నియోజకవర్గ ముఖచిత్రం
మతియామహల్లో ముక్కోణమే..
న్యూఢిల్లీ: ముస్లిం ఓటర్లు అధికంగా ఉండే మతియామహల్లో ఈసారి త్రిముఖ పోటీ తథ్యమనిపిస్తోంది. ఈ అసెంబ్లీ ఎన్నికల్లో ప్రధాన పార్టీల తరఫున పోటీచేస్తున్న అభ్యర్థులందరూ పాతవారే అయినా వారు పోటీచేస్తున్న పార్టీలు మాత్రం మారిపోవడం గమనార్హం. ఈ నియోజకవర్గం నుంచి ఐదుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికైన షోయబ్ ఇక్బాల్ ఈ సారి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీచేస్తున్నారు. గతసారి ఆయన జనతాదళ్ యునెటైడ్ తరఫున పోటీ చేసి గెలిచారు. పార్టీలు మార్చడం షోయబ్ ఇక్బాల్కు కొత్తకాదు. గతంలో ఆయన రెండుసార్లు జనతా దళ్ నుంచి, ఒకసారి జేడీ(ఎస్), ఒకసారి ఎల్జేపీ నుంచి, ఒకసారి జేడీయూ నుంచి గెలిచారు. పార్టీలతో నిమిత్తం లేకుండా షోయబ్ ఇక్బాల్ను ఎన్నుకుంటున్న మతియామహల్ ఓటర్లు మరోసారి ఆయనను గెలిపిస్తారో లేదో ఫిబ్రవరి 10న తేలనుంది. ఇదిలా ఉండగా, గత ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ అభ్యర్థిగా పోటీచేసిన షకీల్ అంజుమ్ దెహల్వీ ఈసారి బీజేపీ టికెట్పై పోటీచేస్తున్నారు. ఈ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ నిలబెట్టిన ఏకైక ముస్లిం అభ్యర్థి దెహల్వీయే కావడం గమనార్హం.
తాను బీజేపీ తరఫున పోటీచేయడంలో విచిత్రమేమీ లేదని దెహల్వీ అంటున్నారు. తన తండ్రి అన్వర్ దెహల్వీ కూడా జన్సంఘ్లో ఉండేవారని, ఆయన రెండుసార్లు మెట్రో పాలిటన్ కౌన్సిల్ ఎన్నికల్లో గెలిచారని ఆయన చెబుతున్నారు. ఆప్ ఈసారి ఆసీమ్ఖాన్కు టికెట్ ఇచ్చింది. కాగా, దెహల్వీ రంగంలోకి దిగడం వల్ల గతంలో ఎన్నడూ లేని విధంగా మతియా మహల్లో ముక్కోణపు పోటీ తథ్యమని రాజకీయ పరిశీలకులు అంటున్నారు. మతియా మహల్లో ఇంతవరకు బీజేపీ ఎన్నడూ గట్టి పోటీ ఇవ్వలేదు. నిజానికి దాన్ని ఈ నియోజకవర్గంలో బలమైన పార్టీగా పరిగణించలేదు.గత ఎన్నికల్లో బీజేపీకి ఇక్కడ ఆరు వేల ఓట్లు మాత్రమే పడ్డాయి. ఇదిలా ఉండగా, గత ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ అభ్యర్థిగా పోటీచేసి మూడవ స్థానంలో నిలిచిన దెహల్వీ ఈసారి బీజేపీ అభ్యర్థిగా బరిలో ఉండటం వల్ల ఫలితాలలపై దాని ప్రభావం ఉంటుందని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు. ఈ నియోజవర్గం ఓటర్లలో 67 శాతం ముస్లింలు కాగా, 31 శాతం హిందువులు, 2 శాతం మంది సిక్కులు ఉన్నారు.
నియోజకవర్గ ముఖచిత్రం
Published Fri, Jan 23 2015 11:25 PM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధర్వంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
అమెరికా వరల్డ్కప్ జట్టులో ఐదుగురు భారత సంతతి ఆటగాళ్లు..
చావ్లా అరుదైన రికార్డు.. ఐపీఎల్ చరిత్రలో రెండో బౌలర్గా
గుడిలో సింపుల్గా పెళ్లి చేసుకున్న నటుడి కూతురు (ఫోటోలు)
పార్టీ ఆఫీసులో రాహుల్ గాంధీ పూజలు - వీడియో వైరల్
వెంకటేశ్ అయ్యర్ అద్భుత పోరాటం.. ముంబై టార్గెట్ ఎంతంటే?
సీఎం జగన్ రేపటి ప్రచార సభల షెడ్యూల్ ఇలా..
పిల్లల్ని ఎందుకు కనలేదో తొలిసారి చెప్పిన వితికా
ధనుష్తో విడిపోయిన ఐశ్వర్య.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)
సొంతగూటికి సంజయ్ నిరుపమ్
అమిత్షాపై కోడ్ ఉల్లంఘన కేసు
తప్పక చదవండి
- వరల్డ్కప్కు వెస్టిండీస్ జట్టు ప్రకటన.. విధ్వంసకర ఆటగాళ్లకు ఛాన్స్
- గుర్తుపట్టలేనంతగా మారిపోయిన టాలీవుడ్ స్టార్ హీరోయిన్
- ICC: నంబర్ వన్గా ఆసీస్.. అందులో మాత్రం టీమిండియానే టాప్
- కోర్టు పెండింగ్లో ఉన్న కేసు గురించి ఎలా మాట్లాడతారు?
- మద్యం పాలసీ కేసు.. మనీష్ సిసోడియాకు ఊరట
- ‘రాహుల్, లాలూ యాదవ్ పేరుందని పోటీ చేయకుండా ఆపలేం’
- ఎక్కువ జీతం కోసం ఎదురు చూస్తున్నారా? అయితే ఇది మీకోసమే
- గేల్, డివిలియర్స్ కాదు.. అతడంటే నాకు వణుకు: గంభీర్
- 'సలార్' పరిస్థితి మరీ ఇంత దారుణమా.. కారణం అదేనా?
- Kushitha Kallapu: ఆరెంజ్ ఆర్మీ విన్తో ‘ఖుషీ’ అవుతున్న ఈ గ్లామర్ లుక్స్ ఎవరివి? (ఫోటోలు)
Advertisement