సాక్షి, హైదరాబాద్: దేవాదాయశాఖలో వారి పోస్టింగే నిబంధనలకు విరుద్ధం... ఆ తర్వాత వారికి కల్పించిన పదోన్నతులు అక్రమం... వాటిని రద్దు చేయాలంటూ కొందరు ఉద్యోగులు పోరాటం చేస్తున్నారు, పదోన్నతులు అక్రమంగా జరిగినందున వాటిపై పునఃసమీక్షించాకే కొత్త పదోన్నతులు ఇవ్వాలంటూ గతేడాదే నాటి దేవాదాయ శాఖ కమిషనర్ కూడా ప్రభుత్వానికి నివేదించారు. కానీ అక్రమాలను సరిచేయటం సంగతి అటుంచితే, ఇప్పుడు వారికి ఏకంగా సహాయ కమిషనర్ పదోన్నతి కల్పించేందుకు రంగం సిద్ధమైంది. ఉన్న పోస్టు నుంచి డిమోట్ కావాల్సిన వారు అసిస్టెంట్ కమిషనర్గా కీలక పోస్టులు పొందబోతున్నారు. కొన్నేళ్లుగా అక్రమాలకు నిలయంగా మారిన దేవాదాయ శాఖలో.. ఇప్పుడు మరో భారీ అక్రమ పర్వానికి తెరలేస్తోంది. ఈ శాఖకు పూర్తిస్థాయి కమిషనర్ లేకపోవడాన్ని ఆసరాగా చేసుకున్న ఓ అధికారి తెరవెనక చక్రం తిప్పి అక్రమ పదోన్నతులకు రంగం సిద్ధం చేశాడన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఈ శాఖకు కొన్నేళ్లుగా ఇన్చార్జి కమిషనర్లే దిక్కయ్యారు. బిజీగా ఉండే ఆ అధికారులు, దేవాదాయ శాఖను పట్టించుకోకుండా తదుపరి అధికారులకు వదిలేస్తున్నారు. ఇప్పుడు అక్రమ పదోన్నతులకు రంగం సిద్ధం చేసి అక్రమార్కులకు కీలక పోస్టులు అప్పగించబోతున్నారు. వారం పది రోజుల్లో ఆర్డర్ కూడా వెలువడబోతోంది.
అక్రమాలు ఇలా...
గతంలో ఐ.వెంకటేశ్వర్లు కమిషనర్గా ఉన్న సమయంలో భారీగా అక్రమాలు జరిగాయంటూ ఆయన హయాంలో జరిగిన పదోన్నతులను ప్రభుత్వం రద్దు చేసింది. ఆ సమయంలో అక్ర మంగా సూపరింటెండెంట్ పదోన్నతి పొందిన ఓ అధికారిపై చర్య తీసుకోలేదు. ఈ తప్పిదాన్ని తర్వాత గుర్తించిన కొందరు ఉద్యోగులు అ అధికారి పదోన్నతిని రద్దు చేయాలని డిమాండ్ చేశారు. కానీ కాసులతో ఉన్నతాధికారులను కొనేసిన ఆ అధికారి అక్రమ పదోన్నతిని కాపాడుకున్నారు. ఇప్పుడు అదే అధికారికి సహాయ కమిషనర్ పోస్టు కట్టబెట్టబోతున్నారు. అసలు ఈ అధికారి నియామకమే అక్రమమని, నిషేధం అమలులో ఉన్న సమయంలో అక్రమంగా నియమించబడ్డారని విజిలెన్స్ అధికారి విచారణ జరిపి నివేదిక ఇచ్చారు.
ఓ ప్రైవేట్ దేవాలయంలో సాధారణ క్లర్క్గా చేరి అక్రమంగా దేవాదాయ శాఖలోకి మారిన మరో చిరుద్యోగి 2008లో గ్రేడ్–2 ఈవో అయ్యారు. అది కూడా అక్రమమని, ఆయన 2011లోగానీ ఆ పోస్టుకు అర్హుడు కాదని విజిలెన్స్ అధికారి నివేదించారు. దీని ప్రకారం తర్వాత తీసుకున్న గ్రేడ్–1 ఈవో పదోన్నతి కూడా రద్దు కావాల్సిందేనని పేర్కొన్నారు. దాన్ని రద్దు చేసి ఆ అధికారిని డిమోట్ చేయాల్సింది పోయి ఇప్పుడు ఏసీ పోస్టు ఇచ్చేందుకు రంగం సిద్ధం చేశారు. 2011లో గ్రేడ్–2 ఈవో పదోన్నతి పొందాల్సిన ఓ అధికారికి అక్రమంగా 2008లోనే కట్టబెట్టారు. ఇది అక్రమమని తర్వాత తేల్చారు. ఈ లెక్క ప్రకా రం 2014లో గ్రేడ్–1 ఈవో కావాల్సి ఉంటుంది. కానీ.. 2011లోనే గ్రేడ్–1 ఈవోగా భావిస్తూ అసిస్టెంట్ కమిషనర్ పోస్టుకు సిద్ధం చేశారు.
గత కమిషనర్ వద్దన్నా....
నిబంధనలకు విరుద్ధంగా పదోన్నతులు కల్పించడం దేవాదాయశాఖలో సాధారణ విషయంగా మారింది. దీనిపై గత రెండుమూడేళ్లలో ఫిర్యాదులు ఎక్కువగా రావడం, వీటిపై కోర్టు కేసులు పెరిగిపోవడంతో గత సంవత్సరం నాటి కమిషనర్ విచారణ జరిపి ప్రభుత్వానికి నివేదిక అందజేశారు. 2006 నుంచి 2018 వరకు జరిగిన పదోన్నతుల ప్యానెళ్లను పునఃసమీక్షిం చి చర్యలు తీసుకోవాల్సి ఉందని, ఆ తర్వాతే సీనియారిటీ జాబితా రూపొందించాల్సి ఉంటుందని పేర్కొన్నారు. కానీ, దాన్ని అమలు చేయకుండా ఇప్పుడు మళ్లీ అడ్డగోలు పదోన్నతులకు తెరదీశారు.
ఆ రెండు ఉత్తర్వులను పట్టించుకోరా...
దేవాదాయ శాఖలో పదోన్నతులు కల్పించేటప్పుడు ప్రభుత్వ ఉత్తర్వులు నెం. 1478, 888లను అనుసరించాల్సి ఉంటుంది. కేడర్ స్ట్రెంథ్ (అనుమతి ఉన్న పోస్టుల సంఖ్య) ఆధారంగానే దేవాలయంలో నియామకాలు జరపాలి. ప్రతి నియామకానికి నిర్ధారిత అర్హతలు ఉండాలి, ఒక పోస్టులో కనీసం ఐదేళ్లు (తర్వాత దాన్ని మూడేళ్లుగా మార్చారు) పనిచేయాలి. మళ్లీ అదే దేవాలయంలో పదోన్నతి పొందాలి. నియామకం సమయంలో ఎస్టాబ్లిష్మెంట్ చార్జీలు మొత్తం వ్యయంలో 30%కు మించరాదు. అంతకంటే మించితే కొత్త నియామకాలు జరపొద్దు. కానీ వీటిని పట్టించుకోకుండా నియామకాలు జరిపేస్తున్నారు,
అక్కడ అన్నీ వింతలే...
గత సంవత్సరం ఓ అధికారి డిప్యూటీ కమిషనర్ హోదాలో పదవీ విరమణ పొందారు. ఆ తర్వాత ఓ విచారణ నివేదిక వచ్చింది. దాని ప్రకారం ఆ అధికారికి అసలు డిప్యూటీ కమిషనర్ అర్హతే లేదు. 2011 లో గ్రేడ్–1 ఈవో కావాల్సిన ఆ అధికారి అక్రమంగా 2003లోనే ఆ పదోన్నతి పొందారు. అంటే 8 సంవత్సరాల ముందే దొడ్డిదారి పదోన్నతి పొందారన్నమాట. ఇలా ఒకదాని తర్వాత ఒకటి అక్రమంగా పదోన్నతి పొందుతూపోయారు, ఇప్పుడు రిటైర్ అయ్యారు. ఆయన బెనిఫిట్స్పై చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది.
అక్రమాలకు ‘పదోన్నతి’!
Published Fri, Apr 26 2019 2:18 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
వారి వల్లే మా ఎంగేజ్మెంట్ జరిగింది: అదితిరావు హైదరీ
పెళ్లి చేసుకున్న తెలుగు సీరియల్ నటి (ఫోటోలు)
రాణించిన హెడ్, కమ్మిన్స్.. ముంబై టార్గెట్ ఎంతంటే?
'దీదీ గిరి' అంగీకరించను: పశ్చిమ బెంగాల్ గవర్నర్
బాబే కాదు ప్రధాని మోదీ కూడా యూటర్న్ తీసుకున్నారు: అమర్నాథ్
త్వరలోనే బిడ్డకు జన్మనివ్వనున్న టాలీవుడ్ హీరోయిన్.. భర్తపై అలాంటి పోస్ట్!
తెలంగాణ రైతులకు గుడ్ న్యూస్.. ఖాతాల్లోకి నగదు
T20 WC 2024: టీమిండియా టీ20 వరల్డ్ కప్ జెర్సీ ఇదే.. ఫోటోలు వైరల్
కాంగ్రెస్కు పాకిస్తాన్ మద్దతు ఉంది: అనురాగ్ ఠాకూర్
టాలీవుడ్ హీరో డ్రీమ్ ప్రాజెక్ట్.. రెబల్ స్టార్ ఎంట్రీ!
తప్పక చదవండి
- సోనాక్షితో ఇంటిమేట్ సీన్స్.. ఆమె తల్లి ఏమన్నారంటే: నటుడు
- అలా చేస్తే ఆ కిక్కే వేరు! అతడితో లవ్లో ఉన్నా: నటి
- హీట్వేవ్ నుంచి ఉపశమనం.. త్వరలో వర్షాలు: వాతావరణ శాఖ
- డైరెక్టర్తో హీరోయిన్ పెళ్లి.. మామయ్యను మండపానికి రానివ్వలేదట!
- మాచర్లలో సీఎం జగన్ ప్రచారం.. పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)
- కాంగ్రెస్ కీలక నిర్ణయం: బరిలోకి మాజీ ముఖ్యమంత్రులు
- హార్దిక్ కాదు!.. రోహిత్ తర్వాత టీమిండియా కెప్టెన్ అతడే!
- సమ్మర్లో కొబ్బరిబోండంలోని నీటిని నేరుగా తాగేస్తున్నారా..?
- చంద్రబాబు మోసాల చరిత్రను గుర్తు తెచ్చుకోండి: సీఎం జగన్
- కల్వకుంట్ల కవితకు బిగ్ షాక్
Advertisement