్ల పాలు, రెండు లీటర్ల పండ్ల రసేఆలు, కేజీ మటన్, అరకేజీ బటర్, ఆరు గుడ్లు, రెండు ప్లేట్ల బిర్యానీ.. ఇలా ఆమె డైట్ గురించి కూడా అప్పట్లో పేపర్లు కథనాలు రాసేవి.హమిదా బాను కెరీర్ సగానికి పైగా వివాదాలతోనే సాగింది. మగవాళ్లతో ఆమె తలపడడాన్ని పలువురు బహిరంగంగానే వ్యతిరేకించారు. మొరార్జీ దేశాయ్ మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఆమె పోటీలపై నిషేధం విధించారు. అందుకు ఆమె బహిరంగంగానే ఆయనపై విమర్శలు గుప్పించింది. అలాగే.. ఆమె పాల్గొన్న పోటీల్లోనూ ప్రేక్షకుల నుంచి దాడులు తప్పలేదట. 1954 దాకా దేశ, విదేశీ రెజ్లర్లతో ఆమె తలపడింది. అయితే అదే ఏడాది విదేశాలకు వెళ్లే అవకాశం వచ్చినా.. ఆర్థిక స్తోమత లేకపోవడం, స్పానర్లు ఎవరూ ముందుకు రాలేదన్న కారణాలతో ఆమె ఆగిపోయింది. అయితే ఆ ఆగిపోవడం.. బరికి శాశ్వతంగా హమిదా బానును దూరం చేసింది కూడా. 1987లో మహేశ్వర్ దయాల్ అనే రచయిత ఆమె జీవితం మీద రాసిన పుస్తకంలో సంచలన విషయాల్ని పేర్కొన్నారు. ఉత్తర ప్రదేశ్, పంజాబ్లో ఆమె కుస్తీ పోటీల్లో పాల్గొందని, మగ పోటీదారులతో మాత్రమే ఆమె తలపడేదని, అయితే కొన్ని చోట్ల ఆమె రహస్య ఒప్పందాలు కూడా చేసుకునేదని ఆయన రాశారు.రెజ్లింగ్ కెరీర్ మాత్రమే కాదు.. వ్యక్తిగత జీవితం కూడా ఒడిదుడుకుల నడుమ సాగింది. కోచ్ సలాం పహిల్వాన్తో కలిసి అప్పటిదాకా ప్రొఫెషనల్ రిలేషన్ సాగించిన ఆమె.. ఆ తర్వాత ఆయనతో సహజీవనం చేసింది. ఈ క్రమంలోనే ఆమెను విదేశీ పోటీలకు వెళ్లకుండా సలామే అడ్డుకున్నాడనన్న ఆరోపణ ఒకటి ఉంది. ఇంకోవైపు ఉత్తర భారతం నలుమూలల పోటీల్లో పాల్గొన్న హమిదాను ఆర్థిక కష్టాలు చుట్టుముట్టాయి. ముంబై కల్యాణ్ ప్రాంతంలో ఉంటూ.. సలాంతో కలిసి పాల వ్యాపారం మొదలుపెట్టింది.సలాం కూతురు సహారా, బానును పినమ్మగా చెబుతుంటుంది. అయితే సలాం ఆమెను శారీరకంగానూ ఎంతో వేధించేవాడని బాను మనవడు ఫిరోజ్ షేక్(ఆమె దత్తపుత్రుడి కొడుకు) ఓ ఇంటర్వ్యూలో చెప్పారు. యూరప్కు వెళ్లకుండా బానును నిలువరించిన సలాం.. ఆమెను చిత్రహింసలకు గురి చేశాడని, ఈ క్రమంలోనే ఆమె కాళ్లు, చేతులు విరిగియాని ఆరోపించారాయన. కొన్నాళ్లకు సలాం, బానులు విడిపోయారు. సలాం కల్యాణ్లోనే ఉంటూ పాల వ్యాపారం కొనసాగించింది. డబ్బు సరిపోని సమయంలో పిండి వంటలు చేసి రోడ్ల మీద అమ్ముకునేది. అలా మల్లు యోధురాలిగా పేరున్న హమీదా బాను.. చివరి రోజులు మాత్రం కష్టంగానే గడిచాయని పలు కథనాలు వెల్లడించాయి. -
లోకం చెడ్డదేం కాదు బాస్.. హార్ట్ టచింగ్ వీడియో
ఎవరైనా కష్టాల్లో ఉన్నారని తెలిస్తే... అయ్యో అనడం మనిషి సహజ లక్షణం. సహానుభూతి అంటారు ఈ ఫీలింగ్ను. ఇంకొంతమంది ఆయ్యో అనడంతో ఆగిపోరు. తమకు చేతనైన సాయం చివరకు మాటసాయమైనా చేసే ప్రయత్నం చేస్తారు. ‘‘నేను ఉన్నాను’’.. ‘‘నువ్వు ఒంటరి కాదు’’ అన్న భరోసా... నిలువెత్తు డబ్బు, బంగారం పోసి కూడా కొనలేము. ఇదంతా ఇప్పుడెందుకు అంటే... ఎక్స్లో (గతంలో ట్విట్టర్) కనిపించిన ఈ ట్వీట్ను చూడండి. మనసులను కదిలించే చిన్ని గాథ! జర్మనీలోని ఆరేళ్ల బాలుడి కథ ఇది! మోటర్సైకిళ్లంటే మహా పిచ్చి! పెద్దయ్యాక రేసుల్లో పాల్గొనే వాడేనేమో కానీ... కేన్సర్ మహహ్మారి అంత ఎదిగేందుకు అవకాశం ఇచ్చేలా లేదు. అందుకే... ఈ కుర్రాడి తల్లిదండ్రులు ఆన్లైన్లో పోస్ట్ పెట్టారు! ‘‘మా వాడికి బైక్లంటే బాగా ఇష్టం. వీలున్న వారు ఎవరైనా మోటర్సైకిల్పై మా ఇంటి ముందు నుంచి ప్రయాణించగలరా?. మా వాడి కళ్లల్లో ఆనందం ఇంకోసారి చూసుకోగలం’’ అని అభ్యర్థించారు. అందరివీ బిజి బిజీ బతుకులు. ఎవరు పట్టించుకుంటారు దీన్ని? అని తల్లిదండ్రులు అనుకున్నారు. కానీ... 20, 30 మంది వరకూ వస్తారనునన వారి అంచనాలు తల్లకిందులయ్యాయి. ఓ సముద్ర కెరటంలా ‘మనీషి’ కదిలాడు. వేయి.. రెండు వేలు కూడా కాదు.. ఎకాఎకిన ఇరవై వేల మంది మోటర్ సైకిళ్లపై ఆ కుర్రాడి ఇంటి ముందు నుంచి వెళ్లారు. వాళ్లలో పొరుగు దేశాల నుంచి వచ్చిన వాళ్లు కూడా ఉన్నారు. ఆ కుర్రాడి ముఖం చంద్రబింబంలా మెరిసి పోయి ఉంటుందా? కచ్చితంగా మెరిసిపోయే ఉంటుంది. వీడియో మూడు నాలుగేళ్ల కిందటిదే అయినా.. ఆ చిన్నారి తుదిశ్వాస విడిచి నెలలు గడుస్తున్నా.. మానవత్వం ఈ భూమ్మీద మిగిలే ఉందని, లోకం మనం అనుకునేంత చెడ్డదేం కాదని నిరూపించింది ఈ ఘటన. In Germany, a 6 year old boy who loved Motorcycles was diagnosed with cancer. His family posted online asking if someone can ride pass their house to cheer him up. They expected 20-30 people. But in the end, nearly20,000 bikers showed up. pic.twitter.com/ZX2Gqpw74m— Restoring Your Faith in Humanity (@HumanityChad) April 30, 2024 -
పానీ పూరీ: ఈ అనిల్ భాయ్ లెక్కే వేరు: వైరల్ వీడియో
పానీ పూరీ అంటే ప్రాణం లేచి వస్తుంది చాలామందికి. అయితే పానీ పూరి బండి నడిపే 71 ఏళ్ల వృద్ధుడితో సెల్ఫీల కోసం జనం ఎగబడుతున్నారు. ఆయన పేరే గుజరాత్కు చెందిన అనిల్ భాయ ఠక్కర్. ఈ పానీ పూరీ వాలా ప్రస్తుతం ఇంటర్నెట్లో హల్చల్ చేస్తున్నాడు. స్టోరీ ఏంటంటే.. మనిషిని పోలిన మనుషులు ప్రపంచంలో ఏడుగురు ఉంటారట. అది ఎంతవరకు నిజమోగానీ, గుజరాత్కు చెందిన అనిల్ భాయ్ ఠక్కర్ మాత్రం తన సైడ్ ప్రొఫైల్, హెయిర్స్టైల్, తెల్లటి గడ్డం, ఆఖరికి డ్రెస్సింగ్ స్టయిల్ కూడా అచ్చం ప్రధాన మంత్రి మోదీ పోలికలతో కస్టమర్లను కట్టిపడేస్తున్నాడు. ఈయన గుజరాత్లోని ఆనంద్లో ‘తులసి పానీ పూరీ సెంటర్’ను నడుపుతున్నాడు. అచ్చం మోదీలా ఉన్న అనిల్ భాయ్నును స్థానికులంతా పీఎం మోదీ అని పిలుచుకుంటారు. ప్రధాని మోదీతో ఉన్న పోలిక కారణంగా స్థానికులు, పర్యాటకుల నుండి తనకు చాలా ప్రేమ, గౌరవం లభిస్తోంది అంటాడు ఆనందంగా అనిల్ భాయ్. అంతేకాదు ప్రధాని తనకు ఎంతో స్ఫూర్తి పొందానని, పరిశుభ్రతకు ఆయన ఎంత ప్రాధాన్యత ఇస్తారో, అలాగే తన స్టాల్ను కూడా పరిశుభ్రంగా ఉంచుకుంటారని అనిల్ భాయ్ చెప్పుకొచ్చాడు. అనిల్ భాయ్ వాస్తవానికి జునాగఢ్కు చెందినవాడు. తన తాత ప్రారంభించిన 'తులసి పానీ పూరీ సెంటర్'ను 18 ఏళ్ల వయస్సునుంచే నడిపిస్తున్నాడు. కాగా ముంబైలోని మలాడ్కు చెందిన వికాస్ మహంతే కూడా ప్రధాని పోలికలతో ఇటీవల వార్తల్లో నిలిచాడు. గర్భా వాయిస్తున్న వీడియో వైరల్ అయిన సంగతి తెలిసిందే. -
Viral Video: జాబ్ మానేసి.. మేనేజర్ ముందు తీన్మార్ డ్యాన్స్లు
ఈ రోజుల్లో ఉద్యోగం రావడం అంటే చాలా కష్టం.. కష్టపడి ఉద్యోగం సంపాదించుకున్నా.. దానిని నిలబెట్టుకోవాలంటే కత్తిమీద సాము లాంటిది. ఉద్యోగంలో ఒత్తిడి, సరిపోని జీతం, సమయ వేళలు ఇలా అనేక సవాళ్లను ఎదుర్కొంటూ ఉంటారు. కొంతమంది వీటిని భరించలేక ఉద్యోగం మానేస్తుంటారు. ఉన్న ఉద్యోగం పోయినప్పుడు చాలా మంది బాధపడుతుంటారు. కానీ మహారాష్ట్రలో ఓ కంపెనీలో పని చేస్తున్న వ్యక్తి జాబ్ మానేసి, ఆఫీసు ఎదుట డ్యాన్స్ చేసి మరి ఎంజాయి చేశాడు. ఈ ఆశ్యర్యకర ఘటన పుణెలో వెలుగుచూసింది. ఉద్యోగానికి రాజీనామా చేసిన ఓ వ్యక్తి తన మాజీ మేనేజర్కు విచిత్రంగా విడ్కోలు పలికారు. బ్యాండ్ను ఆఫీస్ వద్దకు పిలిపించి బాస్ ముందు తీన్మార్ స్టెప్పులు వేశారు. తోటి ఉద్యోగులకు విచిత్రంగా తన రాజీనామా విషయాన్ని తెలియజేశాడు. దీనికి సంబంధించిన వీడియోను కంపెనీ ఉద్యోగి సోషల్ మీడియాలో పోస్టుచేయగా వైరల్గా మారింది. పూణేకు చెందిన అనికేత్ అనే వ్యక్తి గత మూడేళ్లుగా ఓ కంపెనీలో సేల్స్ డిపార్ట్మెంట్లో పనిచేసేవాడు. అయితే ఆ జాబ్లో ఒత్తిడి, సీనియర్ల నుంచి వచ్చే వేధింపులు, సరిపడని జీతంతో తీవ్రంగా సతమతం అయ్యాడు. చివరికి ఇటీవల తన ఉద్యోగానికి రాజీనామా చేశాడు. ఇక తన చివరి వర్కింగ్ డే రోజు ఎప్పటికీ గుర్తుండిపోయేలా నిర్వహించాలనుకున్నాడు. తన స్నేహితులతో కలిసి సర్ప్రైజ్ పార్టీ ఏర్పాటు చేశాడు.ఆఫీస్ వద్దకే బ్యాండ్ను తీసుకువచ్చి.. డ్యాన్స్ చేశాడు. మేనేజర్ బయటకు వచ్చే దాకా అక్కడే ఉండి, అతనికి షేక్ హ్యాండ్ ఇచ్చి ‘సారీ సర్ బాయ్ బాయ్’ అంటూ ఆనందంగా స్టెప్పులేశాడు. ఊహించని పరిణామానికి ఆ కంపెనీ మేనేజర్ అలా చూస్తూ ఉండిపోయాడు. ఈ వీడియో వైరలవ్వడంతో చాలా మంది నెటిజన్లు స్పందిస్తున్నారు. తాము కూడా ఉద్యోగంలో ఇలాంటి ఇబ్బందులే ఎదుర్కొంటున్నామని చెబుతున్నారు. అనికేత్ చేసిన పనికి ప్రశంసలు కురిపిస్తున్నారు. కాగా ఉద్యోగం మానేసిన అనికేత్ జిమ్ ట్రైనర్ కావాలని ప్రయత్నిస్తున్నట్లు అతని స్నేహితుడు భగత్ తెలిపారు. View this post on Instagram A post shared by Anish Bhagat (@anishbhagatt) -
ఎక్కడా తగ్గేదే లేదండీ..పల్లె టు పాపులర్ జోన్ జోరుగా హుషారుగా
యూత్ పల్స్: కంటెంట్లో సత్తా ఉండాలేగానీ కాలు కదపకుండా, కడుపులో చల్ల కదలకుండా సొంత ఊళ్లోనే ఉంటూ తగినంత డబ్బు సంపాదించవచ్చు అని నిరూపిస్తున్నారు గ్రామీణ యువ కంటెంట్ క్రియేటర్లు. హాస్యం నుంచి వ్యవసాయం వరకు రకరకాల సబ్జెక్ట్లను వైరల్ చేయడంలో నేర్పు సాధించారు.ఉత్తర్ప్రదేశ్లోని ఆరియారి గ్రామానికి చెందిన శివానీ కుమారికి సోషల్ మీడియాలో వేలాది మంది ఫాలోవర్లు ఉన్నారు. గ్రామీణ జీవితాన్ని పాటలు, కామెడీతో కూడిన స్కెచ్ల ద్వారా ఆవిష్కరిస్తూ సోషల్ మీడియాలో పేరు తెచ్చుకుంది. తనతో సమానంగా ఫాలోవర్లు ఉన్న ఇంగ్లీష్ క్రియేటర్లు కుమారి కంటే ఎక్కువ సంపాదిస్తున్నటికీ డబ్బుల గురించి చింత ఆమెకు లేదు. డబ్బుల కంటే కంటెంట్ క్రియేషన్ గురించే ఎక్కువ దృష్టి పెడుతుంది కుమారి.ఒడిశాలోని చిత్రకూట్కు చెందిన ధీరజ్ టక్రీకి గతంలో ఇంగ్లీష్లో ఫ్లూయెంట్గా మాట్లాడడం వచ్చేది కాదు. తడబడుతూ మాట్లాడేవాడు. దీంతో యూట్యూబ్ వీడియోలు చూసి ధీరజ్ అమెరికన్స్లా ఫ్లూయెంట్గా మాట్లాడడం నేర్చుకున్నాడు. అమెరికన్ యాక్సెంట్తో మాట్లాడే నైపుణ్యం ధీరజ్ను ‘ఇన్స్టా ఫేమ్’ చేసింది. 2023లో ధీరజ్ ఫాలోవర్ల సంఖ్య 160 మాత్రమే. హ్యాండ్సమ్ అనే మాటను ఫారిన్ యాక్సెంట్లో ఎలా పలకాలి అనే రీల్ వైరల్ కావడంతో ధీరజ్ టక్రీ ఫాలోవర్ల సంఖ్య వేలకు చేరింది. మధ్యప్రదేశ్లోని బిరాఖేడీ గ్రామానికి చెందిన 23 సంవత్సరాల రామ్ పారమార్ 17 సంవత్సరాల వయసులో యూట్యూబ్ చానల్ మొదలు పెట్టాడు. తన చానల్ ద్వారా వ్యవసాయానికి సంబంధించిన విషయాల గురించి మాట్లాడేవాడు. ఏడు, ఎనిమిది వేలతో యూట్యూబ్లో అతడి సంపాదన మొదలైంది. ఇప్పుడు బ్రాండ్ కొలాబరేషన్ ద్వారా లక్ష రూపాయల వరకు సంపాదిస్తున్నాడు.పది లక్షలు వెచ్చించి తన గ్రామంలో ఆఫీస్ నిర్మించుకున్నాడు. కారు కొన్నాడు. ఇద్దరు సభ్యులతో ఉన్న టీమ్ను విస్తరించే పనిలో ఉన్నాడు. గుజరాతీ, తమిళ భాషల్లో కూడా కంటెంట్ను విస్తరించే ఆలోచనలో ఉన్నాడు.‘మన దేశంలో చాలా ప్రాంతాల్లో రైతులు హిందీ భాషను అర్థం చేసుకోలేరు. వారిని దృష్టిలో పెట్టుకొని ఇతరుల సహకారంతో ప్రాంతీయ భాషల్లో కంటెంట్ను క్రియేట్ చేయాలనుకుంటున్నాను. దేశవ్యాప్తంగా ఉన్న రైతులకు కంటెంట్ను చేరువ చేయాలనుకుంటున్నాను’ అంటున్నాడు ధీరజ్.ఇరవై ఏడు సంవత్సరాల మయూరి పాటిల్కు ఇన్స్టాగ్రామ్ రీల్స్ ద్వారా డబ్బు సంపాదించాలనేది లక్ష్యం కాదు. ‘పశ్చిమ కనుమలను కాపాడుకుందాం’ అనే నినాదంతో రీల్స్ చేస్తొంది. పశ్చిమ కనుమల అందాలను కళ్లకు కట్టేలా ఉండే ఆ రీల్స్ ఎంతోమందిని ఆకట్టుకుంటున్నాయి. ఆలోచించేలా చేస్తున్నాయి. కొండపై ఉన్న ఇంట్లో ఒంటరిగా నివసిస్తున్న ఒక వృద్ధురాలి జీవనశైలిపై పాటిల్ చేసిన రీల్ వైరల్ అయింది. ఎలాంటి కమర్శియల్ ఎలిమెంట్స్ లేని ఈ రీల్ సూపర్ సక్సెస్ కావడమే కాదు అది పాటిల్కు ఎంతో ఉత్సాహాన్నీ ఇచ్చింది.మహారాష్ట్రలోని పులగామ్ గ్రామానికి చెందిన నేహా తాంబ్రేది సూపర్ పవర్ గ్రామీణ యాస. కామెడీ దట్టించి వివిధ సామాజిక సమస్యలపై తమ ప్రాంత మాండలికంలో నేహా చేసే వీడియోలు సోషల్ మీడియాలో ΄ాపులర్ అయ్యాయి. తన గ్రామం నుంచి వెళ్లి పుణెలో ఇంజనీరింగ్ చేయడం నేహాకు కల్చరల్ షాక్.‘నా గ్రామీణ మరాఠీ యాసను వెక్కిరించేవారు’ అని గతాన్ని గుర్తు తెచ్చుకుంది నేహా.ఎంతోమంది వెక్కిరించిన ఆ యాస కంటెంట్ క్రియేషన్లో ఆమె బలం అయింది. నేహా సృష్టించిన ‘తోంబ్రే బాయి’ క్యారెక్టర్ బాగా పాపులర్ అయింది.స్థూలంగా చెప్పాలంటే గ్రామీణ ప్రాంత క్రియేటర్లు సోషల్ మీడియాలో కొత్త దృశ్యం ఆవిష్కరిస్తున్నారు. కర్నాటకాలోని చిన్న పల్లెల నుంచి ఈశాన్యప్రాంతాలలోని మారుమూల గ్రామాల వరకు కంటెంట్ క్రియేషన్ ద్వారా వైవిధ్యాన్ని ఆవిష్కరిస్తున్నారు. ప్రతి క్రియేటర్ తనదైన ప్రత్యేకతను కంటెంట్కు జోడిస్తున్నారు.‘ఇన్స్టాగ్రామ్ ఉద్దేశాన్ని చాలా బ్రాండ్స్ మరిచి΄ోయాయి. ఇన్స్టాగ్రామ్ అనేది ఫన్, స్టోరీ టెల్లింగ్కు వేదిక’ అంటుంది ముంబైకి చెందిన కంటెంట్ సొల్యూషన్స్ ఫర్మ్ ‘అప్పర్కేస్’ డైరెక్టర్ నిఠషా భర్వానీ. ఇన్స్టాగ్రామ్కు కీలకమైన ఫన్, వైవిధ్యాన్ని జోడిస్తూ తమదైన ప్రత్యేకతను చాటుకుంటున్నారు గ్రామీణ ప్రాంత యువ కంటెంట్ క్రియేటర్లు.ఎక్కడా తగ్గేదే లేదండీగ్రామీణ్ర ప్రాంత జీవనశైలికి అద్దం పట్టే వీడియోలతో ΄ాపులర్ అయింది ఉత్తర్ప్రదేశ్కు చెందిన శివానీ కుమారి. ఆడంబరాల కంటే సహజత్వమే కంటెంట్కు అందాన్ని తీసుకువస్తుంది అనేది కుమారి నమ్మే థియరీ. అందుకే ఆమె చేసే వీడియోల్లో ఎక్కడా కృత్రిమత్వం కనిపించదు. యూట్యూబ్ ద్వారా వచ్చిన ఆదాయంతో ఊళ్లో సొంత ఇళ్లు కట్టుకుంది. సోషల్ మీడియాలో కుమారి ΄ాపులారిటీని దృష్టిలో పెట్టుకొని వ్యక్తుల నుంచి మొదలు ఆర్గనైజేషన్స్ వరకు ప్రశంసపూర్వకమైన ఈ–మెయిల్స్ వస్తుంటాయి. అవి ఆమెకు బలమైన టానిక్లా పనిచేస్తాయి. ‘ఇంగ్లిష్లో గడగడా మాట్లాడితేనే కంటెంట్ హిట్ అవుతుంది’ అనే భావనను కుమారిలాంటి వాళ్లు తప్పని తేల్చేస్తు్తన్నారు. ఇంగ్లీష్–స్పీకింగ్ అర్బన్ క్రియటర్స్ కంటే తాము తక్కువ కాదని నిరూపిస్తున్నారు శివాని కుమారి -
ఇంటర్నెట్ను ఓ ఊపు ఊపేస్తోంది!
సోషల్ మీడియాలో క్రియేటివిటీ తారాస్థాయికి చేరుకుంటోంది. గుడ్ బ్యాడ్ ఆర్ అగ్లీ.. అది ఏ కోణంలో ఉన్నాసరే నెటిజన్స్ ఫిదా అయిపోతున్నారు. ఈ క్రమంలోనే ఇంటర్నెట్ను కుదిపేస్తున్న ఓ లేటెస్ట్ ట్రెండ్ గురించి తెలుసుకుందాం.లుక్ బిట్వీన్ యువర్ కీ బోర్డు..look between on your keyboard సోషల్ మీడియాను ప్రస్తుతం ఊపేస్తున్న ట్రెండ్. కొత్తదేం కాకపోయినా.. ప్రస్తుతం దీనిని తెగ వాడేస్తున్నారంతా. వివిధ నగరాల పోలీసులు, ఐపీఎల్ జట్లు, ఫుడ్ యాప్స్, అమెజాన్ లాంటి ఓటీటీ ఫ్లాట్ఫామ్స్ ఈ ట్రెండ్లో భాగం అయ్యాయి. మరోవైపు.. ఎన్నికల వేళ రాజకీయపార్టీలు సైతం ఈ ట్రెండ్ను ఫాలో అయిపోతున్నాయి. Wanna know what their favourite key is? 👀Look between 5 & 7 on your keyboard 😋 pic.twitter.com/GRbD9aLOAr— SunRisers Hyderabad (@SunRisers) April 23, 2024 Who’s whistling today? 🥳Check your keyboard between Q and R!⌨️#CSKvLSG #WhistlePodu 🦁💛@msdhoni pic.twitter.com/GFqamYkcZk— Chennai Super Kings (@ChennaiIPL) April 23, 2024 Curious to know who will support CM YS Jagan in doubling the growth of Andhra Pradesh?Just read the letters between Q and R on your keyboard!— YSR Congress Party (@YSRCParty) April 23, 2024 Applicant: "I want to break the record for the longest time without sleep!!"Us: Look between T and U on your keyboard— Guinness World Records (@GWR) April 23, 2024 సోషల్ మీడియాలో ఎప్పుడు ఏది ట్రెండ్ అవుతుందో చెప్పలేం. అర్థమైతే సరే సరి. కొందరైతే ఈ పోస్టులకు అర్థమేంటో తెలుసుకోవడంలో ఇబ్బందిపడుతుంటారు. మరి లుక్ బిట్వీన్ యువర్ కీ బోర్డు ట్రెండ్ గురించి తెలియని వాళ్ల కోసం.. ఈ ట్రెండ్ అసలు ఎక్కడ మొదలైందంటే.. ఇంగ్లీష్ ఆల్పాబెట్స్ కీ బోర్డు బేస్ చేసుకుని పుట్టిందే ఈ ట్రెండ్. 2021లో 4Chan అనే వెబ్సైట్ ఈ ట్రెండ్ను ఆరంభించింది. కాన్(K-ON) అనే యానిమేటెడ్ సిరీస్లో పాత్రను పరిచయం చేయడానికి ఈ ట్రెండ్ను ఉపయోగించారు. లుక్ బిట్వీన్ T అండ్ O అంటూ ‘YUI’(యూఈ) అనే పాత్రను పరిచయం చేశారు. అయితే ఆ తర్వాత ఈ ట్రెండ్ అంతగా ప్రాచుర్యంలో లేకుండా పోయింది. ఇప్పుడు భారతీయుల దెబ్బకు మళ్లీ తెర మీదకు వచ్చేసింది.ఈ ట్రెండ్లో.. ఉదాహరణకు.. లుక్ బిట్వీన్ H అండ్ L ఆన్ యువర్ కీ బోర్డు అన్నారనుకోండి. మనం వాడే కీబోర్డుల్లో వాటి మధ్య లెటర్స్ ‘JK’ ఉంటాయి. షార్ట్ కట్లో దానికి జస్ట్ కిడ్డింగ్ అనే అర్థం ఉంది.ఇక.. ఇంటర్వ్యూయర్ చూపు ఎప్పుడూ X అండ్ B మధ్య ఉంటుందని ఓ వ్యక్తి పోస్ట్ చేశాడు. ఆ రెండు లెటర్స్ మధ్య కీబోర్డులో ఉండేది CV(కరికులమ్ విటే-రెజ్యూమ్). ఇలా కీబోర్డులోని వివిధ అక్షరాలతో తమదైన శైలిలో నెటిజన్లు సరదా సరదా పోస్టులు పెడుతున్నారు. దీంతో మీమ్స్ స్థాయికి దాకా చేరుకుంది. look between Y and P on your keypad. pic.twitter.com/v9klSewlKS— Xavier Uncle (@xavierunclelite) April 23, 2024 Opening Twitter app and watching people here talk like look in keyboard betweenH and LY and OQ and RX and VZ and CE and YF and HI and P pic.twitter.com/kPtJKOybhb— Nabeel Shah (@nabeel_AMU) April 23, 2024 -
ఎంతటి ఫిట్నెస్ కింగ్లైనా..ఆ మెట్లు ఎక్కితే కాళ్లు వణికిపోవాల్సిందే!
ఎన్నో విచిత్రమైన ప్రదేశాలు గురించి విన్నాం.ఎంతో ఎత్తులో ఉండే హోటల్స్ దేవాలయాలు గురించి విన్నాం. కానీ వాటిని ఎక్కడం కష్టమేమి కాదు. కేవలం అంత ఎత్తులో ఉన్నాయన్న భయమేతప్పతే ఇంకేమీ ఉండదు. ఎంచక్కా మెట్ల మార్గం లేదా రోప్వే సాయంతో వెళ్లిపోయేవారు. కానీ చైనాలో ఈ ప్రసిద్ధ పర్వతం ఎక్కితే ఎంతటి వారికైన కాళ్లు వణికిపోతాయి. చేతిలో కర్ర లేనిది నడవలేరు ఎందుకంటే.. చైనాలో ప్రసిద్ధ తాయ్ పర్వతం చారిత్రక సాంస్కృతికి ప్రాముఖ్యత కలిగిన పర్వతం. చైనాలోని షాన్డాంగ్ ప్రావిన్స్లో ఎత్తైన ప్రదేశం. దీన్ని చైనా వాళ్లు పవిత్ర తూర్పు పర్వతంగా పిలుస్తారు. సూర్యోదయం, సూర్యాస్తమయం రెండు ఈ పర్వతం వద్ద చూడొచ్చు. అంత విశేషం గల భారీ పర్వతం. ఈ పర్వతం ఎక్కేందుకు ఏకంగా 6600 మెట్లు ఉంటాయి. అయితే ఈ మెట్లు ఎక్కినప్పుడు కింద భాగం సమ ఉష్ణోగ్రత ఉంటుంది. పైకి వెళ్లే కొద్ది ఉష్ణోగ్రత తక్కువగా ఉండి చలిగా ఉంటుంది. అయితే ఎవ్వరైనా ఈ మెట్లు ఎక్కితే కర్ర పట్టుకోక తప్పదు. అన్ని మెట్టు ఎక్కుతుండటం వల్లనే ఏమో ఎంతటి ఫిట్నెస్ గల వాళ్లైనా వృద్ధుల వలే గజగజ కాళ్లు వణికిపోతుంటాయి. మీసాలు మెలేసిన కండల ధీరుడైన ఈ మెట్లు ఎక్కితే మాత్రం బాబోయ్ అంటూ కర్ర పట్టుకుని వణికిపోక తప్పదు. అంతలా ఉంటుంది ఆ పర్వతం వొంపు, దాని ఉష్ణోగ్రతలు కారణంగానే ఈ పరిస్థితి ఎదురయ్యింది. అందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ తెగ వైరల్ అయ్యింది. 中国の泰山。7200段の階段があり、登頂に4~6時間かかるため観光気分で訪れた人々が後悔する。 pic.twitter.com/DY7xwj18iy — ロアネア@最多情報源バズニュース (@roaneatan) April 17, 2024 (చదవండి: అతిపెద్ద పాము వెలుగులోకి..అది సాక్షాత్తు పరమేశ్వరుడి..!) -
జిమ్లో వర్కౌట్ : క్రేజీ హీరోయిన్ ఫన్నీ వీడియో వైరల్
ఫ్యామిలీ స్టార్ హీరోయిన్, క్రేజీ హీరోయిన్ మృణాల్ ఠాకూర్ (Mrunal Thakur) అందానికి మాత్రమే కాదు ఫిట్నెస్కు కూడా ప్రాధాన్యత ఇస్తుంది. ఇంట్రెస్టింగ్ పోస్టులు, జిమ్లో హెవీ వర్కౌట్స్ ఫోటోలు, వీడియోలతో ఫ్యాన్స్ను ఇంప్రెస్ చేస్తూ ఉంటుంది. తాజాగా ఇన్స్టాలో ఒక వీడియో షేర్ చేసింది. ట్రైనర్ చూసేటపుడు, కెమెరా సహా ట్రైనర్ మన ముందుకు వచ్చినపుడు అనే క్యాప్షన్తో వర్కౌట్ ఫన్నీ చీటింగ్ వీడియోను పోస్ట్ చేసింది. ఇందులో ట్రైనర్ కెమెరాను ఆమెవైపు చూపినప్పుడల్లా, వెంటనే వ్యాయామం చేయడం ప్రారంభించడం, ట్రైనర్ చూడని సమయంలో వర్కవుట్స్ ఆపేసి డాన్స్ మూమెంట్స్ చేస్తుంది. మళ్లీ అతడు చూడగానే కష్టపడి వర్కవుట్ చేస్తున్నట్లు నటించడాన్ని ఈ వీడియోలో గమనించవచ్చు. దీంతో నెటిజన్లు కోచ్ ఉన్నపుడు మేము కూడా ఇంతే అంటూ కమెంట్ చేయడం విశేషం. View this post on Instagram A post shared by Mrunal Thakur (@mrunalthakur) కాగా ‘సీతారామం’ చిత్రంతో ఒక్కసారిగా మృణాల్ ఠాకూర్ తెలుగు ప్రేక్షకుల్ని మంత్రముగ్ధుల్ని చేసింది. త తన అద్భుతమైన నటన, అందంతో స్పెషల్ ఇమేజ్ సొంతం చేసుకుంది. ఆ తరువాతహీరో నానీతో కలిసి ‘హాయ్ నాన్న’ చిత్రంతో ప్రేక్షకులను ఫిదా చేసింది. అలాగే విజయ దేవర కొండ సరసన నటించి మెప్పించింది ఈ బ్యూటీ. -
Angry Rantman Death: ప్రముఖ యూట్యూబర్ కన్నుమూత.. గుండె పగిలిందంటున్న ఫ్యాన్స్
#Angry Rantman ప్రముఖ సోషల్ మీడియా ఇన్ఫ్లూయన్సర్,యూట్యూబర్ అబ్రదీప్ సాహా (Abhradeep Saha) అలియాస్ యాంగ్రీ రాంట్మ్యాన్ (Angry Rantman)కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న రాంట్మ్యాన్ మంగళవారం రాత్రి తుది శ్వాస విడిచాడు. దీంతో అభిమానుల సంతాప సందేశాలు వెల్లువెత్తాయి. చిన్న వయసులోనే వెళ్లి పోయాడంటూ అభిమానులు భావోద్వేగానికి లోనవుతున్నారు. కర్ణాటకు చెందిన అబ్రదీప్ సాహా సోషల్ మీడియాలో రాంట్ మ్యాన్ పేరుతో చాలా పాపులర్. సమాజంలో ప్రతి రోజూ జరిగే అంశాలపై తనదైన శైలిలో వీడియోలు చేస్తూ ఫాలోయర్లు ఆకట్టుకునేవాడు. అతికొద్ది సమయంలోనే దేశవ్యాప్తంగా విపరీతమైన క్రేజ్ సంపాదించుకున్నాడు. ఇటీవలి అతని యూట్యూబ్ ఛానెల్లో పోస్ట్ ప్రకారం యాంగ్రీ రాంట్మ్యాన్ గత నెలలో పెద్ద ఆపరేషన్ జరిగింది. లైఫ్ సేవింగ్ సపోర్ట్ సిస్టమ్మీద ఉన్నాడని, తొందరగా కోలుకోవాలని ప్రార్థించాలని అభిమానులను కోరుతూ ఆ తరువాతి అప్డేట్ ద్వారా తెలుస్తోంది. ఈ క్రమంలోనే అతని ఆరోగ్యం క్షీణించి చనిపోయినట్టు తెలుస్తోంది. 2017, ఆగస్టు 18 లో అబ్రదీప్ తన YouTube ఛానెల్ని “నేను అన్నాబెల్లె మూవీని ఎందుకు చూడను!!!!!!” , అలాగే ‘ది కన్జూరింగ్’ చూసిన తర్వాత ఇకపై హారర్ చిత్రాలను చూడడానికి చాలా భయపడ్డానంటూ రివ్యూ వీడియోలు చేశాడు. తనదైన హావభావాలతో ఫన్నీ రివ్యూలతో నెట్టింట్ హల్ చల్ చేసేవాడు. ఈ క్రమంలో 2018 డిసెంబరులో కేజీఎఫ్ సినిమా రివ్యూతో మరింత ట్రెండింగ్లోకి వచ్చాడు. కేవలం 27 ఏళ్ల వయసులో అకాల మరణంతో మరోసారి ట్రెండింగ్లో నిలవడం విషాదం. యాంగ్రీ రాంట్ మ్యాన్ హ్యాష్ ట్యాగ్ వైరలవుతోంది. Gonna miss pearls of wisdom like these. #AngryRantman pic.twitter.com/wQhnNUGC5G — Ritesh (@Szoboszlai8_) April 17, 2024 -
సన్ రైజర్స్ రికార్డ్ బ్రేక్ : వీణ శ్రీవాణి మాస్ బీట్ సాంగ్ వైరల్!
ఐపీఎల్ పోరులో మరోసారి సన్రైజర్స్ హైదరాబాద్ దుమ్ము రేపింది. ఐపీఎల్ చరిత్రలోనే అత్యధిక స్కోర్ చేసి తన రికార్డ్ను (287/3)తానే బ్రేక్ చేసింది. చిన్నస్వామి స్టేడియంలో హైదరాబాద్ బ్యాటర్లు పరుగుల మోత మోగించారు. ముఖ్యంగా బెంగళూరు బౌలర్లకు చుక్కలు చూపించిన హెడ్ విధ్వంసమే సృష్టించాడు. దీంతో పవర్ ప్లేలో కేవలం 7.1 ఓవర్లు ముగిసేసరికి స్కోర్ 100 పరుగులు దాటడం విశేషం. దీంతో ఫ్యాన్స్ పండగ చేసుకున్నారు. ఈ సందర్భాన్ని వీణ శ్రీవాణి కూడా సెలబ్రేట్ చేసుకుంది. సోషల్ మీడియాలో ఎ పుడూచురుగ్గా ఉంటూ తన అభిమానులను అలరించే శ్రీవాణి సన్రైజర్స్ విజయాన్ని స్పెషల్గా ఎంజాయ్ చేసింది. ఐపీఎల్ 2024 కోసం సన్ రైజర్స్ హైదరాబాద్ టీమ్ రిలీజ్ చేసిన సాంగ్ను తన వీణతో అదరగొట్టేసింది శ్రీవాణి. తన వీణా వాయిద్యాన్ని కేవలం క్లాసిక్ మ్యూజిక్కు పరిమితం కాకుండా, మాస్ సాంగ్స్ను కూడా వాయిస్తూ అందర్నీ ఆకట్టుకుంటున్న శ్రీవాణి తాజాగా మాస్బీట్ ‘‘మేము బ్రో.. పక్కా ఇంకో రేంజ్ బ్రో’ తో ఇరగదీసింది. ఇది ఫ్యాన్స్ను మెస్మరైజ్ చేస్తోంది. View this post on Instagram A post shared by Veena Srivani (satyavani Parankusham ) (@veenasrivani_official) -
రీల్స్తో వేణు, శ్రీవాణి ‘మ్యూజిక్’ మామూలుగా లేదుగా!
ఆమె పేరుకు తగ్గట్టుగానే సంగీత సరస్వతి. అతను ఆమెకు దొరికిన తిరపతి లడ్డు. ఇపుడు వీరిద్దరూ సెలబ్రిటీ కపుల్గా సోషల్మీడియాలో హల్చల్ చేస్తున్నారు. ఇంతకీ వారెవ్వరో ఇప్పటికే అర్థమైపోయిందికదా. అవును వారే. సినీ, రాజకీయ రంగ ప్రముఖులకు జ్యోతిష్యంలో సలహాలు, సూచనలు ఇచ్చే వేణుస్వామి, యాంకర్గా మొదలై వీణా నైపుణ్యంతో పాపులరైన ‘వీణా శ్రీవాణి’. సోషల్ మీడియాలో ఎప్పటికపుడు అనేక పోస్ట్లు పెడుతూ లక్షలాది ఫాలోయర్లను సొంతం చేసుకుంది శ్రీవాణి. అనేక రకాల పాటలకు ఆమె వాయించే వీణ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంటాయి. అలా ఇంట్రస్టింగ్ పోస్ట్లు, తన కచేరీలు, వీణ వీడియోలతో అభిమానులతో ఎపుడూ టచ్లో ఉంటుంది. తాజాగా వీరిద్దరు కశ్మీర్కు సమ్మర్ వెకేషన్కు చెక్కేశారు. దీనికి సంబంధించి రీల్స్ను కూడా ఇన్స్టాలో పోస్ట్ చేసింది. హాలీవుడ్ యాక్షన్ అడ్వెంచర్ ‘కింగ్ కాంగ్’ సినిమాలోఒక సీన్ను రీల్ చేశారు. దీంతో నెటిజన్లు విభిన్నంగా స్పందించారు. ప్రస్తుతం ఈ వీడియో ట్రెండ్ అవుతోంది. అంతేకాదు మంచులో చిల్ అవుతూ కనిపించారు. అలాగే భారతదేశపు మినీ స్విట్జర్లాండ్ శ్రీనగర్లో పెహల్గాం వద్ద అందమైన లోయ సమీపంలో రోజా సినిమాలోని పాటకు వరుసగా ఇద్దరూ రీల్ చేసిన వీడియోలు కూడా నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి. అంతేనా ఇటీవల పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ‘మిర్చి’ సినిమాలోని ‘ఎలాంటి అమ్మాయి కావాలేంటి’ అనే డైలాగులతో భర్త వేణుస్వామితో రీల్ చేయడం ఇంట్రస్టింగ్గా మారింది. ఆ తరువాత టాలీవుడ్ ‘మన్మధుడు’ నాగార్జున సినిమాలోని నాగ్, బ్రహ్మీ ఫన్నీ సీన్ ను రీ క్రీయేట్ చేయడం విశేషంగా నిలిచిన సంగతి తెలిసిందే. View this post on Instagram A post shared by Veena Srivani (satyavani Parankusham ) (@veenasrivani_official) -
చల్లచల్లని కూల్ కూల్
ఈ వేసవిలో ఆకాశానికి ఏసీ బిగిస్తే? మనం నడుస్తూ ఉంటే గాలి గొడుగు పడితే? కూర్చున్న చోటు చల్లని మందిరంగా మారితే? అసలు వేసవి మొత్తం కూల్ కూల్గా అనిపిస్తే? నిజంగా ఎలాగూ జరగదు. ఘోరమైన ఎండల్లో మాడక తప్పదు. అందుకే ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ను అడిగి ఇలాంటి ఊహలు చేసి ఆనందిస్తున్నారు జనం. మార్తాండుడి ముందు ఎవరైనా మోకరిల్లాల్సిందే ఎండాకాలంలో. వట్టివేర్లు కిటికీలకు కట్టుకునేవారు, కూల్ పెయింట్ చేయించుకునేవారు, గోతాం పట్టాలు కట్టుకుని నీళ్లు చల్లుకునేవారు, ఏసీలు కొనుక్కునేవారు, కూలర్లు రిపేర్లు చేయించుకునేవారు, కొబ్బరి మట్టలతో పందిరి వేసుకునేవారు... చల్లదనం కోసం ఎన్నో మార్గాలు. అయితే మన నెత్తి మీదే ఎప్పుడూ ఫ్యాన్ ఉండాలని, మనం ఎక్కడ కూచున్నా జిల్లుమనాలని అత్యాశ కూడా ఉండొచ్చు. ‘ఇలాంటి ఆశలు మాకున్నాయి. అవి తీరినట్టుగా ఫొటోలు చేసి చూపించు’ అని ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ను అడిగితే అది తయారు చేసిన ఫొటోలు నెట్లో వైరల్ అయ్యాయి. నెత్తి మీద ఐసు గడ్డల హెల్మెట్ ఉన్న అవ్వ, ఐసు బల్ల మీద కూచుని టూరిస్ట్లు, ఐసు స్కూటర్ మీద రివ్వున దూసుకెళ్లే అమ్మాయి, ఒళ్లంతా ఫ్యాన్లు మొలిచిన గరీబు... ఇవన్నీ ఏ.ఐ చూపించి ఐసు వాటర్ తాగిన ఫీలింగ్ కలిగించింది. -
కాల్చిన మునక్కాయల కూర
మునక్కాయలను ఇష్టపడని వారు ముల్లోకాల్లో వెదికినా దొరకరు. సాంబారులో ఎన్ని కూరగాయలు వేసినా మునగ వేస్తేనే గౌరవం. మునగను రకరకాలుగా వండటం చూశాం. కాని పల్లె వంటల్లో ప్రసిద్ధం అయిన ఈశ్వరి అవ్వ మునక్కాయలను కాల్చి చేసిన కూరను అందరూ నోరెళ్లబెట్టి చూస్తున్నారు. పొగడ్తలతో ఆమెను ముంచెత్తుతున్నారు. తమిళనాడుకు చెందిన ఈశ్వరి అవ్వకు ‘కంట్రీ ఫుడ్ కుకింగ్’ అనే యూ ట్యూబ్ చానల్ ఉంది. సబ్స్క్రయిబర్స్ ఎంతమందో తెలుసా? పది లక్షల మంది. తమిళనాడు గ్రామీణ వంటలను ప్రయోగ వంటలను అద్భుతంగా చేయడంతో ఈశ్వరి అవ్వకు విపరీతంగా ఫ్యాన్స్ ఉన్నారు. పచ్చి బొ΄్పాయి పచ్చడి, ఆరిటాకుల హల్వా ఇలాంటి వాటితో ΄ాటు నల్ల మాంసం కూర, అరటికాయతో వెజ్ ఫిష్ ఫ్రై లాంటివి నోరూరిస్తాయి. తాజాగా అవ్వ కాల్చిన మునక్కాయల కూర చేసి నెటిజెన్ల మెచ్చుకోలు పొందింది. మునక్కాడలను మంట మీద కాల్చి వాటిని కడిగి, చీరి, లోపల గుజ్జును వొలిచి పక్కన పెట్టుకుందామె. తర్వాత చట్టిలో నూనె ΄ోసి జిలుకర, వెల్లుల్లి, టొమాటో, ఉల్లి΄ాయలు, పసుపు, కారం, పచ్చిమిర్చి వేసి, ఆఖరున మునగగుజ్జును వేసి దోరగా వేయిస్తే మంచి ఫ్రై కూరలా తయారయ్యింది. దానిని తెల్లన్నంతో తింటూ మనకు వీడియో కనిపిస్తుంది అవ్వ. ఈ రెసిపీని చూసి నెటిజన్లు చాలా కొత్తగా ఉందంటున్నారు. మేమూ ట్రై చేస్తామని బజారుకు మునక్కాయల కోసం వెళుతున్నారు. -
ఎందెందు వెదికినా కరివేపాక్ కలదు
‘కరివేపాకులా తీసేయకు’ అని అంటాంగానీ ‘కరివేపాక్ మైసూర్పాక్ కంటే మహాగ్రేట్ సుమీ’ అంటుంది సోషల్ మీడియా ఫేమ్ కుశల కపిల. ఫ్యాషన్ ఎడిటర్, ఎంటర్టైన్మెంట్ రైటర్, కామెడీ కంటెంట్ క్రియేటర్గా ప్రతిభ చాటుకున్న కుశల తాజాగా కరివేపాకుపై దృష్టి పెట్టింది. ‘ఇందు గలదు. అందు లేదు అనే సందేహం వలదు’ టైప్లో కపిల కరివేపాకు గురించి ఇన్స్టాగ్రామ్ ‘రీల్’ చేసింది. ఈ రీల్ 8 మిలియన్ల వ్యూస్ను సొంతం చేసుకోవడమే కాదు ‘కడి పట్ట’ ట్రెండ్గా వైరల్ అయింది. -
దొంగతనం చేసిన డెలివరీ బాయ్కు సపోర్ట్.. సోనూసూద్పై ట్రోలింగ్
స్విగ్గీ డెలివరీ బాయ్ ఫుడ్ ఇవ్వడానికి వెళ్లి.. సదరు ఇంటి ముందు షూ దొంగిలించిన ఘటన హర్యానా రాష్ట్రంలోని గురుగ్రామ్లో చోటు చేసుకుంది. ఈ నెల 9న జరిగిన ఈ సంఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. దీనిపై ప్రముఖ నటుడు సోనూసూద్ పాజిటివ్గా స్పందించాడు. 'మీకు ఫుడ్ తీసుకొచ్చే క్రమంలో డెలివరీ బాయ్ షూలు ఎత్తుకెళ్లిపోతే తిట్టుకోకండి.. దయచేసి తనమీద ఎలాంటి చర్యలు తీసుకోవద్దు. వీలైతే అతడికి కొత్త షూలు కొనివ్వండి. బహుశా అతడికి అవి ఎంతో అవసరమయి ఉండొచ్చు. దయతో ప్రవర్తించండి' అని ట్వీట్ చేశాడు. ఇది చూసిన నెటిజన్లు సోనూసూద్ను విమర్శిస్తున్నారు. 'దొంగతనం చేస్తే ఏమీ అనకూడదా? పేదరికం, అవసరం ఉన్నంతమాత్రాన దొంగిలిస్తే తప్పు ఒప్పయిపోతుందా? ఈ డెలివరీ బాయ్ కంటే పేదవాళ్లు సమాజంలో ఎంతోమంది ఉన్నారు. వాళ్లందరూ తమ కష్టార్జితంతో బతుకుతున్నారే తప్ప ఇలా పక్కవాళ్ల వస్తువులు దొంగలించిట్లేదు' అని ఓ వ్యక్తి నటుడిపై విరుచుకుపడ్డాడు. 'ఎవరైనా బంగారు గొలుసు దొంగిలించినా ఏం పర్లేదని వదిలేయాలా? అతడికి కారు అవసరమనుకోండి.. ఎవరిదో ఒకరిది ఎత్తుకుపోతే సరిపోతుందా? పేదరికంలో ఉన్నంతమాత్రాన దొంగతనం తప్పు కాకుండా పోతుందా?' అని ట్రోల్ చేస్తున్నారు. If Swiggy’s delivery boy stole a pair of shoes while delivering food at someone’s house. Don’t take any action against him. In fact buy him a new pair of shoes. He might be really in need. Be kind ❤️🙏 — sonu sood (@SonuSood) April 12, 2024 If an actor tried to be a saviour, don't take him seriously. He might running a different business using his skill. — Bodhan Biswas 🇮🇳 (@bodhan11) April 12, 2024 So if I need anything, am I allowed to steal anything from anyone’s house? This is one of the weirdest posts I have ever read. — Naveen (@_naveenish) April 12, 2024 Swiggy's drop and PICK up service. A delivery boy just took my friend's shoes (@Nike) and they won't even share his contact. @Swiggy @SwiggyCares @SwiggyInstamart pic.twitter.com/NaGvrOiKcx — Rohit Arora (@_arorarohit_) April 11, 2024 చదవండి: సల్మాన్ చెల్లితో పెళ్లి.. నా దగ్గర పైసా లేదు! నాన్నే పోషించాలని చెప్పా! -
'జైలర్' ఫ్యాన్స్కు గుడ్న్యూస్.. అదిరిపోయే టైటిల్తో సీక్వెల్
రజనీకాంత్ కథానాయకుడిగా నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన యాక్షన్ థ్రిల్లర్ 'జైలర్'. అప్పటి వరకు హిట్ సినిమాలు లేని రజనీకాంత్కు జైలర్తో మంచి విజయాన్ని అందుకున్నారు. గతేడాది అగష్టులో వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద రూ. 600 కోట్లకు పైగానే కలెక్షన్స్ సాధించింది. నిర్మాతకు కూడా భారీ లాభాలను తెచ్చిపెట్టిన సినిమాగా రికార్డ్ క్రియేట్ చేసింది. తాజాగా ఈ సినిమాకు సంబంధించి సీక్వెల్ వార్త వైరల్ అవుతుంది. జైలర్ చిత్రాన్ని సన్ పిక్చర్స్పై కళానిధి మారన్ నిర్మించారు. ఈ సినిమాను నెల్సన్ దిలీప్ కుమార్ డైరెక్ట్ చేయగా అనిరుధ్ సంగీతం అందించారు. తాజాగా ఈ సినిమాకు సీక్వెల్ పనులను డైరెక్టర్ ప్రారంభించారట. 'హుకుమ్' పేరుతో పార్ట్ 2 పనులను ఆయన మొదలుపెట్టేశారట. ఈ జూన్లో ప్రీ-ప్రొడక్షన్ పనులను కూడా ఆయన స్టార్ట్ చేయబోతున్నారని టాక్ ఉంది. #Jailer2, #Hukum హ్యాష్ట్యాగ్లతో సోషల్మీడియాలో ఈ వార్త ట్రెండ్ అవుతుంది. దీంతో జైలర్ ఫ్యాన్స్ ఫుల్ ఖుషి అవుతున్నారు. రజనీకాంత్ ఇప్పటికే రెండు సినిమాలతో బిజీగా ఉన్నారు. దర్శకుడు లోకేశ్ కనగరాజ్ కాంబినేషన్లో ఓ చిత్రం రూపొందనున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే షూటింగ్ జరుపుకుంటున్న ఈ ప్రాజెక్ట్కు ఏప్రిల్ 22న టైటిల్ ఖరారు కానుంది. సన్పిక్చర్స్ పతాకంపై కళానిధి మారన్ ఈ మూవీని నిర్మిస్తున్నారు. మరోవైపు టి.జె.జ్ఞానవేల్ దర్శకత్వంలో 'వేట్టయాన్' చిత్రాన్ని కూడా రజనీ పట్టాలెక్కించిన విషయం తెలిసిందే. జైలర్లో కన్నడ నటుడు శివ రాజ్కుమార్, మలయాళ నటుడు మోహన్ లాల్, బాలీవుడ్ నటుడు జాకీ ష్రాఫ్ తదితరులు కీలక పాత్రలు పోషించడం సినిమాకు ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. రమ్యకృష్ణ, తమన్నా, సునీల్, మిర్నా మేనన్, యోగిబాబు కీలక పాత్రలలో మెప్పించారు. టైగర్ ముత్తువేల్ పాండియన్గా రజనీ హీరోయిజానికి ఫ్యాన్స్ ఫిదా అయితే.. వర్మన్గా వినాయకన్ విలనిజానికి కూడా అదే రేంజ్లో విజిల్స్ పడ్డాయి. జైలర్ సినిమా అమెజాన్ ప్రైమ్లో అందుబాటులో ఉంది. HUKUM... TIGER KA #HUKUM 🔥😎 Morattu excited for the re-entry of the character & combo 💥#Jailer2 #Vettaiyan #Thalaivar171 #ThalaivarNirandharam pic.twitter.com/VTdJI7leXq https://t.co/gBS4XMgze8 — Shreyas Srinivasan (@ShreyasS_) April 12, 2024
Pagination
ఆ బీప్ సౌండ్ వస్తేనే.. మీ ఓటు వేసినట్టు
ఇది కదా క్రేజ్ అంటే.. సీఎం జగన్ ఇంటర్వ్యూకి మిలియన్ల వ్యూస్
Sakshi.com ఇప్పుడు సరికొత్తగా మీ ముందుకు
కాపులు, ముస్లింలకు రిజర్వేషన్లు అక్కర్లేదు: పవన్కళ్యాణ్
రైతు కుమార్తె విజయం.. రిషబ్ శెట్టి అభినందనలు
పులివెందుల ప్రజలకు ఇద్దరిపైనా ప్రేమే: వైఎస్ భారతి
RCB Vs PBKS: కోహ్లి అరుదైన రికార్డు.. ఐపీఎల్ చరిత్రలోనే తొలి క్రికెటర్గా
Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ కేసులో బిగ్ ట్విస్ట్..
బిజీగా ఉండటం ఇంత డేంజరా! హెచ్చరిస్తున్న సైకాలజిస్ట్లు
కారులో వాసన బాగుందని తెగ పీల్చుకుంటున్నారా.?
తప్పక చదవండి
- నేడు రాష్ట్రంలో అమిత్ షా ప్రచారం
- బీజేపీపై తప్పుడు ప్రచారం
- Lok Sabha Election 2024: ఓటింగ్ శాతం తగ్గినా.. ఓట్లు పెరిగాయ్!
- Lok Sabha Election 2024: నాలుగో విడతలోనూ... మహా వార్!
- Lok Sabha Election 2024: మాజీ దంపతుల దంగల్!
- ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్కు వ్యతిరేకంగా యాడ్ .. బీజేపీ నేత సీరియస్
- ఐపీఎల్ మధ్యలోనే దుబాయ్ వెళ్లిన సన్రైజర్స్ కెప్టెన్..
- మేనిఫెస్టోకు, విశ్వసనీయతకు అర్థం చెప్పింది మీ బిడ్డే: సీఎం జగన్
- ‘ కృష్ణమ్మ’ మూవీ రివ్యూ
- వివేకా కేసు: సునీత దంపతులకు ఎదురుదెబ్బ
Advertisement