కాంగ్రెస్‌ను వీడి జేడీఎస్‌లో చేరిక | Sakshi
Sakshi News home page

కాంగ్రెస్‌ను వీడి జేడీఎస్‌లో చేరిక

Published Mon, Aug 29 2016 2:10 AM

Congress passed involvement in jds

సింధనూరు టౌన్ : తాలూకాలోని ఎలెకూడ్లిగి గ్రామానికి చెందిన శంక్రగౌడ, ఈశప్ప బుద్దిన్ని తదితర కాంగ్రెస్ కార్యకర్తలు ఆదివారం ఆ పార్టీని వీడి మాజీ ఎమ్మెల్యే వెంకటరావు నాడగౌడ సమక్షంలో జేడీఎస్ పార్టీలో చేరారు. ఈసందర్భంగా మాజీ ఎమ్మెల్యే మాట్లాడుతూ జేడీఎస్ పార్టీ సిద్ధాంతాలను మెచ్చి, మాజీ ముఖ్యమంత్రి హెచ్‌డీ కుమారస్వామి చేసిన అభివృద్ధి పనులు చూసి జేడీఎస్‌లో చేరారన్నారు. ఇకపై తాలూకాలో జేడీఎస్ పార్టీలోకి మరింత మంది చేరతారని, పార్టీని బలోపేతం చేస్తామన్నారు.


ఈసందర్భంగా జేడీఎస్ తాలూకా అధ్యక్షుడు ఎం.లింగప్ప దడేసూగూరు, జెడ్పీ సభ్యుడు శివనగౌడ గొరేబాళ, గ్రామస్తులు గురుబసప్ప, సిద్దలింగయ్య స్వామి, బసవరాజ భజంత్రి, మల్లికార్జునయ్య, హనుమంత భజంత్రి, సునీల్ దేసాయి, కేమణ్ణ ఉప్పార్, ఖాజా హుసేన్‌సాబ్ తదితరులు పాల్గొన్నారు.

Advertisement
Advertisement