-
హైదరాబాద్కు సుప్రీం బెంచ్ తెస్తాం
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ సమాజం కోరుకునే మొత్తం 23 అంశాలతో లోక్సభ ఎన్నికల కోసం ప్రత్యేకంగా రాష్ట్ర మేనిఫెస్టోను రూపొందించామని టీపీసీసీ మేనిఫెస్టో కమిటీ చైర్మన్, మంత్రి దుద్దిళ్ల శ్రీధర్బాబు చెప్పారు. కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే ఏపీ పునర్వ్యవస్థీకరణ చట్టంలోని అన్ని హామీలను నెరవేరుస్తామన్నారు. హైదరాబాద్లో సుప్రీంకోర్టు బెంచ్ను ఏర్పాటు చేయడం సహా వివిధ హామీలు అమలు చేస్తామని తెలిపారు. శుక్రవారం గాంధీ భవన్లో జరిగిన కార్యక్రమంలో టీపీసీసీ ఆధ్వర్యంలో లోక్సభ ఎన్నికల మేనిఫెస్టోను విడుదల చేశారు. పాంచ్న్యాయ్, తెలంగాణకు ప్రత్యేక హామీల పేరుతో రూపొందించిన ఈ మేనిఫెస్టో విడుదల కార్యక్రమంలో రాష్ట్ర పార్టీ వ్యవహారాల ఇన్చార్జి దీపాదాస్ మున్షీ, టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్, ఎమ్మెల్సీ బి. మహేశ్కుమార్గౌడ్, ముఖ్యమంత్రి సలహాదారు వేం నరేందర్రెడ్డి, మేనిఫెస్టో కమిటీ సభ్యులు రియాజ్, ఆల్దాసు జానయ్య, వినోద్కుమార్, కమలాకర్రావు, అనంతుల శ్యాంమోహన్, లింగం యాదవ్, కప్పర హరిప్రసాదరావు, పార్టీ నేతలు మెట్టు సాయికుమార్, చనగాని దయాకర్ పాల్గొన్నారు. నీతి ఆయోగ్ ప్రాంతీయ కార్యాలయం ఏర్పాటు చేస్తాం.. ప్రత్యేక మేనిఫెస్టో విడుదల సందర్భంగా మంత్రి శ్రీధర్బాబు మాట్లాడుతూ నీతి ఆయోగ్ కార్యాలయాన్ని హైదరాబాద్లో పెట్టాలని నిర్ణయించామన్నారు. అలాగే పలు జాతీయ స్థాయి ప్రతిష్టాత్మక సంస్థలను ఏర్పాటు చేస్తామని చెప్పారు. పాలమూరు–రంగారెడ్డి ప్రాజెక్టు, మేడారం జాతరకు జాతీయ హోదా కల్పిస్తామని, ఏపీలో విలీనమైన 5 గ్రామాలను తెలంగాణలో కలుపుతామని హామీ ఇచ్చా రు. బీఆర్ఎస్ హయాంలో తెలంగాణ ఆర్థిక వ్యవస్థ చిన్నాభిన్నమైందని శ్రీధర్బాబు విమర్శించారు. గత పదేళ్లలో కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ, రాష్ట్రంలో అధికారం చేపట్టిన బీఆర్ఎస్ తెలంగాణకు ఏమీ చేయలేదని మండిపడ్డారు. తాము అధికారంలోకి వచ్చాక పాలనను గాడిలో పెట్టామని చెప్పారు. అనంత రం దీపాదాస్ మున్షీ మాట్లాడుతూ.. దేశవ్యాప్తంగా 400 సీట్లు గెలిచి రాజ్యాంగా న్ని మార్చాలని ప్రధాని మోదీ ప్రయతి్నస్తున్నారని ఆరోపించారు. తెలంగాణలో రాబోయే లోక్సభ ఎన్నికల్లో 14 సీట్లు గెలుస్తామని ఆమె ధీమా వ్యక్తం చేశారు. -
మోదీది సవతి తల్లి ప్రేమ
సాక్షిప్రతినిధి, కరీంనగర్/సిరిసిల్ల: ప్రధాని మోదీ తెలంగాణపై సవతితల్లి ప్రేమ చూపిస్తున్నాడని, పదేళ్లలో ఆయన రాష్ట్రానికి చేసిందేమీ లేదని సీఎం రేవంత్రెడ్డి అన్నారు. మోదీ తరచుగా చెప్పే ఐదు ట్రిలియన్ల ఎకానమీకి ఆద్యుడు ఒకప్పటి మంథని నుంచి ప్రాతినిధ్యం వహించిన మాజీ ప్రధాని పీవీ నరసింహారావు అని గుర్తుచేశారు. పదేళ్లు పాలించిన బీఆర్ఎస్ పార్టీ కాలనాగు అని దాన్ని ఈసారి ఎన్నికల్లో తలమీదే కొట్టాలని పిలుపునిచ్చారు. జనజాతర సభలో భాగంగా శుక్రవారం «జగిత్యాల జిల్లా ధర్మపురి నియోజకవర్గంలోని రాజారాంపల్లి, సిరిసిల్లలో ఏర్పాటు చేసిన బహిరంగసభ, కార్నర్ మీటింగ్లో సీఎం రేవంత్ మాట్లాడారు. బీజేపీ, బీఆర్ఎస్లపై నిప్పులు చెరిగారు. సీఎం రేవంత్ ఏమన్నారంటే.... నేను మధ్యాహ్నం రెండు గంటలకే రావాల్సి ఉన్నా.. రాయ్బరేలిలో రాహుల్గాంధీ నామినేషన్ కార్యక్రమానికి హాజరుకావడం, విమానంలో సాంకేతిక సమస్యల కారణంగా ఆలస్యమైంది. బీఆర్ఎస్ చచ్చిన పాము. తోక మీద కాదు.. పడగ మీద కొట్టండి. కాలనాగు పీడ విరగడవుతుంది. ఇక బీజేపీ నోరు తెరిస్తే.. అబద్ధాలే. ఎన్టీపీసీలో 4,000 మెగావాట్లకుగాను పదేళ్లలో 1,600 మెగావాట్ల ప్లాంట్ మాత్రమే నిర్మించారు.దేశంలో రాజ్యాంగం, రిజర్వేషన్లు ఉండాలంటే రాహుల్గాంధీ ప్రధాని కావాలి. గాంధీ కుటుంబానికి తోడుగా నిలబడాలి. మా ప్రభుత్వం జోలికొస్తే కార్యకర్తలు ఊరుకోరు’’అని ముగించారు. అనంతరం బయ్యారం ఉక్కు కర్మాగారం, కాజీపేట రైల్వే కోచ్ ఫ్యాక్టరీ, ఐటీఐఆర్, గిరిజన వర్సిటీ, ఐఐటీ, ఐఐఎం ఇలా ఏది అడిగినా.. బీజేపీ గాడిద గుడ్డు ఇచ్చిందని సభికులతో సీఎం రేవంత్ అనిపించారు. కారు ఢిల్లీకి పోతే.. కమలం అవుతుంది ‘తెలంగాణలో కారు ఢిల్లీకి పోతే కమలం అవుతుంది. 2014, 2019లో రెండుసార్లు 12 ఎంపీ సీట్లు, 9 ఎంపీ సీట్లు ఇస్తే.. కేసీఆర్ ఏం చేశాడు..ఢిల్లీ సుల్తాన్లకు తాకట్టుపెట్టాడు’అని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి అన్నారు. సిరిసిల్లలో ఆయన మాట్లాడుతూ బీజేపీ ప్రభుత్వం తెచి్చన నల్లాచట్టాలు, నోట్ల రద్దుకు బీఆర్ఎస్ మద్దతు పలికిందన్నారు. కరీంనగర్లో పోటీచేసిన ఒక్కరు అపరమేధావి, మరొకరు అరగుండు మేధావి అని, ఇద్దరూ పాతవారే, ఎంపీలుగా పనిచేసిన వారే కదా అని ప్రశ్నించారు.ఎంపీలుగా ఉన్నప్పుడు ఏమీ చేయనోళ్లు.. ఇప్పుడు మళ్లీ గెలిచి ఏం చేస్తారన్నారు. పదేళ్లు తెలంగాణను నిర్లక్ష్యం చేసి, తెలంగాణ పునరి్వభజన చట్టాన్ని అమలు చేయని బీజేపీకి ఓట్లు ఎట్లా వేస్తామన్నారు. బయ్యారం ఉక్కు పరిశ్రమ, వరంగల్ రైల్వే కోచ్ ప్యాక్టరీ, గిరిజన యూనివర్సిటీ, ఐటీఐఆర్ కారిడార్ వంటి తెలంగాణ పునరి్వభజన చట్టంలోని ఒక్కదాన్ని కూడా బీజేపీ ఇవ్వలేదని చెప్పారు. ఉద్దెరోడు పెట్టిన రూ.40 వేల కోట్లు కట్టలేక పోతున్నా.. రాష్ట్రంలో ఈ ఉద్దెరోడు పెట్టిపోయిన రూ.40వేల కోట్లు కట్టలేక పోతున్నానని, సిరిసిల్ల నేతన్నలకు రూ.275 కోట్లు బకాయి పెట్టిపోయిండని రేవంత్రెడ్డి అన్నారు. నేత, గీత కార్మికులను ఆదుకోవాలని నేతకార్మికులకు ఇటీవల రూ.50కోట్లు మంజూరు చేశామని, ఎన్నికల ముగిసిన తర్వాత మిగతా బకాయిలు ఇస్తామన్నారు. అధికారంలోకి వచి్చన వంద రోజుల్లోనే ఐదు గ్యారంటీలను అమలు చేశామని, 4.50 లక్షల ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేస్తామని రేవంత్రెడ్డి అన్నారు. ఈ సమావేశంలో రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్, ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్, చొప్పదండి, మానకొండూర్ ఎమ్మెల్యేలు మేడిపల్లి సత్యం, డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. -
పార్టీ ఆఫీసులో రాహుల్ గాంధీ పూజలు - వీడియో వైరల్
కాంగ్రెస్ కీలక నేత రాహుల్ గాంధీ రాయ్బరేలీ నుంచి పోటీకి సిద్ధం అయ్యారు. శుక్రవారం కాంగ్రెస్ పార్టీ రాయ్బరేలీ కాంగ్రెస్ అభ్యర్థిగా రాహుల్ గాంధీ పేరును అధికారికంగా ప్రకటించింది. అమేథీ నుంచి కిషోరీలాల్ శర్మను బరిలో దించింది.రాహుల్ గాంధీ రాయ్బరేలి ఎంపీ సీటుకు పోటీ చేస్తున్నట్లు నామినేషన్ కూడా దాఖలు చేశారు. ఈ సమయంలో ఆయన వెంట తల్లి సోనియా గాంధీ, సోదరి ప్రియాంకగాంధీ వాద్రా, రాబర్ట్ వాద్రా ఉన్నారు. రాయ్బరేలి జిల్లా మెజిస్ట్రేట్ కార్యాలయంలో ఆయన నామినేషన్ పత్రాలు సమర్పించారు.నామినేషన్ వేయడానికి ముందు రాహుల్గాంధీ ఆ నియోజకవర్గంలోని కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యాలయంలో ప్రత్యేక పూజలు చేశారు. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట్లో వైరల్ అవుతోంది. ఇందులో సోనియా గాంధీ, ప్రియాంకా గాంధీ, రాబర్ట్ వాద్రా, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి తదితరులు పాల్గొన్నారు.#WATCH | Congress candidate from Raebareli Lok Sabha seat Rahul Gandhi along with Congress Parliamentary Party chairperson Sonia Gandhi, party General Secretary Priyanka Gandhi Vadra and Robert Vadra performed pooja at the party office in Rae Bareli, UP today pic.twitter.com/lNQV0mwIfv— ANI (@ANI) May 3, 2024 -
సీఎం జగన్ రేపటి ప్రచార సభల షెడ్యూల్ ఇలా..
సాక్షి, అమరావతి: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి రేపటి(శనివారం) ఎన్నికల ప్రచార సభల షెడ్యూల్ను వైఎస్సార్సీపీ ప్రధాన కార్యదర్శి తలశిల రఘరామ్ శుక్రవారం విడుదల చేశారు.సీఎం జగన్ 4వ తేదీన ఎన్నికల ప్రచారాన్ని మూడు నియోజకవర్గాల్లో నిర్వహిస్తారు. శనివారం ఉదయం 10 గంటలకు హిందూపురం పార్లమెంట్ పరిధి హిందూపురం పట్టణంలోని అంబేడ్కర్ సెంటర్లో జరిగే ప్రచార సభలో పాల్గొంటారు. అనంతరం మధ్యాహ్నం 12.30 గంటలకు చిత్తూరు పార్లమెంట్ పరిధి పలమనేరు నియోజకవర్గ కేంద్రంలోని బస్టాండ్ సెంటర్లో జరిగే సభలో పాల్గొంటారు. అనంతరం మధ్యాహ్నం 3 గంటలకు నెల్లూరు పార్లమెంట్ పరిధి నెల్లూరు సిటీ గాంధీ విగ్రహం సెంటర్లో జరిగే ప్రచార సభలో పాల్గొంటారు. -
సొంతగూటికి సంజయ్ నిరుపమ్
ముంబై: ఇప్పటికే దేశంలో కొన్ని రాష్ట్రాల్లో ఓటింగ్ ప్రక్రియ ముగిసింది. అయితే ఇంకా ఓటింగ్ జరగాల్సిన ప్రాంతాల్లో పార్టీలలో చేరేవారు చేరుతూనే ఉన్నారు. ఈ తరుణంలో కాంగ్రెస్ మాజీ నాయకుడు సంజయ్ నిరుపమ్ మహారాష్ట్ర సీఎం ఏక్నాథ్ షిండే నేతృత్వంలోని శివసేనలో చేరారు.బీహార్కు చెందిన నిరుపమ్ 1990లలో జర్నలిజం ద్వారా రాజకీయాల్లోకి ప్రవేశించారు. ఆ తరువాత 'దోఫర్ కా సామ్నా'కి సంపాదకుడు అయ్యారు. నిరుపమ్ పనికి ముగ్దుడైన శివసేన చీఫ్ బాల్ థాకరే 1996లో రాజ్యసభకు నియమించారు. ఆ తరువాత 2005లో తలెత్తిన కొన్ని వివాదాల కారణంగా రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేసి 2005లో సేనను వీడి కాంగ్రెస్లో చేరారు.మహారాష్ట్ర ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ప్రధాన కార్యదర్శిగా నిరుపమ్ను కాంగ్రెస్ నియమించింది. 2009 ఎన్నికలలో ముంబయి నార్త్ లోక్సభ స్థానం నుంచి పోటీ చేసి బీజేపీ సీనియర్ నేత రామ్నాయక్పై స్వల్ప తేడాతో విజయం సాధించారు. 2014లో ఇదే నియోజకవర్గంలో బీజేపీ అభ్యర్థి గోపాల్ శెట్టి చేతిలో ఓడిపోయారు. 2017లో ముంబయి సివిక్ బాడీకి జరిగిన ఎన్నికల్లో పార్టీ ఓటమి పాలైన తర్వాత నిరుపమ్ ముంబై కాంగ్రెస్ అధ్యక్ష పదవికి రాజీనామా చేశారు. శివసేనను వీడిన చాలా సంవత్సరాల తరువాత నిరుపమ్ మళ్ళీ సొంతగూటికి చేరారు.#WATCH | Former Congress leader Sanjay Nirupam along with his wife and daughter join Shiv Sena, in the presence of Maharashtra CM Eknath Shinde, in Mumbai pic.twitter.com/lLtKFcelti— ANI (@ANI) May 3, 2024
Pagination
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధర్వంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
తప్పక చదవండి
- వరల్డ్కప్కు వెస్టిండీస్ జట్టు ప్రకటన.. విధ్వంసకర ఆటగాళ్లకు ఛాన్స్
- గుర్తుపట్టలేనంతగా మారిపోయిన టాలీవుడ్ స్టార్ హీరోయిన్
- ICC: నంబర్ వన్గా ఆసీస్.. అందులో మాత్రం టీమిండియానే టాప్
- కోర్టు పెండింగ్లో ఉన్న కేసు గురించి ఎలా మాట్లాడతారు?
- మద్యం పాలసీ కేసు.. మనీష్ సిసోడియాకు ఊరట
- ‘రాహుల్, లాలూ యాదవ్ పేరుందని పోటీ చేయకుండా ఆపలేం’
- ఎక్కువ జీతం కోసం ఎదురు చూస్తున్నారా? అయితే ఇది మీకోసమే
- గేల్, డివిలియర్స్ కాదు.. అతడంటే నాకు వణుకు: గంభీర్
- 'సలార్' పరిస్థితి మరీ ఇంత దారుణమా.. కారణం అదేనా?
- Kushitha Kallapu: ఆరెంజ్ ఆర్మీ విన్తో ‘ఖుషీ’ అవుతున్న ఈ గ్లామర్ లుక్స్ ఎవరివి? (ఫోటోలు)
Advertisement