రాజ్‌నాథ్‌ను కలిసిన మంత్రి కేటీఆర్‌ | Sakshi
Sakshi News home page

రక్షణ శాఖ భూములివ్వాలని వినతి

Published Wed, Oct 30 2019 1:56 PM

KTR Meets Defense Minister Rajnath Singh in Delhi - Sakshi

సాక్షి, ఢిల్లీ : తెలంగాణ మునిసిపల్‌, ఐటీ శాఖ మంత్రి కేటీఆర్‌ బుధవారం ఢిల్లీలో కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ను కలిశారు. సౌత్‌బ్లాక్‌లో రాజ్‌నాథ్‌ను కలిసిన కేటీఆర్‌ హైదరాబాద్‌ - నాగ్‌పూర్‌, హైదరాబాద్‌ - రామగుండం జాతీయ రహదారులను విస్తరించడానికి నగరంలోని రక్షణ శాఖ భూములను కేటాయించాలని కోరారు. ప్రస్తుతం ఉన్న రహదారులు రవాణావసరాలకు సరిపోవడం లేదని, ఆయా మార్గాల్లో స్కైవేల నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించినందున భూముల అప్పగింతపై సానుకూల నిర్ణయం తీసుకోవాలని రాజ్‌నాథ్‌ను కేటీఆర్‌ కోరారు. ఈ సందర్భంగా రాజ్‌నాథ్‌తో కలిసి ఉన్న ఫోటోలను కేటీఆర్‌ తన ట్విటర్‌ ఖాతాలో షేర్‌ చేశారు.




Advertisement

తప్పక చదవండి

Advertisement