3 నుంచి కిషన్రెడ్డి మహా పాదయాత్ర
బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గుజ్జుల ప్రేమేందర్రెడ్డి
కంతనపల్లి వద్ద బీజేపీ బృందం పర్యటన
ఏటూరునాగారం : తెలంగాణకు తలమానికమైన కంతపల్లి ప్రాజెక్ట పనులను స్లో డౌన్ (కాలక్రమేణా నిలుపుదల)కు ప్రభుత్వం యత్నిస్తోందని బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గుజ్జుల ప్రేమేందర్రెడ్డి ఆరోపించారు. రాష్ట్రంలో దిక్కుమాలిన పాలన సాగుతోందని ధ్వజమెత్తారు. తెలంగాణలో దేవాదుల, కంతనపల్లి ప్రాజెక్టులు రైతులకు వందశాతం ఉపయోగపడేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ సెప్టెంబర్ 3 నుంచి కంతనపల్లి - దేవాదుల వరకు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్రెడ్డి మహా పాదయాత్ర చేపడుతున్నారని తెలిపారు. మండలంలోని కంతనపల్లి ప్రాజెక్టు పనులు, పాదయాత్ర ఏర్పాట్లను బీజేపీ రాష్ట్ర నాయకుల బృందం ఆదివారం పరిశీలించింది. అనంతరం విలేకరులతో ప్రేమేందర్రెడ్డి మాట్లాడారు. నీళ్లు, నిధులు, ఉద్యోగ నియామకాల కోసమే తెలంగాణ సాధించుకున్నామని, కానీ, వీటిపై కేసీఆర్ సర్కారు కంటితుడుపుగానే వ్యవహరిస్తోందని పేర్కొన్నారు. పాత ప్రాజెక్టులు పూర్తి చేయకుండా కొత్తవాటికి శ్రీకారం చుట్టడం అర్థరహితమన్నారు. దేవాదుల నీటితో ఒక్క ఎకరాన్నీ తడపలేని దుస్థితిలో ప్రభుత్వం ఉందని ఎద్దేవా చేశారు. 2009లో దివంగత సీఎం వైఎస్సార్ శంకుస్థాపన చేసిన కంతనపల్లిపై సర్కారు ముందుకు వెళ్లడం లేదని విమర్శించారు. కంతనపల్లిని దెబ్బతీసేందుకే దేవాదుల వద్ద దుర్గం గుట్ట ఆనకట్టను తెరపైకి తెచ్చి రూ. 64 లక్షలు మంజూరు చేసిందని ఆరోపించారు.
ఇలాగైతే వందేళ్లరుునా పూర్తికాదు..
కంతనపల్లిలో రెండు పొక్లెయిన్లు, 200ల మంది కూలీలతో పనులు చేయిస్తే వందేళ్లరుునా పనులు పూర్తికావని పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు మూర్తినేని ధర్మారావు అన్నారు. కేంద్ర ప్రభుత్వం రాష్ట్రలో బహుళార్థక ప్రాజెక్టుల నిర్మాణాలు పూర్తి చేయడానికి రూ. 50 వేల కోట్లు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నా.. రాష్ట్ర ప్రభుత్వం సమగ్ర కార్యచరణ అమలు చేయడం లేదని ఆరోపించారు. రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దుగ్యాల ప్రదీప్కుమార్, రాష్ట్ర కార్యదర్శి కాసం వెంకటేశ్వర్లు, జిల్లా అధ్యక్షుడు ఎడ్ల అశోక్రెడ్డి, ములుగు కన్వీనర్ చింతలపుడి భాస్కర్రెడ్డి, నాయకులు చింతకుల సునీల్, నరహరి వేణుగోపాల్రెడ్డి, నాగపురి రాజమౌళి, దొంతి దేవేందర్రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
రాష్ట్రంలో దిక్కుమాలిన పాలన
Published Mon, Aug 31 2015 3:26 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
చెలరేగిన ఆర్సీబీ బౌలర్లు.. 147 పరుగులకు గుజరాత్ ఆలౌట్
కాలేజీ ఫెస్ట్లో ఉర్రూతలూగించిన సింగర్ కార్తీక్ (ఫోటోలు)
ట్రెండింగ్లో 'హీరామండి'.. సిరీస్పై అద్భుతమైన ప్రశంసలు
ఆయన 27 ఏళ్లు పెద్ద.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవరీ నటి?
పూంచ్లో ఉగ్రదాడి.. సైనికులకు గాయాలు
శుబ్మన్ గిల్కు ఏమైంది.. ఇలా అయితే కష్టమే! వీడియో వైరల్
ఐసీయూలో అమ్మ... కలుస్తానంటే వెళ్లనివ్వలేదు: ప్రముఖ టీవీ నటి
యూనీసెఫ్ ఇండియా నేషనల్ అంబాసిడర్గా 'కరీనా కపూర్'
‘ఆప్’ స్టార్ క్యాంపెయినర్ల లిస్టులో కేజ్రీవాల్ పేరు
టీ20 వరల్డ్కప్ వస్తోంది.. బుమ్రాకు విశ్రాంతి ఇవ్వండి: జాఫర్
తప్పక చదవండి
- ఐపీఎల్పై వివాదాస్పద కామెంట్స్.. క్లారిటీ ఇచ్చిన స్టార్ డైరెక్టర్
- ట్రెండింగ్లో 'హీరామండి'.. సిరీస్పై అద్భుతమైన ప్రశంసలు
- పూంచ్లో ఉగ్రదాడి.. సైనికులకు గాయాలు
- ఐసీయూలో అమ్మ... కలుస్తానంటే వెళ్లనివ్వలేదు: ప్రముఖ టీవీ నటి
- రాకాసి నర్సుకు 760 ఏళ్ల జైలు శిక్ష : అసలు ఏమైందంటే..!
- బీజేపీలో చేరిన ఢిల్లీ మాజీ కాంగ్రెస్ చీఫ్ అరవిందర్ సింగ్
- రాయ్బరేలి బరిలో రాహుల్.. వయనాడ్ ఓటర్ల ఫీలింగ్ ఇదే..!
- బాలుడి ఊపిరితిత్తుల్లోకి ఎల్ఈడీ బల్బు.. డాక్టర్లు ఏం చేశారంటే..
- చంద్రబాబు మేనిఫెస్టో మాయలు గుర్తున్నాయా?: సీఎం జగన్
- Tech Layoffs 2024: షాకింగ్ రిపోర్ట్: ఒక్క నెలలోనే 21 వేల టెకీలకు ఉద్వాసన
Advertisement